జగన్ పర్యటనలో మరో అపశృతి…తొక్కిసలాటలో ఓ వ్యక్తి మృతి
posted on Jun 18, 2025 4:14PM
.webp)
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు జిల్లా పర్యటనలో మరో అపశృతి చోటు చేసుకుంది. సత్తెనపల్లి గడియార స్థంభం వద్ద ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. దీంతో జయవర్ధన్ అనే వైసీపీ కార్యకర్త సొమ్మసిల్లి పడిపోయిడటంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కార్యకర్త మృతి చెందారు. ఉదయం జగన్ కాన్వాయ్ లోని వాహనం ఢీ కొట్టడంతో ఓ వృద్ధుడు మరణించాడు. దీంతో వారు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించారు. అయితే కాన్వాయ్ ఢీకొని గాయపడిన వృద్ధుడిని పట్టించుకోకుండా వైఎస్ జగన్తోపాటు వైసీపీ నాయకులు పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో ఆ పార్టీ అధినేత వ్యవహార శైలిపై టీడీపీ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి.