జయలలిత బురద రాజకీయం..
posted on Dec 9, 2015 9:27AM

భారీ వర్షాల వల్ల చెన్నై అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ భారీ వర్షాల వల్ల చెన్నై వాసులు ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. దాంతో ఎంతో మంది దాతలు చెన్నైను ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు. అంతేకాదు మన తెలుగు నాట నుండి కూడా ఎంతోమంది చెన్నై ప్రజలకు సాయం అందించడానికి ముందుకు వస్తున్నారు. ఎవరికి తోచినంత వారు సాయం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే దీనిపై కూడా తమిళనాడు ప్రభుత్వం బురద రాజకీయం చేస్తుందని పలువురు విమర్శిస్తున్నారు. అమ్మ బోమ్మతోనే సాయం అందించాలని.. పలువురు స్వచ్ఛంధ సంస్థలను కూడా కార్యకర్తలు అడ్డుకుంటున్నారట. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పొలిటికల్ మైలేజ్ కోసం ఆరాటపడుతున్నారని.. జయలలితపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వరద సాయం అందించడంలో జయలలిత విఫలమైందని అంటున్నారు.