ఆశాభోంస్లే తనయుడు హేమంత్ భోంస్లే మృతి


 

ప్రముఖ బాలీవుడ్ గాయని ఆశాభోంస్లే తనయుడు.. బాలీవుడ్ సంగీత దర్శకుడు హేమంత్ భోంస్లే ఈ రోజు మరణించారు. గత మూడు సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నహేమంత్ భోంస్లే స్కాట్లాండ్ లో మరణించారు. దీంతో ఆశా భోంస్లే కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిపోయారు. హేమంత్ భోంస్లే  'నజరానా ప్యార్ కా', 'శ్రద్ధాంజలి' లాంటి బాలీవుడ్ సినిమాలకు సంగీతం అందించారు. కాగా బాధాకరమైన విషయం ఏంటంటే గతంలో అంటే 2012 లో ఆశాభోంస్లే కూతురు వర్షా భోంస్లే కూడా డిప్రెషన్ కు గురై ఆత్మహత్య చేసుకుంది. మరోవైపు హేమంత్ భోంస్లే మరణానంతరం లతా మంగేష్కర్ 86వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలనుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ వేడుకలను రద్దు చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu