చలసాని శ్రీనివాస్ ఇంట్లో విషాదం.
posted on Feb 19, 2021 9:45AM
ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఇంట్లో విషాదం. ఆయన కుమార్తె శిరిష్మ (27) బుధవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇంటీరియర్ డిజైనర్ అయిన శిరిష్మకు హైదరాబాద్ మణికొండలోని ట్రయల్ విల్లాస్కు చెందిన గ్రానైట్ వ్యాపారి సిద్ధార్థ్తో 2016లో వివాహమైంది. గత ఏడాది కాలంగా వీరు గచ్చిబౌలి డీ అడ్రెస్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు.
బుధవారం రాత్రి భర్త సిద్ధార్థ్ ఇంటికి రాగా, గదిలో ఫ్యాన్కి చీరతో ఉరివేసుకున్న శిరిష్మ కనిపించింది. సిద్దార్థ్ వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే శిరిష్మ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం శిరిష్మ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చలసాని శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.