రఘువీరా కారుపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి

చిత్తూరు జిల్లా కుప్పంలో ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిపై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు, కుప్పంలో ఎయిర్ పోర్ట్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న స్థానికులకు అండగా అక్కడికి వెళ్లిన రఘువీరాను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు... కాన్వాయ్ పై చెప్పులు, రాళ్లు విసిరారు. దాంతో తెలుగుదేశం, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది, ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా, కొద్దిసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది, మరోవైపు కుప్పంలో కాంగ్రెస్ తలపెట్టిన బహిరంగ సభకు పోలీసులు అభ్యంతరం తెలిపారు, టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ నేపథ్యంలో సభకు అనుమతి నిరాకరించిన పోలీసులు... పెద్దఎత్తున మోహరించారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu