చనిపోయిన తాత శవం పక్కన సెల్ఫీ

సెల్ఫీల పిచ్చి ముదిరిందంటే ఏమో అనుకున్నాం కానీ అది నిజమేనని అప్పుడప్పుడు కొన్ని చూస్తుంటే అర్ధమవుతుంటుంది. సెల్ఫీల గోల ఎక్కువైన తరువాత ఎంతోమంది ప్రాణాలు కూడా బలిగొన్నాయి. ఎదో కొత్తగా ట్రై చేసి సెల్ఫీ దిగాలని ఎంతో మంది తమ ప్రాణాలనే కోల్పోయారు. ఎప్పుడు ఫోటో దిగాలి.. ఏ సందర్భంలో దిగాలి అనే కనీస విజ్ఞతను కూడా కోల్పోతున్నారు. సౌది అరేబియాకు చెందిన ఓ యువకుడు ఏకంగా తన తాత శవం పక్కన సెల్ఫీ దిగి పోస్ట్ చేసి అందరూ షాక్ అయ్యేలా చేశాడు. అక్కడితో ఆగకుండా విచిత్రమైన హావభావాలతో ఫోటోలు దిగి పైగా 'గుడ్ బై గ్రాండ్ ఫాదర్' అంటూ రాసి మరీ పోస్ట్ చేశాడు. యువకుడు చేసిన ఈ పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలా బాధ్యతారహితంగా చేసిన యువకుడిని శిక్షించాలని.. ఇది నైతిక విలువలను ఉల్లంఘించడమేనని సౌద్ అల్ హర్బీ అనే న్యాయవాది అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu