గాంధీ జయంతి సెలవు లేదు.. స్వచ్ఛ భారత్...

 

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్‌ పథకాన్ని గాంధీ జయంతి రోజు నుంచి అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఎక్కడికక్కడ పేరుకున్న చెత్తని, మురికిని తొలగించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమం కోసం కేంద్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఆరోజు సెలవును రద్దు చేసింది. ఆరోజున కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు వుండదు. ఆరోజు దేశవ్యాప్తంగా వున్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు చేసింది. ఆరోజున ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా చీపురు పట్టుకుని శుభ్రపరిచే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇండియా గేట్ వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu