బంజారాహిల్స్‌లో నాళాలో కూరుకుపోయిన ట్రాలీ

 

బంజారాహిల్స్‌ రోడ్ నెంబర్‌-11 పరిధి ఉదయ్‌నగర్ బస్తీలో ఇసుక టిప్పర్ నాళాలో బోల్తా పడింది. డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. నాళా స్లాబ్  నాసిరకంగా  ఉండటంతో వాహనంలో ఇరుక్కుపోయింది. దీంతో స్థానికులు కూరుకుపోయిన  వాహనాన్ని స్థానికులు బయటకు తీశారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది, హైడ్రా, జలమండలి అధికారులు, బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. గత ఆరు నెలల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకొవడం లేదని స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu