ల‌ష్క‌రే తోయిబా టాప్ క‌మాండ‌ర్ మృతి...


జమ్ముకశ్మీర్ లోని అనంత్ నాగ్ లో  పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఓ ఇంట్లో దాక్కున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు..భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే కాల్పుల్లో భార‌త సైన్యం ల‌ష్క‌రే తోయిబా టాప్ క‌మాండ‌ర్ బాషిర్ ల‌ష్కరిని మ‌ట్టుబెట్టినట్టు సమాచారం. కాగా సోప్‌సాలి కోక‌ర్‌నాగ్ ప్రాంతానికి చెందిన బాషిర్ ల‌ష్క‌రి 2015 అక్టోబ‌ర్ 2న ఆ ఉగ్ర‌వాద సంస్థ‌లో చేరాడు. అంతేకాదు గ‌తంలో ఈ ఉగ్ర‌వాదిపై క‌శ్మీర్ పోలీసులు 10 ల‌క్ష‌ల న‌జ‌రానా ప్ర‌క‌టించారు కూడా.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu