లాలూకు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. విచారణ జరగాల్సిందే...!

 

దాణా కుంభకోణ విషయంలో లాలూ ప్రసాద్ యాదవ్ పై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టులో ఎప్పుటినుండో విచారణ జరుగుతుంది. అయితే ఈరోజు దీనిపై విచారణ జరగగా.. లాలూ ప్రసాద్ యాదవ్ కు చుక్కెదురైంది. దాణా కుంభకోణ విషయంలో సీబీఐ ప్రత్యేక విచారణ ఎదుర్కొవలసిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. దాణా స్కాంలో వేర్వేరు కేసుల్లో విచారణ చేయాలని సుప్రీం ఆదేశించింది. కాగా 1990-97 మధ్యలో పశుసంవర్థక శాఖలో రూ. వెయ్యి కోట్లు కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి విదితమే. ఈ కుభంకోణంలో లాలూకు రూ.96 లక్షలు ముట్టినట్టు ఆరోపణలు వచ్చాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu