నా డ్యూటీ నేను చేశా.. మంత్రుల తప్పుల గురించి తెలియదు.. మన్మోహన్

 

మాజీ ప్రధానమంత్రి నోరు తెరిచారు. ప్రధానమంత్రిగా తన డ్యూటీ తాను చేశానని, తన మంత్రివర్గంలో వున్న వాళ్ళు తప్పులు చేశారో లేదో తనకు తెలియదని ఆయన అన్నారు. మన్మోహన్‌సింగ్‌ని ఆకాశానికి ఎత్తేస్తూ ఆయన కుమార్తె దమన్‌సింగ్ రాసిన ‘స్ట్రిక్ట్‌లీ పర్సనల్: మన్మోహన్ అండ్ గురుశరణ్’ అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా మన్మోహన్‌సింగ్ మాట్లాడుతూ, ‘‘నా విధులు నేను నిర్వర్తించాను. ఇతరులు ఏమి చేశారన్న దానిపై నేనేమీ స్పందించలేను’’ అంటూ రెండంటే రెండు ముక్కల్లో తన స్పందనను వెల్లడించేశారు. తండ్రిపై వచ్చిన ఆరోపణలపై కూడా దమన్ సింగ్ కూడా పెద్దగా స్పందించలేదు. ‘‘వాస్తవంగా ఆ విషయం గురించి నాకేమీ తెలియదు. అందువల్ల దానిపై నేనేమీ మాట్లాడలేను’’ అని ఆమె అన్నారు.