బీజేపీకి మిత్రపక్షం పెద్ద షాక్..!!
2014 ఎన్నికల విజయం తరువాత మాకు ఎదురులేదు, మేం చెప్పిందే వేదం అనుకున్న బీజేపీకి.. ఈమధ్య వ్యతిరేకత పెరగడంతో షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి.. మొన్నటికి మొన్న టీడీపీ, ఎన్డీయే నుండి బయటికొచ్చి వ్యతిరేకంగా పోరాడుతుంది.. ఇక శివసేన అంటీ ముట్టనట్టుగా ఉంటుంది.. ఇవి చాలవన్నట్టుగా ఇప్పుడు బీహార్ అధికార పార్టీ జేడీయూ కూడా బీజేపీకి షాక్ ఇస్తుంది.. బీజేపీ మీద వ్యతిరేకత పెరుగుతుంది, ఉపఎన్నికల్లో కూడా చేదు ఫలితాలు ఎదురయ్యాయి.. దీంతో ఇక మనం ఆడిందే ఆట, పాడిందే పాట అనుకుందో ఏమో కానీ జేడీయూ సీట్ల పంపకం విషయంలో అసలు తగ్గట్లేదు.. మాకు ఎక్కువ సీట్లు కావాల్సిందే అంటూ పట్టుపడుతుంది.. అవసరమైతే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని తెగేసి చెప్తుంది.. మొత్తం 40 స్థానాలున్న బీహార్లో బీజేపీ- 20, జేడీయూ-12, ఎల్జేపీ- 6, ఆర్ఎల్ఎస్పీ- 2 సీట్లు కేటాయింపు జరిగినట్టు ప్రచారం జరిగింది.. అయితే, సీట్ల పంపకం ఇంకా ఫైనల్ కాలేదంటున్నారు జేడీయూ సీనియర్ నేత కేసీ త్యాగి.. ఆ లెక్క తమకు ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదని, జేడీయూకి అధిక స్థానాలు కేటాయించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.. పాపం మరి బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏంటో.