బస్సు ప్రమాదం.. ఏడుగురి మృతి

 

చైనాలో యునాన్ ప్రావెన్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడి ఏడుగురు మృతి చెందగా, మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన రక్షణగా పెట్టిన బ్యారికేడ్స్ ని ఢీ కొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మిగిలిన నలుగురు ఆస్సత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు. గాయపడిన వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu