ఆప్ పార్టీకి నకిలీ సర్టిఫికేట్ల తంటాలు

ఆప్ పార్టీ రోజు రోజుకి చాలా ఫెమస్ అయిపోతుంది. అది అదరగొట్టే పరిపాలన చేసి కాదు.. రోజుకో ఆరోపణలు ఎదుర్కొంటూ. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుపోతూనే కేజ్రీవాల్ ను చిక్కుల్లో పడేస్తుంది. ఈ పార్టీలో ఇప్పుడు నకిలీ సర్టిఫికెట్ల వివాదాలు ఎక్కువైపోయాయి. మొన్నటి వరకూ నకిలీ సర్టిఫికేట్లతో మాజీ న్యాయశాఖ మంత్రి జితేందర్ తోమర్ సింగ్ పార్టీని, ప్రజలను మోసం ఆఖరికి పదవిని వీడాల్సి వచ్చింది. ఇప్పుడు మరో ఆప్ నేత భావనా గౌర్ అనే మహిళ నకిలీ సర్టిఫికేట్ల ఆరోపణలో చిక్కుకున్నారు. సుమరేంద్రనాథ్ వర్మ అనే ఆర్ టీఐ కార్యాకర్త బావనా గౌర్ నకిలి సర్టిఫికెట్లు సమర్పించారని.. 2013లో సమర్పించిన అఫిడవిట్ లో, 2015లో సమర్పించిన అఫిడవిట్ లో తేడాలున్నాయని కోర్టులో పిటిషన్ వేశారు. 2013లో తాను ఇంటర్ వరకే చదివానని అఫిడవిట్లు సమర్పించగా... 2015 లో మాత్రం బీఏ చదివానని అఫిడవిట్లు సమర్పించారని కేవలం 14 నెలల వ్యవధిలో బీఏ, బీఈడీ పూర్తి చెయ్యడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. దీనిని బట్టి ఆమె సర్టిఫికేట్లలో ఏదో తేడా ఉందని తెలుస్తోందని.. ఆమె తప్పుడు సర్టిఫికేట్లు సమర్పించారని అర్ధమవుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తానికి ఆప్ పార్టీలో నుండి రోజుకో నేత నకిలీ సర్టిఫికేట్ల వివాదంతో బయటపడుతున్నారు. ఇంకా ఎంతమంది బయటపడతారో చూడాలి..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu