బీఆర్ఎస్ ది దుష్ప్రచారం.. బనకచర్ల ఆగదు!

బనకచర్లపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచర్ల ప్రాజెక్టు ఆగదని విస్పష్టంగా చెప్పారు. తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కేవలం రాజకీయ లబ్ధి కోసం విషప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కడప వేదికగా జరిగిన మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన తరువాత ఆయన మాట్లాడారు.   క‌ర్నూలు జిల్లా బ‌న‌క‌చ‌ర్ల‌లో నిర్మించే భారీప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ రెడీ అయ్యిందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే కేంద్రంతో పలుమార్ల చర్చించినట్లు తెలిపారు. గోదావరి జలాలను పోలవరం ద్వారా మళ్లించి బనకచర్లలో నిల్వ చేసి కర్నూలు జిల్లా సహా సీమ ప్రాంత ప్రజలకు అందించడమే తన లక్ష్యం, సంకల్పం అని ప్రకటించారు.  అంశాన్ని ప్ర‌స్తావించారు. గోదావరి జ‌లాల‌ను పోల‌వ‌రం ద్వారా.. మ‌ళ్లించి.. బ‌న‌క‌చ‌ర్లలో నిల్వ చేసి.. క‌ర్నూలు స‌హా రాయ‌లసీమ ప్రాంత ప్ర‌జ‌ల‌కు అందించాల‌న్న‌ది త‌మ సంక‌ల్పంగా చెప్పుకొచ్చారు. బనకచర్లపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్నదంతా దుష్ప్రాచారమేనని చెప్పిన ఆయన వృధాగా ఉప్పు సముద్రం పాలౌతున్న గోదావరి జిలాలను సద్వినియోగం చేసుకునేందుకుకే ఈ ప్రాజెక్టు కుట్టుకుంటున్నామన్నారు.  దీనిని కూడా అడ్డుకునేందుకు బీఆర్ఎస్ చేస్తున్న కుట్రలు సాగవని హెచ్చరించారు.   స‌ముద్రంలో పోయే నీటిని వాడుకుంటే త‌ప్పా? ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తే ఓర్చుకోలేరా? అని బీఆర్ఎస్ ను సభా ముఖంగా నిలదీశారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు ఆపాలని సూచించారు. బనకచర్ల ద్వారా తెలంగాణకు ఎటువంటి నష్టం వాటిల్లదని ఆయన క్లారిటీ ఇచ్చారు.  ఏ ప్రాజెక్టు క‌ట్టినా.. దాని ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు బాగుండాల‌నేదే త‌మ ఉద్దేశ‌మ‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు.  

వెల్దీ, హెల్దీ, హ్యాపీ.. చంద్రబాబు నినాదం

ఆరు శాసనాలతో నూతనత్వాన్నీ, కొత్త నాయకత్వాన్నీ తీసుకు వచ్చామని చంద్రబాబు అన్నారు. మహానాడు ముగింపు సందర్భంగా కడపలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన మహానాడులో తీర్మానించుకున్న ఆరు శాసనాలనూ తు.చ. తప్పకుండా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. వీటి ద్వారా అద్భుత ఫలితాలను సాధిద్దామని పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర2047 లక్ష్యాన్ని సాధించే క్రమంలో ప్రతి ఏడాదీ ప్రోగ్రస్ రిపోర్టు ఇస్తామని, ఎంత సాధించాం.. ఇంకా సాధించాల్సిందేమిటి?  అంశాలను సమీక్షించుకుని 2029 నాటికి పేదరికం లేని సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుదామని చంద్రబాబు పిలుపునిచ్చారు.  పార్టీకి కార్యర్తే అధినేత అని పునరుద్ఘాటించారు.   ప్రస్తుతం రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ. 2 లక్షల 67 వేలు. వచ్చే 22 ఏళ్లలో దానిని రూ.55 లక్షలే చేసే బాధ్యత తీసుకుంటున్నానని చెప్పిన ఆయన. వెల్దీ, హెల్దీ, హ్యాపీ అన్నదే మన నినాదం అన్నారు. కోడూరు నుంచి సైకిల్‌పై   మహానాడుకు హాజరైన కార్యకర్తను ఈ వేదికపై సీఎం సన్మానించారు. ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి విజ్ఞప్తి మేరకు కడపకు తాగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు, బుగ్గవంక చెరువు అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి సభా ముఖంగా హామీ ఇచ్చారు. 

రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలోనూ నంబర్ వన్ గా నిలబెట్టడమే తన లక్ష్యమని తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. కడప వేదికగా జరిగిన మహానాడు ముగింపు సందర్భంగా గురువారం  (మే29) సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ అభివృద్ధి వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో అభివృద్ధి సుమాలను పూయిస్తానన్నారు. రాయలసీమ అంటే రాళ్ల సీమ కాదన్న చంద్రబాబు.. రాయలసీమను రాష్ట్రానికి మణిహారంగా మారుస్తామని చెప్పారు. మహానాడు వేదికగా రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించారు. సీమ అభివృద్ధికి ప్రధాన అడ్డంకి ఫ్యాక్షనిజమే అన్న ఆయన ఈ విషయాన్ని ఆనాడే గుర్తించామని చెప్పారు. సీమ గడ్డపై ఫ్యాక్షన్ ఉండొద్దనే తాను కఠినంగా వ్యవహరించానని గుర్తు చేశారు.   సీమ అభివృద్ధికి తన వద్ద  ప్రత్యేక బ్లూప్రింట్ ఉందని చెప్పిన ఆయన విద్యా సంస్థలు, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు  పారిశ్రామిక కారిడార్లతో  సీమలో ఏ జిల్లాకు ఏం చెయ్యాలన్నదానిపై పక్కా ప్రణాళిక ఉందన్నారు. తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్ఇఈర్, ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ, అనంతపురంలో సెంట్రల్ యూని వర్సిటీ, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ వంటి సంస్థలు తీసుకువచ్చామన్నారు. కడపలో హజ్ హౌస్ మొదలుపెట్టి 90 శాతం నిర్మిస్తే... గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేయలేదన్నారు. ఇప్పుడు ఆ హజ్ హౌస్ ను 6 నెలల్లో హజ్ హౌస్ పూర్తి చేస్తామని చెప్పారు.  లేపాక్షి - ఓర్వకల్ కారిడార్‌లో డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్ సిటీ, ఆటోమొబైల్ పరిశ్రమలు, డ్రోన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు తీసుకొస్తామని చంద్రబాబు చెప్పారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌కు కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు.  కడప స్టీల్ ప్లాంట్‌కు గతంలో తాను శంకుస్థాపన చేశాననీ, దానికే మళ్లీ భూమిపూజ చేసి జగన్ నాటకాలాడారనీ చెప్పిన చంద్రబాబు  వచ్చే నెల 12 లోగా  కడపలో స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఫేజ్ 1లో రూ.4,500 కోట్లతో, ఫేజ్ 2లో మరో రూ.4,500 కోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామనీ, దీనిని పూర్తి చేసి 6 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామనీ హామీ ఇచ్చారు. 

క‌మ‌ల్ హాస‌న్ కన్నడ కాంట్రవర్సీ

నిజంగానే క‌న్న‌డ త‌మిళంలోంచి  వ‌చ్చిందా?  ద‌క్షిణాది ప్రాచీన భాష‌లేవి!  నిజానికైతే క‌న్న‌డ‌కు త‌మిళానికీ ఉన్న లింకు మాట  ఎలాగున్నా... తెలుగు క‌న్న‌డ‌కు మాత్రం చాలానే సంబంధ బాంధ‌వ్యాలున్న‌ట్టు క‌నిపిస్తాయ్. తెలుగులో ఒక‌టి- క‌న్న‌డ‌లో ఒందు అంటూ మొద‌లు పెడితే.. దాదాపు క‌న్న‌డ భాషకు తెలుగుకు విశేష సంబంధాలున్నట్టు క‌నిపిస్తుంది. తేట తేట తెలుగు, క‌న్న‌డ క‌స్తూరి, సెంత‌మిళ్, మ‌ల‌యాళ మ‌నోర‌మ‌... ఇవీ ద‌క్షిణ ద్ర‌విడ భాష‌లు. ఇంత‌కీ ఈ ద్ర‌విడం ఎక్క‌డి నుంచి వ‌చ్చింది. ద్ర‌విడ భాష‌ల్లోకి త‌మిళ్ ముందా లేక క‌న్న‌డ‌, తెలుగు, మ‌ల‌యాళ భాష‌లా అని చూస్తే.. అస‌లు త‌మిళ్ అన్న‌ది ఎలా పుట్టిందో తెలుసుకోవ‌ల్సి ఉంటుంది.. ద్రవిడ‌మునకు పూర్వరూపము ద్రమిళమని అంటారు. ఇదే ద్రవిడముగ సంస్కృతమున నిలచిన‌ట్టు చెబుతారు. ప్రాకృత భాషల్లో తిరమడ, తిరమిళ, తమిళ అంటూ ఈ భాష అనేక‌ రూపాంత‌రాలు చెందిన‌ట్టుగా చెబుతుంది భాషా చ‌రిత్ర‌. ద్రమిళమే త‌మిళానికి మొద‌టి ప‌దం.  ద్రమిళ, ద్రవిడ, తిరమడ, తిరమిళ, తమిళ  శబ్దములు ధ‌ర్మ శ‌బ్దాల నుంచి వ‌చ్చాయ‌ని అంటారు. దీంతో పాటు ద్ర‌విడ భాష‌ల్లో కూడా ర‌క‌ర‌కాలుంటాయి. ద్రావిడ భాషా కుటుంబంలో ప్రాధాన్య‌ తాంశాలేంట‌ని చూస్తే.. తొలుత త‌మిళ భాష‌- త‌ర్వాత‌ క‌న్న‌డ భాష‌ క‌నిపిస్తాయి. త‌ర్వాత‌ మధ్య ద్రావిడ భాషా కుటుంబం క‌నిపిస్తుంది. ఇందులో తెలుగు ప్ర‌ధాన  భాష‌. ఉత్తర ద్రావిడ భాషా కుటుంబం కురుఖ్ వంటి భాష‌లున్న‌ట్టు చెబుతంది మ‌న ద్ర‌విడ భాషా చ‌రిత్ర‌. అంటే ద్ర‌విడంలోనే అనేక భాష‌లు వాటికి గ్రెడేషన్ ఉన్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్ అంత న‌మ్మ‌కంగా ఎలా చెప్ప‌గ‌లిగారంటే.. ద్ర‌విడ భాష‌ల పెద్ద‌న్న త‌మిళం. త‌ర్వాతే క‌న్న‌డ‌. ఆ త‌ర్వాత మ‌ల‌యాళం, ఆపై ఇత‌ర భాష‌లు. అందుకే ఆయ‌న అంత గ‌ట్టిగా త‌న‌కు చ‌రిత్ర కారులు చెప్పార‌ని గట్టిగా అంటున్నారు. నిజానికైతే తెలుగు క‌న్న‌డ ద‌గ్గ‌ర ద‌గ్గ‌రగా ఉన్న‌ట్టు క‌నిపిస్తాయి. ఆ భాష రాత‌లోగానీ పిలుపులోగానీ ఆ సొబ‌గు ఈ రెండింటి మ‌ధ్యే ఎక్కువ‌గా ఉన్న‌ట్టు క‌నిపిస్తుంది. మీరు కావాలంటే  చూడండీ.. క‌న్న‌డ వాళ్ల‌తో తెలుగు మాట్లాడి  నెగ్గుకు రాగ‌లం. త‌మిళ‌వాళ్ల ముందు మ‌ల‌యాళం మాట్లాడి నెగ్గుకు రాగ‌లం. ఈ రెండింటి మ‌ధ్య ఉన్న అనుబంధం అలాంటిది. అలాంటిది త‌మిళానికీ క‌న్న‌డానికీ సంబంధ‌మేంట‌న్న‌ది అర్ధంకాని చిక్కు ప్ర‌శ్న‌. అస‌లు ద్ర‌విడం అంటేనే బౌద్ధ ధ‌ర్మంలోంచి పుట్టింద‌నీ.. ఆ ధ‌ర్మ‌మే ద్ర‌విడంగా త‌ర్వాత త‌మిళంగా పుట్టుకొచ్చింద‌ని మ‌న‌కు చెబుతోంది భాషా చ‌రిత్ర‌.  ద్ర‌విడ భాష‌లు దాని వంశ వృక్షం విష‌యానికి వ‌స్తే.. మూల ద్రావిడ భాష దాన్లోంచి ఉత్త‌ర ద‌క్షిణ భాష‌లు పుట్టుకొచ్చాయి. వాటిలో ద‌క్షిణ భాషల్లోంచి త‌మిళం పెద్ద‌న్న‌గా ఉండ‌గా క‌న్న‌డ అందులోంచి పుట్టుకొచ్చిన మ‌రో కొమ్మ‌లా క‌నిపిస్తుంది. ఈ కోవ‌లోనే మ‌ల‌యాళం కూడా పుట్టుకొచ్చిన‌ట్టు తెలుస్తుంది.  అంటే త‌మిళ‌మే ఈ భాష‌ల‌న్నిటికీ  హెడ్ క్వార్ట‌ర్. మ‌రి క‌న్న‌డిగుల‌కు ఈ విష‌యం తెలీదా? ఎందుక‌ని క‌మ‌ల్ హాస‌న్ లేటెస్ట్ మూవీ థ‌గ్స్ అండ్ లైఫ్.. సినిమాతో పాటు ఇత‌ర చిత్రాలేవీ ఆడ‌నివ్వ‌మంటున్నారు.. ఇందుకు రీజ‌న్లు ఏమై ఉంటాయ్? అని చూస్తే ఆత్మ‌గౌర‌వ ప్ర‌శ్న‌. ఎవ‌రికి వారు మేమంటే మేమే గొప్ప అనుకుంటారు. అలాంటిది వాళ్ల‌కు వాళ్లు గొప్ప‌. క‌న్న‌డిగుల‌కు అస‌లే ఆత్మాభిమానం ఎక్కువ‌.  ఇప్ప‌టికే కావేరీ స‌మ‌స్య ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఎప్ప‌ట్నుంచో ఉంది. కావేరీ న‌ది పుట్టింది క‌ర్నాట‌క‌లోని త‌ల‌కావేరీ ప్రాంతంలో. అక్క‌డి నుంచి అది త‌మిళ‌నాడు దిశ‌గా ప్ర‌వ‌హించి బంగాళా ఖాతంలో క‌లిసేది తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాల మ‌ధ్య గ‌ల ఈ గొడ‌వ ఇప్ప‌టిది కాదు. ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి రాక పోవ‌డానికి గ‌ల ప్ర‌ధాన‌ కార‌ణం కూడా ఇదే.  ర‌జ‌నీ(మ‌రాఠీ అయిన‌ప్ప‌టికీ) పుట్టింది క‌ర్ణాట‌క‌లో.... ఎంతైనా పుట్టిన ప్రాంత అభిమానం అంటూ ఒక‌టి ఉంటుంది కాబ‌ట్టి.. ఆయ‌న్ను త‌మిళులు రాజ‌కీయ పార్టీ పెట్ట‌నివ్వ‌లేదని అంటారు. ఆయ‌న కూడా ఎందుకొచ్చిన గొడ‌వ అంటూ ప‌క్క‌కు త‌ప్పుకున్నారు. అదే క‌మ‌ల్ హాస‌న్ త‌న మ‌క్క‌ల్ నీతి మ‌య్యం అనే పార్టీ స్థాపించి.. డీఎంకేతో పొత్తు పెట్టుకుని.. ఇప్పుడు రాజ్య‌స‌భ‌కు కూడా వెళ్తున్నారు. అది వేరే విష‌యం అనుకోండి. త‌మిళ క‌న్న‌డ ప్ర‌జ‌ల‌కున్న గొడ‌వ‌లు ఈనాటివి కావు.. కావేరీ జ‌లాల విష‌యంలో ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఇప్ప‌టికే కొన్ని ప‌దుల సంఖ్య‌లో గొడ‌లు జ‌రిగాయ్. ఎప్ప‌టి నుంచో క‌న్న‌డిగుల‌కు మ‌రో  స‌మ‌స్య కూడా ఉంది. త‌మ సినిమాలు ఇత‌ర భాష‌ల డ‌బ్బింగ్ సినిమాల ముందు తేలిపోతున్నాయ‌ని భావించిన వీరు డ‌బ్బింగ్ చిత్రాల‌పై బ్యాన్ విధించారు. ఈ బ్యాన్ ని ఎప్పుడెప్పుడు అమ‌లు చేద్దామా? అని చూస్తున్న వారికి క‌మ‌ల్- క‌న్న‌డ కామెంట్స్ మ‌రింత కాక పుట్టించాయ్. దీంతో అందివ‌చ్చిన అవ‌కాశాన్ని ఎలాగైనా వాడుకోవాల‌న్న‌ది ఇంకో ఎత్తుగ‌డ‌గా తెలుస్తోంది.

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు చివరి దశకు వస్తుండటం, వారంతం సమీపిస్తుండటంతో భక్తులు తిరుమలేశుని దర్శనానికి పోటెత్తుతున్నారు. శుక్రవారం (మే 30) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకూ  సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.  ఇక గురువారం (మే 29) శ్రీవారిని మొత్తం 69 వేల 19 మంది దర్శించుకున్నారు. వారిలో 37 వేల 774 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 42 లక్షల రూపాయలు వచ్చింది. 

ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తితో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్!

పాక్ ఉగ్రవాదులను ఏరిపారేసిన ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ కు నాంది పలుకుదామని తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపు నిచ్చారు. మహానాడు ముగింపు సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన టెర్రరిస్టులు దేశానికి ఎంత ప్రమాదమో....రాజకీయ ముసుగులో ఉన్న ఆర్ధిక ఉగ్రవాదులు అంత కంటే ప్రమాదమన్నారు. వారిని రాష్ట్రం నుంచి తరిమికొడదామన్నారు. అందుకే  ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ తో వారిని రాజకీయాల్లో లేకుండా చేద్దామన్నారు.  రాజకీయాలు అడ్డం జగన్ హయంలో ల్యాండ్, సాండ్, వైన్, మైన్ కుంభకోణాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్న చంద్రబాబు.. ఒక్క చాన్స్ అంటే నమ్మి నాడు ఓటేసి గెలిపిస్తే..   జగన్ హయాంలో జె బ్రాండ్స్‌తో, గంజాయి, డ్రగ్స్‌తో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేశారనీ,  అడవులను ఆక్రమించి ఎస్టేట్ లు నిర్మించుకున్నారని... కొండలు, చెరువులు కూడా మింగేశారని,     ప్యాలెస్‌ల నుంచి ఎస్టేట్‌ల వరకు అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారని విమర్శించారు. అదికార అహంతో విర్రవీగిన వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్న చంద్రబాబు  పార్టీ ఎలా ఉండాలో, పాలన ఎలా ఉండాలో చెప్పడంలో టీడీపీ ప్రస్థానం ఒక ఒక కేస్ స్టడీ అయితే.. పాలకులు ఎలా ఉండకూడదో, పార్టీ ఎలా నడపకూడదో చెప్పడానికి వైసీపీ ఒక కేస్ స్టడీ అన్నారు. 

కడప జగన్ అడ్డా కాదు.. చంద్రబాబు ఖిల్లా.. బీటెక్ రవి

తెలుగుదేశం ఆవిర్భావం తరువాత తొలి సారిగా కడపలో మహానాడు నిర్వహించి ఇక కడప ఎంత మాత్రం జగన్ అడ్డా కాదని నిరూపించామని పులివెందుల తెలుగుదేశం ఇన్ చార్జ్ బీటెక్ రవి అన్నారు. మమానాడు చివరి రోజున గురువారం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కడపలో ఇంత విజయవంతంగా మహానాడు నిర్వహించిన పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు ఆయన ఈ సందర్భంగా కృతజ్ణతలు తెలిపారు.  జగన్ ఇలాకాలో మహానాడు అంటూ మీడియాలో వచ్చిందనీ, అయితే 2024 ఎన్నికలకు ముందు వరకూ కడన జగన్ అడ్డా అయితే అయి ఉండొచ్చు కానీ.. ఇప్పుడు కడప చంద్రబాబు ఖిల్లా అని బీటెక్ రవి అన్నాడు. జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏడింటిలో కూటమి విజయం సాధించిందనీ, ఇంకా కడన జగన్ ఇలాకా ఎలా అవుతుందని ప్రశ్నించారు. వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్చినందుకు ఆయన ప్రభుత్వానికి కృతజ్ణతలు తెలిపారు. చంద్రబాబు గారి కృషితోనే నేడు పులివెందుల హార్టికల్చర్ హబ్‌గా మారింది. ఇక్కడ పండిస్తున్న అరటి, బత్తాయి పంటలు ఢిల్లీ, ముంబై వంటి నగరాలకే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి అన్న బీటెక్ రవి.. పులివెందులకు చెందిన ఇద్దరు సీఎంలు వైఎస్, జగన్  పులివెందులకు  కనీసం తాగునీరు కూడా అందించలేకపోయారని విమర్శించారు. చంద్రబాబు జల్ జీవన్, అమృత్ పథకాల ద్వారా పులివెందుల మున్సి పాలిటీకి తాగునీరు అందిస్తే..  జగన్ రెడ్డి   నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకున్నారని ఆరోపించారు.  వైసీపీ నాయకులు ఎప్పుడు బయట ఉంటారో, ఎప్పుడు జైలుకు వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొందని  ఎద్దేవా చేసిన బీటెక్ రవి   వైఎస్ఆర్ హయాంలో పని చేసిన పలువురు ఉన్నతాధికారులు జైలుకెళ్లారనీ, ఆ తరువాత జగన్ హయాంలో ఆయన చెప్పినట్లల్లా ఆడిన  ధనుంజయ రెడ్డి, పీఎస్ఆర్ ఆంజనేయులు వంటి అధికారులు కూడా జైలుకెళ్లారనీ అన్నారు.   పరిటాల రవి హత్య కేసు, మద్దెలచెరువు సూరి హత్య కేసు, గాలి జనార్దన్ రెడ్డి కేసుల్లో నిందితులంతా జైలుకు వెళ్లారని గుర్తుచేస్తూ, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి, లిక్కర్ కేసులో జగన్ రెడ్డి కూడా వచ్చే మహానాడు నాటికి జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు బీటెక్ రవి. 

జూన్ 6లోగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా : మంత్రి పొంగులేటి

  ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో నిర్లక్ష్యం సహించేది లేదని హెచ్చరించారు. గురువారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు,సేకరణ, వ్యవసాయం, వర్షాకాలం ముందస్తు ప్రణాళికా, ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి, వరంగల్ ఎయిర్ పోర్టు అంశాలపై  మంత్రులు, ఎమ్మేల్యేలు, కలెక్టర్లు అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు  జిల్లాలో కనీసం 50 శాతం కూడా లబ్ధిదారుల జాబితా ప్రకటించకపోవడం ఏంటి ప్రశ్నించారు. లబ్ధిదారుల జాబితా ఫ్రేమ్ కట్టుకోవడానికి కాదని మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 6వ తేదీ లోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వాలి ఆదేశించారు.  నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. వీటి నియంత్రణకు పోలీస్‌, వ్యవసాయ శాఖ సమన్వయంతో పని చేయాలన్నారు. జూన్ 6 కటాఫ్ డేట్‌గా ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అప్లికేషన్లను క్లియర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారుల ఎంపికలో వయో పరిమితి లేదని స్పష్టం చేశారు. పేదల సొంతింటి కల నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం చేపట్టిన విషయం తెలిసిందే

వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు

  వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ  హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తక్షణమే ఆయనకు వైద్యం అందించాలని అధికారులను ఆదేశించింది. తన హెల్త్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని బెయిల్ మంజూరు చేయాలని వంశీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వంశీకి తక్షణమే వైద్యం అందించాలని అధికారులను ఆదేశించింది. కాగా అక్రమ మైనింగ్ కేసులో కూడా వంశీకి నేడు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్ట్. అదే విధంగా వంశీ తనకు మెరుగైన చికిత్స కోసం ప్రయివేటు ఆస్పత్రికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రి లో సరైన సౌకర్యాలు లేవని కోర్టుకు నివేదించారు. దీంతో, వంశీకి మెరుగైన చికిత్స అందించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  

ఈ పెద్దాయన మహా అభిమాని.. 400 కిలోమీటర్లు సైకిల్‌పై మహానాడుకు

  ఈ పెద్దాయన తెలుగుదేశం పార్టీకి మహా అభిమాని 400 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణం చేస్తూ కడపలో జరిగిన మహానాడుకు హాజరయ్యారు. మండే ఎండలు మధ్య మధ్యలో వానలు అయినా లెక్క చేయకుండా ఏడు పదులు దాటిన వయసులో 400 కిలోమీటర్లు సైకిల్ తొక్కాలంటే సాహసమే..అయినా అభిమానం ముందు ఆ సాహసం ఆయనకు పెద్ద లెక్కే కాకుండా పోయింది. ధూళిపూడి మునేశ్వరరావు అనే  ఈ పెద్దాయనది అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు.  తెలుగుదేశం పార్టీ అంటే వల్లమాలిన అభిమానం కడపలో జరుగుతున్న మహా పండుగ కు తమ తెలుగుదేశం పార్టీ గుర్తు,పేదోడి రధం అయిన సైకిల్ పై వచ్చారు. ఈయనకు టిడిపి అంటే వీరాభిమానం 400 కిలోమీటర్లు సైకిల్ పై వచ్చిన ఈ పెద్దాయన గురించి చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో చంద్రబాబు ఆయన్ను వేదికపై కి పిలిచి అందరికీ చూపిస్తూ స్ఫూర్తి దాత అంటూ కితాబిచ్చి అభినందించారు. తెలుగుదేశం పార్టీకి ఇలాంటి కార్యకర్తలు ఉండం పూర్వజన్మ సుకృతం అని చంద్రబాబు కొనియాడారు. వేదికపై ఉన్న నారా లోకేష్ సైతం లేచి చప్పట్లు కొడుతూ అభినందించారు  

మహానాడు సభలో ఎమ్మెల్యే భర్త తీవ్ర భావోద్వేగం .. ఓదార్చిన సీఎం చంద్రబాబు

  కడపలో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు మూడో రోజు భారీ బహిరంగ సభతో విజయవంతంగా ముగిసింది. ఈ సభ వేదికపై ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వేదికపైకి చేరుకున్న పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఏర్పాట్లను చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రెడ్డెప్పగారి శ్రీనివాస్‌ రెడ్డిని భుజం తట్టి సీఎం మెచ్చుకున్నారు. దీంతో శ్రీనివాస్ రెడ్డి ఆనందభాష్పాలతో చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.  గత ఐదేళ్లలో కడప జిల్లాలో పార్టీ బలోపేతం కోసం ఆయన పడి కష్టం.. ప్రత్యర్థుల కుట్ర, చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను గుర్తు తలచుకోని శ్రీనివాస్‌ రెడ్డిని ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు. దీంతో ఆయనను చంద్రబాబు నాయుడు ఓదార్చారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొని నిలబడిన మాధవీ రెడ్డి దంపతులను అభినందించారు. ఈ సందర్బంగా కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి మాట్లాడుతు  తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు.కడప ఎమ్మెల్యే సీటు ఒక మహిళకు కేటాయించారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు.  

కడప గడ్డన ముగిసిన మహా సంబరం

  రాయలసీమ నడిబొడ్డు కడప గడ్డన నిర్వహించిన పసుపు పండగ పసుపు దండు ఆనందోత్సాహాల మధ్య ముగిసింది. ఉత్తంగ తరంగమై అన్ని దారులు కడప వైపు అన్నట్టు పెను ప్రవాహంలో తెలుగుదేశం శ్రేణులు మహానాడుకు తరలి వచ్చి జోష్ నింపారు .ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలతో పాటు తెలంగాణ ప్రాంతం నుంచి కూడా నేతలు ,కార్యకర్తలు అభిమానులు రావడంతో కడప ఈ మూడు రోజులు మినీ సమైక్యాంధ్ర ను తలపించింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ,జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబుల ప్రసంగాలు ఆకట్టు కొనడమే కాదు పార్టీ కార్యకర్తలకు అత్యంత ప్రధాన్యం ఇస్తూ మాట్లాడం వారిలో  మరింత భరోసా నింపింది .అందరి నాయకులకు వేదికపై మాట్లాడే అవకాశం కల్పించడంతో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తల కరతాళధ్వనులతో సభా ప్రాంగణం మారుమ్రోగింది. *కడప వేదికగా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక  ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తెలుగుదేశం పార్టీ జరుపుకునే మహానాడు ఈసారి కడపలో నిర్వహించడంతో మరోసారి చంద్రబాబు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక కావడానికి కడప వేదికైంది .ఆ హోదాలో చంద్రబాబు నాయుడు ప్రసంగించి తెలుగు తమ్ముళ్లు కార్యకర్తలకు సేవలకు జోష్ నింపారు .మీకు నేనున్నాను పార్టీ ఉంది మనం కష్టపడదాం ప్రజలకు మంచి చేద్దాం అంటూ పార్టీ శ్రేణులకు స్థైర్యాన్ని ఇచ్చారు. *కలివిడిగా లోకేష్  రాష్ట్ర సాంకేతిక ,విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మహానాడులో కలివిడిగా తిరుగుతూ అందరితో మాట్లాడుతూ సీనియర్ నాయకులను గౌరవిస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కనిపించారు. ఎక్కడ తారతమ్య భేదాలు ప్రదర్శించకుండా అవకాశం దొరికిన మేరకు అందరితో  ముచ్చటిస్తూ వచ్చారు. మీడియా పాయింట్ లో సైతం అయన మాట్లాడేందుకు వేదికపై కూర్చుంటారని జర్నలిస్టు భావించారు. అయితే ఆయన నేరుగా వచ్చి వేదిక మీదే కుర్చీలో కాకుండా ఒక వారన క్రింద కూర్చొని అందరితో కలిసి మాట్లాడుతూ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వచ్చారు. ఎక్కడా విసిగించుకోకుండా ప్రశ్నించిన ప్రతి వారితో నవ్వుతూ మాట్లాడుతూ సమాధానం ఇవ్వడం ఆయన పరిణితికి నిదర్శనంగా చెప్పవచ్చు. *ప్రత్యేక ఆకర్షణగా యన్టీఆర్ గ్యాలరీ. మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఫోటో గ్యాలరీ మహానాడుకు వచ్చిన వారిని బాగా ఆకర్షించింది .మొదటి రెండు రోజుల్లో ప్రతిధుల మహాసభకు దక్షిణం వైపు ఏర్పాటుచేసిన ఈ గ్యాలరీలో ఒక భాగం ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటివి పాత చిత్రాలు రంగుల్లోనూ బ్లాక్ అండ్ వైట్ లోను ప్రదర్శించడం చూసేవారికి ఆసక్తి కలిగించింది .ఎన్టీఆర్ గారి తో పాటు దాని పక్కన చంద్రబాబు ,లోకేష్ ఫోటో గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు. కాకపోతే మహానాడు చివరి రోజున గురువారం ఆ గ్యాలరీ లో ఫోటోలు తీసివేయడంతో లక్షల సంఖ్యలో వచ్చిన వారు వాటిని వీక్షించలేకపోయారు. *అనుకూలించిన వాతావరణం మహానాడు మరో నాలుగు రోజుల్లో మొదలవుతుందన్న ప్పట్నుంచి వర్ష వస్తుందేమో అన్న ఆందోళన కలిగిస్తూనే వస్తోంది .మహానాడు మొదలయ్యే ముందు రోజు కూడా వర్షం కురవడంతో నిర్వాహకుల్లో ఆందోళన తప్పలేదు. ముందు జాగ్రత్త చర్యగా ప్రాంగణంలో వేదికల టెంట్ ల చుట్టూ ముందు జాగ్రత్త చర్యగా కాలువలు తవ్వించారు . 27 నుంచి మూడు రోజులపాటు మహానాడు ముగిసే‌వరకు వర్షాలు రాకపోగా వాతావరణం కూడా చల్లబడడంతో మహానాడు మరింత విజయవంతం కావడానికి కారణం అయ్యింది . టిడిపి నాయకులు కూడా ఊపిరి పిల్చుకున్నారు. *సీమగడ్డన వరాల జల్లు  కడపలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహానాడు జరుగుతుందంటే కడప తో పాటు రాయలసీమ వాసులు ఈ ప్రాంతానికి అభివృద్ధి కోసం ఏవైనా హామీలు ఇస్తారని భావించడం సహజమే.. అయితే అందుకు తగ్గట్టుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీమతో పాటు రాష్ట్రంలో చేపట బోయే అభివృద్ధి పనులను మహానాడు వేదికగా  ప్రకటించారు. రాయలసీమ విషయానికొస్తే రాయలసీమను సుభిక్షం చేసేందుకు ప్రాజెక్టులు చేపట్టాలని సీమను కరువు సీమగా ,ఎడారి సీమ గా కానివ్వమని భరోసా ఇచ్చారు. తెలుగు గంగా, హంద్రీ నీవా-నీవా, గాలేరు -నగరి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ అని ఆ తర్వాత తాను బాధ్యతలు చేపట్టాక వాటిని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని అన్నారు .సీమ ప్రాజెక్టులకు 3500 కోట్లు కట్ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది పోలవరం తర్వాత ఎక్కువ స్టైల్ నిధులు కట్ చేసిన ప్రాజెక్టు పందిరి అని అన్నారు 2027 నాటికి జాతికి అంకితం చేస్తామని పోలవరంపై స్పష్టత ఇవ్వడం జరిగింది. వంశధార నుంచి పెన్నా వరకు నదులు అనుసంధానం చేయాలన్నది తమ లక్ష్యం అని తన సంకల్పాన్ని వెల్లడించారు. రాయలసీమ అభివృద్ధిని అగ్రభాగంలోని బాధ్యత తమదే అని హామీ ఇవ్వడం జరిగింది. *ఉక్కుకు మోసులు కడుపుతో పాటు  రాయలసీవాసులు ఎప్పుడెఎప్పుడా  అని ఎదురుచూస్తున్న ఉక్కు పరిశ్రమపై చంద్రబాబు నాయుడు స్పష్టత ఇవ్వడం ఈ ప్రాంత వాసుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.దాదా20ఏళ్ళు గా 20 ఏళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న ఉక్కు సంకల్పానికి పునాదిరాళ్లు తప్ప పూర్తి  చేసిన పరిస్థితులు లేవు. అయితే ముఖ్యమంత్రి మహానాడులో 10 రోజుల్లో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేస్తామని రెండు దశల్లో రూ,9,000 కోట్లతో రాయలసీమ స్టీల్ మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తితో నిర్మాణం చేపడతామని ప్రకటించారు. జిందాల్ సంస్థ నిర్మించే ఈ స్టీల్ ప్లాంట్ లో  3,000 మందికి ఉద్యోగాలు వస్తాయని,ఈ ప్లాంట్ కు శంకుస్థాపనతో పాటు నేనే ప్రారంభోత్సవం చేస్తారని చెప్పడం పై ఇక్కడి వాసుల్లో నమ్మకం కుదురుతోంది. పర్యాటపరంగా గండికోటను అభివృద్ధి చేస్తామని, అక్కడ శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని భవిష్యత్తులో అంతా టూరిజమే‌అని చెబుతూ గండికోట అభివృద్ధి చేయడంతో పాటు శ్రీశైలం,తిరుపతి క్షేత్రాలను మరింతగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు .మహానాడు కడపలో పెట్టిన నేపథ్యంలో ఇలాంటి హామీలు ఇవ్వడం సీమవాసుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది

మహానాడు గ్రాండ్ సక్సెస్.. ఇక కడప జిల్లా టీడీపీకి అడ్డా : సీఎం చంద్రబాబు

  కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కడప టీడీపీ మహానాడుగ ముగింపు సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఎన్నోసార్లు కడపకు వచ్చానని.. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు టీడీపీ మహానాడుకు రావడం చూసి కొండంత ధైర్యం వచ్చిందన్నారు. కడపలో మహానాడు పెడితే చాలామంది అనుమానించారని సీఎం అన్నారు. కడప తెలుగుదేశం పార్టీ అడ్డా అని నిరూపించేందుకే మహానాడు ఇక్కడ పెట్టామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు దేవుని గడపలో జరిగిందని.. రెస్పాన్స్ అదిరిందన్నారు. మహానాడు సూపర్ హిట్ అయ్యిందని అన్నారు. కడప రాజకీయం మారబోతోందని.. కడప గడపలో మార్పు కనిపిస్తుందని గత ఎన్నికల ప్రచారంలో చెప్పానన్నారు. అహంకారంతో విర్రవీగే వారికి ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చారని  కొనియాడారు.  ఈ ఎన్నికల్లో కడపతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అద్భుతమైన విజయం సాధించామన్నారు. ఉమ్మడి కడపలో పదికి ఏడు స్థానాలు గెలిచామని చెప్పుకొచ్చారు. ఇప్పటి నుంచి కష్టపడితే 2029 ఎన్నికల్లో పదికి పదికి స్థానాలు గెలుచుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.  జూన్‌ 12 నాటికి 500 సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయి. వాట్సప్‌లో హాయ్‌ అని పెడితే పనులు జరుగుతాయి. 2027 డిసెంబరు నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. దేశానికి ఉగ్రవాదుల వల్ల చాలా నష్టం. రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదుల వల్ల కూడా అంతే నష్టం. ఆర్థిక ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తాం. రాజకీయాల ముసుగులో ల్యాండ్‌, శాండ్‌, మైన్స్‌ దోచేశారు.  డ్రగ్స్‌, గంజాయి అమ్మితే అదే చివరి రోజని హెచ్చరిస్తున్నా. ఆడబిడ్డల జోలికి వస్తే అవే వారికి అంతిమ గడియలు. గత పాలనలో భూతానికి పరిశ్రమలు వెనకడుగు వేశామన్నారు. భూతాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తున్నామని హామీ ఇచ్చా. రాష్ట్రాన్ని గ్లోబల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం. రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత నాది. రాయల సీమను రాష్ట్రానికి మణిహారంగా మారుస్తాం. రాయలసీమ అభివృద్ధికి బ్లూప్రింట్‌ ఉంది. ఆరు నెలల్లో కడప హజ్‌హౌస్‌ పూర్తి చేస్తాం. కర్నూలుకు హైకోర్టు బెంచ్‌ తప్పకుండా వస్తుంది. జూన్‌ 12లోగా కడపలో రాయలసీమ స్టీల్‌ ప్లాంట్‌ పనులు ప్రారంభిస్తాం’’ అని సీఎం ప్రకటించారు. ప్రజలకు డబ్బులతో పాటు ఆరోగ్యం ఉంటేనే నిజమైన అభివృద్ధిని తెలిపారు.

ఒక పుష్ప‌ నేష‌న‌ల్, స్టేట్ అవార్డులు రెండు..కార‌ణాలేంటి?

  పుష్ప పార్ట్ వ‌న్ ద్వారా నేష‌న‌ల్ బెస్ట్ యాక్ట‌ర్ అవార్డు రాగా.. పార్ట్ టూ ద్వారా.. స్టేట్ బెస్ట్ యాక్ట‌ర్ అవార్డు రావ‌డం మాములు విష‌యం కాదు. ఒక పాత్ర‌ను ద‌ర్శ‌క ర‌చ‌యిత‌లు మ‌ల‌చ‌డం ఒక ఎత్తు అయితే దాన్ని చేయ‌డం మ‌రొక ఎత్తుగా భావించాల్సి ఉంటుంది. ఈ క్రెడిట్ ద‌ర్శ‌క ర‌చ‌యిత‌ల‌దా? లేక ఆ కేరెక్ట‌ర్ కి ప్రాణం పెట్టిన ఆర్టిస్టుదా? ఎవ‌రి స‌మ‌ర్ధ‌త ఎంతెంత‌? ఎవ‌రికి ఈ ఘ‌న‌త‌ను ఇవ్వాల్సి ఉంటుంద‌ని చూస్తే.. ఒక ర‌కంగా చెబితే ఆర్టిస్టుకే ఈ క్రెడిబిలిటీ ఇవ్వాల్సి ఉంటుంది.కార‌ణం.. పాత్ర‌లు అన్నింటా ఉంటాయి. అంద‌ర‌కూ క్రియేట్ చేయ‌గ‌ల‌రు. కానీ దాన్ని పాన్ ఇండియాలో ప్రేక్షక ప్ర‌జ‌లను అల‌రించ‌డం.. ఒక ర‌క‌మైన మేన‌రిజమ్స్ తో ఆక‌ట్టుకోవ‌డం.. ఇవ‌న్నీ ఆర్టిస్టు చేతుల్లోనే ఉంటాయి. పుష్ప  2 పాత్ర అయితే, ఏకంగా డైలాగ్ డెలివ‌రీ కూడా స‌రిగా ఉండ‌దు. నోట్లు తంబాకు పెట్టుకుని న‌త్తి న‌త్తిగా డైలాగ్ చెప్ప‌డం అన్న‌ది ఇందులో క‌నిపిస్తుంది. దీంతో .. ఈ పాత్రను మ‌రింత క‌ష్ట‌త‌రం చేశారు ద‌ర్శ‌క ర‌చ‌యిత‌లు. దీంతో చెప్పేదేముందీ ఈ పాత్ర పోష‌ణ మ‌రింత క‌ఠువుగా మారినా.. దాన్నికూడా ఒక ఛాలెంజింగా తీసుకున్న న‌టుడు అల్లు అర్జున్ దీన్ని భేష్ అనిపించాడు. ఇక్క‌డ మ‌రో స‌బ్జెక్ట్ ఏంటంటే.. ఇలాంటి స్మ‌గ్ల‌ర్ కేరెక్ట‌ర్స్ కి, గ‌ద్ద‌ర్ లాంటి  ప్ర‌జా వాగ్గేయ‌కారుడు, విప్ల‌వ‌కారుడి పేరిట ఇవ్వ‌డ‌మేంటి? ఇక్క‌డ‌స‌బ్జెక్ట్ గ‌ద్ద‌ర్ కీ ఆ పాత్ర‌కీ  ఉన్న పోలిక కాదు. అంత‌టి క‌ష్ట‌త‌ర‌మైన పాత్ర‌ను ఒక న‌టుడిగా అత‌డెలా చేశాడు? అన్న‌దే కీల‌కం. దీంతో ఈ దృష్టికోణంలో మ‌నం అలా చూడాల్సి ఉంటుంద‌ని చెప్పాలి

ముఖ్యమంత్రి రేవంత్ కు కోపమొచ్చింది.. ఎందుకో తెలుసా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజుల ఢిల్లీ పర్యటన తర్వాత, ఆయనలో మార్పు వచ్చిందా?  గతానికి భిన్నంగా.. ముఖ్యంగా అధికారుల విషయంలో కొంత కఠినంగా, ఖచ్చితంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చారా?  అధికారులపై, కల్లెక్టర్లపై కోపంగా ఉన్నారా?  అలాగే.. మంత్రులకు మంరిత దగ్గరయ్యే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారా? అంటే ఇటు అధికార వర్గాల నుంచి, అటు రాజకీయ వర్గాల నుంచి కూడా ఔననే సమాధానమే వస్తోంది.  ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి.. మంగళవారం(మే28)  జిల్లా కల్లెక్టర్లతో  వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు. అఫ్కోర్స్  రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలతో పాటుగా.. ఇంచార్జి మంత్రుల జిల్లా పర్యటనలు, జూన్ 3వ తీదీ నుంచి 20వ వరకు జరగనున్న భూభారతి రెవెన్యూ సదస్సులు, ధాన్యం సేకరణ, తదితర అంశాలపై చర్చించేందుకే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఉండవచ్చును. అయితే.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన చేసిన వ్యాఖ్యలు  కొంత భిన్నంగా ఉన్నాయని అంటున్నారు. ఈసందర్భంగా జిల్లా కల్లెక్టర్లు కార్యాలయాలకు పరిమితం అయితే కుదరదని ముఖ్యమంత్రి కరాఖండిగా  చెప్పారు. మంత్రులు జిల్లా కల్లెక్టర్లు క్షేత్ర  స్థాయిలో పర్యటించి, ధాన్యం సేకరణ, భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, ఖరీఫ్ సీజన్  వ్యసాయ కర్యకాలపాల అమలు తీరును స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.  జిల్లాల ఇంచార్జి మంత్రులు మే 29, 30 తేదీల్లో జిల్లాలో పర్యటించి ధాన్యం సేకరణ, భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు,ఖ రీఫ్ సీజన్ వ్యవసాయ కర్యకాలపాల అమలు తీరును సమీక్షించి..  నివేదికను జూన్ 1 వ తేదీ, సాయంత్రం 4 గంటల లోపు  సీఎంవోకు అందచేయాలని ఆదేశించారు.   అంతే అయితే, అదో రకం కానీ..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతటితో ఆగలేదు. జిల్లా కల్లెక్టర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. ముఖ్యంగా కల్లెక్టర్లు  క్షేత్ర స్థాయి  పర్యటనలు చేసి తీరాలని లేదంటే, ప్రత్యామ్నాయం చూసుకోవలసి వస్తుందని గట్టిగా హెచ్చరించారు. అంతే కాదు.. ఇక పై ప్రమోషన్లు, పోస్టింగులకు  క్షేత్ర స్థాయి పని తీరు ప్రధాన కొలమానంగా ఉంటుందని స్పష్టం చేశారు.   అంతే కాదు.. జిల్లా కల్లెక్టర్లు ఎవరికైనా క్షేత్ర స్థాయి పర్యటనలకు ఏ కారణంగా అయినా.. ఎలాంటి ఇబ్బంది,అభ్యంతరం ఉన్నా,  వారి స్థానంలో ప్రత్యామ్నాయం చూసుకుంటామని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.  మాట వినక పోతే సహించేది లేదని కూడా ముఖ్యమంత్రి హెచ్చరించారు. అలాగే..  ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీడియా, సోషల్ మీడియా చేస్తున్నతప్పుడు ప్రచారం విషయంలో కల్లెక్టర్లు మౌనంగా ఉండడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసిన  ముఖ్యమంత్రి,  కల్లెక్టర్లు వాస్తవాలను చెప్పకపోవడం వలన తప్పుడు ప్రచారాన్ని  ప్రజలు నిజమని నమ్మే పరిస్థితి వస్తోందని అన్నారు. అధికారులు, ప్రజలకు సరైన సమాచారం ఇవ్వడంలో క్రియాశీలంగా ఉండాలని, వాస్తవ సమాచారం ఇచ్చిన తర్వాత కూడా తప్పుడు ప్రచారం కొనసాగితే.. అందుకు బాధ్యులైన వారిపై పోలీసు కేసులు పెట్టాలని మఖ్యమంత్రి   ఆదేశించారు.  ప్రభుత్వం చేసిన మంచిని చెప్పుకోక పోవడం వలన, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని, జిల్లా కల్లెక్టర్లు క్షేత్ర స్థాయి పర్యటనల వలన వాస్తవ విషయాలు బయటకు వస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మొత్తం మీద ముఖ్యమంత్రి, కల్లెక్టర్లు సహా అధికారుల పనితీరు పట్ల సంతృప్తిగా లేరనే విషయం, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పష్టమైందని అంటున్నారు. అదలా ఉంటే ముఖ్యమంత్రి అసంతృప్తికి, ఆయన మూడు రోజులఢిల్లీ పర్యటనకు  ఏదైనా సంబంధం ఉందా..  కొన్ని పత్రికల్లో వచ్చినట్లు ప్రభుత్వ పనితీరు పట్ల పార్టీ అధిష్టానం అసంతృప్తి వ్యక్త చేసిననేపథ్యంలోనే ముఖ్యమంత్రి  అత్త మీది కోపాన్ని దుత్త మీద చూపినట్లు అన్న చందాన అధికారుల మీద చూపించారా  అనే  కొత్త చర్చ మొదలైంది. అలాగే.. ముఖ్యమంత్రి, మంత్రులకు మధ్య  సయోధ్య సరిగా లేదని వస్తున్న కధనాలకు సమాధానంగానే..  ముఖ్యమంత్రి తమ నివాసంలో విందు ఇచ్చారా ? అనే ప్రశ్న కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.  

నేను సుద్ద పూసను.. వాలంటీర్లే విలన్లు.. పోలీసుల విచారణలో సజ్జల భార్గవ్ రెడ్డి

అధికారం అండ చూసుకుని సోషల్ మీడియా వేదికగా ఇష్టారీతిగా చెలరేగిపోయిన సజ్జల భార్గవ్ రెడ్డి సన్ ఆఫ్ సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇప్పుడు పోలీసుల విచారణలో మాత్రం  . తాను సుద్దపూసననీ, తనకే పాపం తెలియదనీ చెప్పుకొచ్చారు. అసలైన విలన్స్ వేరు ఉన్నారంటూ తాను తప్పించుకోవడానికి నెపం వాలంటీర్ల మీద నెట్టేయడానికి శతధా ప్రయత్నించారు. అందితే జుట్టు.. అందకుంటే కాళ్లు అన్న సామెతలా సజ్జల భార్గవ్ రెడ్డి తీరు ఉందని పరిశీలకులు అంటున్నారు.  సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల కేసులో పిల్ల సజ్జల అదే సజ్జల భార్గవ్ రెడ్డి పీకల్లోతు కూరుకుపోయారు. ముందస్తు బెయిలు కోసం సుప్రీం కోర్టు వరకూ కూడా వెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో ఇప్పుడీ కేసు నుంచి బయటపడటానికి నెపం వాలంటీర్ల మీద నెట్టేస్తున్నారు. తాను సుద్దపూసననీ వాలంటీర్లే అసలు విలన్లను చెబుతున్నారు. మంగళగిరి పోలీసులు సజ్జల భార్గవ్ రెడ్డిని నిన్న రెండున్నర గంటల పాటు  విచారించారు.  ఆ సందర్భంగా పోలీసుల ప్రశ్నలకు సజ్జల వద్ద సమాధానమే లేకుండా పోయింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులకూ తనకూ అసలు సంబంధమేలేదనీ, అంతా వాలంటీర్లే చేశారని చెప్పారు. అయితే ఆ పోస్టులు మీ పేరు మీద ఎలా షేర్ అయ్యాయన్న పోలీసుల ప్రశ్నలకు సజ్జల వద్ద సమాధానమే లేదు.   విచారణ సందర్భంగా సజ్జలను ఆయన వైసీపీ సోషల్ మీడియా వింగ్ చీఫ్ గా ఉన్న సమయంలో ఉపయోగించిన లాప్ టాప్, మొబైల్ ఫోన్ ఇవ్వమని అడిగితే నిరాకరించారు. విచారణ సందర్భంగా సజ్జలను పోలీసులు 22 ప్రశ్నలు అడిగారు. వాటిలో వేటికీ ఆయన సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు తన పని కాదనీ, అదంతా వాలంటీర్లు చేశారనీ పదేపదే చెప్పినట్లు తెలిసింది.  మరి వాలంటీర్లను ఎందుకు నియంత్రించలేదంటే మాత్రం సరైన సమాధానం చెప్పకుండా నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది. ఉదయం పది గంటల నుంచి పన్నెండుర గంటల వరకూ దాదాపు రెండున్నర గంటల విచారణ అనంతరం సజ్జలను మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పి పంపేశారు.   విచారణ అనంతరం విచారణాధికారి అవసరమేతే మళ్లీ సజ్జలకు సమన్లు జారీ చేసి విచారణకు పిలుస్తామని పేర్కొన్నారు.  పర్వత  చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులు, పవన్ కల్యాణ్, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణలపై సజ్జల భార్గవ్ రెడ్డి, పర్వత సుధాకర్ రెడ్డిలు సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారన్న రాజేష్ బాబు అనే వ్యక్తి ఆధారాలతో సహా చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్ల తెలిపిన సీఐ ఆయనకు మరో సారి నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తామని పేర్కొన్నారు. ముందస్తు బెయిలు పిటిషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో సజ్జల భార్గవ్ రెడ్డి  విచారణకు సహకరించకుంటే  అరెస్టయ్యే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. 

మహానాడు వేదికపై మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌ అస్వస్థత

  కడప మహానాడు బహిరంగ సభా వేదికపై మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌ స్పృహ తప్పిపడిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న జలీల్ ఖాన్‌ను హుటాహుటిన ఆసుపత్రికి టీడీపీ శ్రేణులు తరలించారు.  2014 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరుఫున విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు జలీల్ ఖాన్. బీజేపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ మీద విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపొంది అధికారంలోకి వచ్చింది. దీంతో జలీల్ ఖాన్‌తో పాటుగా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు.. అప్పట్లో టీడీపీలో చేరిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి జలీల్‌ ఖాన్ స్థానంలో ఆయన కూతురు టీడీపీ తరుఫున పోటీ చేశారు. అయితే వైసీపీ తరుఫున పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్.. నాటి ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ విపక్షంలో ఉండిపోయారు జలీల్ ఖాన్. ఇక 2024 ఎన్నికల్లో జలీల్ ఖాన్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ తరుఫున టికెట్ ఆశించారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి దక్కింది. 

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ..కీలక నేత హిడ్మా అరెస్ట్

  మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత హిడ్మాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశా, కోరాపూట్ అడవుల్లో భద్రతా బలగాలు చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో హిడ్మాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిడ్మా ప్రస్తుతం మావోయిస్టు ఏరియా కమీటీ సభ్యుడిగా ఉన్నారు. అయితే.. మావోయిస్టులకు వరుసగా భారీ షాక్‌లు తగులుతున్నాయి.  ఇటీవలే ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు  అలియాస్‌ బసవరాజు మృతి చెందారు. ఆయనతో పాటు మరో 27 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన సంగతి తెలిసిందే. వారిలో నంబాల కేశవరావు ఉన్నట్లు స్వయంగా కేంద్ర హోంశాఖ అధికారికంగా ధ్రువీకరించింది. ఇది జరిగిన వారం రోజులకే కీలక నేత హిడ్మా పోలీసులకు చిక్కడం హాట్ టాపిక్‌గా మారింది. 

పాక్‌లో సన్నీయాదవ్‌ బైక్ రైడ్.. రంగంలోకి ఎన్‌ఐఏ

  యూట్యూబర్ భయ్యా సన్నీయాదవ్‌ను చెన్నై ఎయిర్పోర్టులో ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సన్నీ యాదవ్ ఇటీవలే పాకిస్తాన్‌‌‌‌లో బైక్ రైడ్ చేశారు. పాక్ టూర్ వీడియోలను సోషల్ మీడియాలో అప్‌‌‌లోడ్ చేశాడు. అయితే, ఓ నెటిజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన చెన్నై పోలీసులు, ఎన్‌ఐఏ అధికారులు టూర్ ముగించుకుని స్వదేశానికి వచ్చిన భయ్యా సన్నీ యాదవ్‌ను ఇవాళ చెన్నై ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఐఏ అధికారుల సమాచారంతో తెలంగాణ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సన్నీ స్వగ్రామైన సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి వెళ్లి ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యులను సైతం విచారించినట్టు సమాచారం. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే ఇవాళ ఎన్ఐఏ అధికారులు సన్నీ యాదవ్‌ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.  మరోవైపు భయ్యా సన్నీయాదవ్ రెండు నెలలు పాకిస్థాన్‌లో ఏం చేశాడు? అక్కడ ఆయనకు షల్టర్ ఇచ్చింది ఎవరు? పాకిస్థాన్‌లో ఎవరెవరిని కలిశాడు? అసలు అన్ని రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఆపరేషన్ సిందూర్ జరుతుగుతున్న సమయంలోనే అక్కడి వీడియోలను ఎందుకు అప్ లోడ్ చేశాడు? అనే విషయాలపై ఎన్ఐఏ దర్యాప్తు చేసున్నాట్లు తెలుస్తోంది. దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టమైన సమాచారం లేనప్పటికీ పాకిస్థాన్‌లో రెండు నెలల దిన చర్యపై కూపీలాగుతున్నట్లు పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. పాక్ పర్యాటనపై విమర్శలు రావడంతో  సన్నీయాదవ్ ఇటీవలనే ఓ వీడియో విడుదల చేశారు. తనపై కొంతమంది తప్పులు వీడియోలు, వార్తలు పోస్ట్ చేస్తున్నారని, ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేయవద్దని కోరారు. మీలాగే తనకు కుటుంబం ఉందని, మమ్ముల్ని బాధపెట్టేవారిపై తాను లీగల్‌గా యాక్షన్ తీసుకుంటానని ఆయన హెచ్చరించాడు