తెలుగు రాష్ట్రాల్లో ఎల్లుండి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం 

లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ జూన్ 1న ముగుస్తుంది. తొలి దశ ఎన్నికల్లో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఏపీ, తెలంగాణ సహా పది రాష్ట్రాల్లో నాలుగో విడతలో పోలింగ్ జరగనుంది. మే 13న పోలింగ్ జరుగుతుంది. ఎల్లుండి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను దాదాపుగా ప్రకటించేశాయి. అయితే, బీఫామ్ చేతికి వచ్చేంత వరకు కొందరు అభ్యర్థులకు టెన్షన్ తప్పని పరిస్థితి ఉంది. తెలంగాణలో బిఆర్ఎస్ నుంచి  చాలామంది ముఖ్య నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికార వైసీపీ నుంచి నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికలలో త్రి కూటమి సక్సెస్ అవుతుందని  న్యూస్ ఎక్స్ సర్వేలో వెల్లడైంది. తెలంగాణలో చేరికలు కాంగ్రెస్ వైపు ఉంటే ఎపిలో మాత్రం త్రి కూటమిలో చేరుతున్న వారు ఎక్కువగా ఉన్నారు. 

ఏపీ, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్:
.ఏప్రిల్ 18 – నామినేషన్ల స్వీకరణ
.ఏప్రిల్ 25 – నామినేషన్లకు చివరి తేదీ
.ఏప్రిల్ 26 – నామినేషన్ల పరిశీలన
.ఏప్రిల్ 29 – నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
.మే 13 – పోలింగ్
.జూన్ 4 – ఎన్నికల ఫలితాలు.