కాల్పుల విరమణ అధికారంగా ప్రకటించిన పాకిస్థాన్

 

పాకిస్థాన్, భారత్ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఆదేశ డిప్యూటీ సీఎం విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ట్వీట్ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. పాక్ ఎప్పుడు శాంతి భద్రతలు కోసమే పాటుపడుతుందన్నారు. ఇరు దేశాల మిలిటరీ జనరల్స్ మధ్య జరగబోయే చర్చల్లో సరిహద్దుల్లో శాశ్వత శాంతి కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే అవకాశం ఉంది. డోనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఈ కాల్పుల విరమణ సాధ్యమైందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఒప్పందం ఎంతకాలం కొనసాగుతుంది, ఏ షరతుల మేరకు కుదిరింది అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుందని, ప్రాంతీయ శాంతికి దోహదపడుతుందని భావిస్తున్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu