కేసీఆర్ వినాశకాలే విపరీతబుద్ధి.. జానా ఆగ్రహం

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ప్రతిపక్ష పార్టీల దాడి తీవ్రమైంది. పాపం ఏ విషయంలోనైనా ఆచి తూచి మాట్లాడే కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి కూడా కేసీఆర్ మీద ఒంటి కాలిమీద లేచి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని జానారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే కనకయ్యపై అనర్హత వేటు వేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి పిటిషన్ ఇచ్చినట్లు జానారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా పొందిన పదవిని విడిచిపెట్టకుండా వేరే పార్టీలోకి చేరడం అనైతికమని జానా అన్నారు. స్పీకర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి ఎమ్మెల్యే కనకయ్య మీద అనర్హత వేటు వేయాలని జానారెడ్డి కోరారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News