మద్యం సేవించి బస్సు నడిపిన డ్రైవర్‌కు జైలు

హైదరాబాద్ నగరంలో మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తప్పవన్న సంగతి మరో సారి నాంపల్లి కోర్టు తీర్పుతో వెల్లడైంది.   మద్యం సేవించి ప్రయాణికులతో నిండిన  బస్సును నడిపిన డ్రైవర్‌కు నాంపల్లి కోర్టు 15 రోజుల జైలు శిక్ష విధించింది. ఇంటర్‌సిటీ యూనివర్సల్ ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్న కన్నెబోయిన మహేష్‌బాబు అనే వ్యక్తి పీకలదాకా మద్యం సేవించి ఆ మత్తులో బస్సు నడిపినట్లు గా రుజువు కావడంతో  నాంపల్లి కోర్టు అతనికి జైలు శిక్షతో పాటు రూ.2,100 జరిమానా కూడా విధించింది.

గతేడాది డిసెంబర్ 15న ఎస్‌ఆర్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీల్లోకన్నెబోయిన మహేష్‌బాబు  పట్టుబడ్డాడు. మద్యం మత్తులో బస్సు నడుపుతున్నట్లు అనుమానం రావడంతో పోలీసులు వెంటనే బస్సును ఆపి డ్రైవర్‌కు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వ హించారు.ఆ పరీక్ష లో  డ్రైవర్ రక్తంలో 119.100 mg ఆల్కహాల్ సాంద్రత ఉన్నట్లు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ఇతను అనుమతించిన పరిమితికి చాలా ఎక్కువగా మద్యం సేవించినట్లు  తేలడంతో  పోలీసులు వెంటనే అతడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసుకుని నాంపల్లి కోర్టులో హాజరు పరచారు.

కోర్టు విచారణలో పోలీసులు  మద్యం సేవించి భారీ వాహనాన్ని నడపడం వల్ల ప్రయాణికుల ప్రాణాలకు తీవ్ర ముప్పు ఏర్పడు తుం దని వాదించారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఏ క్షణంలోనైనా ప్రమాదం జరిగే అవకా శముందని పోలీసులు కోర్టుకు వివరించారు.

వాదనలు, ఆధారాలు పరిశీలించిన తర్వాత న్యాయస్థానం డ్రైవర్‌కు 15 రోజుల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించింది. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని... ఇకపై ఎలాంటి సడలింపులు ఉండవని ఈ తీర్పు ద్వారా కోర్టు వెల్లడించింది.
ఈ తీర్పుతో మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎంతటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో మరోసారి స్పష్ట మైంది. ముఖ్యంగా ప్రజా రవాణా వాహనాలు నడిపే డ్రైవర్లు అత్యంత బాధ్యతగా వ్యవహరిం చాలని పోలీసులు సూచిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu