జాతీయ పార్టీగా టిడిపి
posted on May 22, 2014 12:41PM
.jpg)
తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా మారడానికి సిద్దమవుతోంది. ఈ మేరకు ఈ నెలలో జరిగే మహానాడు సమావేశాల్లో తీర్మానం ఆమోదించే అవకాశం ఉంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా నమోదైన టీడీపీ ఇప్పటిదాకా అదే ప్రతిపత్తితో ఉంది. రాష్ట్రం రెండుగా విభజితమైన తర్వాత రెండు రాష్ట్రాల్లో పాత గుర్తుతో పోటీచేయడానికి ఆ పార్టీ జాతీయ పార్టీగా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం మూడు రాష్ట్రాల్లో ఆరు శాతం ఓట్లు వస్తే ఆ పార్టీకి జాతీయ హోదా వస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ ఓట్ల శాతం సాధించడంలో ఆ పార్టీకి ఇబ్బంది లేదు. మరో రాష్ట్రంలో ఆరు శాతం ఓట్లను సాధించాల్సి ఉంటుంది. దీనికోసం తెలుగువారి సంఖ్యాబలం అధికంగా ఉన్న తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ వంటి చోట్ల కూడా పార్టీ శాఖలు ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీచేయాలన్న ప్రతిపాదన ఆ పార్టీలో అంతర్గతంగా ఉంది.