ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అమ్మ

తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రమాణం చేశారు. మద్రాస్ యూనివర్శిటీ సెంటినరీ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రోశయ్య ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా జయ గద్దెనెక్కడం ఇది ఆరోసారి. ఆమె తర్వాత 28 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అంతకు ముందు ప్రమాణ స్వీకారం చేయడానికి తన అధికార నివాసం పోయిస్ గార్డెన్స్‌ నుంచి మద్రాస్ యూనివర్శిటీకి వెళుతుండగా అభిమానులు, కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి అమ్మకు ఘనస్వాగతం పలికారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu