ఢిల్లీలో కంపించిన భూమి.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.1

దేశ రాజధాని ఢిల్లీలో గురువారం (జులై 10) తెల్లవారు జామున భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైంది. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఒక్క ఢిల్లీలోనే కాక హర్యానాలో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి.  

కాగా ఈ భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. భూకంపం సమయంలో తమ ఇళ్లల్లోని వస్తువులు కదిలాయనీ, కొన్ని కిందపడ్డాయనీ పలువురు ఢిల్లీ వాసులు సామాజిక మాధ్యమంలో షేర్ చేస్తూ అందుకు సంబంధించిన ఫొటోలు జత చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu