సతీసమేతంగా కేసీఆర్ చంద్రబాబుకు ఆహ్వానం..!

తెలంగాణ ముఖ్యమంత్రి ఈ నెల చివరి వారంతంలో ఆయుత చండీయాగం చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ యాగానికి గాను కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును స్వయంగా ఆహ్వానించాలని నిర్ణయించున్నారు. అయితే ఇప్పటికే రెండుమూడుసార్లు కేసీఆర్, చంద్రబాబును కలుద్దామని అనుకున్నా అది జరగలేదు. అయితే ప్రస్తుతం ఇద్దరు ముఖ్యమంత్రులు ఢిల్లీలో ఉన్నారు. కాగా  వీరివురు ఢిల్లీ నుండి రాగానే కేసీఆర్ స్వయంగా వెళ్లి చంద్రబాబును ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. అయితే కేసీఆర్ మాత్రమే కాదు.. కేసీఆర్ ఆయన సతీమణి ఇద్దరు కలిసి ప్రత్యేక హెలికాప్టర్‌లో విజయవాడకు వెళ్లి చంద్రబాబును ఆహ్వానిస్తారని అనుకుంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu