ఆంధ్ర నవయుగ వైతాళికుడు.. 

 

కందుకూరి విరేశలింగం అనగానే అందరికీ ఉద్యమ స్పూర్తి గుర్తుకు వస్తుంది.  స్త్రీల కోసం పాటు పడిన సంఘసంస్కర్తలలో కందుకూరి విరేశలింగం తెలుగు ప్రజల గుండెల్లో గొప్ప స్థానం సంపాదించారు.  ఈయనను నవయుగ వైతాళికుడు అని పిలుస్తారు. భారత ప్రభుత్వం కందుకూరి విరేశలింగం ను రావు బహదూర్ అనే బిరుదుతో సత్కరించింది.  ఏప్రిల్ 16, 1848లో ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో జన్మించారు. ఆయన జయంతి సందర్బంగా ఆయన గూర్చి తెలుసుకుంటే..

కందుకూరి విరేశలింగం గూర్చి..

వీరేశలింగం ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఈయన కేవలం నాలుగు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు  తండ్రి మరణించాడు. దీంతో ఈయన  తన మామ వద్ద పెరిగాడు. విరేశలింగం గారి  విద్యా నైపుణ్యం,  స్నేహపూర్వక స్వభావం  పాఠశాల రోజుల్లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. 1869లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన తర్వాత, ఒక గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయుడిగా తన వృత్తిని ప్రారంభించాడు.
వీరేశలింగం తెలుగు, సంస్కృతం,  ఆంగ్ల భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. ఆయన తెలుగులో మొదటి నవలను రచించారు,  తెలుగు సాహిత్యానికి ఆత్మకథ,  వ్యాస ప్రక్రియలను పరిచయం చేశారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రంపై మొదటి తెలుగు పుస్తకాన్ని కూడా రాశారు.  అనేక ఆంగ్ల రచనలను తెలుగులోకి అనువదించారు.

తెలుగు సమాజ సంస్కరణకు ఆయన చేసిన గణనీయమైన కృషి ఎంతో గౌరవనీయమైనది. అయితే రాజా రామ్ మోహన్ రాయ్,  కేశుబ్ చంద్ర సేన్ వంటి సామాజిక సంస్కర్తలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ వెలుపల ఆయన కీర్తి పరిమితం. ఆయన మహిళల హక్కులకు చాలా మద్దతు ఇచ్చారు.  మహిళల హక్కుల గురించి చాలా  విస్తృత రచనలు చేశారు. బాల్య వివాహాలను,  యువతులను వృద్దులతో  వివాహం చేసే ఆచారాన్ని ఆయన ఖండించారు. వితంతు పునర్వివాహాన్ని కూడా ఆయన సమర్థించారు.


విరేశలింగం గారి  రాడికల్ ఆలోచనలు,  పదునైన విమర్శలు అతన్ని చాలా మంది విమర్శకులకు,  ప్రజల ఎగతాళికి గురి చేశాయి. స్త్రీలను ఎల్లప్పుడూ ద్వితీయ పౌరులుగా పరిగణించరని వాదించడానికి ఆయన పురాతన గ్రంథాలను ఉపయోగించారు. రామాయణంలో, శ్రీరాముడు ఎల్లప్పుడూ సీతతో సభలో ఎలా ఉండేవాడో ఆయన నొక్కి చెప్పారు.   మహిళల పరిస్థితి దిగజారినప్పుడు భారతదేశం యొక్క క్షీణత ప్రారంభమైందని ఆయన నమ్మాడు.

ఆయన బాలికలు,  మహిళల కోసం పాఠశాలలను స్థాపించాడు.  డిసెంబర్ 11, 1881న ఆంధ్రప్రదేశ్‌లో మొదటి వితంతు పునర్వివాహాన్ని జరిపించాడు.  ఇది సంప్రదాయవాద సమాజం నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. సమాజం ఎంతగానో అవమానించినా, ఆయన తన జీవితకాలంలో దాదాపు 40 మంది వితంతువులకు పునర్వివాహం చేయించాడు. మహిళల హక్కులు,  విద్యను ప్రోత్సహించడానికి ఆయన వివిధ పత్రికలు,  జర్నల్స్‌ను ప్రచురించారు.  1887లో రాజమండ్రిలో బ్రహ్మ మందిరాన్ని ప్రారంభించాడు. 1885లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ ప్రారంభ సమావేశానికి హాజరైన వారిలో వీరేశలింగం మొదటి వ్యక్తి.  1893లో భారత ప్రభుత్వం ఆయనను 'రావు బహదూర్' బిరుదుతో సత్కరించింది. ఆయన మే 27, 1919న 71 సంవత్సరాల వయసులో మరణించారు.


                                              *రూపశ్రీ.