జయమ్మ కథ చివరికి జైలుకి

 

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను దోషిగా నిర్ధారించిన బెంగళూరు ప్రత్యేక కోర్టు శనివారం ఐదు గంటల ప్రాంతంలో జయలలితకు, ఆమె సన్నిహితులు శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు నాలుగేళ్ళ జైలు శిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో జయలలిత తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ కేసులో మొదట ముఖ్యమంత్రి జయలలితకు కనీసం ఏడేళ్ళ జైలు శిక్ష పడుతుందని అనుకున్నారు. అయితే ప్రత్యేక కోర్టు ఆ శిక్షను నాలుగేళ్ళకు పరిమితం చేసింది. జయలలితకు నాలుగేళ్ళ జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పగానే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.జయలలితను కోర్టు నుంచే జైలుకు తరలించే అవకాశం వుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu