అక్కినేని, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ ల చెంతకి చేతబడి మూవీ
on Apr 29, 2024
బడా సినిమాలకే కాదు చిన్న సినిమాలకి సీక్వెల్స్ ఉంటాయని పొలిమేర సిరీస్ నిరూపించింది. మా ఊరి పొలిమేర, మా ఊరి పొలిమేర 2 ఇలా వచ్చిన రెండు పార్టులు మంచి విజయాన్ని సాధించాయి. ఫస్ట్ పార్ట్ 2021 లో ఓటిటి వేదికగా స్మాల్ స్క్రీన్స్ లో అడుగుపెట్టింది. సెకండ్ పార్ట్ 2023 లో థియేటర్స్ లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఈ మూవీ అరుదైన ఘనతని సాధించింది.
ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 30 న ఢిల్లీలో దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఎంటైర్ భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభ కనపరిచిన సినిమాలు ఈ ఫెస్టివల్ కి ఎంపిక చేయబడతాయి. ఇప్పుడు పొలిమేర 2 దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ కి ఎంపిక అయ్యింది. దీంతో మేకర్స్ ఆనందంలో ఉన్నారు. నిజానికి దాదాసాహెబ్ ఫాల్కే అనగానే భారత ప్రభుత్వం ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందరకి గుర్తుకొస్తుంది. భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభ కనపర్చిన వారికి ఆ అవార్డు ని ఇస్తుంటారు. మన తెలుగు చిత్ర సీమ నుంచి దేవికా రాణి, బి ఎన్ రెడ్డి,ఎల్ వి ప్రసాద్, బి నాగి రెడ్డి, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ,మూవీ మొఘల్ డి రామానాయుడు, కళాతపస్వి కే.విశ్వనాధ్ తదితరులు ఫాల్కే ని అందుకున్నారు. అమితాబ్ ,రజనీకాంత్ వంటి ప్రముఖుల్ని కూడా ఫాల్కే వరించింది.
. ఇక బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో పొలిమేర 2 తెరకెక్కింది. సత్యం రాజేష్, బాలాదిత్య, గెటప్ శ్రీను, రవివర్మ, రాకేందు మౌళి,కామాక్షి బాసర్ల, సాహితీ దాసరి ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్పై గౌర్ కృష్ణ నిర్మించగా అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించాడు