కేసీఆర్‌ రుజువు చేయాలి.. లేదా క్షమాపణ చెప్పాలి: జానారెడ్డి

  హుస్నాబాద్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేసారు.. అంతేకాకుండా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి సవాల్ విసిరారు.. 'ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జానారెడ్డి, వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తే గులాబీ కండువా కప్పుకొని ప్రచారం చేస్తానని అసెంబ్లీలోనే అన్నారు.. జానారెడ్డికి నిజాయతీ ఉంటే ఈరోజు ఆ పనిచేయాలని నేను డిమాండ్‌ చేస్తున్నా' అని కేసీఆర్ అన్నారు.. అయితే తాజాగా జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కే సవాల్ విసిరారు.. కేసీఆర్‌ తనపై అసత్య అరోపణలు చేస్తున్నారని.. 24 గంటలు కరెంట్‌ ఇస్తే గులాబీ జెండా కప్పుకుంటానని అసెంబ్లీలో తాను అనని మాటలను అన్నట్లు చెబుతున్నారని  మండిపడ్డారు.. గులాబీ జెండా కప్పుకుంటానని తాను అన్నట్లు ఉంటే, ఆ రికార్డులు తెప్పించి ప్రజల ముందు పెట్టాలని డిమాండ్‌ చేశారు.. తాను అన్నట్లు రుజువు చేస్తే 24 గంటల్లోనే రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు.. 24 గంటల్లోగా కేసీఆర్‌ రుజువు చేయాలి, లేకపోతే వెంటనే క్షమాపణ చెప్పాలని జానారెడ్డి డిమాండ్‌ చేశారు.

టీ స్టాల్ లో హరీష్..!!

ఏషియన్ గేమ్స్ - 2018 లో కాంస్యం సాధించిన భారత్ సేపక్ తక్రా (కిక్ వాలీబాల్) జట్టులో సభ్యుడైన హరీష్ కుమార్.. ప్రస్తుతం టీ అమ్ముతున్నాడు.. మెడల్ సాధించి టీ అమ్మడం ఏంటని మీడియా ప్రశ్నించగా.. తమది చాలా పేద కుటుంబమని, అందరూ పనిచేస్తేనే ఇల్లు గడుస్తుందని తన దయనీయ దుస్థితిని వివరించాడు.     మాకు ఉన్న చిన్న టీ కొట్టులో మా కుటుంబానికి సాయంగా టీ అమ్ముతాను.. ప్రతిరోజూ 2 నుంచి 6 మధ్య నాలుగు గంటలు ప్రాక్టీస్ చేస్తాను.. భవిష్యత్తులో మంచి ఉద్యోగం సాధించి నా కుటుంబానికి అండగా ఉండాలనుకుంటున్నాని అన్నాడు.. ప్రత్యేకంగా ఉండే సెపక్ తక్రా ఆట ఆడటం అంత సులువు కాదు.. ఆ ఆటను ఆడటానికి తను ఎన్నో కష్టాలు పడ్డానని తెలిపాడు.. 2011 లో ఈ ఆటను ఆడడం ప్రారంభించాను.. నా కోచ్ హెమ్ రాజ్ నన్ను ఈ ఆటకు పరిచయం చేసారు.. ఒకరోజు నేను నా ఫ్రెండ్స్ తో కలిసి టైర్ ఆట ఆడుతుండగా మా కోచ్ చూసి నన్ను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు తీసుకెళ్లారు.. అప్పటి నుంచి ఉపకార వేతనాలు అందుకుంటూ ఆటను నేర్చుకున్నాను.. దేశానికీ మెడల్ సాధించాలనే పట్టుదలతో ప్రాక్టీస్ చేసేవాడిని అని హరీష్ కుమార్ తెలిపాడు.

టిక్కెట్ రాకపోవడానికి కేటీఆరే కారణం: కొండా సురేఖ

తెరాస ప్రకటించిన తొలిజాబితాలో కొండా సురేఖ పేరు లేకపోవడంతో అసంతృప్తికి గురైన కొండా దంపతులు.. సోమాజికగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.. ఈ సందర్భంగా మాట్లాడిన కొండా సురేఖ.. వరంగల్ తూర్పు నియోజవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిచిన తనను ఆ జాబితాలో ప్రకటించకపోవడం బాధాకరమన్నారు.. బీసీ మహిళనైన తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.. 105 మంది జాబితాలో తన పేరు ప్రకటించకపోవడానికి కారణాలేంటని ఆమె ప్రశ్నించారు.. గత ఎన్నికలలో ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలనుకుంటే, చాలాసార్లు తమకు వర్తమానం పంపారని.. అయితే పరకాల సీటు ఇస్తేనే తెరాసలోకి వస్తామని తాము తేల్చిచెప్పామని.. అందుకు కేసీఆర్ అంగీకరిస్తూ తనకు మంత్రి పదవి, కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారని ఆమె గుర్తుచేశారు.     వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు.. తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించకపోవడం అమానించడమే అని అన్నారు.. టీఆర్‌ఎస్‌లో తాము చేసిన తప్పేంటో చెప్పాలని ప్రశ్నించారు.. మహిళకు మంత్రి పదవి ఇవ్వని ప్రభుత్వంగా తెరాస చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.. తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏనాడు మాట్లాడలేదన్నారు.. గతంలోను తాను మంత్రి పదవిని తృణప్రాయంగా విడిచిపెట్టానని గుర్తుచేశారు.. హరీశ్ రావు, కేసీఆర్‌లతో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఇద్దరూ ఫోన్ ఎత్తలేదని అన్నారు.. ఎవరి ప్రభావంతో తన టికెట్‌ ఆపారో చెప్పాలన్నారు.. తాము రెండు సీట్లు అడిగామనడం అబద్ధమని, తమను పొమ్మనలేక పొగబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసారు.. తమ ఫోన్‌లను ట్యాప్‌ చేస్తున్నారని ఆరోపించారు.. తెలంగాణ, కల్వకుంట్ల వారి ఇల్లు కాదని విమర్శించారు.. తనకు టిక్కెట్ ఇవ్వకపోవడానికి కేటీఆరే కారణమని, తెరాసలో కేటీఆర్ కోటరీని తయారుచేస్తున్నారని ఆరోపించారు.. తెరాస తీసుకునే నిర్ణయాన్ని బట్టి భవిష్యత్తు కార్యాచరణ గురించి వెల్లడిస్తామని కొండా సురేఖ స్పష్టం చేసారు.

ఉప్పల్ అభ్యర్థిని మార్చనున్న తెరాస అధిష్టానం..!!

  తెరాస తెలంగాణలోని 119 స్థానాలకు గాను తొలివిడతగా 105 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే ఈ జాబితాలో చోటు దక్కని కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. వారిలో ఒకరు హైదరాబాద్ మేయర్‌ బొంతు రామ్మోహన్‌.. బొంతు ఉప్పల్ టిక్కెట్ ఆశించారు.. అయితే ఆ స్థానంలో తెరాస అభ్యర్థిగా భేతి సుభాష్‌రెడ్డికి అవకాశం ఇచ్చారు.. కేటీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే తమకు అభ్యర్థిత్వం దక్కకపోవడంపై బొంతుతో పాటు ఆయన కుటుంబసభ్యులు తీవ్ర నిరాశకు గురైనట్టు తెలిసింది.. ఈ నేపథ్యంలో ఉప్పల్‌ అభ్యర్థిగా ప్రకటించిన భేతి సుభా్‌షరెడ్డికి నచ్చచెప్పి ఆయన స్థానంలో రామ్మోహన్‌కు అవకాశం కల్పించే అంశాన్ని అగ్రనాయకులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.. కేసీఆర్‌ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి, ఆయన ఆమోదిస్తే తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.

కాంగ్రెస్ గూటికి కొండా దంపతులు..!!

  ఒకప్పుడు కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన కొండా దంపతులు తరువాత పార్టీని వీడారు.. ప్రస్తుతం తెరాస లో ఉన్న కొండా దంపతులు టిక్కెట్ల విషయంలో ఆ పార్టీ మీద అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.. రీసెంట్ గా కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి 105 మంది అభ్యర్థులను ప్రకటించి ముందస్తుకు ముందడుగు వేసిన సంగతి తెల్సిందే.. అయితే తొలి జాబితాలో కొండా సురేఖ సీట్ పెండింగ్ లో పెట్టారు.. కొందరు ఆమెకి టిక్కెట్ డౌట్ అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.. ఇదే కొండా దంపతుల అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది.. కూతురు సుశ్మితాపటేల్‌కు భూపాలపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశమివ్వాలని సురేఖ తెరాస అధిష్ఠానాన్ని కోరారు.. ఆ అభ్యర్థనను కేసీఆర్‌ సున్నితంగా తిరస్కరించారు.. ఇస్తే ఇద్దరికీ టికెట్లు ఇవ్వాలని, లేకపోతే లేదని సురేఖ చెప్పడంతో ఆమె సిట్టింగ్‌ స్థానం వరంగల్‌ తూర్పును పెండింగ్‌లో పెట్టారు.. దీంతో కొండా దంపతులు తెరాసని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.. త్వరలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ సమక్షంలో కొండా దంపతులు కాంగ్రెస్‌ కండువా కప్పుకొనేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారని సమాచారం.

ముందస్తుకు కారణం కాంగ్రెస్‌: కేసీఆర్

  అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత శుక్రవారం హుస్నాబాద్‌లో 'ప్రజా ఆశీర్వాద సభ' పేరుతో కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించారు.. ఈ సభలో కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు.. ఎన్నికలు ఎందుకు వచ్చాయో నిన్ననే వివరించా.. ఎన్నికలు తేవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్‌.. అవాకులు, చవాకులు పేలుస్తూ అధికారుల స్థైర్యాన్ని దెబ్బతీసేవిధంగా కాంగ్రెస్‌ అసత్య ఆరోపణలు చేసింది.. అవినీతి రహితంగా పాలన చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది.. ప్రతీ రూపాయిని లెక్కపెట్టి సమకూరిస్తే ఆదాయం వచ్చింది.. భారతదేశంలో రైతులకు 24 గంటలు విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే.. రాష్ట్రంలో అభివృద్ధి కనిపించకపోతే కాంగ్రెస్‌నేతలు కంటివెలుగు పరీక్షలు చేయించుకోవాలి.. దేశాన్ని కాంగ్రెస్‌ 60ఏళ్లు పాలించింది.. వాళ్ల అవినీతి, దరిద్రపు పాలన వల్లనే దేశం దౌర్భాగ్యంగా ఉంది అని కేసీఆర్ మండిపడ్డారు.. దేశంలో 70వేల టీఎంసీల నీరు ఉన్నప్పటికీ ప్రజలకు ఉపయోగపడని దుస్థితి కాంగ్రెస్‌ వల్లే ఏర్పడింది.. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఆంధ్రాపాలకుల దగ్గర అడుక్కోవడం తప్ప ఎప్పుడూ క్రియాశీలకంగా పనిచేయలేదని మండిపడ్డారు.. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని తెగేసి చెబితే, ఒక్క కాంగ్రెస్‌ నేత కూడా పోరాడలేదన్నారు.. అనేక త్యాగాలు చేసి తెలంగాణ సాధించామని అన్నారు.. కాంగ్రెస్‌ పాలన అంతం కావాలనే 2014లో ప్రజలు తెరాసను గెలిపించారు అని కేసీఆర్ అన్నారు.. మొత్తానికి 'ప్రజా ఆశీర్వాద సభ' సాక్షిగా కేసీఆర్ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు.

కేసీఆర్ నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్‌..!!

  కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు సిద్దమైన విషయం తెలిసిందే.. అయితే కేసీఆర్ తీసుకున్న అసెంబ్లీ రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రాపోలు భాస్కర్ అనే న్యాయవాది పిటిషన్‌ను దాఖలు చేశారు.. ఇంకా 9 నెలల సమయం ఉండగా ముందే అసెంబ్లీని రద్దు చేయడంపై పిటిషన్‌లో ఆయన అభ్యంతరాలను వ్యక్తం చేశారు.. ఉన్నపళంగా అసెంబ్లీని రద్దు చేయడం వలన రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని పేర్కొన్నారు.. 5 సంవత్సరాలు పూర్తి అయ్యేంత వరకూ ఎలాంటి ఎన్నికలు జరగకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.. ఈ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారించనుంది.  

కాంగ్రెస్ కి పెద్ద షాక్.. సీనియర్ నేత తెరాసలో చేరిక

  తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి.. అసెంబ్లీ రద్దు, అభ్యర్థుల ప్రకటన, ముందస్తు అంటూ తెరాస హడావుడి చేస్తుంటే.. కాంగ్రెస్ కి మాత్రం పెద్ద షాక్ తగిలింది.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి తెరాసలో చేరారు.. ఈరోజు కేటీఆర్‌, సురేష్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.. అనంతరం కేటీఆర్‌తో కలిసి సురేష్ రెడ్డి తన నివాసంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు.. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 1989 నుంచి సురేష్ రెడ్డి, కేసీఆర్ మిత్రులని గుర్తుచేశారు.. పార్టీలు వేరైనా తెలంగాణ ఏర్పాటు కోసం ఆయన కృషి చేశారన్నారు.. తమ ఆహ్వానాన్ని మన్నించి సురేష్ రెడ్డి తెరాసలోకి వస్తున్నారని చెప్పారు.. ఆయనకు తగిన పదవి ఇచ్చి గౌరవిస్తామని కేటీఆర్ తెలిపారు.. సురేష్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ లబ్ది కోసం తెరాసలో చేరడం లేదని చెప్పారు.. నిన్ననే తెరాస టికెట్ల పంపిణీ పూర్తయిందని గుర్తుచేశారు.. తెలంగాణ అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ తెరాస రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.. కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటానని సురేష్ రెడ్డి తెలిపారు.

ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు అలక..!!

రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అలక పాన్పు ఎక్కినట్టు తెలుస్తోంది.. అందుకే ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదని సమాచారం.. గతంలో మంత్రివర్గ సమావేశాన్ని బహిష్కరించి, మంత్రి గంటా శ్రీనివాసరావు అలకబూనగా ఇప్పుడది అయ్యన్న వంతు అయింది.. భీమిలి నియోజకవర్గంలో గంటా మళ్ళీ గెలిచే అవకాశం లేదు, ఆయనికి టిక్కెట్ దక్కటం కూడా కష్టమేనని అప్పట్లో మీడియాలో వార్తలొచ్చాయి.. ఆ లీకులిచ్చింది సాక్ష్యాత్తు సీఎం కార్యాలయమేనని విశ్వసించిన గంటా, గతంలో కేబినెట్ మీటింగ్ కు గైర్హాజరైన సంగతి తెలిసిందే.. ఇదే సాకుగా ఇప్పుడు అయ్యన్న అలకపాన్పు ఎక్కారు.     ఒక్కరోజు గంటా అలకబూనితేనే మంత్రులు పలువురు విశాఖలోని గంటా ఇంటికి వెళ్లి, సీఎంతో ఫోన్ లో మాట్లాడించారు.. ఈ విషయం అప్పట్లోనే ప్రాధాన్యత సంతరించుకుంది.. దీనిపై అయ్యన్న అప్పట్లోనే మండిపడ్డారు.. దానికి నిరసనగానే ఇప్పుడు తాను అసెంబ్లీకి వెళ్ళేది లేదంటూ ఆయన విశాఖలోనే ఉండిపోయారు.. ఈ ఇద్దరు మంత్రుల మధ్య మొదటి నుంచి విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది.. తాజాగా నర్సీపట్నం ఆర్టీసీ స్థలానికి సంబంధించిన విషయంలోనూ గంటా వర్గం పనులు చేపడుతుంటే, వారం రోజుల క్రితం అయ్యన్న స్వయంగా వెళ్లి తన వర్గంతో అడ్డుకున్నారు.. ఈ అంశంపై పార్టీ అధిష్టానం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో అసెంబ్లీకి, మంత్రివర్గ సమావేశానికి అయ్యన్న హాజరుకాలేదని తెలుస్తోంది.. అయితే ఆయన వర్గీయులు మాత్రం వ్యక్తిగత కారణాల వల్ల సభకు హాజరుకాలేదని అంటున్నారు.

చంద్రబాబు అసహనం.. కారణం ఎన్టీఆర్.!!

టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ అంటే టీడీపీ శ్రేణులకు, చంద్రబాబుకి అమితమైన గౌరవం.. అలాంటిది ఎన్టీఆర్ విషయంలో పార్టీ నేతలు నిర్లక్ష్యంగా ఉంటే బాబు ఊరుకుంటారా? ఆగ్రహించరు.. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది.. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు ఎన్టీఆర్ కు నివాళులు అర్పించే విషయంలో టీడీపీ ప్రజాప్రతినిధులు తమ బాధ్యతను విస్మరించారు.. ఉభయసభల్లో దాదాపు 160 మంది ప్రాతినిధ్యం వహిస్తుండగా.. గురువారం ఎన్టీఆర్ కి వెంకటపాలెంలో బాబు నివాళులు అర్పించేటప్పుడు కనీసం 15 మంది కూడా లేరు.     హైదరాబాద్ లో సమావేశాలు జరిగినప్పుడు ఎన్టీఆర్ ఘాట్ లో ఆయన సమాధికి నివాళులు అర్పించిన తరువాతే సభకు వెళ్లడం ఆనవాయితీగా ఉండేది.. అసెంబ్లీ అమరావతికి మారక వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి తొలిరోజు నివాళులర్పించి అసెంబ్లీకి వెళ్లడం బాబు ఆనవాయితీగా పెట్టుకోవడంతో ప్రజాప్రతినిధులు ఆయన్ని అనుసరిస్తున్నారు.. అయితే గురువారం అసెంబ్లీకి వెళ్లే ముందు బాబు, ఎన్టీఆర్ కి నివాళులు అర్పించే సమయంలో నేతలు చాలా తక్కువమంది హాజరయ్యారు.. దీంతో పదవులు పొందాక నేతలు బాధ్యతలు విస్మరిస్తున్నారనే మాటలు కార్యకర్తల నుండి వినిపిస్తున్నాయి.. ఈ కార్యక్రమానికి సభ్యులు గైర్హాజరవడంపై సీఎం చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేసారు.. పార్టీకి ఇచ్చే గౌరవం ఇది కాదని అసహనం వ్యక్తం చేసారు.

అమెరికాలో కాల్పులు.. తెలుగు యువకుడు మృతి

  అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.. గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటకు చెందిన కందేపి పృధ్వీరాజ్‌(26) ఆరేళ్ల క్రితం అమెరికాకు వెళ్లారు.. విద్యాభ్యాసం పూర్తి చేసుకుని సిన్సినాటిలోని ఓ బ్యాంకులో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు.. గురువారం సాయంత్రం బ్యాంకు విధులు ముగించుకుని ఉద్యోగులంతా బయటకు వస్తున్న సమయంలో దోపిడీ దొంగలు కాల్పులు జరిపారు.. ఈ ఘటనలో పృథ్వీరాజ్‌తో పాటు మరో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.. ఈ ఘటనలో పృథ్వీరాజ్‌ తో మరో ముగ్గురు కూడా మరణించినట్టు సమాచారం.. పృథ్వీరాజ్‌ మృతిచెందిన సమాచారం తెలియడంతో కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.. కుమారుడు అమెరికాలో స్థిరపడటంతో త్వరలోనే వివాహం చేయాలని తల్లిదండ్రులు ప్రయత్నాలు చేస్తున్నారని, ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందనుకోలేదని బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

తెలంగాణాలో కాంగ్రెస్- టీడీపీ పొత్తు.. టీ-టీడీపీకి స్వేచ్ఛ..!!

తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది.. ఇప్పటికే అధికార పార్టీ తెరాస అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు సిద్ధమైంది.. అంతేకాదు తొలివిడతగా 105 మంది అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించింది.. ప్రతిపక్ష పార్టీలు కూడా ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేము కూడా సిద్దమే అంటూ ఓ వైపు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉంటూ మరోవైపు ఇతర పార్టీలతో పొత్తులకు ప్రణాళికలు వేస్తున్నాయి.. ప్రధానంగా కాంగ్రెస్- టీడీపీ ల పొత్తు గురించి అందరూ ఎక్కువగా చర్చించుకుంటున్నారు.. కొందరు పొత్తు ఉండదంటే కొందరు మాత్రం పొత్తు ఖచ్చితంగా ఉంటుంది అంటున్నారు.     ఏపీలో అయితే ఈ రెండు పార్టీల మధ్య పొత్తుకు ఆస్కారం లేదు కానీ తెలంగాణలో మాత్రం అవకాశం ఉండనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. ఈ పార్టీల మధ్య పొత్తు గురించి ఇంకా చర్చ జరగలేదు కానీ రెండు పార్టీలు విడివిడిగా అంతరంగంగా చర్చించుకుంటున్నాయి.. తెలంగాణలో అయితే ఈ పార్టీల మధ్య పొత్తు కుదిరేలాగానే ఉంది.. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు కూడా పొత్తు గురించి పార్టీ నేతలతో చర్చించినట్టు సమాచారం.. తెలంగాణలో ఒకవేళ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాల్సి వస్తే దానివల్ల ఏపీలో ఇబ్బంది వస్తుందేమోనని కొందరు నేతలు సందేహం వ్యక్తం చేయగా.. ‘ఇవి రెండు వేర్వేరు రాష్ట్రాలు.. ఎక్కడి పార్టీలు అక్కడ ఉన్నాయి.. అక్కడి రాజకీయ పరిస్థితులను బట్టి అక్కడ ఏం చేయాలో నిర్ణయించుకొనే స్వేచ్ఛ తెలంగాణ టీడీపీ రాష్ట్ర కమిటీకి ఇద్దాం.. నేను శనివారం అక్కడకు వెళ్తున్నాను.. అక్కడి నేతలతో మాట్లాడతాను.. వారి అభిప్రాయాలు కూడా తెలుసుకొంటాను.. అక్కడైనా ఇక్కడైనా ఒకటి మాత్రం స్పష్టం.. మోదీ మళ్లీ రావడం దేశానికి నష్టం.. దాని ప్రాతిపదికపైనే పార్టీ నడుస్తుంది’ అని చంద్రబాబు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

జాబితాలో కనిపించని దానం పేరు.. కారణం అదేనా?

  అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో తెరాస తరుపున బరిలోకి దిగే 105 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన విషయం తెల్సిందే.. అయితే ఆ జాబితాలో దానం నాగేందర్‌ పేరు లేదు.. గతంలో కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పని చేసిన దానం కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తితో ఇటీవలే కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరారు.. గ్రేటర్ లో మంచి పట్టున్న దానం ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి టిక్కెట్ ఆశిస్తున్నారు.. అయితే, అక్కడ ఆశావహుల మధ్య గట్టి పోటీ ఉండటంతో దానం పేరు పెండింగులో పడింది.. ఒకప్పుడు ఈ నియోజకవర్గానికి పలు విడతల పాటు ప్రాతినిథ్యం వహించిన మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత అయిన దివంగత పి జనార్ధన రెడ్డి కుమార్తె విజయారెడ్డితో పాటు, మరికొందరు కూడా ఆశావహుల జాబితాలో ఉండటంతో ఇక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలన్నది పార్టీ ముఖ్యులతో చర్చించిన తర్వాత ప్రకటించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.. అందుకే తొలి జాబితాలో దానం పేరు లేదు.. ఖైరతాబాద్ సహా అభ్యర్థులను ప్రకటించని నియోజకవర్గాలు మొత్తం 14 ఉన్నాయి.. ఈ 14 నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను మరో వారం పది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.. ఆ జాబితా వస్తే గాని దానం టిక్కెట్ గురించి క్లారిటీ వచ్చే అవకాశాల్లేవు.

బాబూ మోహన్‌కు నో టిక్కెట్.. కొండా సురేఖకు డౌట్.!!

  కేసీఆర్ వచ్చే ఎన్నికలకు తెరాస తరుపున బరిలోకి దిగే 105 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే ఇద్దరు ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తప్పించి ఇంచు మించు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ కేసీఆర్ అవకాశం కల్పించారు.. టిక్కెట్ కోల్పోయిన వారిలో ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే బాబూ మోహన్ కూడా ఉన్నారు.. అయితే ఆయన దురుసు తనం కారణంగానే ఆయన టిక్కెట్ కోల్పోయారనే అభిప్రాయాలూ వ్యక్తమవుతోన్నాయి.. బాబూ మోహన్ అధికారులతో దురుసుగా మాట్లాడుతున్న వీడియో, కార్యకర్తలను తన్నటానికి కాలెత్తిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. ఆయన ప్రవర్తన మూలంగా అక్కడ నియోజకవర్గ ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.. దాని మూలంగానే కేసీఆర్ బాబూ మోహన్ కి టిక్కెట్ నిరాకరించినట్టు సమాచారం.     వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ పేరు కూడా జాబితాలో లేదు.. ప్రస్తుతం ఆ సీట్ ని పెండింగ్ లో ఉంచారు.. అయితే కొండా సురేఖ టిక్కెట్ కూడా డౌట్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. కొండా సురేఖకు సొంత పార్టీ నేతలతో విభేదాలు తలెత్తుతున్నాయి.. దీంతో కేసీఆర్ ఆమె తీరుపై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.. ప్రస్తుతానికైతే కొండా సురేఖకు టిక్కెట్ డౌట్ అనే మాట వినిపిస్తోంది.. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

కేసీఆర్ హాట్ కామెంట్స్.. పప్పు కాదు పెద్ద బఫూన్

  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఇన్ని రోజులు బీజేపీ నేతలు మరియు ఇతర ప్రత్యర్థి పార్టీ నేతలు పప్పు అని విమర్శిస్తున్నారు.. కానీ తాజాగా కేసీఆర్ మాత్రం రాహుల్ గాంధీ పెద్ద బఫూన్ అంటూ బిరుదు ఇచ్చారు.. అసెంబ్లీ రద్దు అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ మీద నిప్పులు చెరిగారు.. రాష్ట్రం ఆర్థికంగా ముందుకు పోతోందని కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెబుతోంటే విపక్షాలు పసలేని ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ప్రజల కోసం తెరాస ఎన్నో త్యాగాలను చేసింది.. 8 మాసాల తమ పదవులను త్యాగం చేసినట్టు కేసీఆర్ చెప్పారు.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు భయపడుతోంది.. రాహుల్ గాంధీ పెద్ద బఫూన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తెరాస 105 మంది అభ్యర్థులు వీరే

​ కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళ్లి చరిత్ర సృష్టించడానికి సిద్ధమయ్యారు.. అంతేకాదు తొలివిడతగా 119 స్థానాలకు గాను, ఒకేసారి ఏకంగా 105 మంది అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు.. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఇద్దరికి తప్పితే మిగతా అందరికి అవకాశం ఇచ్చారు.   భద్రాచాలం- వెంకట్రావు పినపాక- వెంకటేశ్వర్లు అశ్వరావుపేట- తాటి వెంకటేశ్వర్లు ఇల్లందు- కనకయ్య కొత్తగూడెం- జలగం వెంకట్రావు ఖమ్మం- పువ్వాడ అజయ్ కుమార్ పాలేరు- తుమ్మల నాగేశ్వరరావు వైరా- బానోతు మదన్‌లాల్ మధిర- లింగాల కమలరాజ్ సత్తుపల్లి- పిడమర్తి రవి మహబూబాబాద్- బానోత్ శంకర్‌నాయక్ డోర్నకల్- డీఎస్.రెడ్యానాయక్ పరకాల- చల్లా ధర్మారెడ్డి నర్సంపేట- పెద్ది సుదర్శన్‌రెడ్డి వర్థన్నపేట- ఆరూరి రమేష్ వరంగల్ వెస్ట్- వినయ్ భాస్కర్ భూపాలపల్ల- మధుసూధనాచారి ములుగు- అజ్మీరా చాందూలాల్ జనగాం- ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్టేషన్‌ఘన్‌పూర్- డా. తాటికొండ రాజయ్య పాలకుర్తి- ఎర్రబెల్లి దయాకర్‌రావు నల్గొండ- కంచెర్ల భూపాల్‌రెడ్డి మిర్యాలగూడ- ఎన్.భాస్కర్ నాగార్జునసాగర్- నోముల నర్సింహయ్య దేవరకొండ- రమావత్ రవింద్రకుమార్ మునుగోడు- కాసు కుంటల ప్రభాకర్‌రెడ్డి నకిరేకల్- వేముల వీరేశం సూర్యాపేట- జగదీశ్‌రెడ్డి తుంగతుర్తి- గ్యేదర్ కిషోర్‌కుమార్ ఆలేరు- గొంగెడి సునీత భువనగిరి-శంకర్‌రెడ్డి నిజామాబాద్ అర్బన్-బి.గణేష్ నిజామాబాద్ రూరల్-బాజిరెడ్డి గోవర్థన్ ఆర్మూర్-జీవన్‌రెడ్డి బాల్కొండ-వేముల ప్రశాంత్ రెడ్డి బోధన్-షకీల్ అహ్మద్ బాన్సువాడ-పోచారం శ్రీనివాస్‌రెడ్డి కామారెడ్డి-గంపా గోవర్ధన్ జుక్కల్-హన్మంతు షిండే ఎల్లారెడ్డి-ఏనుగు రవీందర్‌రెడ్డి ఆదిలాబాద్-జోగు రామన్న బోథ్-రాథోడ్ బాబూరావు ఖానాపుర్-రేఖానాయక్ ఆసిఫాబాద్-కోవా లక్ష్మీ సిర్పూర్ కాగజ్‌నగర్-కోనేరు కొన్నప్ప నిర్మల్-అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ముథోల్-విఠల్‌రెడ్డి మంచిర్యాల-నడిపల్లి దివాకర్‌రావు బెల్లంపల్లి-దుర్గం చెన్నయ్య చెన్నూర్-బాల్క సుమన్ కరీంనగర్-గంగుల కమలాకర్‌ హుజూరాబాద్-ఈటెల రాజేందర్ మానుకొండూరు-రసమయి బాలకిషన్ సిరిసిల్ల-కేటీఆర్ వేములవాడ-చెన్నమనేని రమేష్ జగిత్యాల-సంజయ్ కుమార్ కోరుట్ల-కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ధర్మపురి-కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి-దాసరి మనోహర్‌రెడ్డి మంథని-పుట్టా మధుకర్ రామగుండం-సోమారపు సత్యనారాయణ సిద్దిపేట-హరీశ్‌రావు దుబ్బాక-సోలిపేట రామాలింగారెడ్డి గజ్వేల్-కేసీఆర్ హుస్నాబాద్-సతీష్‌కుమార్ సంగారెడ్డి-చింతా ప్రభాకర్ నారాయణఖేడ్-భూపాల్‌‌రెడ్డి ఆందోల్-చంటి క్రాంతి కిరణ్ పటాన్‌చెరు-గూడెం మహిపాల్ రెడ్డి మహబూబ్‌నగర్-శ్రీనివాస్‌గౌడ్ జడ్చెర్ల-లక్ష్మారెడ్డి దేవరకద్ర-ఆలే వెంకటేశ్వర్‌రెడ్డి నారాయణపేట్-రాజేందర్‌రెడ్డి మక్తల్-చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నాగర్‌‌కర్నూల్-మర్రి జనార్ధన్‌రెడ్డి కొల్లాపూర్-జూపల్లి కృష్ణారావు అచ్చంపేట-గువ్వల బాలరాజ్ చాంద్రాయణగుట్ట- ఎం. సీతారాం రెడ్డి కార్వాన్‌- జీవన్‌ సింగ్‌ బహదూర్‌పురా- ఇయాకత్‌ అలీ నాంపల్లి- అనంత్‌ గౌడ్‌ యాకత్‌పూరా- సామ సుందర్‌ రెడ్డి మహేశ్వరం- తీగల కృష్ణారెడ్డి ఇబ్రహింపట్నం- మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి శేరిలింగంపల్లి- అరికెపూడి గాంధీ ఎల్బీనగర్‌- మద్దగోని రామ్మోహన్‌ గౌడ్‌ చేవెళ్ల- కాలె యాదయ్య కుత్బుల్లాపూర్‌- వివేకానంద కూకట్‌పల్లి- మాధవరం కృష్ణారావు ఉప్పల్‌- సుభాష్‌ రెడ్డి సికింద్రాబాద్‌- పద్మారావు సనత్‌ నగర్‌- తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కంటోన్మెంట్‌- సాయన్న జూబ్లీహిల్స్‌- మాగంటి గోపినాథ్‌ కల్వకుర్తి- జయ్‌పాల్‌ యాదవ్‌ వనపర్తి- నిరంజన్‌ రెడ్డి గద్వాల్‌- కృష్ణమోహన్‌ రెడ్డి ఆలంపూర్‌ ‌- అబ్రహం పరిగి- కొప్పుల మహేష్‌ రెడ్డి తాండూర్‌- పట్నం మహేందర్‌ రెడ్డి కొండగల్‌- పట్నం నరేందర్‌ రెడ్డి షాద్‌నగర్‌- అంజయ్య యాదవ్ రాజేంద్రనగర్‌- ప్రకాష్‌ గౌడ్‌ మెదక్‌- పద్మాదేవేందర్‌ రెడ్డి నర్సాపూర్-మధన్‌రెడ్డి

ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌.!!

  అసెంబ్లీని రద్దు చేస్తూ ఏకవాక్య తీర్మానంపై సీఎం కేసీఆర్ సంతకం చేసి ఆ ప్రతిని గవర్నర్‌ నరసింహన్‌కు అందజేసిన విషయం తెలిసిందే.. తెలంగాణ అసెంబ్లీ రద్దు తీర్మానానికి గవర్నర్ ఆమోదం తెలిపారు.. ఈ మేరకు రాజ్‌భవన్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్‌ను ఈసీ, అసెంబ్లీ కార్యదర్శికి రాజ్‌భవన్‌ వర్గాలు పంపాయి.. దీంతో తెరాస ప్రభుత్వం అధికారికంగా రద్దయింది.. అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్‌ను గవర్నర్ కోరారు.. ఇందుకు కేసీఆర్ కూడా సుముఖత వ్యక్తం చేశారు.. ఈ క్రమంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌, మంత్రులు కొనసాగాలని సీఎస్‌ ఎస్కే జోషి జీవోను జారీ చేశారు.    

ముందస్తు వద్దు.. రాజ్‌భవన్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం

  తెలంగాణలో ఓ వైపు అసెంబ్లీ రద్దు, ముందస్తు అంటూ హడావిడి జరుగుతుంటే.. మరోవైపు ఓ యువకుడు ముందస్తు వద్దంటూ రాజ్‌భవన్ ముందు ఆత్మహత్యాయత్నం చేసాడు.. రాజ్ భవన్ ముందు ఓ యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించాడు.. సకాలంలో రాజ్‌భవన్ సిబ్బంది స్పందించడంతో ప్రమాదం తప్పింది.. సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళుతుండటాన్ని నిరసిస్తూ ఆత్మహత్యకు యత్నించినట్టు యువకుడు తెలిపాడు.. తన పేరు ఈశ్వర్ అని, నిజాం కాలేజీ పాత విద్యార్థినని నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి నుంచి వచ్చినట్టు తెలిపాడు.. ఉద్యమకారులకు, తెలంగాణ కోసం అమరులైన వారికి, నిరుద్యోగ యువతకు ఏం చేశారని కేసీఆర్ ముందస్తుకు వెళుతున్నారని ప్రశ్నించాడు.. ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్నది తన డిమాండ్ అని తెలిపాడు.