మోడీని ఆహ్వానించిన చంద్రబాబు.. తప్పకుండా వస్తా
posted on Oct 6, 2015 10:51AM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాగరమాల కార్యక్రమం నిమిత్తం ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈసందర్బంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. దీనికి మోడీ సాకుకూలంగా స్పందించి తాను శంకుస్థాపన కార్యక్రమానికి వస్తానని.. మధ్యాహ్నం 12.35 నుంచి 12.45లోపు వస్తాయని చెప్పారని.. అనంతరం తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటానని చెప్పారని చంద్రబాబు తెలిపారు. అంతేకాక రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీలు.. ఇతర నిధుల మంజూరు తదితర విషయాలపై చర్చించినట్టు తెలిపారు. కాగా అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని దసరా రోజు ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 12.45 నిమిషాలకు ఖరారు చేసిస సంగతి తెలిసిందే. కార్యక్రమాని ప్రధాని నరేంద్రమోడీతో పాటు సింగపూర్, జపాన్ ప్రధానులు కూడా పాల్గొననున్నారు.