ఇళ్ళకి వెళ్ళి పెన్షన్ ఇవ్వడానికి ఏం రోగం!?

ఎండలు మండిపోతున్నాయి. ఎండలో ఇంట్లోంచి కాలు బయటకి పెట్టాలంటే యువత కూడా భయపడిపోతున్న పరిస్థితులు. మరి వృద్ధులకు బయటకి వచ్చే పరిస్థితి వుందా? ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధులకు పెన్షన్ ఇళ్ళకి వెళ్ళి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. అయితే ఎన్నికల కోడ్ వున్నప్పటికీ జగన్ కనుసన్నల్లో పనిచేసే అధికారులు మాత్రం వృద్ధులకు పెన్షన్ ఇళ్ళకి వెళ్ళి ఇవ్వం, బ్యాంకుల్లో జమచేస్తాం.. వాళ్ళు వచ్చి తీసుకోవాల్సిందే అని కరాఖండీగా చెబుతున్నారు. వాలంటీర్లు లేనప్పటికీ వృద్ధులకు ఇళ్ళ దగ్గర పెన్షన్ పంపిణీ చేయడానికి అసవరమైన ప్రభుత్వ సిబ్బంది వున్నారు. అయినప్పటికీ అధికారులు మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారు. పెన్షన్ తీసుకోవడం కోసం ఇంత ఎండలో బయటకి వస్తే వృద్ధుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఒకవేళ అలా ఎవరైనా చనిపోతే ఆ చావులను తెలుగుదేశం పార్టీ అకౌంట్లో వేసి శవరాజకీయం చేయాలన్నది వైసీపీ వ్యూహంలా అనిపిస్తోంది. పాపం అడుగు తీసి అడుగు వేయడానికి ఇబ్బందిపడే వృద్ధులకు ఇళ్ళకు వెళ్ళి పెన్షన్ ఇవ్వడానికి ఏం రోగం నాయనా? కొంతమంది కుర్రకారు పుట్టుకతో వృద్ధులు అన్నట్టుగా... ఇళ్ళకు వెళ్ళి పెన్షన్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న అధికారులు నిజమైన వృద్ధులు.