ముస్లింలకు చంద్రబాబు బంపర్ ఆఫర్!

ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలకు హజ్ యాత్రకు వెళ్ళడానికి లక్ష రూపాయలు  ఇవ్వనున్నామని ప్రకటించారు. నెల్లూరులో షాదీ మంజిల్‌లో చంద్రబాబు ముస్లింలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, మక్కా యాత్రకు వెళ్ళే ప్రతి ఒక్క ముస్లింకు లక్ష రూపాయలను ప్రభుత్వం తరఫున అందిస్తామని చెప్పారు.