నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు.. నేను నిన్ను మళ్ళీ కలుస్తా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 902 లో.. మహేంద్ర డ్రింక్ చేస్తూ ఎక్కడికి వెళ్తున్నాడో అర్థం కాకుండా వెళ్తుంటాడు. మరొకవైపు వసుధార, రిషి ఇద్దరు కలిసి మహేంద్ర ఎక్కడికి వెళ్లాడోనని కంగారుపడుతు వెతుకుతుంటారు. మరొక వైపు ఒక ఆవిడ నేచర్ ని  ఫొటోస్ తీస్తూ ఉంటుంది. మరొక వైపు మహేంద్ర వెళ్తుండగా తన పర్సు కిందపడిపోతుంది. అప్పుడే ఆవిడ ఫొటోస్ తీస్తుండగా పర్సు కన్పించి, ఆ పర్సు ఇవ్వడానికి మహేంద్రని పిలుస్తుంది. ఆ తర్వాత మహేంద్ర ఒక దగ్గర కూర్చొని ఉంటాడు. అతని దగ్గర ఒక రాయిపై జగతి, మహేంద్ర, అనుపమ అని రాసి ఉంటుంది.. అది చూసిన మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. మరొకవైపు పర్సు తీసుకొని మహేంద్ర దగ్గరకి వస్తుంది ఆవిడ. తనని చూసిన మహేంద్ర షాక్ అవుతాడు. " అనుపమ.. నువ్వేంటి ఇక్కడ"  అని అడుగుతాడు. నువ్వు ఏంటి ఇక్కడ అని అనుపమ మహేంద్రని అడుగుతుంది. ఆ తర్వాత మహేంద్ర, అనుపమ జగతితో ఉన్న జ్ఞాపకాలు గుర్తుకు చేసుకుంటాడు. జగతి ఎక్కడ అని అనుపమ మహేంద్రని అడుగుతుంది. జగతి లేదు అన్న విషయం తెలిస్తే అనుపమ తట్టుకోలేదని మహేంద్ర సైలెంట్ గా ఉంటాడు. జగతి జీవితంతో ఆడుకుంటున్నావ్ కదా? ఎప్పుడో మీరు దూరంగా ఉంటున్నారని తెలిసింది కానీ ఇప్పుడు నువ్వు మౌనంగా ఉంటున్నవ్ అది నిజం అని అర్థం అవుతుందని అనుపమ అంటుంది. జగతి ఎక్కడ ఉంది? నేను వెళ్లి మాట్లాడతా అని అనుపమ అనగానే.. నేను తర్వాత కలిసినప్పుడు చెప్తానని, జగతి లేదన్న విషయం చెప్పకుండా డైవర్ట్ చేస్తాడు. మరొకవైపు రిషి, వసుధార ఇద్దరు మహేంద్ర గురించి వెతుక్కుంటూ వస్తారు. " నీ అడ్రెస్ చెప్పు, వచ్చి జగతి గురించి తెలుసుకోవాలి" అని అనుపమ అడుగుతుంది. మళ్ళీ కలిసినప్పుడు జగతి గురించి చెప్తాను. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని‌ అనుపమతో మహేంద్ర అంటాడు. ఆ తర్వాత అనుపమ వెళ్తుండగా.. రిషి, వసుధార ఇద్దరు వస్తారు. మహేంద్ర దగ్గరికి వచ్చిన ఆవిడా ఎవరు అని రిషి అడుగుతాడు. అడ్రెస్ కావాలంటే చెప్పానని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత మహేంద్రని రిషిని తీసుకొని వెళ్తుంటాడు. వసుధార మాత్రం అక్కడ రాయిపై రాసి ఉన్నా పేర్లు చూసి ఈ అనుపమ ఎవరని అనుకుంటుంది. మరొకవైపు అనుపమకి వాళ్ళ పెద్దమ్మ వీడియో కాల్ చేసి మాట్లాడుతుంది. నాకు మహేంద్ర కన్పించాడని అనుపమ చెప్పగానే.. ఏంటి మహేంద్ర కన్పించడా అని వాళ్ళ పెద్దమ్మ షాక్ అవుతుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

దుబాయ్‌లో బతుకమ్మ.. ఫ్యాన్స్ తో మారుమ్రోగిన స్టేజ్!

తెలంగాణలో బతుకమ్మ పండుగ సందర్భంగా ఎంతో మంది సెలబ్రిటీలు ఆటలు  ఆడి, పాటలు పాడి బతుమ్మ సెలబ్రేషన్స్ లో పాల్గొని బాగా ఫేమస్ అయ్యారు. అయితే ఇప్పుడు బతుకమ్మ సెలబ్రేషన్స్ తెలంగాణాతో పాటు ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది. ఆస్ట్రేలియాలో బతుకమ్మ జరిపించారని కవితక్క చెప్పింది. ఇప్పుడేమో దుబాయ్ లో బతుకమ్మని సెలబ్రేట్ చేసుకున్నామని, ఈ ఈవెంట్ కి ఇంతమంది జనాలు వస్తారని అనుకోలేదంటూ అనిల్ జీలా తన యూట్యూబ్ ఛానెల్ లో పంచుకున్నాడు. అనిల్ జీల.. 'హలో వరల్డ్' వెబ్ సిరీస్ తో చాలా మందికి పరిచయం అయినా ఒక యూ ట్యూబేర్... ప్రస్తుతం సోషల్ మీడియాలో మై విలేజ్ షో అనిల్ జీల అండ్ టీమ్ హవా నడుస్తుంది. యూట్యూబర్ గా అనిల్ జీల మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలంగాణాలోని ఒక మారుమూల గ్రామంలో ఉన్న గంగవ్వని పాపులర్ చేసాడు అనిల్ జీల. మై విలేజ్ షో ద్వారా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ కొంతమందితో కలిసి చిన్న చిన్న వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు పాపులర్ అయ్యాడు. అనిల్ జీల క్రియేట్ చేసిన  'మై విలేజ్ షో' యూట్యూబ్ ఛానెల్ ద్వారా గంగవ్వకి బిగ్ బాస్ షోలో అవకాశం లభించింది. షోలోకి వెళ్ళాక నాగార్జున సైతం తనకి ప్రోత్సాహం అందించాడు. యూట్యూబ్ వీడియోల నుండి అనిల్ కెరీర్ మొదలు పెట్టి.. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నాడు. అనిల్ జీల ఎప్పటికప్పుడు విభిన్నంగా ఆలోచిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. లాక్ డౌన్ లో అనిల్ పెళ్లి చేసుకుని పెళ్లి పత్రిక డిఫరెంట్ గా చేయించాడు. అప్పట్లో అది కాస్త వైరల్ గా మారింది. రీసెంట్ గా హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ లో నటించి తన కామెడీతో అందరిని మెప్పించాడు. ట్రెండింగ్ లో ఉన్న కంటెంట్ తీసుకొని వీడియోలు చేయడం అనిల్ స్టైల్ అనే చెప్పాలి. కొన్ని రోజుల క్రితం బిగ్ బాస్ లోకి వెళ్తున్నట్టుగా వార్తలు రావడంతో ఒక్కసారిగా  వైరల్ అయ్యాడు. గంగవ్వ, అంజీ ఇంకా "మై విలేజ్ షో" టీమ్ తో కలిసి దుబాయ్ కి వెళ్లిన అనిల్ జీల అక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. అక్కడికి వచ్చిన తెలుగు అభిమానులని చూసి వాళ్ళంతా షాక్ అయ్యారు. ఎన్నడూ ఇంతమంది జనాలు రాలేదని ఆ ఈవెంట్ ని జరిపిస్తున్న మేనేజర్ చెప్పాడు. ఇప్పుడు అనిల్ జీలా తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసిన ఈ వీడియో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.  

ఎమోషనల్ అయిన అప్పు.. కావ్యకి సపోర్ట్ గా రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -234 లో.. ఎలుక తన చీరలు నాశనం చేసిందని కనకం తిడుతుంటుంది. అది విని రుద్రాణి భరించలేక.. ఆపేయ్ తిట్లు అని ఇంకా రెచ్చిపోయి తిడుతుంది కనకం. ఇక ఆ తిట్లు భరించలేక రుద్రాణి వెళ్ళిపోతుంది. కాసేపటికి స్వప్న తిన్న తర్వాత ట్యాబ్లెట్ ఇచ్చి వేసుకోమంటుంది. అప్పుడే ట్యాబ్లెటా? నాకు వద్దని అంటుంది. మీకోసం నేను ఇలాగే ట్యాబ్లెట్ వేసుకున్నానని అంటుంది. ఇక కావ్యను జ్యూస్ తీసుకురా అని  స్వప్న అంటుంది.  ఇప్పుడెంత పనిచేస్తే అంత బాగా ప్రసవం అవుతుంది. ఇప్పుడు ఇలా ఉంటే వొల్లు కూడా కదపలేవు. కడుపు ఉంటే కదా అమ్మ ప్రసవం అయ్యేది " అని కావ్య అంటుంది. ఏయ్ ఏంటే అలా అన్నావని కనకం‌ అంటుంది. అంటే నేను కేర్ లెస్ గా ఉన్నాను కదా అమ్మ ‌అందుకే తొమ్మిది నెలలు బిడ్డని మోస్తానో లేదోనని అలా కావ్య అందని స్వప్న కవర్ చేస్తుంది. "నీలాగా నేను అవలీలగా అబద్ధాలు చెప్పలేను కదా అక్క" అని కావ్య తన మనసులో అనుకుంటుంది. మరొకవైపు అప్పుని తీసుకొని కళ్యాణ్, అనామిక కలిసి ఫోటోషూట్ కోసం ఒక ప్లేస్ కి వెళ్తారు. అక్కడ  అనామిక, కళ్యాణ్ లు క్లోజ్ గా ఉంటారు. వారిని ఫోటోలు తీయమని అప్పుతో కళ్యాణ్ చెప్పగా.. తన గుండె పగిలినంత పని అవుతుంది. కన్నీళ్ళతో వాళ్ళ ఫోటోలని తీస్తుంది అప్పు. దుగ్గిరాల కుటుంబంలో ఉదయం లేచేసరికి కిచెన్ లో పనిమనిషి శాంత వచ్చి పని చేస్తుంటుంది. కిచెన్ లో శాంతని చూసిన కావ్య షాక్ అవుతూ.. తనని అత్తమ్మ చూస్తే ఎంత గొడవ అవుతుందోనని అనుకొని కంగారుపడుతుంది కావ్య. అప్పుడే వచ్చిన అపర్ణ కిచెన్ లో ఉన్న శాంతని చూసి ఆశ్చర్యపోతుంది. కావ్య అని గట్టిగా పిలిచేసరికి ఏదైనా గొడవేమోనని ఇంట్లోవాళ్ళంతా వస్తారు‌. ఏమైందని కావ్య అడుగగా.. శాంతని ఎవరు పిలిచారని అపర్ణ అడుగుతుంది. ఇదే టైమ్ అని రుద్రాణి మధ్యలో దూరి అపర్ణకి కోపం వచ్చేలా నెగెటివ్ గా మాట్లాడుతుంది. రాజ్ వచ్చి నేనే శాంతని తీసుకొచ్చానని అంటాడు. అందరు షాక్ అవుతారు. రుద్రాణి మధ్యలో కలుగజేసుకొని మీ అమ్మకి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు శాంతని తీసుకొచ్చావని రాజ్ ని రుద్రాణి అడుగుతుంది. "ఇంట్లో అందరికి కాఫీ, టీ, గ్రీన్ టీ , టిఫిన్ అంటూ పొద్దున్నుండి మొత్తం పని కావ్యనే చేస్తుంది. ‌తాతయ్యకి ఏ టైమ్ కు ఏం మందులు ఇవ్వాలని కావ్యకి మాత్రమే తెలుసు, అవి ఒక్కోసారి లేట్ అవుతున్నాయి. అందుకే తనకి సాయంగా ఉంటుందని , అన్నీ తెలిసిన శాంతని తీసుకొచ్చాను" అని రాజ్ అంటాడు. మరి మీ అమ్మకి ఒక మాట చెప్పాలి కదా అని రుద్రాణి అడుగుతుంది. పొద్దున్నే అయిదు గంటలకి లేచి అందరికి అన్ని సమకూరుస్తూ, పనులు చేసి తన గదికెళ్ళి పడుకునేసరికి రాత్రి పదకొండు దాటుతుందని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

బిగ్‌బాస్‌ హౌస్‌లోనే కంటెస్టెంట్‌ అరెస్ట్‌... షాక్‌ అయిన నిర్వాహకులు!

ఈమధ్యకాలంలో ఎక్కువ ఆదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్‌. ఈ షోకి సంబంధించి ఏ చిన్న అప్‌డేట్‌ వచ్చినా నెటిజన్లు ఎంతో ఆసక్తిగా దాన్ని ఫాలో అవుతారు. మొదట హిందీలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన ఈ షోను ఇప్పుడు వివిధ భాషల్లో విస్తరించారు. ఇప్పుడు పలు భాషల్లో ఈ షో సందడి చేస్తోంది. ఇప్పుడు ఈ షోలో జరిగిన ఒక పరిణామం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బిగ్‌బాస్‌ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు జరగని ఓ ఘటన ఈ షోలో చోటు చేసుకుంది. అటవీ శాఖకు చెందిన కొందరు అధికారులు బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి వెళ్ళి ఒక కంటెస్టెంట్‌ను అరెస్ట్‌ చేశారు. కన్నడ భాషలో నిర్వహిస్తున్న బిగ్‌బాస్‌లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. పులిగోరు గొలుసును ధరించిన కంటెస్టెంట్‌ వర్తుర్‌ సంతోష్‌పై పలువురు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అటవీ శాఖ అధికారులు సంతోష్‌ను అదుపులోకి తీసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించినందుకు సంతోష్‌పై కేసు నమోదు చేశారు. అయితే డైరెక్ట్‌గా బిగ్‌బాస్‌ హౌస్‌కి అధికారులు వెళ్ళడం వెనుక ఓ కారణం ఉంది. సంతోష్‌పై ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు అతన్ని తమకు అప్పగించాలని కోరారు. అయితే దీన్ని బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఒప్పుకోలేదు. దీనిపై స్పందించిన అధికారులు వారికి సీరియస్‌గా వార్నింగ్‌ ఇవ్వడంతో నిర్వాహకులు వెనక్కి తగ్గారు. అప్పుడు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంటర్‌ అయిన అధికారులు సంతోష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అసలు పులిగోరు అతనికి ఎలా అందింది అనే విషయంపై ఆరా తీస్తున్నారు అధికారులు. త్వరలోనే కోర్టులో సంతోష్‌ను హాజరుపరిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటివరకు బిగ్‌బాస్‌ చరిత్రలోనే ఇలాంటి అరెస్ట్‌ ఘటన జరిగింది లేదు. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ పెడుతున్నారు.  

తాగిన మైకంలో ఒకే బెడ్ పై వాళ్ళిద్దరు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-901 లో.. శైలేంద్ర కుట్రల గురించి ఎలాగైన రిషికి సాక్షాలతో చూపించాలని వసుధార, మహేంద్ర అనుకుంటూ ఉండగా అప్పుడే వచ్చిన రిషి.. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారని అడుగుతాడు. వసుధార, మహేంద్ర ఏదో ఒకటి కవర్ చేస్తారు. ఆ తర్వాత నేను జగతి ప్రాణo కంటే ఎక్కువగా ప్రేమించుకున్నాం కానీ ఇప్పుడు మాకు కలిసి ఉండే అదృష్టం లేకుండాపోయింది. మీరు నాలాగా కాకూడదు ఎప్పుడు కలిసి మెలిసి ఉండాలని మహేంద్ర అంటాడు. మీకు ఆ పరిస్థితి రావడానికి కారణం నేనే కదా అని మహేంద్రకు రిషి సారీ చెప్తాడు. అలా అనకు రిషి, ప్రశాంతత కోసం అని వచ్చి మీరు అప్సెట్ అయితే ఎలా ఒక ప్లేస్ కీ తీసుకొని వెళ్తాను పదా అని రిసార్ట్ ముందు నృత్యం చేస్తున్న వారి దగ్గరికి మహేంద్ర తీసుకొని వస్తాడు.  ఆ తర్వాత వాళ్ళతో పాటు రిషి, వసుధార, మహేంద్ర ముగ్గురు కలిసి డ్యాన్స్ చేస్తారు. ఆ తర్వాత మహేంద్ర పక్కకి వచ్చి కూర్చొని వాటర్ బాటిల్ లో మందు కలుపుతాడు. అది తెలియని వసుధార, రిషి డాన్స్ చేసి వచ్చి మహేంద్ర  మందు కలిపిన వాటర్ తాగుతారు. అప్పుడే మహేంద్ర వచ్చి ఈ వాటర్ ఎందుకు తాగారని అడుగుతాడు. ఇక వసుధార, రిషి మందు మైకంలో ఉంటారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఒక పాట మైకంలో డ్యాన్స్ చేస్తుటారు. వాళ్ళను అలా చూసిన మహేంద్ర హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. ఆ తర్వాత రిషి, వసుధారలని మహేంద్ర లోపలికి తీసుకొని వెళ్తాడు. మరుసటి రోజు ఉదయం రిషి, వసుధారలు నిద్రనుండి లేచేసరికి ఇద్దరు ఒకే బెడ్ పై ఉండడం చూసుకొని రాత్రి డాన్స్ చేసింది గుర్తుకు చేసుకుంటూ నవ్వుకుంటారు. ఆ తర్వాత రిషికి వసుధార కాఫీ ఇస్తుంది. మహేంద్ర ఎక్కడ కన్పించకపోయేసరికి రిషి, వసుధారలు వెతుకుతారు.  మహేంద్ర డ్రింక్ చేస్తు వెళ్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కృష్ణకి మురారి జాడ తెలిసేనా.. ముకుంద నిజం చెప్పనుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ ఎపిసోడ్-295 లో.. మురారి కోసం కృష్ణ హాస్పిటల్ మొత్తం వెదుకుతుంటుంది. శకుంతల దగ్గరికి వచ్చి ఏసీపీ సర్ కన్పించాడా అంటూ అడుగుతుంది. మరొక వైపు ముకుంద అన్నయ్య మురారి సర్జరికి సంబంధించిన సంతకాలు  పెట్టుకొని పరిమళ మేడమ్ కి ఇస్తాడు. మరొక వైపు ముకుంద వాళ్ళ అన్నయ్య ముకుందతో ఫోన్ లొ మాట్లాడుతాడు. రేపటికి అల్ల పని పూర్తి అవుతుందని ముకుంద అన్నయ్య చెప్పగానే ముకుంద టెన్షన్ పడుతుంది ఈ విషయం బయట ఎవరికైనా తెలిస్తే మొదటికే మోసం వస్తుందని ముకుంద అనగానే.. నువ్వేం టెన్షన్ పడకని ముకుంద వాళ్ళ అన్నయ్య చెప్తాడు. ఆ తర్వాత ముకుంద అన్నయ్య ఫోన్ కట్ చెయ్యగానే తన చుట్టూ పోలీసులు ఉంటారు. ఎందుకు వచ్చారని ముకుంద వాళ్ల అన్నయ్య అడగ్గానే.. మురారిని  నువ్వే చంపావని‌ మాకు తెలుసని పోలీసులు చెప్తారు. అలా అని ఎవరు చెప్పారని అనగానే.. శ్రీనివాస్ వచ్చి నేనే చెప్పానని అంటాడు. ఆ తర్వాత కన్న తండ్రి అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు శ్రీనివాస్ ని తిడతాడు. ఆ తర్వాత పోలీసులు తీసుకొని వెళ్తారు. మరోక వైపు కృష్ణకి టీ తీసుకొని శకుంతల వస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా అని కృష్ణ అడుగుతుంది. నేను మా ఇంటికి వెళ్లి ఏసీపీ సర్ గురించి అడుగుతానని శకుంతలకి కృష్ణ చెప్తుంది. శకుంతల వద్దని చెప్పిన కృష్ణ వినకుండా భవాని దగ్గరికి బయలుదేర్తుంది. మరొక వైపు ప్రభాకర్ హాస్పిటల్ కి వచ్చి కృష్ణ ఎక్కడ అని అడుగుతాడు. భవాని దగ్గరికి వెళ్లి ఏసీపీ గురించి అడుగుతానంటూ వెళ్ళిందని శకుంతల చెప్పగానే.. ఎందుకు పంపించావని తనపై ప్రభాకర్ కోప్పడతాడు.  ఆ తర్వాత కృష్ణని తన ఇంటికి వెళ్లకుండా ఆపాలని అక్కడ నుండి వెళ్తాడు. మరొక వైపు డాక్టర్స్ మురారి సర్జరికీ సంబందించి ఏ విషయం బయటకు రావద్దని అనుకుంటారు. మరొక వైపు మురారి కర్మకాండ జరిపించాలని పంతులిని తీసుకొని వస్తాడు మధు. ఏర్పాట్ల గురించి రేవతికి చెప్తాడు. మరొక వైపు కృష్ణ ఇంటిముందుకు రాగానే ప్రభాకర్ తన వెనకాలే వచ్చి వెనక్కి తీసుకొని వెళ్తాడు. కృష్ణ, ప్రభాకర్ లు వెళ్లడం ముకుంద చూస్తుంది. మరొకవైపు కృష్ణ, ప్రభాకర్ లు  హాస్పిటల్ కి వెళ్లి మురారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఎనిమిదో వారం హీటెడ్ నామినేషన్లు.. మళ్లీ టార్గెట్ భోలే షావలేనా!

బిగ్ బాస్ సీజన్-7 కంటెస్టెంట్స్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్ సాగుతుంది. అదే సోమవారం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. దీనికి సంబంధించి కంటెస్టెంట్స్ మధ్య జరిగిన వాగ్వాదం కోర్ట్ రూమ్ లో జరిగే కేసుల వాదనలను తలపించాయి. హౌస్ కెప్టెన్ అంబటి అర్జున్ కాబట్టి తనని ఎవరు నామినేట్ చేయొద్దని బిగ్ బాస్ చెప్పాడు. ఆ తర్వాత నామినేషన్ ప్రక్రియను మొదట శివాజీ ప్రారంభించాడు.‌ ప్రియాంక, శోభాశెట్టిలని శివాజీ నామినేట్ చేశాడు. "భోలే సారీ చెప్పిన ఆక్సెప్ట్ చేయలేదు" అని శోభాకి శివాజీ చెప్పి నామినేట్ చేశాడు. ఆ తర్వాత ప్రియాంక, శోభాశెట్టి లని  అశ్విని శ్రీ నామినేట్ చేసింది. తనతో  ఎవరు మాట్లాడటం లేదని అశ్విని శ్రీ నామినేట్ చేసింది. భోలే షావలి, అశ్వినిశ్రీలని ప్రియాంక నామినేట్ చేసింది. టాస్క్ సరిగ్గా ఆడలేదని, బూతులు వాడొద్దని, నటించొద్దని చెప్తూ భోలే షావలిని ప్రియాంక నామినేట్ చేసింది‌. అశ్వినిశ్రీని, భోలే షావలిని ఆట సందీప్ నామినేట్ చేశాడు. టాస్క్ లోకి పంపించట్లేదని, ఇరిటేట్ అయ్యావ్. ఆ రోజు నువ్వు అడిగిన విధానం ఇలా లేదని అశ్వినిశ్రీని ఆట సందీప్ అన్నాడు.  బూతు మాట్లాడటం తప్పు అని భోలే షావలిని ఆట సందీప్ నామినేట్ చేశాడు. "నాకు మోషన్స్ వచ్చిన తట్టుకుంటాను కానీ ఎమోషన్స్  వస్తే తట్టుకోలేనని ఆట సందీప్ తో భోలే షావలి అన్నాడు. భోలే షావలిని గౌతమ్ కృష్ణ నామినేట్ చేశాడు. నువ్వు గేమ్ ఆడలేదు. హౌస్ లో నువ్వు వీక్ అని నాకనిపిస్తుందని గౌతమ్ కృష్ణ రీజన్ చెప్పాడు. ఇది నామినేషన్ల మొత్తంలో చెత్త రీజన్ అనిపించింది. ఇలా ఒక్కో నామినేషన్ లో కంటెస్టెంట్స్ చెప్పే రీజన్స్ అన్నీ తుప్పాస్ రీజన్స్ లా అనిపించాయి. అయితే వీరి మధ్య జరిగిన ఇంటెన్స్ డ్రామాని తలపించాయి.

నా కాంట్రాక్ట్ ముగిసింది.. నాకు మెసెజ్ లు చేయకండి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ లో ముకుంద వాళ్ళ అన్నయ్య ఎంట్రీతో కథ పూర్తిగా మలుపు తిరుగుతుంది. ఇస్తాడు. యాక్సిడెంట్ చేసి మురారిని హాస్పిటల్ కీ తీసుకొని వెళ్ళి ప్రాణాలు కాపాడతాడు ముకుంద వాళ్ళ అన్నయ్య. ఆ తర్వాత వేరొకరి శవాన్ని భవానీ వాళ్ల ఇంటికి పంపించి కృష్ణ చనిపోయాడని చెప్పిస్తాడు. మరొకవైపు మురారి ఎక్కడున్నాడో తెలియక కృష్ణ విలవిల లాడిపోతుంది. అదే హాస్పిటల్ లో ముకుంద వాళ్ళ అన్నయ్య మురారికీ ట్రీట్ మెంట్ చేస్తున్న డాక్టర్ కాబిన్ దగ్గరికి వెళ్ళి.. నేను చెప్పినట్లు చెయ్యండంటు బ్లాక్ మెయిల్ చేస్తాడు. హాస్పిటల్ బయటకి వచ్చిన ముకుంద వాళ్ళ అన్నయ్య దగ్గరికి పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. అతడిని అరెస్టు చేపించిన శ్రీనివాస్ ని చంపేస్తానని ముకుంద వాళ్ళ అన్నయ్య అంటాడు. డాక్టర్స్ మురారిని చూసి ఇతడిది చాలా క్లిష్టమైన కేస్, ఎవరికి చెప్పొద్దని డాక్టర్స్ మాట్లాడుకుంటారు. మరొక వైపు కృష్ణ, ప్రభాకర్ కలిసి భవానికి కంటపడకుండా వెనక్కి వచ్చేస్తారు.  మురారి క్యారెక్టర్ ముగిసిందని ఈ సీరియల్ అభిమానులు ప్రోమోల కింద కామెంట్లలో అడుగుతున్నారు. దీంతో పాటుగా గగన్(మురారి) ని ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులు ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారంట. ఇక వాళ్ళ ప్రశ్నలన్నింటికి సమాధానమిచ్చాడు గగన్ అలియాస్ మురారి. " నాకు చాలా మెసెజ్ లు వస్తున్నాయి. నా కాంట్రాక్ట్ సరిగ్గా సంవత్సరం ఉంది. అది కూడా 1-10-222 నుండి 1-10-23 వరకని గగన్ అన్నాడు. దీని గురించి తప్పుడు ప్రచారం చేయకండి అని గగన్ అన్నాడు.  నాకు ఈ సీరియల్ లో కాంట్రాక్ట్ ముగిసిందని రూమర్స్ స్ప్రెడ్ చేయకండని గగన్ అన్నాడు. దీంతో మురారి క్యారెక్టర్ ఈ కథలో ముగిసిందని స్పష్టంగా తెలిసింది. మరి మురారి స్థానంలో ఇంకెవరు వస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది.

నా డెసిషన్ రాంగ్.. తుప్పాస్ రీజన్ వల్ల బయటకొచ్చా!

బిగ్ బాస్ సీజన్-7 ఆసక్తికరంగా సాగుతుంది. ‌ప్రతీ కంటెస్టెంట్ తమ ఆటతీరు, మాటతీరుతో రోజు రోజుకి ఆసక్తి కలిగిస్తున్నారు. బిగ్ బాస్ హౌజ్ లో ఇప్పటికి ఏడు వారాలు పూర్తయింది. అందులో గతవారం నయని పావని ఎలిమినేషన్ అవ్వగా, ఈ వారం పూజామూర్తి ఎలిమినేషన్ అయింది. అయితే ఎలిమినేషన్ తర్వాత బిబి బజ్ ఎగ్జిట్ ఇంటర్వ్యూలో గీతు రాయల్ తో హౌస్ మేట్స్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది పూజామూర్తి. మీకు రెండు నామినేషన్లు పడ్డాయి. వాటిలో మీకు ఏది తుప్పాస్ నామినేషన్ అనిపించిందని గీతు రాయల్ అడుగగా.. టేస్టీ తేజ వేసిన నామినేషన్ తుప్పాస్ అని పూజామూర్తి అంది. వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చిన మీరు వైల్డ్ గా ఆడుతారని అనుకున్నారంతా అని గీతు అడుగగా.. దెబ్బ తగులుతుంది ఆడపిల్లలు అంటే సైలెంట్ గా టీవీ చూస్తూ ఇంట్లో కూర్చోవాలని ఇక్కడికి రాకూడదని పూజామూర్తి అంది. ఇది భోలే షావలిని ఉద్దేశించి చెప్పిందని తెలుస్తుంది.  మిగిలిన వాళ్ళు మీకన్నా డిజర్వింగ్ అనుకుంటున్నారా అని గీతు అడుగగా.. లేదు, బోలే షావలి, అశ్వినిశ్రీ నాకన్నా డిజర్వింగ్ కాదు. ఎందుకంటే టాస్క్ మొదలైనప్పుడు నన్ను టాప్ టూ బాటమ్ చూసి.. "హా నువ్వు ఫిజికల్లీ స్ట్రాంగ్ అని అన్నప్పుడు నాకే కాదు, ఎవ్వరికైనా కాలుద్ది" అని పూజామూర్తి అంది. మీరు హౌస్ మేట్స్ తో కలిసి ఆడటానికి వచ్చారా లేక ఎంకరేజ్ చేయడానికి వచ్చారా అని గీతు అడుగగా.. గైడ్ చేశాను. అది కూడా ఒక గేమే అని పూజామూర్తి అంది. ప్లేయరే విన్ అవుతాడు కోచ్ విన్ అవ్వడని గీతు అంది. నా డెసిషన్ రాంగ్ కానీ నేను ఆడలేను అని ఆ నిర్ణయం తీసుకోలేదని పూజామూర్తి అనగా.. మీరు ఆడలేదు కదా అని గీతు అంది. ఇక్కడ హౌస్ లో ఉన్నవాళ్ళంతా ఆడి ఉంటున్నారనుకుంటున్నారా అని పూజామూర్తి అంది. ఇలాంటి బోలెడు ఆసక్తికరమైన విషయాలని పంచుకుంది పూజామూర్తి.

పూజామూర్తి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

బిగ్ బాస్ హౌస్ లో ఏడవ వారం పూజామూర్తి ఎలిమినేట్ అయింది. 2.0 లో గ్రాంఢ్ గా ఎంట్రీ ఇచ్చిన పూజామూర్తి ‌హౌస్ లో తన ఆటతీరు, మాటతీరుతో ఆకట్టుకుంది. 2.0 లో అంబటి అర్జున్, నయని పావని, భోలే షావలి, పూజామూర్తి, అశ్వినిశ్రీ లు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. "గుండమ్మ గారి కథ" సీరియల్ లొ ప్రధాన పాత్ర పోషించిన పూజామూర్తి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక ఎవరితోను‌ ఎక్కువగా కలవలేకపోయింది. అంబటి అర్జున్, గౌతమ్ కృష్ణ తో ఎక్కువ సమయం ఉండటంతో కాస్త పాజిటివిటీని పొందినా అశ్వినిశ్రీతో గొడవ పెద్ద మైనస్ గా మారింది. నోటికొచ్చినట్టు మాట్లాడటంతో తను హౌస్ లో రూడ్ బిహేవియర్ లా అనిపించింది. అయితే అన్నింటికన్నా ముఖ్యంగా నామినేషన్లో పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేసి చెప్పిన రీజన్ సరైనది కాదని అందరూ భావించారు. కెప్టెన్ గా సరిగా బాధ్యతలు చేయలేదని, అందుకే హౌస్ లో అనర్హుడని ‌పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేసింది పూజామూర్తి. దీనివల్ల ఆడియన్స్ లో నెగెటివిటి పెరిగింది. హౌస్ నుండి ఎలిమినేట్ అయి స్టేజ్ మీదకొచ్చాక ఎమోషనల్ అయింది పూజామూర్తి. హౌస్ మేట్స్ తో తనకున్న ఫీలింగ్ చెప్పుకొచ్చింది. హౌస్ లోని వారిలో ఉన్న బలం, బలహీనతల గురించి వారితో చెప్పింది పూజామూర్తి. అయితే హౌస్ లో పూజామూర్తి రోజుకి 35వేల చొప్పున వారానికి  2లక్షల 45 వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుందంట. తను మొట్ట మొదటి వారంలోనే హౌస్ లోకి రావాల్సింది. అయితే వాళ్ళ నాన్న చనిపోవడంతో 2.0లో గ్రాంఢ్ ఎంట్రీ ఇచ్చింది పూజామూర్తి.

బిగ్ బాస్ హౌస్ లో దసరా సంబరాలు.. ఫన్ అండ్ ఎమోషనల్!

బిగ్ బాస్ సీజన్-7 ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. ఆదివారం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఈసారి వినోదంతో పాటుగా ఫ్యామిలీ సెంటి మెంట్ ని చూపించేసాడు బిగ్ బాస్. హౌస్ లోకి 2.0 లో గ్రాంఢ్ గా వచ్చిన 5 మంది కంటెస్టెంట్స్ లలో.. గతవారం నయని పావని, ఈ వారం పూజామూర్తి కలిపి ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. హౌస్ లోని కంటెస్టెంట్స్ లలో రెండు టీమ్ లని చేసి, వారిచేత బతుకమ్మ చేయడానికి రకరకాల పూలని ఇచ్చి బతుకమ్మ చేయమన్నాడు నాగార్జున. ఇందులో పల్లవి ప్రశాంత్ టీమ్ బతుకమ్మని బాగా చేసి టాస్క్ లో గెలిచారు. ఆ తర్వాత రెబా మౌనిక, డింపుల్ హయాతి, పాయల్ రాజ్ పూత్ డ్యాన్స్‌ పర్ఫామెన్స్ తో అదరగొట్టారు. ఇక కొంతమంది సింగర్స్ చేత పాటలు పాడించారు. ఇక  ఈ సండే ఫండే తో పాటు ఎమోషనల్ చేసాడు నాగార్జున. టాస్క్ లలో గెలిచిన టీమ్ లలోని ఇద్దరికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు రాసిన లెటర్ లని ఇప్పించాడు నాగార్జున. అందులో శోభాశెట్టి, అమర్ దీప్ లు మొదట టాస్క్ లలో గెలిచి లెటర్స్ తీసుకున్నారు. యావర్ కి వాళ్ళ ఫ్యామిలీ నుండి వచ్చిన లెటర్ చదువుతూ ఎమోషనల్ అయ్యాడు. దాంతో ప్రియాంక జైన్ ని ఆ లెటర్ చదవమనగా.. తను చదువుతూ మరింత ఎమోషనల్ అయింది‌. ఆ లెటర్ తర్వాత చదువుకోమని యావర్ తో నాగార్జున చెప్పాడు. ఇక ఆ తర్వాత పోస్టర్ చూసి పాటని గెస్ చేయమని టాస్క్ ఇచ్చాడు. దానిని బాగా అందరు బాగా ఆడారు. రెండు టీమ్ లకి టై అయింది. దాంతో వాళ్ళకి వచ్చే లగ్జరీ బడ్జెట్ హౌస్ మేట్స్ అందరికి అందింది. ఇక ఆ తర్వాత కంటెస్టెంట్స్ పండుగని బాగా సెలబ్రేట్ చేసుకున్నారు.

రీఎంట్రీ ఇచ్చిన రతిక.. వెళ్ళగానే శివాజీ కాళ్ళమీద పడ్డదిగా!

బిగ్ బాస్ సీజన్-7 లో ట్విస్ట్ లు మాములుగా లేవు కదా. ఒకరు ఎలిమినేషన్ అవుతుంటే, మరొకరు సీక్రెట్ రూమ్ కి వెళ్తున్నారు.‌ ఇక బయటకు వెళ్లిన ముగ్గురిలో నుండి ఒకరు మళ్ళీ హౌస్ లోకి రావడం. ఇదంతా చూస్తున్న ప్రేక్షకులు ఇవెక్కడి ట్విస్ట్ లు రా మామా అని అనుకుంటున్నారు.  గతవారం శుభశ్రీ, దామిణి, రతికరోజ్ ముగ్గురు హౌస్ లోకి వచ్చి తమకి ఓట్ వేసి గెలిపించాలని హౌస్ మేట్స్ ని రిక్వెస్ట్ చేసి వెళ్ళిపోయారు. అయితే హౌస్ మేట్స్ అందరు కలిసి ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారో వారికే ఓట్లు వేసారు. అయితే మెజారిటీ ఓట్లు వచ్చినవాళ్ళు కాకుండా లీస్ట్ ఓట్లు వచ్చినవారే హౌస్ లోకి రీఎంట్రీ ఇస్తారంటూ, ఇదే ఉల్టా పల్టా అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు నాగార్జున. దీంతో హౌస్ మేట్స్ వేసిన ఓటింగ్ లో  లీస్ట్ లో రతికరోజ్ ఉంది. దాంతో దసరా కానుకగా బిగ్ బాస్ హౌస్ లో గ్రాంఢ్ గా ఎంట్రీ ఇచ్చింది రతికరోజ్. స్టేజ్ మీదకి రాగానే.. మళ్లీ ఈ స్టేజ్ మీదకి వస్తానని అనుకోలేదంటూ, నాకు ఇది గోల్డెన్ ఛాన్స్ అంటూ నాగార్జునతో తన సంతోషాన్ని పంచుకుంది. లైఫ్ లో ఇలా సెకండ్ ఛాన్స్ ఎప్పుడు రాదు. నీకు వచ్చింది. మొదటి రెండు వారాలు నీ ఆట టాప్ లో ఉంది. ఆ తర్వాత పాతాళానికి పడిపోయింది. అందుకే ఎలిమినేట్ చేసి పంపించేశారు. ఇప్పుడు మళ్లీ ఈ తప్పు చేయకని నాగార్జున చెప్పాడు. ఈసారి పాతాళం నుండి టాప్ కి వెళ్ళిపోతా, నన్ను నేనేంటో ప్రూవ్ చేసుకుంటానని రతిక ప్రామిస్ చేసింది. ఇక డోర్ ఓపెన్ అవ్వగానే శివాజీ ఎదురుగా కనిపించాడు. నా టైమ్ బాగుంది శివన్నే కన్పించాడంటూ రతిక అంది. వచ్చీ రాగానే శివాజీని హగ్ చేసుకుంది. అందరికి హాయ్ చెప్పిన రతికకి ఎదురుగా వచ్చి మరీ టేస్టీ తేజ అన్నం తినిపించాడు. ఆ తర్వాత సీరియల్ బ్యాచ్ లోని అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభాశెట్టిలను పలకరించింది. ఇక అందరితో మాట్లాడిన తర్వాత శివాజీతో మాట్లాడాలని చెప్పి డీలక్స్ రూమ్ కి తీసుకెళ్ళింది. వెళ్ళగానే శివాజీ కాళ్ళమీద పడి.. నన్ను నీ బిడ్డ అనుకో అన్న, క్షమించు అన్న అని రతికరోజ్ అంది. "ఇక్కడికి గేమ్ ఆడటానికి వచ్చాం. ఇగోలు, గొడవలు వద్దు. గేమ్ మీద ఫోకస్ చేయు. ఇలా కాళ్ళమీద పడటాలు అవీ వద్దు" అని రతికతో శివాజీ అన్నాడు. ఆ తర్వాత కాసేపటికి కిచెన్ ఏరియాలో ఉన్న రతిక కోసం రసగుల్ల తీసుకొచ్చాడు పల్లవి ప్రశాంత్. "ఏంటి రసగుల్లనా.. మల్లొచ్చిన"  అంటూ ప్రశాంత్ డైలాగ్ చెప్పి హ్యాపీగా తినేసింది రతిక. 

పూజామూర్తి ఎలిమినేషన్.. వరుసగా ఏడో ఫీమేల్ కంటెస్టెంట్!

బిగ్ బాస్ సీజన్-7 గ్రాంఢ్ గా మొదలైన విషయం తెలిసిందే. అయితే సీజన్ మొదలైన ఆరు వారాల నుండి వరుసగా ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేటెడ్ అయ్యారు. తాజాగా మరో ఫీమేల్ కంటెస్టెంట్ పూజామూర్తి ఎలిమినేట్ అయింది‌. ఇది బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారి. సీజన్-7 లో కిరణ్ రాథోడ్, షకీల, దామిణి, రతిక, శుభశ్రీ రాయగురు, నయని పావని ఇలా ఆరుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఏడవవారం ఎవరూ ఊహించని విధంగా ఎలిమినేషన్ జరిగింది. ఎందుకంటే పూజామూర్తి కంటే గౌతమ్ కృష్ణ లీస్ట్ ఓటింగ్ లో ఉన్నాడు. దాంతో అందరు ఈ సారి గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అవుతారని అనుకున్నారంతా. కానీ బిగ్ బాస్ ఉల్టా పల్టా చేసి ఈసారి కూడా హౌస్ లో నుండి ఫిమేల్ కంటెస్టెంట్ అయినటువంటి పూజామూర్తిని ఎలిమినేట్ చేశాడు. అయితే నామినేషన్ తర్వాత పూజామూర్తి, అశ్వినిశ్రీల మధ్య జరిగిన గొడవలో పూజామూర్తి బిహేవియర్ నచ్చకనే ప్రేక్షకులు కావాలని ఓటింగ్ చేయకుండా ఎలిమినేషన్ చేయాలని ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే కొందరు నెటిజన్లు మాత్రం అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దసరా వేడుకలను బిగ్ బాస్ హౌస్ లో గ్రాంఢ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా ఈ వారం హౌస్ కెప్టెన్ గా అంబటి అర్జున్ ఎంపిక అయ్యాడు.

అమర్ దీప్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన తేజస్విని!

బిగ్ బాస్ సీజన్-7 లో అమర్ దీప్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే అమర్ దీప్, ప్రియాంక జైన్ కలిసి చేసిన 'జానకి కలగనలేదు' సీరియల్ ఎంత హిట్ అయిందో తెలిసిందే. దీంతో ఈ ఇద్దరికి బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది. అయితే తనపై భారీ అంచనాలు పెట్టుకున్న బిగ్ బాస్ మేకర్స్ కి తీవ్ర అసంతృప్తిని మిగిల్చాడు అమర్ దీప్.  ఇక అమర్‌దీప్ భార్య తేజస్విని గౌడ కూడా బుల్లితెరపై ఎంత ఫేమస్సో తెలిసిందే. బిగ్ బాస్ కి వెళ్లిన తర్వాత అమర్ దీప్ ప్రవర్తన ఎలా ఉంది. ఆటతీరు, మాటతీరు గురించి 'క్వశ్చన్ అండ్ ఆన్సర్స్' అంటూ వ్లాగ్స్ చేస్తుంది తేజస్విని గౌడ. యూట్యూబ్ లోని తన ఛానెల్ లో అమర్ దీప్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది తేజస్విని గౌడ. లెటర్ సాక్రిఫైజ్ గురించి చెప్పండి అని ఒకతను అడుగగా.. సందీప్ మాస్టర్ అమ్మ గురించి ఉంటుందేమోనని అన్నాడు. ఇక ఏమీ ఆలోచించకుండా లెటర్ సాక్రిఫైజ్ చేసేశాడు అమర్. అమ్మ అని అన్న తర్వాత ఇంకా ఏం ఆలోచించలేదు‌. ఇప్పుడిప్పుడు హౌస్ లో ఎవరేంటని తెలుసుకుంటున్నాడని తేజస్విని అంది. లాజికల్ క్వశ్చన్స్ టాస్క్ లో అతనెలా ఆడాడని ఒకరు అడుగగా.. డెఫ్ నెట్లీ బాగా ఆడలేదు. క్వశ్చన్ అడుగగానే బజర్ నొక్కుతున్నాడు. కానీ ఆలోచించట్లేదు. అందరు నవ్వుతున్నారు కానీ నాకనిపించింది ఏంటంటే తన ఆలోచన  గేమ్ లో లేదు. ఇంకెక్కడో ఉంది. ఆ లెటర్ లో కూడా నేను రాసాను. మాస్ మహారాజ్ లో ఆ ఫన్ లేదని చెప్పాను. బాగా మోటివేట్ చేశానని తేజస్విని అంది. హౌస్ లో తన ఆటతీరు సరిగ్గా లేదు కదా అని ఒకరు అడుగగా.. అవును, అందరు అమర్ ని నామినేట్ చేసేసరికి బాగా 'లో' ఫీల్ అవుతున్నాడు. చాలా రోజుల తర్వాత మంచి ప్రోమో చూసాను. అమర్ దీప్ తన వంద శాతం ఇచ్చాడని నాగార్జున అనేసరికి చాలా బాగా అనిపించింది. తనవల్ల‌ కాదు.. ఆడలేడని అందరికి ఒక అభిప్రాయం వచ్చినప్పుడు, పూజామూర్తి తన పక్కన ఉండి.. గెలుపు ఓటమి పక్కన పెట్టి ఆడు అని చెప్పింది. అలా చెప్పగానే అమర్ చిన్నపిల్లాడిలా మారిపోయి.. ఆడాలి, ఆడుతానంటూ ఎమోషనల్ అయ్యాడు. యావర్ ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడిప్పుడే అమర్ కూడా హౌస్ లో అన్నీ అర్థం చేసుకుంటున్నాడని, కచ్చితంగా మళ్ళీ ఆటలో తన సత్తా చాటుతాడని తేజస్విని అంది. అయితే అమర్ దీప్ ఆటలో కసిగా ఆడట్లేదని, ఎప్పుడు చూసిన శివాజీ తనని మెచ్చుకోవాలని చూస్తున్నాడని అభిమానులు అనుకుంటున్నారు. శివాజీ దృష్టిలో తను మంచిగా ఆడుతున్నాడని అనిపించుకోవాలని అమర్ దీప్ అనుకోకుండా, టాస్క్ మీద ఫోకస్ చేస్తే సక్సెస్ అవుతాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు తేజస్విని గౌడ చేసిన ఈ వ్లాగ్స్ ఇంపాక్ట్ ఉంటుందా లేదా అని చూడాలి మరి.

కవితక్కతో బతుకమ్మ ఆడిన జ్యోతక్క.. వైరల్ గా మారిన వ్లాగ్!

తెలంగాణలో బతుకమ్మ పండుగని ఎంత గ్రాండ్ గా జరుపుకుంటారో తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ప్రతీ ఏటా బతుకమ్మ ఆటలో పాల్గొంటుంది. ఈ సారి కవితక్కతో కలిసి జ్యోతక్క బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంది. బతుకమ్మ పండుగలో భాగంగా తెలంగాణలో అతిముఖ్యమైన చివరి రోజుని 'సద్దుల బతుమ్మ' అంటారు. ఈ రోజుని తెలంగాణ మొత్తం అత్యంత వైభవంగా గౌరీదేవిని పూజిస్తూ పండుగలా జరుపుకుంటారు. గౌరీదేవి అనగా పార్వతీదేవిని కొలుస్తూ తీరొక్క పూవు తీసుకొచ్చి బతుకమ్మగా పేర్చి జరుపుకునే ఈ పండుగ అంటే ప్రతీ ఆడబిడ్డ గౌరవంగా భావిస్తుంది. కవితక్కతో కలిసి బతుకమ్మ పండుగని జరుపుకుంది జ్యోతక్క. శివజ్యోతి అలియాస్ తీన్మార్ సావిత్రి.. అందరికి సుపరిచితమే. అందరిని కలుపుకుపోయే శివజ్యోతి మాటతీరుని చూసి ఇష్టపడని వారంటు ఎవరూ ఉండరు. బిగ్ బాస్ ద్వారా కోట్లాది ప్రేక్షకులకు దగ్గర అయింది శివజ్యోతి. బిగ్ బాస్ తో సెలబ్రిటీ లిస్ట్ లో చేరింది. తీన్మార్ సావిత్రిగా ప్రముఖ టీవీ ఛానల్ లో న్యూస్ రీడర్ గా చేసిన శివజ్యోతి.. తన మాట తీరుతో అందరిని ఆకట్టుకుంది. తెలంగాణ యాసతో పాటు తను మాట్లాడే తీరు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా చేసింది. దాంతో మంచి క్రేజ్ సంపాదించుకుంది శివజ్యోతి. అంతే కాకుండా బిగ్ బాస్ 3 లో ఎంట్రీ ఇచ్చి హౌస్ లో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చి అందరిని ఆకట్టుకుంది. బిగ్ బాస్ 3 లో మోస్ట్ ఎమోషనల్ గా శివజ్యోతి ని చెప్తారు... బిగ్ బాస్ తర్వాత శివ జ్యోతి కి కెరీర్ కి బ్రేక్ పడింది మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేనంత మంచి సక్సెస్ఫుల్ లైఫ్ ని గడుపుతుంది. శివజ్యోతి ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి ప్రేక్షకులకు న్యూస్ ని అందిస్తుంది. శివజ్యోతి న్యూస్ చదవడంలో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చింది. చమాత్కరంతో వార్తలు చదవడంలో శివజ్యోతి తర్వాతనే మరొకరని అనడంలో ఆశ్చర్యం లేదు. అయితే శివజ్యోతి తన యూట్యూబ్ ఛానెల్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు దగ్గరగా ఉంటూ వస్తుంది. శివజ్యోతి భర్త గంగూలీ కూడా అందరికి సుపరిచితమే. అప్పట్లో శివజ్యోతి, గంగూలీ కలిసి ఇస్మార్ట్ జోడిలో పార్టిసిపేట్ చేసి అందరిని మెప్పించారు. అయితే కొన్నిరోజుల క్రితం శివజ్యోతి‌ చేసిన ' పెద్దమ్మ తల్లికి యాటను కోసినం' అనే వ్లాగ్ ఎంత వైరల్ అయిందో అందరికి తెలిసిందే.  ఈసారి అటు ఎన్నికలు, ఇటు బతుకమ్మ రెండు ఒకేసారి వచ్చాయి. రెండింటిని ఎలా మేనేజ్ చేస్తున్నారని కవితక్కని శివజ్యోతి‌ అడుగగా.. మన సంస్కృతిని మర్చిపోకూడదు కదా, దేనికి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ దానికి ఇవ్వాలి. వేరుని మర్చిపోతే చెట్టు పడిపోతుంది. మన తెలంగాణ సంస్కృతిని కాపాడుతూ రసమయి అన్న పాటలు, ఉద్యమంలో పాల్గొన్న యువత, ఆడబిడ్డల బతుకమ్మ అన్నీ మనవే.. వాటిని మనమే కాపాడుకోవాలని కవిత అంది. అప్పటికి ఇప్పటికి బతుకమ్మ చాలా వ్యత్యాసం ఉంది కదా అని జ్యోతక్క అడుగగా.. అవునని, అప్పుడు మైక్ లు పెట్టుకొని బతుకమ్మ ఆడితే పోలీసుల లాటీఛార్జ్ లు కూడా అయ్యాయని, ‌ఇప్పుడు తెలంగాణ మొత్తం జరుపుకుంటున్నామని, ఇక్కడే కాదు పక్క దేశాల్లో కూడా మనవాళ్ళు బతుకమ్మ జరుపుతున్నారని కవిత అంది. మొన్న న్యూజిలాండ్ లో బతుకమ్మ పండుగ చేస్తే అక్కడి ప్రధాని వచ్చాడని, ప్రపంచవ్యాప్తంగా మన బతుకమ్మ పాపులారిటీ తెచ్చుకుంటుందని కవిత అంది. ఇలా కవితక్కతో జ్యోతక్క బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడం దానిని తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్ గా చేయడంతో ఫుల్ వైరల్ గా మారింది.

మురారి లేడనే విషయం కృష్ణకి తెలియనుందా.. ప్రభాకర్ ఏం చేయనున్నాడు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -294 లో.. ప్రభాకర్ ఫోన్ చెయ్యగానే మధు బయటకు వచ్చి ఎందుకు వచ్చావని అడుగుతాడు. మురారి ఎక్కడ ఉన్నాడు? లోపల ఉన్నాడా? అని ప్రభాకర్ అడగ్గానే.. లేదు మామయ్య అంటూ మధు జరిగింది మొత్తం చెప్తాడు. మురారి చనిపోయాడు మామయ్య అని మధు చెప్పగానే ప్రభాకర్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు అసలేం జరిగింది? కృష్ణ ఎక్కడ ఉందని, కృష్ణపై చాలా కోపంగా ఉన్నారని మధు చెప్తాడు. కృష్ణ హాస్పిటల్ లో ఉందని చెప్తే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుందని కృష్ణని మీరే ఇంటి నుండి పంపించేశారు కదా అని ప్రభాకర్ అంటాడు. ఆ తర్వాత ప్రభాకర్ బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అసలు ఈ విషయం కృష్ణకి ఎలా చెప్పాలి అని ప్రభాకర్ అనుకుంటాడు. అలాగే అనుకుంటూ ప్రభాకర్ హాస్పిటల్ కి వస్తాడు. ఏమైంది అల్లుడి జాడ దొరికిందా అని శకుంతల అడుగుతుంది. ప్రభాకర్ ఏం చెప్పలేక సైలెంట్ గా ఉంటాడు. అయినా శకుంతల మళ్ళీ మళ్ళీ అడిగేసరికి ప్రభాకర్ మధు చెప్పింది మొత్తం శకుంతలకి చెప్తాడు. శకుంతల ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ విషయం మన కృష్ణకి తెలియవద్దని ఇద్దరు అనుకుంటారు. కాసేపటికి ఏసీపీ సర్ ఎక్కడ ఉన్నారో, అయినా చిన్నాన్న వెళ్ళాడు కదా, ఎలాగైనా ఏసీపీ సర్ ని తీసుకొని వస్తాడని కృష్ణ అనుకుంటుంది. అప్పుడే ప్రభాకర్, శకుంతల ఇద్దరు వస్తారు. ఏసీపీ సర్ గురించి తెలిసిందా అని కృష్ణ అడుగుతుంది. కాసేపటికి డాక్టర్ దగ్గరికి వచ్చి చెకప్ చేస్తుంది. ముకుంద వాళ్ళ అన్నయ్య ముకుందకి ఫోన్ చేసి మురారి గురించి అప్డేట్ ఇస్తుంటాడు. మరొకవైపు కృష్ణ హాస్పిటల్ కి వచ్చి మురారి గురించి చూస్తుంది. మురారి గురించి తన చిన్నాన్న, పిన్నికి చెప్తుంటుంది. అప్పుడే ముకుంద వాళ్ళ అన్నయ్య.. కృష్ణ ముందు నుండి మురారిని తీసుకొని వెళ్తాడు. నాకు ఎందుకో ఏసీపీ సర్ ఇక్కడే ఉన్నట్లు అనిపిస్తుందని శకుంతలతో కృష్ణ చెప్తుంది. మరొక వైపు ముకుంద వాళ్ళ అన్నయ్య పరిమళతో  మురారి ట్రీట్ మెంట్ గురించి మాట్లాడుతాడు. పరిమళకి మురారి అన్న విషయం తెలియదు. కృష్ణ హాస్పిటల్ లో మురారి గురించి వెతుకుతుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. 

శైలేంద్ర చేస్తున్న కుట్రలని రిషి తెలుసుకోగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -900 లో.. మహేంద్ర సర్ ని ఒంటరిగా వదిలి పెట్టవద్దని రిషితో వసుధార అంటుంది. అయితే అలా చెప్పేటప్పుడు రిషిని వసుధార సర్ అని పిలవడంతో.. పక్కనే ఉన్న మహేంద్ర.. ఏం అన్నావ్? రిషి నీ భర్త.. సర్ ఏంటి సర్. భర్తని ఏమని పిలవాలి, అలాగే పిలువమని అంటాడు. ఏవండీ అని పిలువు లేదా రిషి అని పిలువు అని మహేంద్ర అనగానే.. సర్ ఇప్పుడు నేను అలా పిలవలేను అని వసుధార అనగానే సరే నిన్ను ఇబ్బంది పెట్టను. నన్ను మాత్రం మామయ్య అని పిలువమని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత మహేంద్రని మామయ్య అని పిలుస్తుంది వసుధార. ఆ తర్వాత ఈ ఒక్క రోజు మీరు వెళ్లి ఎంజాయ్ చెయ్యండి. రేపు కలిసి వెళదామని మహేంద్ర అంటాడు. లేదు మామయ్య మీరు రండి అని వసుధార అంటుంది. లేదమ్మా నేను ఎక్కడికి వెళ్ళను. మీరు వచ్చేవరకు ఇక్కడే ఉంటానని మహేంద్ర అనగానే.. రిషి, వసుధార ఇద్దరు అక్కడ నుండి వెళ్తారు. ఆ తర్వాత మహేంద్ర జగతిని గుర్తుకుచేసుకొని.. నువ్వు కోరుకున్నది కూడా ఇదే కదా జగతి అని అంటాడు. మరొక వైపు రిషి, వసుధారలు ప్రేమ పక్షుల లాగా సరదాగా బయటకు వెళ్తారు. అలా అన్ని ప్లేస్ లు తిరుగుతు ఒక వాటర్ ఫాల్ దగ్గర ఆగుతారు. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు. మరొక వైపు అసలు రిషి వాళ్ళు ఎక్కడికి వెళ్లారని శైలేంద్ర ఫోన్ చేస్తాడు. రిషి ఫోన్ వసుధార లిఫ్ట్ చేస్తుంది. ఎక్కడ ఉన్నారో చెప్పకుండా వసుధార పొగరుగా సమాధానం చెప్తుంది. దాంతో ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతుందని శైలేంద్ర కోపంగా ఉంటాడు. ఆ తర్వాత భోజనం చేస్తుండగా.. ఫణీంద్ర ద్వారా రిషి వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలని ట్రై చేస్తుంది దేవయాని. కానీ ఫణీంద్ర వాళ్ళ గురించి చెప్పకుండా దేవయాని కి కౌంటర్ వేస్తాడు. మరొక వైపు వసుధార ఒంటరిగా బయట నిల్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఇద్దరు తాగుబోతులు వసుధార దగ్గరకు వస్తారు. దాంతో మహేంద్ర వచ్చి వాళ్ళని కొడతాడు. ఆ తర్వాత శైలేంద్ర కాల్ చేశాడని మహేంద్రకి వసుధార చెప్తుంది. శైలేంద్ర చేసే కుట్రల గురించి ఎలాగైనా సాక్ష్యాలతో రిషికి చూపించాలని మహేంద్ర, వసుధార మాట్లాడుకుంటారు. అప్పుడే రిషి ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారని అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

రెట్టింపు ఉత్సాహంతో శివాజీ.. జోష్ లో హౌస్ మేట్స్!

బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతుంది. ఏడవ వారం హౌస్ కెప్టెన్ గా అంబటి అర్జున్ ఎంపికయ్యాడు. నామినేషన్లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే వీరిలో పూజామూర్తి, గౌతమ్ కృష్ణ, అశ్విని శ్రీ డేంజర్ జోన్ లో ఉన్నారు. శనివారం నాటి ఎపిసోడ్ లో.. శివాజీ చేతి గాయం కారణంగా ఫిజికల్ గేమ్స్ ఆడటం లేదని నాగార్జునని అంబటి అర్జున్ అడిగాడు.  దాంతో శివాజీని నాగార్జున సీక్రెట్ రూమ్ కి పిలిచి అడిగాడు. చెప్పండి శివాజీ మీ చేతి నొప్పి ఎలా ఉందని అడుగగా.. బాలేదండి బాబు గారు.. నొప్పి ఎక్కువగా ఉంది. కాస్త ఫిజియోథెరపీ ఉంటే బాగుంటుందని శివాజీ అంటాడు. సరే అయితే ఫిజియో‌ పంపిస్తే ఆడతావ్ కదా అని నాగార్జున అనగా.. ఆడతాను సర్ అని శివాజీ అంటాడు. ఇక హౌస్ మేట్స్ దగ్గరికి వెళ్ళమని నాగార్జున చెప్తాడు. ఇక నుండి శివాజీ మెంటల్ గా ఫిజికల్ గా ఆడతాడని అందరికి నాగార్జున చెప్పాడు. దాంతో హౌస్ మేట్స్ అంతా చప్పట్లతో, విజిల్స్ తో ఫుల్ జోష్ నింపారు. ఈ ఎపిసోడ్ లో స్పష్టంగా తెలిసిందేంటంటే శివాజీ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేస్తే.. సీరియల్ గ్యాంగ్ చేసే ఆగడాలకి అడ్డు అదుపు ఉండదని బిగ్ బాస్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. హౌస్ లో నీకు లాడర్ ఎవరు? స్నేక్ ఎవరని శివాజీని నాగార్జున అడుగగా.. ప్రిన్స్ యావర్ లాడర్, అమర్ దీప్ స్నేక్ అని శివాజీ అన్నాడు.  కారణమేంటంటే నేను గేమ్ ఆడకపోయిన, డిస్టబ్ గా ఉన్నా నా దగ్గరుండి.. మీరు ఉండాలి, మీరు మాతో ఉంటే చాలు అనే మాటలు చెప్తూ నాలో ఆత్మవిశ్వాసం నింపుతుంటాడని అందుకే యావర్ నాకు లాడర్ అని శివాజీ అన్నాడు. ఇక అమర్ దీప్ స్నేక్ అని అన్నాడు. వాడికి మొదటి నుండి నా మీద నెగెటివ్ ఇంపాక్ట్ ఉందని, వాడిలో ట్యాలెంట్ ఉంది‌. కానీ కొందరి మాటలు విని అలా చేస్తున్నాడని, అనవసరమైన మాటలు మాట్లాడుతున్నాడని శివాజీ అన్నాడు.

కావ్య, రాజ్ ల మధ్య రొమాంటిక్ సీన్.. అప్పు ఎమోషనల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -233 లో.. కళ్యాణ్, అనామిక, అప్పు లు షాపింగ్  చేసి తిరిగి వస్తుంటారు. అప్పును చూస్తే ఎవరినో లవ్ చేసింది కావచ్చని అనామిక అడుగుతుంది. అప్పు మాత్రం బాధగా చూస్తుంటుంది. అలాంటిదేం లేదని అప్పు అనగానే.. నేను చెప్పాను కదా అప్పుకి అలాంటివేం ఉండవని కళ్యాణ్ అంటాడు. అలా అనగానే అప్పుకి ఇంక బాధగా అనిపిస్తుంది. మరొకవైపు రాహుల్ తన నగలు తీసుకొని వెళ్లినందుకు రాహుల్ ని స్వప్న తిడుతుంటుంది. వద్దని చెప్పినా నా నగలు దొంగతనంగా తీసుకొని వెళ్ళావని అనగానే స్వప్న పై కోప్పడతాడు రాహుల్. ఆ తర్వాత తన నగలు తీసుకొని వెళ్లి బీరువాలో పెట్టి లాక్ వేసుకుని స్వప్న వెళ్ళిపోతుంది. ఉన్న ఒక్క దారి కూడా లేకుండా పోయిందని రాహుల్ అనుకుంటాడు. ఆ తర్వాత  అప్పు వెళ్తుంటే కళ్యాణ్ అనామికకి దగ్గరగా వచ్చి బై చెప్తుంటే.. అప్పు వాళ్ళని చూసి బాధపడుతుంది. రేపు ఫోటో షూటింగ్ ఉంది నువ్వు కంపల్సరీ రావాలని అప్పుతో అనామిక చెప్తుంది. మరొక వైపు కావ్య ఇంట్లో వర్క్ అంతా చేసి గదిలోకి వచ్చి నడుము నొప్పితో ఇబ్బంది పడుతుంది.  కావ్య అలా ఇబ్బంది పడుతుండగా రాజ్ తననే చూస్తుంటాడు. అలా చూస్తూ ఉండకపోతే వచ్చి ఈ ఆయింట్ మెంట్ రాయొచ్చు కదా అని కావ్య అనగానే.. రాజ్ వచ్చి ఆయింట్ మెంట్ రాస్తాడు. రాజ్ అలా ఆయింట్ మెంట్ రాస్తూ నిన్ను ఒకటి అడగాలా అని అనగానే.. ఏంటి ముద్దు అడుగుతాడా అని కావ్య అనుకుంటుంది. మొన్న నిజంగా గుడికే వెళ్ళావా అని కావ్యని అడగ్గానే.. తను కోపంగా ఆయింట్ మెంట్ రాయడం వద్దని రాజ్ కి చెప్తుంది. మరొకవైపు  కనకం తన గదిలో ఉండడం ఇష్టం లేని రుద్రాణి.. కనకం చీరలు అన్ని కట్ చేస్తుంది. ఆ తర్వాత స్నానం చెయ్యడానికి రుద్రాణి గదిలోకి వచ్చిన కనకం బీరువా చూసి.. ఏంటి చీరలు ఇలా అయ్యాయని అడుగుతుంది. ఈ రూమ్ లో ఎలుక ఉందని రుద్రాణి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.