షర్మిలకు ఉస్మానియా విద్యార్థుల మద్దతు..

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, స్వయానా ఏపీ ముఖ్యమంత్రి చెల్లెలు షర్మిల  తెలంగాణాలో పార్టీ పెట్టనున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే తెలంగాణాలో వైఎస్ అభిమానులతో షర్మిల సమావేశాలు నిర్వహిస్తూ చాలా చురుగ్గా కొత్త పార్టీ పెట్టె పన్నుల్లో ఉన్నారు. ఈ నేపథ్యం లో  షర్మిల పార్టీ పై ఎన్ని వ్యతిరేకతలు ఉన్న, మరిన్ని తప్పుడు అభిప్రాయాలూ ఉన్న తెలంగాణాలో షర్మిలకు వైఎస్ అభిమానుల ఆదరణ ఉండనే చెప్పాలి. అభిమానులు మాత్రమే కాదు  ఉస్మానియా యూనివర్సిటీ విద్యారథులు కూడా షర్మిల పార్టీని స్వాగతిస్తున్నారు.   

రాజేశేఖర్ రెడ్డి ‌వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆయన కూతురు షర్మిల త్వరలోనే తెలంగాణలో పెట్టబోయే పార్టీని ఓయూ విద్యార్థులు ఆహ్వానిస్తున్నారని ఓయూ జేఏసీ నాయకుడు, పరిశోధక విద్యార్థి అర్జున్‌ బాబు పేర్కొన్నారు. శుక్రవారం ఓయూ ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో షర్మిల పార్టీని స్వాగతిస్తూ విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు. వైఎస్‌ ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం ప్రవేశపెట్టి పేద విద్యార్థులకు మేలుచేస్తే, టీఆర్‌ఎస్‌  తూట్లు పొడుస్తోందని విమర్శించారు. ఓయూ విద్యార్థులు పలువురు పాల్గిన్నారు.