పని మానేసి పండగలేంటి భై?
posted on Sep 27, 2014 4:52PM
.jpg)
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతిరోజూ బతుకమ్మ ఆడాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద తెలంగాణ బీజేపీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం పనిచేయడం మానేసి పండుగలు చేస్తోందని విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా రైతులు దసరా పండుగ చేసుకునే స్థితిలో లేరని ఆయన అన్నారు. విద్యుత్ సమస్య కారణంగా రాష్ట్ర రైతాంగం ఇబ్బందులు పడుతోందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అసలు పరిపాలన అనేదే కనిపించడం లేదని చెప్పారు. నాలుగు నెలల పాలనలో ఒక రూపాయి విలువైన కరెంటు అయినా రాష్ట్ర ప్రభుత్వం కొన్నదా అని నాగం జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికే ప్రభుత్వ కార్యాలయాల్లో బతుకమ్మ పండుగ జరుపుతున్నారని నాగం విమర్శించారు.