మొహమ్మద్ గజ్నివీ చరిత్రను జగన్ పునరావృత్తం చేశారు

 jagan is ghaznavi says ED Lawyer, ED Lawyer Says  jagan is ghaznavi, ED Lawyer Praful Kumar Alleges  jagan is ghaznavi

 

మొహమ్మద్ గజ్నవీ చరిత్రను జగన్ పునరావృత్తం చేశారు ... వ్యవస్థను తనకు అనువుగా మార్చుకున్నారు అని ఈడీ లాయర్ విపుల్ కుమార్ తెలిపారు. ఈ వ్యాఖ్యలను హైకోర్టు చేసిందా? అని ధర్మాసనం ప్రశ్నించగా ... "హైకోర్టు నేరాన్ని గుర్తించింది. హైకోర్టు వైఖరి ఆధారంగా నేనీ వ్యాఖ్యలు చేస్తున్నాను అని, తండ్రి అధికారంలోకి రాగానే జగన్ సంపద కూడగట్టారు, ప్రభుత్వ భూ కేటాయింపులు, సెజ్ లు, రియల్ ఎస్టేట్ అనుమతులు, కాంట్రాక్టులు, మైనింగ్ తవ్వకాల అనుమతుల్లో అవినీతికి పాల్పడ్డారని, తండ్రి అధికారాన్ని అడ్డం పట్టుకుని భారీగా అవినీతికి పాల్పడినందునే జగన్ ను గజ్నవీతో పోల్చాను అని విపుల్ ధర్మాసనానికి విన్నవించారు. జగన్ అక్రమాస్తుల కేసులో జనవరి 8వ తేదీనాటి రూ.143.74 కోట్ల విలువైన ఆస్తుల జప్తుపై ఈడీ న్యాయ ప్రాధికార సంస్థ సభ్యులు పి.జె.శర్మ, రామ్మూర్తిలతో కూడిన ధర్మాసనం ఎదుట బుధవారం తుది వాదనలు జరిగాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడైన జగన్ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యవస్థలను తనకు ఇష్టం వచ్చినట్లు మార్చుకుని, ప్రజాధనాన్ని దోచుకున్నారని ఎన్ ఫోర్స్ మెంట్ (ఈడీ) స్పష్టం చేసింది. నేరుగా లంచాలు తీసుకుంటే అవినీతి నిరోధక చట్టం కింద దొరికిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి 36 కంపెనాలను సృష్టించి ముడుపులకు పెట్టుబడుల రూపం ఇచ్చారని, జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులు పెట్టినవారంతా ప్రభుత్వం నుంచి లబ్ది పొందినవారేనని, లంచాలను షేర్ల కొనుగోలుకు చెల్లించారని ఈడీ తరపు న్యాయవాది ధర్మాసనం ముందు వాదించారు. వైఎస్ అధికారంలోకి రాకముందు వారి ఐటీ రిటర్న్స్ చూస్తే ఈ విషయం స్పష్టమవుతుందని, 36పైగా కంపెనీలను ప్రారంభించిన జగన్ అవినీతి సొమ్మును పెట్టుబడుల రూపంలో మళ్ళించారని, జగతి పబ్లికేషన్స్ లోకి కూడా ఇదే తరహాలో నిధులు మళ్ళించారని ఈడీ తరపు న్యాయవాది విపుల్ కుమార్ తెలిపారు. జగతి ఆస్తుల విలువపై డెలాయిట్ నివేదిక తప్పుల తడక అని జగన్, విజయసాయి రెడ్డి ఒత్తిడి మేరకే ఈ నివేదిక తయారు చేశారని తెలిపారు. ధర్మాసనం సభ్యుడు రామ్మూర్తి కల్పించుకుని "ఆస్తులను మదింపు చేసే కంపెనీల కారణంగానే అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి, సత్యం కుంభకోణంలో జప్తు సందర్భంగా సంబంధిత ఆడిటింగ్ సంస్థపై భారీ జరిమానా విధించాలని సిఫారసు చేశానని ఆయన గుర్తు చేశారు. విపుల్ కుమార్ వాదించుతూ సిబీఐ జగతి అప్బ్లికేశంస్ ఆస్తులను ఎస్.బి.ఐ. క్యాపిటల్ సంస్థ చేత ముదింపు చేయించిందని, ఈ సందర్భంగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu