పునర్‌వినియోగ వాహక నౌక పరీక్ష విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌ నుంచి పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక ( ఆర్‌ఎల్వీ)ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఉదయం 7 గంటలకు ధ్వని కంటే ఐదు రెట్లు వేగంతో నింగిలో 70 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లిన రాకెట్ 11 నిమిషాల వ్యవధిలోనే బంగాళాఖాతంలో ఏర్పాటు చేసిన వర్చువల్ రన్‌వేపై సురక్షితంగా దిగింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో అంతరిక్ష ప్రయోగాల వ్యయం దాదాపు పదిరెట్లు తగ్గనుంది. ప్రస్తుతం ఉన్న సంప్రదాయ వాహకనౌకలకు ఆ సామర్ధ్యం లేకపోవడంతో అంతరిక్ష ప్రయోగ వ్యయం ఎక్కువవుతోంది.