తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేసవి సెలవులే ముగియనుండటంతో తిరుమల వేంకటే శ్వరుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.  ముఖ్యంగా విద్యాసంస్థల సెలవులు ముగిసే సమయం దగ్గరపడుతుండటంతో పిల్లలతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో వారంతాం, వారం ప్రారంభం అన్న తేడా లేకుండా తిరుమల భక్త జన సంద్రంగా మారింది.  మంగళవారం (మే 27) ఉదయం శ్రీవారిని దర్శించుకునేందుకు వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లు అన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది.  టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి18 గంటలకు పైగా సమయం పడుతున్నది.  ఇక సోమవారం శ్రీవారిని మొత్తం  83,542 మంది భక్తులు దర్శించుకున్నారు. వరిలో 34,265 మంది  తలనీలాలు సమర్పించారు. భక్తుల కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం 5 కోట్ల 9లక్షల రూపాయలు వచ్చింది.  

కవిత.. వాట్ నెక్ట్స్.. సర్వత్రా అదే చర్చ!

తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు కుమార్తె కల్వకుట్ల కవిత మనసులో ఏముందో..  ఆమె భవిష్యత్ రాజకీయ వ్యూహం ఏమిటో, ఏమో కానీ, ఆమె సంధించిన లేఖ మాత్రం సొంత పార్టీలో కంటే ప్రత్యర్ధి పార్టీలలోనే ఎక్కవ కలవరాన్ని సృష్టిస్తున్నట్లు ఉందని  రాజకీయ పరిశీలకులు అంటున్నారు.   మరోవంక, కవిత నెక్స్ట్ మూవ్ ఏమిటి? ఆమె  అడుగులు  ఎటుగా పడుతున్నాయి.. అనే విషయంలో ఇటు మీడియాలో, అటు రాజకీయ పార్టీలలో విభిన్న కోణాల్లో జోరుగా  చర్చకు జరుగుతోంది. ఒకప్పుడు  వైఎస్సార్ కుమార్తె షర్మిల అన్న జగన్ రెడ్డిపై తిరుగుబాటు జెండా ఎగరేసినప్పుడు, ఆమె చుట్టూ ఎంత రాజకీయ చర్చ జరిగిందో.. ఇప్పుడు  కవిత తిరుగు బాటు (?) పై అంత కంటే ఎక్కువగానే రాజకీయ రచ్చ జరుగుతోంది. ఓ వంక షర్మిల బాటలోనే కవిత కూడా సొంత పార్టీ పెట్టి, అదే రూట్ లో కాంగ్రెస్ లో కలిపేస్తారనే  వాదన రోజు రోజుకూ బలాన్ని పుంజు కుంటోందని అంటునారు. మరో వంక కవిత అదే రూటులో వెళ్ళక పోవచ్చనే అభిప్రాయం కూడా రాజకీయ చర్చల్లో అంతే ప్రముఖంగా వినిపిస్తోంది.  అయితే.. కవిత నాయన కేసీఆర్ కు రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలు, అమెరికా నుంచి వచ్చిన వెంటనే శంషాబాద్ విమానాశ్రయంలోలో చేసిన   దయ్యాల  వ్యాఖ్యలు, దానిపై కేటీఆర్   స్పందించిన తీరు, బీఆర్ఎస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోవర్టులు ఉంటే ఉండవచ్చునని చేసిన మర్మగర్భ వ్యాఖ్యలు.. అలాంటి వారు  తమంతట తాముగానే బయట పడతారంటూ   కవిత పేరు ప్రస్తావించకుండానే ఆమె రేవంత్ రెడ్డి కోవర్ట్ కావచ్చనే విధంగా ఇచ్చిన సంకేతాలు, జరుగతున్న ఇతర పరిణామాలను గమనిస్తే.. ఆమె అడుగులు  అటుగా అంటే గాంధీ భవన్ వైపుగా పడుతున్నాయనే అనుమానాలను నిజం చేసేలా ఉన్నాయని అంటున్నారు. .  కవిత తన లేఖలో ప్రధానంగా  బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగిన తీరు తెన్నులు, మంచిచెడులు, మరీ ముఖ్యంగా కేసీఆర్ ప్రసంగంలోని పాజిటివ్, నెగటివ్  అంశాలను  ప్రస్తావించారు. అందులో ప్రత్యర్ధి రాజకీయ పార్టీలపై చేసిన వ్యాఖ్యలను గమనిస్తే, ఆమె బీజేపీ వ్యతిరేక, కాంగ్రెస్ అనుకూల ధోరణితోనే  కేసీఆర్ ప్రసంగాన్ని విశ్లేషించినట్లు ఉందని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా  కేసీఆర్ ప్రసంగంలో బీజేపీని అలా పైపైన ఒకటి రెండు పొడిపొడి మాటలతో వదిలేయడం, చిన్నిచిన్ని వాతలు మాత్రమే పెట్టి వదిలేయడం, తమ సహజ ధోరణిలో గట్టిగా  తిట్టక  పోవడం  కవితకు నచ్చలేదు. బీజేపీని కేవలం రెండు నిముషాలు మాత్రమే టార్గెట్ చేశారేంటి డాడీ  అంటూ ఆమె కేసీఆర్ కు వేసిన ప్రశ్నలో, కేసీఆర్ తన ప్రసంగంలో బీజేపీని, మోదీని బండకేసి ఉతికి ఆరేయ లేదనే బాధ వ్యక్తమైందని అంటున్నారు. అలాగే.. ఉర్దూలో ప్రసంగింక పోవడాన్ని, వక్ఫ్ బిల్లు ప్రస్తావన తేక  పోవడాన్ని కూడా కవిత తప్పు పట్టారు. అలాగే, దండకారణ్యంలో నక్సల్స్ ఏరివేత, నక్సలిజం నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న ఆపరేషన్ ని ఆపి నక్సల్స్ తో చర్చలు జరపాలని డిమాండ్ చేయడం బాగుందని, కేసీఆర్ ను కవిత మెచ్చు కున్నారు. ఇవేవీ కూడ బీజేపీకి రుచించే అంశాలు కాదు. బీజేపీతో కలిసి నడవాలని అనుకునే ఎవరూ  ఇలాంటి ఎజెండాను ముందు పెట్టరు.  అంటే..  కవిత భవిష్యత్ ఎజెండా బీజేపీ వ్యతిరేక ఎజెండాగా ఉంటుందని చెప్పకనే చెప్పినట్లు అయింది. మరో వంక ఆమె  కేసీఆర్ తన ప్రసంగంలో రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించక పోవడాన్ని మెచ్చుకున్నారు.  దీన్ని బట్టి చూస్తే, కవిత ఆలోచనలు కాంగ్రెస్ కు దగ్గరగా ఉన్నట్లు అర్థమవుతున్నదని విశ్లేషకులు అంటున్నారు.  ఈ అన్నికంటే ముఖ్యంగా కవిత తెర పైకి తెచ్చిన సామాజిక తెలంగాణ  అంశం  రాహుల గాంధీ ప్రవచించిన, రేవంత్ రెడ్డి జపిస్తున్న కుల గణనకు దగ్గరగా ఉందని అంటున్నారు.  అలాగే..  రాష్ట్రంలో కవిత కథ నడుస్తున్న సమయంలోనే, ఢిల్లీలోని ఎఐసీసీ కార్యాలయంలో రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సామాజిక న్యాయ సదస్సు నిర్వహించడం..  అందుకోసం  ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనను మూడో రోజు కొనసాగించడం.. మరో వంక కవిత అమెరికా నుంచి వచ్చి రెండు రోజులు అయినా ఇంతవరకు కేసీఆర్ ను కలవక పోవడం, ఆమెను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని వస్తున్న వార్తలు గమనిస్తే, కవిత బీఆర్ఎస్  నుంచి అనివార్యంగా బయటకు రావలసి వస్తే ... కాంగ్రెస్ దగ్గరవడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. అలాగే..  ప్రస్తుతానికి కవిత ఎవరితోనూ చేతులు కలపక పోవచ్చని, అన్ని కోణాల్లో పరిస్థితిని సమీక్షించుకున్న తర్వానే  తుది నిర్ణయం ఉటుందని అంటున్నారు.

ద్రోహుల సమాచారంతోనే నంబాల ఎన్ కౌంటర్

మావోయిస్టుల సంచలన లేఖ పాకిస్థాన్‌తో చర్చలు జరిపినప్పుడు తమతో చర్చలు జరిపితే తప్పేంటని ప్రశ్న   మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టులు తొలిసారిగా సంచలన లేఖ విడుదల చేశారు. లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారం మేరకే నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ జరిగిందని ఆ లేఖలో పేర్కొన్నారు.   6నెలలుగా మాడ్ ప్రాంతంలోనే నంబాల ఉన్నట్లు ప్రకటించారు. కేశవరావు టీమ్‌లో ఉన్న ఆరుగురు మావోయిస్టులు ఇటీవలే లొంగిపోయారని మావోయిస్టులు లేఖలో తెలిపారు.  వారు ఇచ్చిన సమాచారంతోనే ఎన్‌కౌంటర్ జరిగిందని చెప్పుకొచ్చారు. కేశవరావును సురక్షిత ప్రాంతానికి తరలిస్తామంటే ఆయన ఒప్పుకోలేదని అన్నారు. కేశవరావు కోసం 35మంది ప్రాణాలు అడ్డుపెడితే ఏడుగురం సురక్షితంగా బయటపడ్డామని తెలిపారు. 27మంది ఎన్ కౌంటర్‌లో చనిపోయారని చెప్పారు. పాకిస్థాన్‌తో చర్చలు జరిపినప్పుడు తమతో చర్చలు జరిపితే తప్పేంటని ప్రశ్నించారు. స్పెషల్ జోనల్ కమిటీ వికల్ప్ పేరుతో ఈ లేఖను మావోయిస్టులు విడుదల చేశారు. కాగా, మావోయిస్టు చీఫ్ నంబాల కేశవరావు అంత్యక్రియలు  సోమవారం(మే 26) సాయంత్రం పూర్తి అయ్యాయి. మాడ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో నంబర్ల కేశవరావు చనిపోయిన విషయం తెలిసిందే. కేశవరావు మృతదేహాన్ని అప్పగించాలంటూ బలగాలని కుటుంబ సభ్యులు కోరారు. కేశవ్‌రావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా భద్రతా బలగాలే అంత్యక్రియలు పూర్తిచేశాయి. అబూజ్‌మడ్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన నక్సలైట్లకు పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. నాలుగు రోజులుగా మృతదేహాన్ని అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేసినా ఫలితం లేకపోయింది. 

నాడు అవమానం.. నేడు సన్మానం!

ఆయన జాగీరులో అడుగు పెట్టాలంటే భయపడాలి... ఆయన అనుమతి లేనిదే చెట్టు ఆకు రాలేదు.. కోడి కూయదు అనే చెందగా మారింది గత ఐదేళ్ల కాలంలో చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసింది చట్టం.. చెప్పింది న్యాయం. ఇదే పెద్దిరెడ్డి జాగీరులో అడుగడుగునా సాగిన అరాచకాలు.  గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్టు చేశారు. ఆ అరెస్టు నేపథ్యంలో అనేక మంది ప్రత్యక్షంగా... పరోక్షంగా చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. చంద్రబాబుకు సంఘీభావంగా శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సామన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు  సైకిల్ యాత్ర చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారువా గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రామకృష్ణ, రామసూరి, ఆది నారాయణ, సుందరరావు రమేష్ సైకిల్ యాత్ర చేస్తూ పుంగనూరు నియోజకవర్గంలోకి 2023 అక్టోబర్ 22న వచ్చారు. పుంగనూరు సుగాలిమిట్ట వద్దకు చేరుకోగానే పెద్దిరెడ్డి అనుచరులు వారిపై దాష్టీకానికి పాల్పడ్డారు. సైకిల్ యాత్ర చేస్తున్న తెలుగుదేశం కార్యకర్తలు టీ తాగడానికి నిలవడంతో వారిని బూతులతో తిడుతూ టీడీపీ జెండాలను, వేసుకున్న పసుపురంగు షర్టులను తీయించారు.  తీవ్రంగా అవమానించారు. అదే పుంగనూరు నియోజకవర్గంలోని సుగలిమిట్ట వద్ద..  ఎక్కడైతే పసుపు సైనికులకు అవమానం జరిగిందో అక్కడే వారికి ఇప్పుడు సన్మానం జరిగింది.   పుంగనూరు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి సైకిల్ యాత్ర చేస్తున్న వారి సైకిళ్ల కి పాలాభిషేకం చేశారు. అవమానం ఎదుర్కొన్న ఐదుగురికీ పూలమాలలు వేసి శాలువలతో సత్కరించారు. అవమానం జరిగిన చోటే ఘనంగా సన్మానించి.. సగౌరవంగా మహానాడుకు పంపారు.  

కడప గడపలో ఎదురొడ్డిన నిలిచిన పసుపు జెండా

43 ఏళ్ళ ప్రస్థానానికి జనం అండ  సీమ దత్త పుత్రుడు గా ఎన్టీఆర్ చిరస్మరణీయుడు చంద్రబాబు నేతృత్వంలోనూ ఆయన వెంటే కడప జనం.  మరోత్సాహంతో కడపలో తెలుగుదేశం మహానాడు. కడపలో మూడు రోజుల పాటు పసుపు పండగ  సీమ నడిబొడ్డు కడప గడ్డన ఎదురొడ్డి పోరాడిన తెలుగుదేశం పార్టీకి ఆపార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి నాలుగు దశాబ్దాలకు పైగా కడప జనం అండగా నిలిచారు. జెండా ఎత్తి పోరు సాగించారు. జిల్లా రాజకీయాల్లో అప్పట్లో కాంగ్రెస్ నేత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ,ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిల ప్రాబల్యం నడుస్తూ వచ్చినా  తెలుగుదేశం పార్టీ మొక్క వోని  విశ్వాసంతో ముందుకు సాగింది. పడుతూ లేస్తూ వచ్చి హీరోలా నిలిచింది. ప్రజాబలమే   కొండంత అండగా 43 ఏళ్ల ప్రస్థానం సాగించిన తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి కడప జిల్లాలో కార్యకర్తలే పట్టు సడలకుండా  జెండా ఎగరేస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల దాకా పదిసార్లు ఎన్నికలు జరిగితే ఇందులో ఐదుసార్లు తెలుగుదేశం పార్టీ నే పైచేయి సాధించి విజయం  సాధించింది. చంద్రబాబు నాయుడు పగ్గాలు పట్టిన తరువాతా పార్టీకి కడప ఎప్పటిలాగే వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది. ప్రస్తుత ముఖ్యమంత్రి,  తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత 1999 ఎన్నికల్లో కూడా  తెలుగుదేశం జిల్లాలో హవా కొనసాగించింది. ఈ  ఎన్నికల్లో మొత్తం 11 అసెంబ్లీ స్థానాల్లో తొమ్మిది స్థానాలు గెలుచుకొని ఉమ్మడి కడపలో తన సత్తా ఏంటో చాటింది . వైయస్ రాజశేఖరరెడ్డి , వైయస్ జగన్మోహన్ రెడ్డి లు సొంత గడ్డపై ఎదురొడ్డి పోరాడుతూ పార్టీ కార్యకర్తలు, ప్రజల  గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహానాడు కడప జిల్లాలో జరగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకోవడంతో పాటు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నేతలలో ఉత్సహాన్ని నింపింది.  జీరో నుంచి హీరోగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తన పట్టు సాగిస్తూ వచ్చినా 2004 నుంచి  2019 ఎన్నికల వరకు  పార్టీ ఫలితాలు తీవ్ర అసంతృప్తికి గురిచేశాయి. 2019 ఎన్నికల్లో అటు పార్లమెంటు గాని ఇటు అసెంబ్లీలో గాని ఒక్క సీటు కూడా రాకుండా జీరో స్థాయికి ఫలితాలు పడిపోయాయి.అయినా  కార్యకర్తలు, పార్టీ  ఏ మాత్రం విశ్వాసం కోల్పోకుండా పని చేయడం జరిగింది . గత ఏడాది  జరిగిన ఎన్నికల్లో జీరో పలితాలు  నుంచి హీరోగా ఎగిరింది. ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా వీటిలో ఏడు స్థానాల్లో కూటమి జయకేతనం ఎగురవేసింది. వాటిలో   ఐ దు స్థానాలలో తెలుగుదేశం జయభేరి మోగించింది.  వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కేవలం మూడు సీట్లకే పరిమితమైంది . ఈ ఫలితాలతో జిల్లా తెలుగుదేశం పార్టీ  ప్రతిష్టాత్మక ఫలితాలను భవిష్యత్తులోనూ సాధించాలన్న పట్టుదలతో కడపలో మహానాడును  తలపెట్టి పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు వై సిపి పట్టును సడలించే  ప్రణాళిక తో మహానాడు మహానాడు జరుపుకుంటోంది. 1983 నుంచి 2024 దాకా  తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక 1983 నుంచి   2024 వరకు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలాన్ని, గెలుపు ఓటములను పరిశీలిస్తే.. ఇప్పటివరకు పదిసార్లు జరిగిన ఎన్నికల్లో ఐదు సార్లు తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. డీలిమిటేషన్ కు ముందు 11 అసెంబ్లీ స్థానాల్లో 1983లో మొత్తం  6 స్థానాలు గెలుచుకుంది. 1985లో జరిగిన ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకోగా 1989లో 2  స్థానాలకే పరిమితమైంది.  1994 లో తిరిగి పైకి లేచి 8 స్థానాలు గెలుచుకుంది. 1999లో తొమ్మిది స్థానాలు  సొంతం చేసుకుంది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగించడంతో టిడిపి కేవలం రెండు స్థానాలకే  పరిమితమైంది. అప్పటినుంచి తెలుగుదేశం పార్టీకి  కోలుకోలేని దెబ్బ తగులుతూ వచ్చింది .2009 ఎన్నికల్లో ఒక్క స్థానానికే పరిమితం అయింది .డీ లిమిటేషన జరిగి 10 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైన ఉమ్మడి జిల్లాలో 2014 లో కూడా ఒక్క అసెంబ్లీ స్థానానికే  పరిమితం కాగా 2019లో ఒక్క అసెంబ్లీ స్థానం కానీ ,ఒక్క పార్లమెంటు స్థానం గాని గెలుచుకొని దుస్థితిలోకి పార్టీ వెళ్లిపోయింది. ఆ తర్వాత జిల్లాలో పార్టీ కోలుకోవడం  కష్టమే అనుకుంటూ వచ్చినా టిడిపి మాత్రం జగన్ సొంత జిల్లాలోనే  వైసీపీకి  గట్టి  దెబ్బ కొట్టి కూటమితో కలిసి  ఎన్నికల్లో దిగి పార్టీ పరంగా ఐదు కూటమి పరంగా ఏడు స్థానాలు సాధించింది .దీంతో పులివెందులలో జగన్మోహన్ రెడ్డి ,బద్వేలు, రాజంపేటలో మాత్రమే వైసిపి అభ్యర్థులు గెలిచారు .ఈ ఫలితాలతో ఉత్సాహంలో ఉన్న టీడీపీ శ్రేణులలో జోష్ ను మరింత పెంచేందుకు   మహానాడుకు కడప వేదికైంది. కంచు కోటలా ఆ రెండు స్థానాలూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు కంచు కోటల్లా  మారాయి 1983 నుంచి 1999 దాకా జమ్మలమడుగు, రైల్వే కోడూరు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి వరుస విజయాలను సాధించిపెట్టాయి. అయితే 2004, 2009, 2014 ఎన్నికలలో ఈ నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. అయితే 2024 ఎన్నికలలో మళ్లీ ఇక్కడ జెండా ఎగురేసింది.  కాకపోతే తెలుగుదేశం కంచు కోటలైన జమ్మలమడుగు లో బిజెపి , రైల్వే కోడూరులో జనసేన గెలవడం జరిగింది.  సీమ దత్త పుత్రుడు గా ఎన్టీఆర్  సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు రాయలసీమ దత్తపుత్రుడుగా పేరుగాంచారు . ఆయనకు  రాయలసీమ ప్రజలు నీరాజనాలు పట్టారు.  ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కడపలో చారిత్రాత్మకమైన అభివృద్ధి జరిగింది. ముద్దనూరు దగ్గర రాయలసీమ ధర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించారు. నందలూరు దగ్గర  వందలాది మందికి ఉపాధి కల్పించే ఆల్విన్ ఫ్యాక్టరీని ఆయన హయాంలోనే నిర్మించారు. ఇవే కాదు తెలుగు గంగ ప్రాజెక్టుకు  అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ తో కలిసి శంకుస్థాపన చేశారు. వీటితో పాటు గాలేరు -నగరికి రూపకల్పన చేసి ప్రకటించారు. ఇలా రాయలసీమకు చారిత్రాత్మకమైన సీమ కడగండ్లు తీర్చే అభివృద్ధి పనులు ఎన్నో చేశారు. అంతేకాదు రాయల సీమలోని  అనంతరం జిల్లా హిందూపురం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి గా ప్రాతినిధ్యం వహించారు. ఒంటిమిట్టకు వెలుగు తెచ్చిన  చంద్రబాబు  జిల్లాలో చారిత్రక పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టకు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో   విలువ తీసుకొచ్చారు. రాష్ట్రం విడిపోయాక రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరిగే శ్రీరామనవమి ఉత్సవాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒంటిమిట్టలో జరిపే లాగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించేవారు. రాష్ట్రం విడిపోయాక ఒంటిమిట్ట కు ఆ భాగ్యం దక్కింది. ప్రాజెక్టుల పరంగా చూస్తే గాలేరు-నగరి  మొదటి దిశలో మిగిలి ఉన్న పనులను 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు దాదాపు పూర్తి చేశారు.  ముస్లిం మైనార్టీల కోసం కడప సమీపంలో హజ్ హౌస్ ను నిర్మించారు. కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసినప్పటికీ ఆ తర్వాత 2019లో ఎన్నికల్లో ఓటమి  పాలు కావడంతో ఆ ఉక్కు పరిశ్రమ నిర్మాణం కొనసాగ లేకపోయింది .ఇలా తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రులుగా ఉన్న  ఎన్టీ రామారావు ,చంద్రబాబు నాయుడు కడప జిల్లాకు రాయలసీమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.

ఏపీ పూర్తి స్థాయి డీజీపీగా హరీశ్‌కుమార్ గుప్తా నియమకం

  ప్రస్తుత ఇన్‌చార్జి డీజీపీగా కొన‌సాగుతున్న హరీశ్‌కుమార్ గుప్తాను పూర్తిస్థాయిలో ఏపీ పోలీస్ బాస్‌గా నియమిస్తూ కూటమి సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. నేటీ నుంచి రెండేళ్ల పాటు ఆయన డీజీపీగా కొనసాగనున్నారు. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో హరీశ్‌కుమార్ గుప్తాను ప్ర‌భుత్వం ఇన్‌చార్జి డీజీపీగా నియ‌మించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ప‌నితీరు సంతృప్తిక‌రంగా ఉండ‌డంతో ఆయ‌న‌నే పూర్తిస్థాయి డీజీపీగా నియ‌మించాల‌ని ప్ర‌భుత్వం  నిర్ణ‌యించింది.  రిటైర్‌మెంట్ వ‌య‌సుతో సంబంధం లేకుండా రెండేళ్లపాటు హరీశ్‌కుమార్ గుప్తా ఈ ప‌ద‌విలో కొన‌సాగుతారు.  నూతన పూర్తి స్థాయి డీజీపీగా ఎంపికైన ఆయన 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. జమ్మూకశ్మీరుకు చెందిన ఆయన.. న్యాయ శాస్త్రంలో పట్టా పొందారు. 1993 డిసెంబరులో ఖమ్మం ఏఎస్పీగా తొలుత విధుల్లో చేరారు. తర్వాత మెదక్‌, పెద్దపల్లి ఏఎస్పీగా పనిచేశారు. కరీంనగర్‌, నల్లగొండ జిల్లాల అదపు ఎస్పీగా.. అనంతరం కృష్ణా, నల్లగొండ జిల్లాల ఎస్పీగా విధులు నిర్వహించారు. సమర్థ అధికారిగా పేరుతెచ్చుకున్న ఆయన.. గుంటూరు రేంజ్‌ ఐజీ, శాంతిభద్రతల ఐజీగానూ పనిచేశారు.  

కేటీఆర్‌‌కు బిగ్ షాక్..మరోసారి ఏసీబీ నోటీసులు

  ఫార్ములా-ఈ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈనెల 28న హాజరుకావాలంటూ తనకు ఏసీబీ  నోటీసులు ఇచ్చిందని కేటీఆర్ ఎక్స్ వేదికగా తెలిపారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం తాను యూకే, యూఎస్ వెళ్తున్నందున తిరిగి వచ్చాక విచారణకు హాజరవుతానని చెప్పినట్లు మాజీమంత్రి పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ కక్ష్య సాధింపులో భాగంగానే నోటీసులు వచ్చాయన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జిషీటులో ఆయన పేరు చేర్చి 48గంటలు గడుస్తున్నా ఒక్క బీజేపీ నేత దీనిపై మాట్లాడకపోవడం విడ్డూరమన్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో హైదరాబాద్ నగరంలో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు.  అయితే కేబినెట్, ఆర్థిక శాఖల అనుమతి లేకుండా రూ.45 కోట్లు విదేశీ సంస్థకు చెల్లించి ప్రజాధనం దుర్వినియోగం చేశారని కేటీఆర్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఆర్బీఐ రూల్స్ ఫాలో కాకుండా మౌఖిక ఆదేశాలతో నగదు బదిలీ చేసినట్లు ఆరోపించారు. రూ.10 కోట్ల కంటే ఎక్కువ చెల్లింపునకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనుమతి ఉండాలన్న రూల్ బుక్‌ను హెచ్‌ఎండీఏ ఫాలో కాలేదని.. చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. ఈ మేరకు ఈ కారు రేసులో వ్యవహారంలో అప్పటి మున్సిపల్ మంత్రి బీఎల్‌ఎన్‌పై, సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ అధికారి బీఎల్‌ఎన్ రెడ్డిపై ఏసీబీ కేసులు పెట్టింది.  

గోదావరి నదిలో 8 మంది యువకులు గల్లంతు..సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

  అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ముమ్మిడివరం మండలం కమినిలంక వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగిన ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కాకినాడ జిల్లా రామచంద్రపురం మండపేటకు చెందిన యువకులు శురుల్లంక  గ్రామంలో జరిగిన ఒక శుభకార్యానికి పలువురు యువకులు హాజరయ్యారు. వీరిలో 11 మంది సరదాగా స్నానం చేసేందుకు సమీపంలోని కమినిలంక వద్ద గోదావరి నదిలోకి దిగారు. అయితే, వారు దిగిన ప్రాంతంలో నది లోతు ఎక్కువగా ఉండటంతో అదుపుతప్పి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. వారిలో ముగ్గురు అతి కష్టం మీద సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా, మిగిలిన ఎనిమిది మంది ఆచూకీ తెలియలేదు.గల్లంతైన వారిని కాకినాడ, రామచంద్రపురం, మండపేటకు చెందిన క్రాంతి, పాల్‌, సాయి, సతీష్‌, మహేశ్‌, రాజేశ్‌, రోహిత్‌, మహేశ్‌గా గుర్తించారు. గల్లంతైన యువకుల కోసం పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. గోదావరి నదిలో యువకులు గల్లంతుపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. గల్లంతైన వారిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గాలింపు చర్యల వివరాలను చంద్రబాబుకు కలెక్టర్‌ వివరించారు. అలాగే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కూడా కోనసీమ జిల్లా కలెక్టర్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన యువకుల ఆచూకీని వీలైనంత త్వరగా కనుగొనేందుకు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గల్లంతైన యువకుల కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి ఆవేదన పలువురిని కంటతడి పెట్టించింది.   

మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. కేంద్రం అలర్ట్

  దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 1,009 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌  డైరెక్టర్ జనరల్‌ డాక్టర్‌ రాజీవ్‌ బహల్‌ కీలక సూచనలు చేశారు. కరోనా కొత్త వేరియంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మాస్కులు ధరించాలని జగ్రత్తగా ఉండాలని వారు సూచించారు. వారం వ్యవధిలో 750 మందికి కొత్తగా కరోనా సోకిందని సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  డేటాబోర్డులో వెల్లడించిన సమాచారం ప్రకారం..  ఈ ఉదయం 8గంటల వరకు రాష్ట్రాల వారీగా కొవిడ్‌ యాక్టివ్‌ కేసుల వివరాలు పరిశీలిస్తే.. కేరళలో అత్యధికంగా 430 క్రియాశీల కేసులు ఉండగా.. మహారాష్ట్ర (209), దిల్లీ (104), గుజరాత్‌ (83), తమిళనాడు (69), కర్ణాటక (47) ఏపీ 4, మధ్యప్రదేశ్‌ 2, తెలంగాణ, గోవా, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.  

మహానాడుకు వెళ్తూ కార్యకర్త కొట్టుకెళ్లి టీ తాగిన లోకేష్.. కార్యకర్త భావోద్వేగం

  చిత్తురు జిల్లా కుప్పం వచ్చి గత రెండురోజులుగా బిజీ బిజీగా ఉన్న రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టీడీపీ వీరాభిమానినని, శాంతిపురంలో టీకొట్టు నడపుతూ జీవనం సాగిస్తున్నాటీడీపీ వీరాభిమాని చెంగాచారికి కలిశారు. కుప్పం నుంచి కడప మహానాడుకు బయలుదేరిన యువనేత లోకేష్ సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా టీకొట్టు వద్దకు వెళ్లాడు. అన్నా... చాలా దూరం వెళ్లాలి... టీ ఇస్తావా అని అడిగాడు లోకేష్. చెంగాచారికి కొద్దిసేపు నోటమాట రాలేదు. తమ అభిమాననేత నేరుగా తమ కొట్టుకురావడంతో సంభ్రమాశ్చార్యానికి లోనయ్యాడు. యువనేత లోకేష్ కు టీ గ్లాసు అందించాడు.  వ్యాపారం ఎలా ఉందని అడగ్గా చెంగాచారి స్పందిస్తూ... సర్... నేను 1994 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటున్నా. చంద్రబాబు గారంటే అభిమానం. నేను టిడిపికి చెందిన వాడినన్న కోపంతో గత అయిదేళ్లుగా నా టీ అంగడిని మూయించేశారు. గత ఏడాది జూన్ 12న చంద్రబాబు గారు సిఎంగా ప్రమాణ స్వీకారం చేశాక 17వతేదీ మళ్లీ టీకొట్టు ప్రారంభించా. నాకు ఇద్దరు ఆడబిడ్డలు, ఒకబిడ్డకు పెళ్లయింది... మరో కూతురికి పెళ్లి చేయాలి. మీరు మా అంగడికి రావడం నమ్మలేక పోతున్నా చిన్నయ్యా అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. చెంగాచారి భుజం తట్టిన యువనేత లోకేష్... ఇప్పుడు నువ్వు ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. నీ వెంట నేనున్నా... ఏ అవసరమొచ్చినా నాకు ఫోన్ చెయ్యి అని చెప్పి ముందుకు సాగారు. కార్యకర్తకు యువనేత లోకేష్ ఎంతటి ప్రాధాన్యత నిస్తారనడానికి ఇదొక మచ్చుతునక.  

వైసీపీ ప్రభుత్వంలో సాయం అడగడానికి భయపడాల్సి వచ్చేది : దిల్ రాజు

  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంతో సపోర్ట్ చేశారని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో సాయం అడగడానికి భయపడాల్సి వచ్చేదని ఆయన అన్నారు. పవన్ వచ్చిన తర్వాత నిర్మాతలు ఏపీకి పక్కింటి వెళ్లొచ్చినట్లు వెళ్లొస్తున్నారని ఆయన తెలిపారు. ఓ అప్లికేషన్ లేదా ఫోన్‌లో మాట్లాడితే సినిమా టికెట్ల ధరలు పెరిగిపోతున్నాయన్నారు. టాలీవుడ్‌లో కొందరు ఎంతకు దిగజారిపోతున్నారో వారు చేస్తున్న పనులు చూస్తుంటే తెలుస్తుందని ఆయన అన్నారు.ఇటీవల థియేటర్ల విషయంలో నెలకొన్న కాంట్రావర్సీపై ఆయన స్పందించారు.  తెలంగాణలో 370 థియేటర్లు ఉంటే.. వాటిలో 30 థియేటర్లు తనవేనన్నారు. పవన్ కళ్యాణ్ మా పెద్దన్న ఆయన తిడితే మేము పడతామని దిల్‌రాజు అన్నారు. పవర్ స్టార్ సినిమాను ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు. మీడియా వల్ల జరిగిన మిస్ కమ్యూనికేషన్ కారణంగానే పవన్ కల్యాణ్ హార్ట్ అయ్యాడని ఆయన పేర్కొన్నారు. తాను హాలిడేకు వెళ్లి వచ్చేసరికి మే18న ఎగ్జిబిటర్లు మీటింగ్ పెట్టుకున్నారని, చివరి పావుగంట మాత్రమే మీటింగ్ కు వెళ్లానని చెప్పారు. వారు అక్కడ సినిమాలపై పర్సంటేజిలపై తమకున్న డిమాండ్లను చెప్పారని, వారి సమస్యల్ని పరిష్కరించేందుకే తాము ప్రయత్నిస్తున్నామన్నారు. ఇంతలోనే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్  అనే వార్తలొచ్చాయని అసహనం వ్యక్తం చేశారు.  డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో పూర్తిస్థాయి సమావేశం జరగకుండానే ఇలాంటి న్యూస్ ను వ్యాప్తి చేయడంపై ఆవేదన చెందారు. ఇదే అంశంలో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేశ్  తనతో మాట్లాడారని, థియేటర్లు మూసివేయరని ఆయనకు అప్పుడే చెప్పానని వెల్లడించారు. ఇటీవల సినీ పరిశ్రమకు సంబంధించిన జాయింట్ మీటింగ్ లోనే థియేటర్ల అంశంపై స్పష్టత వచ్చిందని, ఈలోపే కొందరు ప్రభుత్వాలకు తప్పుడు సమాచారం అందించడం వల్ల ఇది వివాదం రూపుదాల్చిందని దిల్ రాజు పేర్కొన్నారు. మే 30న భైరవం, జూన్ 5న కమల్ హాసన్ సినిమా, జూన్ 12 పవన్ కల్యాణ్   సినిమా, జూన్ 20 కుబేర సినిమాలు ఉన్నాయి... జులై, ఆగస్టులో కూడా కొత్త చిత్రాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా థియేటర్లు మూసివేసుకుంటారా? అని ప్రశ్నించారు. అలా చేస్తే ఎగ్జిబిటర్లకే కదా నష్టం అని అన్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..ఎల్లో అలెర్ట్‌ జారీ

  తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం, అల్లూరి జిల్లాల్లో  తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, కృష్ణానగర్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో వాన కురుస్తోంది. తెలంగాణలో ఈ నెల 29 వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని.. నైరుతి విస్తరణకు పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయని తెలిపింది. మంగళవారం పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపింది.  నైరుతి రుతుపవనాల కారణంగా రాయలసీమలో  భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొన్నాది. ఈ మేరకు ఒకరోజు ముందుగానే ఇవాళ కడపలో ఓ మోస్తారుగా వర్షం కురుస్తోంది. అదేవిధంగా ఉపరితల ద్రోణి ప్రభావంతో బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చీరాల, వేటపాలెంలలో భారీ వర్షం కురిసింది. గంటకుపైగా కురిసిన వర్షానికి పట్టణంలోని రహదార్లు చిత్తడిగా మారాయి. భారీ శబ్దాలతో ఉరుములు, మెరుపులతో వాన పడుతుండటంతో ప్రజలు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముంబాయిలో భారీ వర్షంతో జనజీవనం  అతలాకుతలం అయింది. ఆత్రే చౌక్ మెట్రో స్టేషన్‌లోకి భారీగా వర్షపు నీరు చేరింది. స్టేషన్ మెట్లపై నుంచి నీరు జలపాతంలా ఉధృతంగా కిందికి ప్రవహిస్తున్న దృశ్యాలు అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నాయి. దీంతో స్టేషన్ ప్రాంగణం మొత్తం నీటితో నిండిపోయి చెరువును తలపించింది. 

వంశీ పిటిషన్ ను తోసిపుచ్చిన నూజివీడు కోర్టు.. మళ్లీ విజయవాడ జిల్లా జైలుకే!

గన్నవరం మాజీ  ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు వల్లభనేని వంశీకి  మరోసారి నిరాశే ఎదురైంది. నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను  నూజివీడు కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో తనపై నమోదైన అభియోగాలను రద్దు చేయాలని కోరుతూ వంశీ దాఖలు చేసుకున్న పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేసింది. వంశీ పిటిషన్ పై సోమవారం నూజివీడు కోర్టు విచారిం చింది. ఇరు పక్షాల వాదనలూ విన్న మీదట వంశీ పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు తీర్పు వెలువరించింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ప్రస్తుతం వంశీ విజయవాడ జిల్లా కోర్టులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలా ఉండగా పోలీసు కస్టడీలో ఉండగా అస్వస్థతకు గురైన వంశీని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయనకు చికిత్స అందించిన తరువాత తిరిగి విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. కాగా వంశీ ఆరోగ్య పరిస్థితిపై గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి విడుదల చేసిన బులిటిన్ మేరకు వంశీకి ఫిట్స్ ఉన్నాయి. అలాగే నిద్రలో శ్వస అగిపోవడం అనే సమస్య కూడా ఉంది. ఈ సమస్యకు చికిత్స చేయడానికి ముందు స్లీప్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆ టెస్ట్ చేయడానికి అవసరమైన పరికరాలు జీజీహచ్ లో లోకపోవడంతో  ఆ టెస్ట్ చేయించుకోవడం కోసం మరో  ఆస్పత్రికి రిఫర్ చేసినట్లు ఆ బులిటిన్ పేర్కొంది. 

తరచు ఎన్నిక‌లతో ప్రజా ధ‌నం వృధా : డిప్యూటీ సీఎం పవన్

  దేశం ప్రధాని మోదీ నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.  చెన్నైలో జరుగుతున్న వన్ నేషన్-వన్ ఎలక్షన్ సెమినార్‌లో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతు జమిలీ ఎన్నికలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన నిర్ణయం మార్చుకోవాలని సూచించారు. తరచూ ఎన్నికలతో కేంద్రంపై భారం పడుతుందని ఆయన తెలిపారు.భారత్‌కు ఉన్న సామర్ధ్యం రీత్యా ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ ఆచరణ సాధ్యమే అని తెలిపారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ దేశానికి అవసరమైన మార్పు అని చెప్పారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకుడు ప్రధాని మోదీనే అని పవన్ పేర్కొన్నారు. త్వరల్లో తమిళనాడులో ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలుపు ఖాయమని అన్నారు. అవసరం అయితే ఇక్కడ ప్రచారం చేసేందుకు తాను వస్తానని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ క్రమంలో సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని అన్నారు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ అధినేత జగన్‌పై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎంలపై వైసీపీకీ ఓ విధానం లేదని అన్నారు. 2019లో వైసీపీ గెలిచింది కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ ద్వారనే అని ఆయన తెలిపారు. పవన్‌సై తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై ప్రశంసలు కురిపించారు. పవన్ ఏపీ నుంచి ఓ శక్తిలా ఇక్కడికి వచ్చారని ఆయను సుస్వాగతం మీరు రావడం నాకే కాదు మొత్తం తమిళనాడుకే చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు.

చేసిన పాపాలకు కాకాణి శిక్ష అనుభవించాల్సిందే!

  గత వైసిపి పాలనలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కన్నూమిన్నూ  కానకుండా  వ్యవహరించి చేసిన పాపాలకు శిక్ష అనుభవించి తీరాల్సిందేనని మాజీ మంత్రి, సర్వేపల్ల ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కాకాణి అరెస్టు తరువాత సోమవారం (మే 26) సోమిరెడ్డి పొదలకూరులో మీడియాతో మాట్లాడారు. అధికారం అండ చూసుకుని సోమిరెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరించారని సోమిరెడ్డి విమర్శించారు.   వైసిపి పాలనలో తప్పుడు కేసులు పెట్టి టిడిపి నాయకులు, కార్యకర్తలను జైలు పాలు చేశారనీ, ఆయనకు వ్యతిరేకంగా వార్తలు రాసిన జర్నలిస్టులు కూడా జైలుకు పంపిన దుర్మార్గుడని అన్నారు.  కాకాణి వేధింపులకు  తాళలేక పొలాలు బీళ్లు  పెట్టుకుని ఊర్లు వదిలి భార్యాబిడ్డలకు దూరంగా  కాలం గడిపిన వారున్నారని చెప్పారు. అధికారం అండతో, అహంభావంతో తప్పుడు పనులు చేసిన కాకాణి ఇప్పుడు ఆ పాపాలకు, తప్పులకు శిక్ష అనుభవించాల్సిన సమయం వచ్చిందని సోమిరెడ్డి చంద్రశేఖరరెడ్డి అన్నారు. 

మాజీ మంత్రి కాకాణికి 14 రోజుల రిమాండ్

వైసీపీ సీనియర్ నాయ‌కుడు, మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డికి నెల్లూరు జల్లా వెంకటగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో కాకాణిని నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు. అక్రమమైనింగ్ సహా పలు కేసులను ఎదుర్కొంటున్న కాకాణి గోవర్ధన్ నెడ్డిని  బెంగళూరు సమీపంలో అరెస్టు చేసినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. వాస్తవానికి ఆదివారం ఆయన ను కేరళలో అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆయనను బెంగళూరులో అదుపులోనికి తీసుకుని నెల్లూరుకు తరలించినట్లు పోలీసులు ధృవీకరించారు.  ఆదివారం (మే 25)న కాకాణిని బెంగళూరు వద్ద అరెస్టు చేసిన పోలీసులు ఆయనను సోమవారం (మే26) ఉదయం నెల్లూరుకు తీసుకువచ్చి ఇక్కడి పోలీసు శిక్షణ కేంద్రంలో ఉంచారు. అనంతరం భారీ బందోబస్తు నడుమ వెంకటగిరి కోర్టులో హాజరు పరిచారు.   అనంతరం కోర్టు కాకాణికి 14 రోజుల రిమాండ్ విధించింది.  అక్రమ మైనింగ్, పేలుడు పదార్థాల అక్రమ వినియోగం,  కోట్లాది రూపాయల విలువైన ఖనిజాల అక్రమ రవాణా, ఎస్సీఎస్టీ అట్రాసిటీ సహా కాకాణిపై పలు కేసులు ఉన్న సంగతి విదితమే. 

వైఎస్ఆర్ జిల్లా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ

  వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై వైఎస్సార్ కడప జిల్లాగా  మారుస్తున్నట్లు జీవోలో పేర్కొంది.  జిల్లా పేరు మార్పుపై గతంలో ప్రాథమిక నోటీఫికేషన్ జారీ చేయగా, ప్రజలు నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో కూటమి సర్కారు తుది నోటీఫికేషన్ విడుదల చేసింది. గతేడాది అక్టోబర్‌లోనే వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పుపై ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. కడప ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ జిల్లా పేరును మార్చాలంటూ సత్యకుమార్ యాదవ్ సుదీర్ఘ లేఖ రాశారు.  కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన దేవుని కడప ఆలయంలో శ్రీవారు శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామిగా కొలువై ఉన్నారన్న సత్యకుమార్.. దేవుని కడప ఆలయ విశిష్టతను లేఖలో ప్రస్తావించారు.. ఇంతటి చారిత్రక నేపథ్యం ఉన్న కడప పేరును వైసీపీ అవగాహన రాహిత్యంతో వైఎస్ఆర్ జిల్లాగా మార్చిందన్న సత్యకుమార్ పేర్కొన్నారు. ఇక కడప జిల్లా అభివృద్ధి కోసం వైఎస్ఆర్ ఎంతో కృషిచేశారనీ. కడప జిల్లా చారిత్రక నేపథ్యాన్ని. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధిని పరిగణిస్తూ.. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా పేరు మార్పునకు నిర్ణయం తీసుకుంది.  

సిరిసిల్ల కేటీఆర్ క్యాంప్ కార్యాలయం వద్ద హైటెన్షన్

  సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫోటో ఉండాలని కాంగ్రెస్ నేతలు పట్టుబట్టారు. ఆఫీసులో ముఖ్యమంత్రి ఫొటో పెట్టేందుకు కాంగ్రెస్‌ నేతలు యత్నించారు. ప్రొటోకాల్‌ పాటించాలని డిమాండ్‌‌ చేశారు. వారిని బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో హైటెన్షన్ నెలకొంది. దీంతో ఇరుపార్టీల నేతల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. సీఎం ఫోటో పెట్టేందుకు కాంగ్రెస్ నేతల ప్రయత్నంచటంతో సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో కింద పడి పగిలిపోవడంతో కాంగ్రెస్‌ నాయకులు కోపోద్రిక్తులయ్యారు. పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు ఇక ఈ పోలీసుల లాఠీ ఛార్జిలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి సహా పలువురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసుల వైఖరిపై బీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇరువర్గాల తోపులాటతో సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ వేలికి గాయమైంది.   

కాకా మూడో తరం వారసుడి కాంట్రవర్సీలు!

గడ్డం వంశీకృష్ణ ఎంపీ ఆఫ్ పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్. 35 ఏళ్ల చిన్న వయసులోనే ఎంపీగా గెలిచిన ఆయన కాకా వెంకటస్వామి కుటుంబం నుంచి పెద్దపల్లి సీటుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న మూడో తరం వ్యక్తి.  అదే పార్లమెంట్  నియోజకవర్గ పరిధిలో వంశీ తండ్రి వివేక్,  పెదనాన్న వినోద్ కూడా ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాకా  మనవడిగా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వంశీ తనదైన వర్కింగ్ స్టైల్‌తో ప్రస్తుతం సొంత పార్టీలోనే హాట్ టాపిక్‌గా మారారు. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఆయనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదన్నది ఆయన అనుచరులు కొంత కాలంగా ప్రచారం చేస్తున్నారు. అటు పార్టీ కార్యక్రమాల్లో,  ఇటు ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఎంపీకి ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం అందడం లేదంట. ఐడెంటిటీ సమస్య కావడంతో ఆగ్రహంతో ఉన్నారట గడ్డం వంశీకృష్ణ. ఆ నేపథ్యంలోనే గతంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన సీఎం సభలో ప్రోటోకాల్  అంశాన్ని ప్రస్తావించారు. సగానికిపైగా క్యాబినేట్ మంత్రులు,  సీఎం ఉన్న వేదికపైనే వంశీ అసంతృప్తి వెళ్లగక్కినా పరిస్థితిలో  మాత్రం ఇసుమంతైనా మార్పు లేదట. దీంతో అధికారులను ప్రశ్నించడం స్టార్ట్ చేసారట ఆయన. అయినా ఫలితం లేకపోవడంతో రూట్ మార్చారంటున్నారు. గత కొంతకాలంగా తన  నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్‌లలో సొంత టీం  ఫాం చేసుకునే పనిలో పడ్డారంట.  గతంలో వంశీ తండ్రి వివేక్ ఎంపీగా ఉన్నప్పుడు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిచయాలను వాడుకుంటూ.. వారితో పాటు ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్‌లకు పడని వారిని చేరదీసి వారికి అన్ని రకాల సహకారాలు అందిస్తున్నారంట. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని కొందరు ఎమ్మెల్యేలు వంశీపై ఆగ్రహంతో కనిపిస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో తమకు తెలియకుండా కార్యక్రమాలు చేయడం ఏంటని రగిలిపోతున్నారు.   అందుకే తమ పరిధిలో జరిగే అధికార, అనధికార,  పార్టీ కార్యక్రమాలకు పిలిచామా లేదా అన్నట్టు మొక్కుబడిగా ఆహ్వానిస్తున్నారంట. దీంతో ఎమ్మెల్యేలకు ఎంపీకి మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయిందట. అటు పారిశ్రామికంగా కీలకంగా ఉండే రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌తో,  ఇటు ధర్మపురిలో ప్రభుత్వ విప్‌ అడ్లూరి  లక్ష్మణ్ తో, పెద్దపల్లిలో విజయరమణారావుతో వంశీకృష్ణకు గడ్డం  పొసగడం లేదట.  కేవలం వీరితో ఆగితే సరిపోయేది...  అందరినీ సమన్వయం చేసుకునే మంథని ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబుతోనూ లేటెస్ట్‌గా గిచ్చి కయ్యం పెట్టుకునే ప్రయత్నాల్లో పడ్డారంట. మంథనిలో పరిణామాలను సీఎం దృష్టికి తీసుకు వెళ్తానని గడ్డం వంశీ ప్రకటించడం కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలం రేపుతోంది.  మొదటి నుంచీ శ్రీధర్ బాబుతో సఖ్యతగానే ఉన్న వంశీ ఫ్యామిలీ ఆల్ ఆఫే సడన్‌గా వ్యతిరేకంగా మారిపోయిందట. వంశీ గెలుపులో మంత్రి శ్రీధర్‌బాబు కీలక పాత్ర  పోషించారనే టాక్ ఉంది.  ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మంథనిలో వంశీకి 50 వేలకు పైగా లీడ్ వచ్చింది.  వంశీ తండ్రి, పెదనాన్నల నియోజకవర్గాల్లో రెండింటిలో కలిపి వంశీకి వచ్చిన లీడ్ కంటే మంథనిలో వచ్చిన ఆధిక్యమే ఎక్కువ. మరి అలాంటి మంత్రి నియోజకవర్గంలో జోక్యం చేసుకునే ప్రయత్నం వంశీ ఎందుకు చేస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది.    సరస్వతి పుష్కరాల సందర్భంగా సీఎం పాల్గొన్న సభలో వంశీ అనుచరులు ప్లకార్డ్స్‌తో నిరసన తెలిపారు. దళిత ఎంపీ లేకుండా కార్యక్రమమా అంటూ నినాదాలు చేసారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపు చేసారు.  కట్‌ చేస్తే...  సీఎం సభలో సొంత పార్టీ వారు నినాదాలు చేయడం ఏంటి? అనే అంశంపై హాట్ హాట్‌‌గా చర్చలు సాగుతున్నాయి. ఈ పార్లమెంట్ పరిధిలో సీఎం సభ అనగానే వంశీకి పూనకాలు లోడింగ్ అయినట్టు, అయితే ఆయనో, లేదంటే ఆయన అనుచరులతో నిరసనలు వ్యక్తం చేస్తారని అని జోకులేసుకుంటున్నారు బయట పార్టీల వారు.  వంశీ అనుసరిస్తున్న వ్యవహర శైలి ఇప్పుడు పొలిటికల్‌గా ఆసక్తిని రేపుతోంది. సుదీర్ఘ రాజకీయ అనుబంధం కలిగిన కుటుంబం నుంచి వచ్చారు. పైగా ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా సీఎం లాంటి వ్యక్తి పాల్గొన్న సభల్లో ఇలా వ్యవహరించడం ఏంటి? అనేది క్యాడర్‌కు అంతు చిక్కడం లేదట.  అధికార పార్టీలోనే ఉన్న వాళ్లు సీఎంను నేరుగా కలిసి పరిస్థితిని వివరించే అవకాశం ఉన్నప్పటికీ, ఇలా పబ్లిక్‌గా రచ్చ చేయడం వెనక లెక్కలేంటో ఎవరికీ అంతుపట్టడం లేదంట.  వంశీ అనుసరిస్తున్న వైఖరి వెనక కేవలం ఆవేదన, ఆవేశం మాత్రమే ఉన్నాయా?  ఇంకేమైనా అంతరార్థం ఉందా?  అనే చర్చ  ప్రస్తుతం పెద్దపల్లి కాంగ్రెస్‌లో సాగుతోందట. త్వరలో జరిగే క్యాబినెట్ విస్తరణలో గడ్డం కుటుంబానికి ఓ బెర్తు దక్కుతుందన్న భారీ ఆశలే పెట్టుకున్నారు. కానీ ఇటీవల పలువురు మంత్రులు, సీనియర్ నేతలు  వివేక్ ఫ్యామిలీ పేరు కాకుండా ప్రేమ్‌సాగర్‌రావు పేరును ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రస్తావించడంతో తండ్రీ కొడుకులు రగిలి పోతున్నారంట.  అందుకే జిల్లాలోని అన్ని నియోజవర్గాల్లో ఇలా అలజడి సృష్టించి తమ ఉనికిని చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగానే వంశీ ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని అంటున్నారు.  మరి వంశీ వైఖరిపై కాంగ్రెస్ పెద్దలు ఎలా స్పందిస్తారు? వరుసగా సీఎం పాల్గొన్న సభల్లో రచ్చ చేస్తూన్న కుర్ర ఎంపీని ఎలా దారికి తెస్తారు?  అన్ని  నియోజకవర్గాల్లో ఇలా గ్రూపులను ఎంకరేజ్‌ చేస్తున్న ఆయన తీరును ఎలా డీల్ చేస్తారో చూడాలి.