కష్టాల్లో ఎయిర్ ఇండియా.. మూకుమ్మడి రాజీనామాకు సిద్దమైన పైలెట్లు

  ఎయిరిండియా పీకల్లోతు సంక్షోభంలో మునిగింది. ఓ పక్క ఇంధన కస్టాలు వెంటాడుతుంటే మరోపక్క పైలెట్లు  సహాయ నిరాకరణ మొదలుపెట్టారు. మూకుమ్మడి రాజీనామాలకు దిగారు, మొన్నటి జట్టు సంక్షోభం మరిచిపోకముందే ఎయిరిండియా క్రైసిస్ దేశీయ విమానయాన రంగంలో సంక్షోభానికి కారణం అవుతోంది.కష్టాల్లో ఎయిరిండియా ఉంది. మూకుమ్మడి రాజీనామాకు రెడీ అయిన పైలెట్లు, ఆర్ధిక సంక్షోభంలో ఎయిరిండియా.ఎయిర్ ఇండియా భారంగా ఎగురుతోంది. ఇప్పటికే ఓ పక్క ఇంధన కష్టాలు వెంటాడుతున్నాయి. మరోపక్క పైలెట్లు మూకుమ్మడి రాజీనామాకు సిద్ధమయ్యారు.వేతనాల పెంపు ప్రమోషన్లపై ప్రభుత్వ వైఖరే ఇందుకు కారణమంటున్నారు.  ఇప్పటికే జెట్ ఎయిర్ వేస్ మూతతో కష్టాల్లో ఉన్న విమానయాన రంగానికి ఇప్పుడు ఎయిరిండియా సంక్షోభం తలనొప్పిగా మారింది .తమ డిమాండ్ల సాధన కోసం ఎయిర్ బస్ ఎ త్రీ ట్వంటీ పైలెట్లు నూట ఇరవై మంది ఇప్పటికే రాజీనామా చేశారు. అయితే పైలెట్ల మూకుమ్మడి రాజీనామా వల్ల విమాన సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగదంటోంది ప్రభుత్వం. పైలెట్లు సరిపడా ఉన్నారంటోంది. మొన్నటికి మొన్న జెట్ ఎయిర్ వేస్ మూతపడగా తాజాగా ఎయిరిండియాను నష్టాలతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది .అయితే అరవై వేల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఎయిరిండియా విక్రయాన్ని కచ్చితంగా పూర్తి చేయాలని భావిస్తోంది కేంద్రం.ఇందులో భాగంగా ఇన్వెస్టర్లకు అభ్యంతరకరంగా ఉన్న నిబంధనలను సవరించడం పై కసరత్తు చేస్తోంది. దీని ప్రకారం ఎయిర్ ఇండియా నుంచి కేంద్రం పూర్తిగా నిష్క్రమించే అవకాశముండగా దాదాపు తొంభై ఐదు శాతాన్ని విక్రయించాలని కేంద్రం భావిస్తోంది. కొనుగోలుదారులపై భారీ రుణభారం పడకుండా చూడటం ప్రైవేటీకరణ ప్రక్రియ నిబంధనల సడలింపు గట్టి చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం.  ఎయిరిండియా ప్రైవేటీకరణ తర్వాత కూడా ప్రభుత్వం ఇరవై నాలుగు శాతం వాటాలను తనదగ్గరే ఉంచుకుంటుందన్న నిబంధన కారణంగా ఇన్వెస్టర్లు ముందుకు రావడం లేదు. వాటాలు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు కంపెనీ నిర్వహణకు అవసరమైన నిధులను సమీకరించుకునేందుకు లాకిన్ వ్యవధిలేకుండా కొన్ని వాటాలను తక్షణం విక్రయించుకునే వెసులుబాటు కూడా కల్పించనుంది.అసలే నష్టాలతో కుదేలైన ఎయిరిండియాను నడిపించడానికి అవసరమైన నిధులను సమీకరించడానికి ఈ నిబంధన సమస్యగా మారుతుందని పరిశ్రమ వర్గాలు భావించాయి. ఎయిరిండియాకు రుణాలివ్వడానికి బ్యాంకులు ముందుకు రావు కాబట్టి కొత్త యజమాని తాను కోరుకున్న వాటాలను విక్రయించుకుంటే గానీ నిధులు సమకూర్చుకోవడం కుదరదు.అందుకోసం లాకింగ్ నిబంధనను పక్కన పెట్టి ఆలోచనలో ఉన్నారు. నిజానికి ఎయిరిండియాను విక్రయించేందుకు గతంలో రెండు సార్లు ప్రయత్నాలూ జరిగాయి ,రెండు వేల ఒకటిలో ఒకసారి మళ్లీ రెండు వేల పధ్ధెనిమిదిలో మరోసారి కేంద్రం ప్రయత్నించింది. కానీ ఈ రెండూ విఫలం కావడంతో ముచ్చటగా మూడో సారి ప్రయత్నిస్తూ ఆర్ధిక సంక్షోభంలో ఉన్న ఎయిరిండియాను గట్టెక్కించేందుకు కేంద్రం రెండు వేల పదహారు, పదిహెడు ఆర్థిక సంవత్సరంలో రెండు వేల నాలుగు వందల అరవై ఐదు కోట్లు, రెండు వేల పదిహెడు ,పధ్ధెనిమిదిలో పధ్ధెనిమిది  వందల కోట్లు, రెండు వేల పధ్ధెనిమిది, పంతొమ్మిదిలో మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్ల మేర నిధులు సమకూర్చింది.

కాశ్మీర్ లో మళ్ళీ నిలిచిపోయిన ఫోన్ సర్వీసులు...

  నిన్న మొన్నటి దాకా అల్లకల్లోలంగా ఉన్న కాశ్మీర్ లో ఇప్పుడు కొంత మెరకు ప్రశాంత వాతావరణం నెలకొంది అనే చెప్పుకోవాలి. కాశ్మీర్ లో మొబైళ్లు అందుబాటులోకి వచ్చిన గంటల వ్యవధి లోనే ఎస్ఎంఎస్ సర్వీసులు నిలిపివేశారు. ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నాం అంటున్నారు అధికారులు. రాజస్థాన్ ట్రక్ డ్రైవర్ ను ఉగ్రవాదుల చంపివేయడంతో సైన్యం అప్రమత్తమైంది. మరోవైపు కాశ్మీర్ లో జన జీవనం సాధారణ స్థితికి వచ్చింది. డెబ్బై రెండు రోజుల తరువాత ఫోన్ లు పని చేస్తున్నాయన్న ఆనందం కశ్మీరీలకూ కొన్ని గంటలు కూడా లేకుండా పోయింది. ఉదయం ఫోన్ ను పునరుద్ధరించిన అధికారులు సాయంత్రానికి ఎస్సెమ్మెస్ ల సర్వీసులు నిలిపేశారు. రాజస్థాన్ ట్రక్ డ్రైవర్ హత్యతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అటు సరిహద్దుల్లో కూడా సైన్యం నిఘా పెంచింది. చొరబాటుదార్ల కదలికలపై కన్నేసింది. ఆగస్టు ఐదు తర్వాత కశ్మీర్ లో ఫోన్ లు బంద్ చేసిన ప్రభుత్వం సోమవారమే పునరుద్ధరించింది. పోస్ట్ పెయిడ్ మొబైల్ ఫోన్ సర్వీసులు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే మూడు నెలలుగా బిల్లు కట్టలేదనే కారణంగా మొబైల్ ఆపరేటర్లు సర్వీసులు నిలిపేశారు. ఫోన్ లు బంద్ చేసిన కాల్స్ కి కూడా బిల్లులు రావడంతో కాశ్మీరీలు గగ్గోలు పెడుతున్నారు. అటు ప్రీపెయిడ్ మొబైల్ ఫోన్ల పై వచ్చే నెలలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇంటర్నెట్ సర్వీసులు కూడా త్వరలో అందుబాటు లోకి తెస్తామని గవర్నర్ చెబుతున్న అధికారులు మాత్రం రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు. అటు కాశ్మీర్ లో సాధారణ జన జీవనానికి ఎలాంటి ఆటంకం లేదని చెబుతున్నారు. ప్రజా రవాణా బాగానే ఉందని, వీధి వ్యాపారాలు కూడా జరుగుతున్నాయని అంటున్నారు. మళ్ళీ ఫోన్ సర్వీసులు కాశ్మీరీ ప్రజలకు ఎప్పుడు చేరువవునున్నాయో వేచి చూడాలి.

బీజేపీ మహారాష్ట్ర ఎన్నికల మ్యానిఫెస్టో పై తీవ్రంగా మండిపడుతున్న కాంగ్రస్ నేతలు...

మహారాష్ట్ర ఎన్నికల వేడి దేశాన్ని తాకింది. ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీ లు ఇస్తున్న హామీలు వివాదాస్పదంగా మారుతున్నాయి.వీర్ సావర్కర్ పేరు భారతరత్నకు సిఫారసు చేస్తామన్న బీజేపీ ప్రకటన రాజకీయంగా దుమారం రేపుతోంది. మహారాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కమలనాథులు తాము మరోసారి అధికారంలోకి వస్తే వీరసావర్కర్ కు భారత రత్న వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. దీని పై విపక్షాలు భగ్గుమన్నాయి. ఈ దేశాన్ని దేవుడే ఇక రక్షించాలంటూ కాంగ్రెస్ విరుచుకుపడింది. సావర్కర్ తరవాత గాడ్సే పేరును కూడా ప్రతిపాదిస్తారేమోనని  వామపక్షాలు మండిపడ్డాయి.  మహారాష్ట్ర లో తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తే హిందుత్వ సిద్ధాంత రూపకర్త వీర్ సావర్కర్ కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న కోసం ప్రయత్నిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఈ అంశాన్ని ప్రస్తావించింది. సావర్కర్ తో పాటు మహాత్మ పూలే సావిత్రిబాయి ఫూలే కు భారత రత్న కోసం కేంద్రానికి సిఫారసు చేస్తామని కూడా వెల్లడించింది. సావర్కర్ పేరును భారత రత్నకు ప్రతిపాదించాలనే బిజెపి ఆలోచనపై విపక్షాలు మండిపడుతున్నాయి. గాంధీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడంటూ విద్యార్థులకు ఎగ్జామ్ లో ప్రశ్నలు ఇచ్చిన దేశంలో సావర్కర్ లాంటి వారికి భారత రత్న కూడా వస్తుందంటూ కాంగ్రెస్ ఎగతాలి చేసింది. మహత్మ గాంధి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి భారత రత్న ఎలా ప్రతిపాదిస్తారని కాంగ్రెస్ ప్రశ్నించింది. మరో వైపు గాంధీ నూట యాభైవ జయంతి వేడుకలు నిర్వహిస్తూ ఆయన్ను పొట్టన పెట్టుకున్న వారిని అత్యున్నత పురస్కారాలతో గౌరవిస్తారా అంటూ ప్రశ్నించింది. వామపక్షాలు కూడా బిజెపి మ్యానిఫెస్టో హామీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వీరసావర్కర్ తరువాత గాంధీని హత్య చేసిన గాడ్సే కూడా భారత రత్న ఇస్తారేమో నని సిపిఐ విమర్శించింది. రెండుదేశాల సిద్ధాంతాన్ని బలపరిచి గాంధీ హత్యలో భాగస్వామిగా ఉన్న వ్యక్తికి భారత రత్న ఎలా ప్రతిపాదిస్తారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని ప్రశ్నించింది. మొత్తాని కి మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా బిజెపి మ్యానిఫెస్టోలో చేసిన ప్రస్తావన అగ్ని రాజేసింది.ఇక మ్యానిఫెస్టోనే ఇంత గోడవలకు తావునిస్తే ఎన్నికలు ఇంకేలా జరగబోతాయన్నది చూడాల్సి ఉంటుంది.

మేడిపండులా మారిన ఓరుగల్లు నగరం...

ఓరుగల్లు నగరాన్ని దేశానికే రోల్ మోడల్ గా చేస్తామన్న రాజకీయ నాయకుల హామీలు మాటలకే పరిమితమయ్యాయా, స్మార్ట్ సిటీ అని గొప్పలు చెప్పుకుంటున్న వరంగల్ నగర పరిస్థితి మేడిపండులా ఉందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఈ కాలనీలు చూస్తే స్మార్ట్ సిటీ ఎంత స్మార్ట్ గా ఉందో అర్ధమైపోతోంది. వరంగల్ నగరంలో ఇలాంటి కాలనీలు ఎన్నో ఉన్నాయి. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో మొత్తం నూట ఎనభై మూడు మురికివాడలు ఉన్నాయి. వీటిలో శివారు ప్రాంతాల్లో ఉన్న బస్తీల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. గుంతలమయమైన దారులు, రహదారికి రెండు వైపులా పారుతున్న మురుగు నీరు, మురికి కూపాలను తలపించే రోడ్లు, దోమలు ముసురుతూ, డంపింగ్ యార్డు లాంటి పరిసరాలు ఇది అక్కడి వారి దుస్థితి. ఆ రోడ్డు వరకు వెళ్లాల్సిన అవసరం లేదు దూరం నుంచి చూసినా చాలు వెంటనే ముక్కును మూసుకుంటాం. ఇది వరంగల్ నగరానికి ఏ మారుమూలనో ఉంటే సరే, కాని నగరం నడిబొడ్డున ఉన్న కాలనీ ఇది. ఒకటో రెండో మురికివాడలు కాదు, వరంగల్ కార్పొరేషన్ పరిధిలో నూట ఎనభై మూడు మురికివాడల్లో ఇదే పరిస్థితి. కనీసం నెలకు ఒక్కసారైనా ఫాగింగ్ చేయడం లేదు. అందుకే దోమలు మురికివాడలను ఆవాసాలుగా చేసుకొని జనాలు రోగాల బారిన పడేలా చేస్తున్నాయి. అధికారులు పొరపాటును కూడా అటు కన్నెత్తి చూడటం లేదు. వరంగల్ నగరాన్ని దేశానికే రోల్ మోడల్ గా చేరడమేమోగానీ మొదట కనీస వసతులు కల్పించాలని స్థానికులు వేడుకుంటున్నారు. మరి అధికారుల్లో ఎప్పటికి చలనం వస్తుందో చూడాలి.

నిర్మలా సీతారామన్ కు తప్పని ఇంటిపోరు!!

  కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు ఇంటిపోరు ఎదురవుతోంది. మాంద్యం వేళ పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు ఆమె భర్త పరకాల ప్రభాకర్ కు నచ్చడం లేదు. పివి, మన్మోహన్ విధానాలు పాటించాలని నేరుగానే సలహా ఇస్తున్నారు. వీరిద్దరి మద్య వాగ్వాదం ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ అవుతోంది. పివి, మన్మోహన్ విధానాలే దేశానికి శ్రీరామరక్ష అని పరకాల ప్రభాకర్ అంటున్నారు. గత ఐదేళ్ళలో ఎన్నో సంస్కరణలు తెచ్చాం అని నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం విరుగుడుకు తీసుకోవలసిన చర్యలపై పరకాల ప్రభాకర్ తన అభిప్రాయంను ఓ ప్రముఖ పత్రికా ఎడిటోరియల్ పేజీకి ఆర్టికల్ రూపంలో వెల్లడించారు. ఎ లోడ్స్టర్ టూ స్టీర్ ద ఎకానమీ పేరుతో ఓ ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కు వ్యాసాన్ని రాశారు. చాలా అంశాల్లో అందులో వ్యక్తం చేశారు. దేశం తీవ్ర ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంది, వాస్తవాలను కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని పరకాల విమర్శించారు. పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ విధానాలే బాగున్నాయి. పివి, మన్మోహన్ సింగ్ ఆర్థిక విధానాలను బీజేపీ ప్రభుత్వం అనుసరించాలని సలహా ఇచ్చారు. నెహ్రూ ఆర్థిక విధానాల్లో బీజేపీ విమర్శించడాన్ని కూడా పరకాల తప్పుబట్టారు. అధికార పార్టీ చర్య ఆర్ధిక విమర్శగా లేదని రాజకీయ దాడిగానే మిగిలిపోయిందని ఆ విషయాన్ని బిజెపి ఇంకా గుర్తించటం లేదని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఇంకా తిరస్కరణ ధోరణిలోనే వెళుతుందని ప్రభాకర్ మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం కొత్త విధానాలను రూపొందించడానికి సుముఖత చూపడం లేదని దేశంలో ఒక రంగం తర్వాత మరో రంగానికి సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. ఆర్థిక మాంద్యం వల్ల నిరుద్యోగం నలభై ఐదేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకోవడమే కాకుండా వివిధ రంగాల్లో చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని పరకాల ప్రభాకర్ కేంద్రంపై ఓ స్థాయిలో విమర్శలు గుప్పించారు. నిజానికి పరకాల ప్రభాకర్ మాత్రమే కాదు, నిన్నటికి నిన్న నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్న అభిషేక్ బెనర్జీ అప్పుడెప్పుడో ఇదే ఘనత సాధించిన అమర్త్యసేన్ రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఇలాంటి ప్రముఖులెందరో కేంద్ర ప్రభుత్వ విధానాలని విమర్శించారు. వారితో పోలిస్తే పరకాల అభిప్రాయాలకు పెద్దగా విలువ ఇవ్వాల్సిన పనిలేదు. కానీ నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ అనే హోదా ముందుకొస్తోంది, ఆ కారణంగానే హాట్ టాపిక్ అవుతోంది.

కేసీఆర్ ఫాంహౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య...

  కేసీఆర్ ఫాంహౌస్ లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఈ కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్నాడు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు అధికారుల వేధింపులే కారణమని ప్రచారం జరుగుతోంది. వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్  తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ పన్నెండవ బెటాలియన్ కి చెందిన వ్యక్తి. నల్లగొండ జిల్లా వలిగొండ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకటేశ్వరుల ఆత్మహత్యకు పై ఆధికారుల వేదింపులని ఒక రకం ప్రచారం జరుగుతుంటే కుటుంబంలో ఇబ్బందుల వల్ల అని కూడా మరో వైపు ప్రచారం జరుగుతుంది. వెంకటేశ్వర్లు గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం 11 గంటల సమయంలో ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వెంకటేశ్వర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీఎం కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో జరిగిన కానిస్టేబుల్ ఆత్మహత్య ఘటనపై  సిద్దిపేట పోలీస్ కమిషనర్  జోయల్ డేవిస్ స్పందించారు. కానిస్టేబుల్ మద్యం మత్తులోనే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. అతను గత కొంతకాలంగా విధులకు హాజరుకావడం లేదని, అతని భార్య విజ్ఞప్తి తో తిరిగి విధుల్లోకి తీసుకున్నామని చెప్పుకొచ్చారు. వ్యక్తిగత కారణాలతోనే వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నాడని కమీషనర్ వెల్లడించారు.

టీడీపీని వదలి వెల్లాలనుకునే నేతల పై ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్న అయ్యన్న........

  పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతలకు వలస నాయకులకూ మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది.కొందరు నేతలు పార్టీ వీడతారని జోరుగా ప్రచారం జరుగుతుండడంతో మాటల తూటాలు పేలుతున్నాయి.ట్విట్టర్ లో ఘాటైన విమర్శలకు దిగుతున్నారు వివరాళ్లోకి వెళ్తే ఉలుకూ లేదు పలుకూ లేదు అంటారు కదా అచ్చం అలాగే ఉంది విశాఖ తెలుగు దేశం పార్టీల పరిస్థితి టీడీపీని వీడుతున్న కొందరు నేతలను ఉద్దేశించి పార్టీ సీనియర్ నేత తీవ్ర స్థాయిలో వ్యాఖ్యా నించినా మరెవరూ స్పందించకపోవటం చర్చ నీయాంశంగా మారింది. ప్రస్తుతం విశాఖ టీడీపీలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. టిడిపి ద్వారా ఉన్నత పదవులు పొందిన కొందరు నేతలు పార్టీని వీడుతారని ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే జిల్లాలో కొందరు నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరుతుంది.దీంతో కేడర్లోను అయోమయం నెలకొంది. ఎవరు పార్టీలో ఉంటారో ఎవరు ఉండరో అనేది అర్థం గాక తెలుగు తమ్ముల్లు తలలు పట్టుకుంటున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు ఆయన వర్గీయులు పార్టీ మారడం ఖాయమని మధ్య విస్తృతంగా ప్రచారం జరిగింది. గంటా కూడా టీడీపీ కార్యక్రమాలకు అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఇతర కార్యక్రమాలకు మాత్రం రెక్కలు కట్టుకొని వాలిపోతున్నారని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుతున్నారు.మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావు మధ్య ఎలాంటి సఖ్యత ఉందనేది విశాఖ టీడీపీలో ఎవరిని అడిగినా చిటికెలో చెప్పేస్తారు. ఈనేపధ్యంలో ఏమైందో తెలియదు గానీ హఠాత్తుగా అయ్యన్న ట్విట్టర్ ద్వారా ఘాటైన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చ నీయాంశంగా మారింది. అవకాశవాదులే తరచూ పార్టీలు మారతారని అలాంటి చీడపురుగులు ద్రోహులను తరిమికొట్టినప్పుడే రాజకీయాలకు పట్టిన మురికి వదులుతుందని అయ్యన్న పాత్రుడు చాలా ఘాటైన పదజాలాన్ని ప్రయోగించారు. కష్టాల్లో ఉన్నప్పుడు తల్లి లాంటి పార్టీని వదిలిపోయి పిరికిపందలు పార్టీకి అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.తాను మరణించినా ఒకే జెండాతో పోతానని నాలుగు పార్టీల జెండాలను కప్పుకోనని అయ్యన్న పాత్రుడు ట్వీట్ చేశారు.అయితే అయ్యన్న పాత్రుడు తన ట్వీట్లో ఎవరి పేరు ప్రస్తావించకుండానే తీవ్ర విమర్శలు చేయడంతో ఆయన ప్రత్యర్థులు ఏమి మాట్లాడలేకపోతున్నారు కానీ ఎన్ని విమర్శలొస్తున్నా పార్టీ వీడతారని ప్రచారం జరుగుతున్న నేతలెవ్వరూ బహిరంగంగా తాము టీడీపీని వీడతామని గాని వీడడంలేదని గానీ గట్టిగా ఖండించక పోవడంతో తెలుగు తమ్ముళ్లు అయోమయంలో పడిపోయారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం తప్పులమీద తప్పులు చేస్తుండడం పై టిడిపి నేతలు దృష్టి పెట్టకుండా ఇలా స్వపక్షంలోనే పరస్పరం విమర్శలు చేసుకోవడం ఏమిటీ అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మొత్తం మీద విశాఖ టీడీపీలో నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతుండడం పార్టీ కేడర్ ను గందరగోళంలోకి నెట్టేస్తుంది. కొంత మంది నేతలు టీడీపీని వీడతారని పక్కా సమాచారం ఉంది కాబట్టే అయ్యన్నపాత్రుడు ఘాటైన వ్యాఖ్యలు చేశారన్న వాదన కూడా వినిపిస్తోంది.అయితే ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ ట్వీట్ చేశారనేది ఖచ్చితంగా తెలియాలంటే మాత్రం మరి కొన్ని రోజులు వేచి చూడాలి అప్పుడే కదా పార్టీల ఉండేదెవరు పార్టీలు మారేది ఎవరు అని మనకు స్పష్టమవుతోంది.    

మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రఫుల్ పటేల్ ఎదురుకున్న షాక్.......

  వాస్తవానికి దావూద్ గ్యాంగ్ బినామీ ఆస్తులు చాలా రోజుల క్రితమే బయటపడ్డాయి. కానీ డీ గ్యాంగ్ తో లింకున్న నేతల పేర్లు మాత్రం ఇప్పుడే బయటకొచ్చాయి. ప్రఫుల్ పటేల్ కు మిలీనియం డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఉంది. ప్రఫుల్ తో పాటు ఆయన భార్య వర్ష ఇందులో భాగస్వాములు, ముంబైలో విలాసవంతమైన ఏరియాలో దావూద్ కుడి భుజం ఇక్బాల్ మిర్చికి వందల కోట్ల విలువైన స్థలముంది. రెండు వేల ఏడులో మిలీనియం డెవలపర్స్ కు మిర్చి కుటుంబానికి మధ్య డీల్ కుదిరింది. ఇక్బాల్ మిర్చికి చెందిన స్థలంలో ప్రఫుల్ పటేల్ సంస్థ సీజే హౌస్ అని ఖరీదైన అపార్ట్ మెంట్ ను నిర్మించింది. అందులో రెండు ఫ్లోర్ లను ప్రతిఫలంగా ఇక్బాల్ మిర్చి కుటుంబానికి కేటాయించారు. ఈ ఒప్పందానికి సంబంధించిన డాక్యుమెంట్ లలో ప్రఫుల్ పటేల్ స్వయంగా సంతకం చేశారు. అదే పత్రాలపై ఇక్బాల్ మిర్చి భార్య హజరా కూడా సంతకాలు చేశారు. రెండు వేల ఏడు నాటి డాక్యుమెంట్ లను ఈడీ సంపాదించింది. ఈ ఆస్తులు ఎలా వచ్చాయన్న విషయం పై ఇక్బాల్ మిర్చి కుటుంబ సభ్యులను ఈడీ ఇప్పటికే ప్రశ్నించింది. వాళ్ళను ప్రశ్నించినప్పుడు ప్రఫుల్ పటేల్ పేరు బయటకు వచ్చింది. అయితే రెండు వేల ఏడు నాటి విషయాలను ఇప్పుడు ఎందుకు తెరపైకి తెచ్చారని ప్రశ్నిస్తున్నారు ప్రఫుల్ పటేల్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొద్ది రోజుల ముందు రాజకీయ లబ్ధి పొందటానికి ఈ కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. కావాలనే డాక్యుమెంట్ లను మీడియాకు ఈడీ లీక్ చేసిందని మండిపడ్డారు. ఇక్బాల్ మిర్చితో తాను ఎలాంటి ల్యాండ్ డీల్ చేయలేదంటున్నారు ప్రఫుల్ పటేల్. రెండు వేల ఏడులో ఈ డీల్ కుదిరినప్పుడు ఇక్బాల్ మిర్చి భార్య హజరా పై ఎలాంటి కేసులు లేవన్నారు. అంతా చట్టపరంగానే జరిగిందన్నారు. హజ్రా విధిగానే ఆదాయపు పన్ను చెల్లించారని కూడా తెలిపారు. తనపై కేసులో వెనుక రాజకీయ కుట్ర ఉందని అంటున్నారు ప్రఫుల్ పటేల్. కోర్టులోనే తేల్చుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ఈడీ విచారణకు ఈ నెల పధ్ధెనిమిది వ తేదీన హాజరవుతానని తెలిపారు ప్రఫుల్ పటేల్. పోలింగ్ కు కేవలం ఐదు రోజుల ముందు ఆయనకు ఈడీ పిలుపు రావడం తీవ్ర కలకలం రేపింది. ప్రఫుల్ పటేల్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు అత్యంత సన్నిహితుడు. మన్మోహన్ కేబినెట్ లో ఆయన విమానయాన శాఖ నిర్వహించారు. ఎయిర్ బస్ కుంభకోణంలో ఆయన్ను ఇప్పటికే సీబీఐ ఈడీ అధికారులు విచారించారు. తాజాగా దావూద్ గ్యాంగ్ తో బిజినెస్ డీల్స్ లో ఆయన చిక్కుకోవడం ఎన్సిపికి పెద్ద దెబ్బగా మారింది.ఇక ఈ టేన్షన్ నుంచి ప్రఫుల్ పటేల్ ఎలా బయటపడతారో వేచి చూడాలి.    

ఎవరికి ఏ స్థానాలు ఇవ్వాలో తెలియక అయోమయంలో పడ్డ గులాబీ వర్గ నేతలు....

  ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితిలో నెలకొన్న పరిస్థితి మందెక్కువయితే మజ్జిగ పల్చన అన్న సామెతను తలపిస్తోంది. వాస్తవానికి టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో దూకుడు ప్రదర్శించింది. సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. తొలుత గ్రామ, ఆ తర్వాత మండల, పట్టణ కమిటీలను ఎన్నుకొంది. ఇక మిగిలింది మున్సిపాలిటి, మున్సిపల్ కార్పొరేషన్ ల కమిటీలే అయితే మండల కమిటీల ఎన్నికలు పూర్తయి నెల గడిచినా మునిసిపల్ కమిటీలను మాత్రం ప్రకటించేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయా నియోజక వర్గాల పార్టీ ఇన్ చార్జిలు సాహసించటం లేదు. ఒక్కో పదవికి పదిమందికీ తక్కువ కాకుండా ఆశావహులు పోటీగా ఉండడం మెజారిటీ కార్యకర్తలు తమకు కీలక పదవులు కావాలని ఒత్తిడి తెస్తుండడంతో ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మెజారిటీ మున్సిపాల్టీల్లో కనీసం వార్డు కమిటీలను కూడా అధికారికంగా ప్రకటించలేదు పరిస్థితి ఏర్పడినట్లు గులాబీ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. నిజానికి టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి చాలాయేళ్ళపాటు సంస్థాగత ఎన్నికల లేవు. ఉద్యమం తొలి దశలో ఉన్నప్పుడు పార్టీ పదవులు తీసుకొనేందుకు చాలా చోట్ల కార్యకర్తలే దొరకలేదు. కాలక్రమేణ ఉద్యమం ఊపందుకోవడం టీఆర్ఎస్ బలమైన శక్తిగా ఎదగడంతో పార్టీ పదవులకు పోటీ ఏర్పడుతూ వస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పోటీ మరింత తీవ్రంగా మారింది. దీంతో మొదటి నుంచి పార్టీలో ఉన్నవారితో పాటు మధ్య మధ్యలో ఇతర పార్టీల నుంచి చేరిన వారితో కారు పార్టీలో ఓవర్ లోడ్ అయిందట దీంతో ఎవరెవరికి ఏ ఏ సమీకరణాలతో పదవులివ్వాలో తేల్చుకోలేని పరిస్థితి నెలకొందనే చర్చ టీఆర్ఎస్ లో జోరుగా సాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఖానాపూర్, మంచిర్యాల, లక్సెట్టిపేట, చెన్నూరు, బెల్లంపల్లి, మందమర్రి, క్యాతన్ పల్లి, నస్పూర్, కాగజ్ నగర్ మున్సిపాలిటీలున్నాయి. వీటిలో కొన్నింట టీఆర్ఎస్ వార్డు కమిటీలను పూర్తి చేశారు. మెజారిటీ మునిసిపాలిటీల్లో వార్డు సమన్వయ కమిటీలు, పట్టణ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశారు. ఆశావహులు అందరినీ ఆ కమిటీల్లో సభ్యులుగా చేశారు. కానీ వార్డు మున్సిపల్ అధ్యక్షులను మాత్రం అధికారికంగా ఖరారు చేయడం లేదు. పార్టీ ఎమ్మెల్యేలు ఇన్ చార్జిలను ఆశావహుల్లో ఎవరడిగినా నీకే ఇస్తామని వారు చెబుతున్నారని సమాచారం. బెల్లంపల్లి మున్సిపాలిటీ అధ్యక్ష పదవి కోసం అయిదారుగురు పోటీలో ఉన్నారు. వీళ్లంతా ఎమ్మెల్యే చిన్నయ్య వెంటపడుతున్నారు. అందరూ కావాల్సినవారే కావడంతో ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నాడట ఇతర మున్సిపాలిటీల్ లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.ఇక ఎవరెవరికి ఏ స్థానాలు ఇస్తారో వేచి చూడాలి.  

సచివాలయం దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్న రాయలసీమ న్యాయవాదులు...

  సీమ సెగ అమరావతికి తాకింది, హైకోర్టును తమ ప్రాంతంలో పెట్టాలనీ వెలగపూడి సచివాలయం దగ్గర నిరసన వ్యక్తం చేశారు లాయర్లు. ఒక వైపు సచివాలయంలో కేబినెట్ జరుగుతుంటే, మరో వైపు ఈ ఆందోళన జరగడం చర్చనీయాంశమైంది. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని రాజధానిని ఇక్కడ పెట్టారు కాబట్టి హై కోర్టు తమ ప్రాంతంలో పెట్టాలని డిమాండ్ చేశారు న్యాయవాదులు. రాయలసీమలో హై కోర్టు ఏర్పాటు చేయాలని రాయలసీమకు చెందినటువంటి న్యాయవాదులు విధులు బహిష్కరించి వారు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాయలసీమ న్యాయవాదులు మాట్లాడుతూ, అధికార వికేంద్రీకరణ ప్రకారం రాజధాని అమరావతిలో ఉంది కాబట్టి రాయలసీమకు హైకోర్టునైనా అక్కడ ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో ఏవిధంగా ఒకేచోట హైదరాబాద్ అభివృద్ది చెందిందో అక్కడ నుంచి ఒక్కసారిగా మనమంతా బయటకు రావటం జరిగిందని రాజధాని లేకుండా , హైకోర్ట్ లేకుండా ఇన్ని రోజులు బయట ఉన్నామని, ఆ పరిస్థితి మరల ఇప్పుడు రాకుండా ఉండాలంటే అన్ని చోట్ల అభివృధ్ధి చేయాలని, దానికోసం రాయలసీమకు హైకోర్ట్ ఇచ్చి అన్ని ప్రాంతాలను అభివృధ్ధి చేయాలని కోరారు. కోర్ట్ రాజధాని మధ్యలో ఉండాలనేది సర్కారు వారి దురాలోచన అని, రాజధానికి మధ్యలో హైకోర్ట్ లేకుండా దేశంలో పదకొండు రాష్ట్రాల్లో ఉన్నాయని అన్నారు. పెద్ద పెద్ద రాష్ట్రాల్లోనే రాజధాని ఒకచోట ఉంటే హైకోర్ట్ ఒకచోట ఉందని అటువంటిది అమరావతిలో రాజధాని ఉన్నప్పుడు రాయలసీమలో హైకోర్ట్ ఇవ్వటానికి ఇబ్బందేంటని ప్రశ్నించారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా హైకోర్టును గాని రాజధానిని గాని ఏదో ఒకటి మాత్రం ఏర్పాటు చేయాలి అని వెంటనే దీనిమీద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని లేక పోతే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని న్యాయవాదులు హెచ్చరిస్తున్నారు.    

కొనసాగుతున్న గోదావరిలో మునిగిపోయిన బోటును బయటకు తీసే ప్రయత్నాలు...

  తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు సమీపంలో గోదావరిలో మునిగిపోయిన బోటును బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గోదావరి వరద తగ్గటంతో ధర్మాడి సత్యం టీమ్ రంగంలోకి దిగి ఆపరేషన్ కొనసాగిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర గోదావరిలో మునిగిపోయిన బోట్ వెలికితీత పనులు మళ్లీ రెండో రోజు కొనసాగుతున్నాయి. అయితే నిన్నంతా దేవీపట్నం నుంచి కేవలం ఐరన్ రోప్ లతో పాటు తాళ్లు అన్నీ తీసుకొని అలాగే ధర్మాడి సత్యం బృందంకి సంబంధించి ఒక ఇరవై ఐదు మంది బృందం దేవీపట్నం నుంచి కచ్చులూరుకు రావడం జరిగింది. మళ్లీ పంటల మీద ఉన్న రోప్ అంతటిని కూడా గోదావరి మధ్యలోకి ఎక్కడైతే ప్రమాదం జరిగిందని చెప్తున్నారో ఆ ప్రమాద ఘటన జరిగిన స్థలం దగ్గర నుంచి రోప్ లు వేసుకొని రావటం జరుగుతుంది. గోదావరి వరద ఉధృతి తగ్గు ముఖం పట్టడంతో గోదావరి లోతు కూడా తగ్గింది. ఘటన జరిగిన సమయంలో చూసినట్లయితే రెండు వందల పదిహేను అడుగుల వరకు ఉన్న గోదావరి వరద నీటి మట్టం ఇప్పుడు సుమారు ముప్పై నుండి నలభై అడుగుల వరకు దాని నీటి మట్టం తగ్గడం జరిగింది. స్తుతం మొత్తం నూట డెబ్బై నుంచి నూట ఎనభై అడుగుల వరకూ కూడా లోతు ఉండే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. రోప్ సాయంతోటి యాంకర్ లన్నింటినీ కూడా గోదావరిలోకి దింపడం జరిగింది. గోదావరిలోకి దింపిన తర్వాత అక్కడి నుంచి ఘటన ఎక్కడ అయితే జరిగిందో దానికి పదిహేను మీటర్లకి ముందు నుంచి ఈ యాంకర్ లన్నింటినీ వేయటం జరిగింది. ప్రస్తుతం నాలుగు యాంకర్ లను ఉపయోగిస్తున్నారు, ఈ నాలుగు యాంకర్లను కూడా పై నుంచి లాక్కొని వచ్చి అక్కడ నుంచి కూడా కిందకి లాక్కురావడం జరుగుతది. ఎక్కడైతే పట్టుబడతదో ఆ పట్టుపట్టిన తరువాత అప్పుడు రోప్ సాయంతో లాగుతారు. ఇప్పటికే బోటు వెలికితీతకు నాలుగు లక్షల ముప్పై వేల రూపాయల వరకు ఖర్చు కాగా తర్వాత సుమారు ఎనిమిది లక్షల వరకు కూడా ఖర్చు కావటం జరుగుతది. అయితే ధర్మాని సత్యానికి సంబంధించిన బాలాజీ మెరైన్ సంస్థ ఇరవై రెండు లక్షల డెబ్బై వేల రూపాయలకు ఈ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికే పది లక్షల ఖర్చు చేసిన కారణంగా ఒకవేళ బోటు తీయలేని పక్షంలో మొత్తం నష్టం వాటిల్లుతుందేమో అని  చెప్పి ఎలాగైనా బోటును బయటకు తీయాలనే కృతనిశ్చయంతో సత్యం బృందం మొత్తం ప్రయత్నించడం జరుగుతున్నది.    

దశాబ్దాల కాలం నాటి అయోధ్య కేసుకు తెర పడబోతోందా?

అయోధ్యలో బాబ్రీ మసీదు విషయం లో హిందువులు ముస్లింల మధ్య శతాబ్ద కాలానికిపైగా వివాదం నడుస్తోంది.పంతొమ్మిది వందల తొంభై రెండులో హిందువులు మసీదును కూలగొట్టడంతో ఈ వివాదం పెద్దదైంది. ఆ ఘటన నేపథ్యంలో జరిగిన అల్లర్లలో దేశ వ్యాప్తంగా దాదాపు రెండు వేల మంది చనిపోయారు. ఆ సంఘటన తర్వాత అయోధ్యలోని భూమిపై వివాదం నడుస్తోంది. ఈ కేసును అలహాబాద్ హై కోర్టు విచారించింది. రెండు వేల పది సెప్టెంబర్ ముప్పైన తీర్పు ప్రకటించింది. అయోధ్య భూమిని మూడు భాగాలుగా విభజించారని అలహాబాద్ హై కోర్టు తీర్పిచ్చింది .ఈ మూడు భాగాల్లో ఒక భాగం హిందూ మహాసభ ప్రాతి నిధ్యం వహిస్తున్న రామ్ లల్లాకు, రెండో భాగం సున్నీ వక్ఫ్ బోర్డుకు, మూడో భాగం నిర్మోహి అఖాడాకు వెళుతుందని తీర్పు చెప్పారు.అలహాబాద్ హై కోర్టు రెండు వేల పది సెప్టెంబర్ లో ఇచ్చిన తీర్పులో మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పింది. వివాదాస్పద భూభాగం రాముడి జన్మస్థలమని చెప్పింది. అక్కడున్న ఒక దేవాలయాన్ని కూల్చేసిన తరవాత మసీదు నిర్మించారని  పేర్కొంది. ఆ మసీదును ఇస్లాం సూత్రాలకు అనుగుణంగా నిర్మించలేదని తీర్పులో వ్యాఖ్యానించింది. ఈ తీర్పు పై ఇరువర్గాల సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు, దీంతో సుప్రీం కోర్టు అలహాబాద్ హైకోర్ట్ తీర్పును సస్పెండ్ చేసింది.సుప్రీం కోర్టులో ఈ కేసును తుది దశకు చేరుకుంది. ఎట్టకేళ్ళకు అయోధ్య భూ వివాదం విచారణ ఇవాళ ముగియనుంది. సుప్రీం కోర్టు ఈ కేసులో వాదనలను ఇవాళ మధ్యాహ్నంలోగా ముగించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.దీనికి సంబంధించి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సారథ్యంలోని బెంచ్ సూచనప్రాయంగా తెలియచేసింది.హిందూ ముస్లిం పక్షాలు తమ తమ అభిప్రాయాల్ని సమర్పించటానికి సాయంత్రం ఐదు గంటల వరకు సమయం ఇచ్చే అవకాశం ఉంది. ముప్పైతొమ్మిది రోజుల నుంచి సుప్రీం కోర్టు ఇరుపక్షాల వాదనలు వింటోంది. తొలుత అక్టోబర్ పధ్ధెనిమిదివ తేదీనాటికల్లా విచారణ పూర్తి చేయాలనుకుంది. ఆ తర్వాత అందుకు ఒక రోజు ముందే అంటే పదిహెడువ తేదీన తుది గడువుగా పెట్టుకుంది.ఇప్పుడు అంతకంటే ముందే ఇవాళ విచారణని పూర్తి చేయనున్నట్లు సూచనప్రాయంగా తెలిపింది. అయోధ్యలోని రామజన్మభూమి వద్ద మసీదును నిర్మించడం ద్వారా మొఘల్ చక్రవర్తి బాబర్ చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారంటూ మహన్ సురేష్ దాస్ అనే హిందూ పిటిషనర్ తరపు న్యాయవాది పరాశరన్ మంగళవారం సుప్రీం కోర్టు ఎదుట తన వాదనని వినిపించారు. అయోధ్యలో పలు మసీదులున్నాయని అక్కడ ముస్లింలు ప్రార్థనలు చేసుకోవచ్చని అయితే హిందువులు మాత్రం శ్రీరాముడి జన్మస్థలాన్ని మార్చలేరని అన్నారు. అయోధ్య వివాదంపై మధ్యవర్తిత్వానికి తావు లేదని సుప్రీం కోర్టు వెలువరించే తీర్పుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.వివాదాస్పద భూమిని హిందువులకు అప్పగించడం మంచిదని ఇండియన్ ముస్లీమ్స్ ఫర్ పీస్ అనే సంస్థ చేసిన ప్రతిపాదనను ఆయన తోసిపుచ్చారు.ఈ మాటను ఆ సంస్థ మధ్యవర్తిత్వం సాగుతున్న సమయంలో ఇచ్చి ఉండాల్సిందని ఇప్పుడు ఆ గడువు మించిపోయిందని చెప్పారు. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నవంబర్ పదిహెడున రిటైర్ కానున్నారు ఈ నేపథ్యంలో ఈ కేసు నవంబర్ నాలుగు నుంచి పదిహేనులోగా తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ నవంబర్ పదిహెడవ తేదీలోగా చీఫ్ జస్టిస్ గొగోయ్ తీర్పు ప్రకటించలేకపోతే ఆ అంశాన్ని కొత్త ధర్మాసనం విచారిస్తోంది. సుప్రీంకోర్టు వివాదాస్పద భూమి ఎవరికి చెందుతుందనే అంశంపై తీర్పు నివ్వనుంది.ఆ భూమి ఎవరికి చెందుతుంది ఏ భాగం ఎవరికి లభిస్తుందని అంశంమ్మీద స్పష్టతనిస్తూ సిజెఐ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. అలహాబాద్ హై కోర్టు ఇచ్చిన తీర్పును కూడా రాజ్యాంగ ధర్మాసనం సమర్థించవచ్చు.అలాగే అన్ని పక్షాలకు ఉత్తమమని తాను భావించిన విధంగా ఆ భూభాగాన్ని రాజ్యాంగ ధర్మాసనం విభజించే అవకాశం కూడా ఉంది.తీర్పు వెలువరించే రోజు అయిదుగురు న్యాయమూర్తులు ధర్మాసనం మీదకొచ్చి తీర్పులో తాము రాసిన భాగాన్ని ఒక్కొక్కరిగా చదివి వినిపిస్తారు.సిజిఐ స్వయంగా తీర్పు చదవడం ప్రారంభించే అవకాశం కూడా ఉంది. అయితే అయోధ్యపై వేసిన పిటిషన్ను సున్నీ వక్ఫ్ బోర్డ్ విత్ డ్రా చేసుకుంటుందన్న ఒక కీలక మలుపు  కూడా వినిపిస్తోంది.మొత్తానికి దశాబ్దాల కాలానికి చెందిన ఈ కేసుకు నేటితో తెర పడబోతోంది. ఏమి జరగబోతోందో వేచి చూడాలి. 

అందుకోసమే రాజధాని నిర్మాణాలు ప్రభుత్వం ప్రారంభించిందా..?

  రాజధాని నిర్మాణానికి భూసేకరణ కింద భూములిచ్చిన రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం పదమూడు ప్యాకేజీల్లో పదిహేడు వేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచారు. ఇందులో సిమెంటు రహదారులు, విద్యుత్, మంచి నీరు పైపు లైన్లు, అత్యంత అధునాతనమైన రహదార్లు, సైకిల్ ట్రాక్ ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ఈ ఖర్చును తగ్గించాలని నిర్ణయించింది. పదిహేడు వేల కోట్ల రూపాయల పనులను ఐదు వేల కోట్ల రూపాయలకు తగ్గించాలని భావిస్తుంది. సిమెంట్ రహదారుల స్థానంలో తారు రోడ్డు, సైకిల్ ట్రాక్ ఎత్తేసి కనీస మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వం సీఆర్డీఏ అధికారులకు సూచించింది. రాజధానులు, రహదారుల నిర్మాణంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలతో రాజధానిలో రహదారుల నిర్మాణానికి అమరావతి అభివృద్ధి సంస్థ టెండర్లను పిలిచింది. అనేక రహదారుల నిర్మాణం దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం వరకు పూర్తయ్యాయి, కొన్ని రహదారుల నిర్మాణం ప్రారంభం కాలేదు. అవసరమైన రహదారుల నిర్మాణం మాత్రమే చేపట్టాలని మొత్తం ఐదు వేల కోట్ల రూపాయలకు ఖర్చును కుదించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. రాజధానుల్లో నిత్యం రాకపోకలకు అవసరమైన రహదారులను మాత్రమే చేపట్టాలని సూచించింది. సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. రాజధాని నిర్మాణానికి నిధుల కొరత ఎక్కువగా ఉందని ప్రభుత్వం చెప్తోంది. రాజధాని నిర్మాణానికి రుణం ఇచ్చే పలు జాతీయ, అంతర్జాతీయ, ఆర్థిక సంస్థలు వెనక్కు వెళ్లడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. రాజధాని నిర్మాణాన్ని నిలిపివేశారని హై కోర్టును కూడా తరలిస్తున్నారనే ప్రచారం కోస్తా జిల్లాల్లో ఊపందుకోవడంతో పరిమిత వనరులతో అవసరమైన మేరకే రాజధాని నిర్మాణం చేపడితే ఈ ప్రచారానికి తెర దించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. అందువల్లే రాజధాని నిర్మాణాలపై ప్రభుత్వం అడుగు ముందుకు వేస్తుందని చెబుతున్నారు. 

రాజధాని పనుల్లో మళ్ళీ కదలిక ప్రారంభమైంది...

  అమరావతి నిర్మాణంలో మళ్లీ కదలిక ప్రారంభమైంది. ప్రాథమిక చర్చలు ముగిశాయి. కాసేపట్లో జరిగే మంత్రి వర్గ సమావేశంలో లాంఛనంగా ఆమోదం పొందిన తర్వాత నవంబర్ ఒకటో తేదీ నుంచి పనులు ప్రారంభించాలని కాంట్రాక్టు సంస్థలకు వర్తమానం పంపారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని నిర్మాణాలను పూర్తిగా నిలిపివేసింది. అప్పటి వరకూ రాజధానిలో నిర్మాణాల కోసం కాంట్రాక్టు సంస్థలు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ముప్పై ఐదు వేల మంది కార్మికులు వెనుదిరిగి వెళ్లిపోయారు. నివాస భవనాలు, సెక్రెటరీ టవర్లు, హైకోర్టు నిర్మాణం, మంత్రుల నివాసాలు నిర్మాణ దశలో ఉన్నాయి. రాజధానిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తూ విచారణకు ఆదేశించింది, ప్రస్తుతం ఈ విచారణ జరుగుతోంది. నివేదిక అందిన తర్వాత అక్రమాలు ఉన్నాయో లేవో తేలుతోంది. అయితే ఇటీవల ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాజధానిలో పర్యటించారు. అనేక నిర్మాణాల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయన పర్యటన అనంతరం ప్రభుత్వంలో కదలిక ప్రారంభమైంది. రెండ్రోజుల క్రితం మంత్రి బొత్స సత్యనారాయణ సీఆర్డీఏ అధికారులతో సమావేశమయ్యారు. మొత్తం పదమూడు పనులను నవంబర్ ఒకటవ తేదీ నుంచి పున ప్రారంభించాల్సిందిగా మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ పనులన్నీ ఇప్పటికే డెబ్బై శాతం పూర్తయ్యాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసు అధికారులు, ఎన్జీవోలూ, గెజిటెడ్ అధికారులు, సచివాలయ ఉద్యోగుల అపార్ట్మెంట్ నిర్మాణాలను పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన మూడు వందల యాభై కోట్ల రూపాయలను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. పనుల పున: ప్రారంభానికి లిఖిత పూర్వకంగా లేఖలు పంపాలని కూడా నిర్ణయించారు. గతంలో రద్దు చేద్దామనుకున్న హై కోర్టు, సచివాలయ టవర్లు, మంత్రి నివాస భవనాలు, సీఎం నివాసాలను హొల్డ్ లో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎందుకంటే ఇప్పటికే ఈ భవనాల నిర్మాణం ఇరవై నుంచి ముప్పై శాతం వరకు పూర్తయింది. వీటిని రద్దు చేయటం మంచిది కాదని ఇంజనీరింగ్ నిపుణులు సూచించినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సెక్రటేరియట్, హెచ్ఓడి టవర్లు అంతస్తులు కుదించి పదిహేను లేదా ఇరవై అంతస్తులతో నిర్మిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంతోంది. అయితే వ్యయం తగ్గదని భవిష్యత్తులో నిర్మాణాలు చేపట్టడం కూడా ఇబ్బంది అవుతుందని నిపుణులు సూచించినట్టు తెలుస్తుంది.

తగ్గుతున్న రెండువేల రూపాయల నోట్ల ముద్రణ అందుకోసమేనా..?

  రెండు వేల రూపాయల నోటును త్వరలో బ్యాన్ చేస్తారు, గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న మాట ఇది. అయితే అలాంటిదేమీ లేదంటున్నాయి ఆర్బిఐ, కేంద్ర ఆర్థిక శాఖ. పెద్ద నోట్ల రద్దు తరువాత కేంద్రం ప్రవేశ పెట్టిన రెండు వేల రూపాయల నోటును ఉపసంహరించబోతున్నట్లు గత కొంతకాలంగా హల్ చల్ చేస్తున్న వార్తలకు కేంద్రం బలం చేకూర్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క రెండు వేల నోటును కూడా ఆర్బిఐ ప్రింట్ చేయకపోవడమే ఇందుకు కారణం. వాస్తవానికి పెద్ద నోట్లుగా చలామణి అయిన 500 రూపాయలు, వెయ్యి రూపాయల నోట్లను 2016 నవంబర్ లో రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. ఆ క్రమంలో నోట్ల కొరతను తగ్గించేందుకు కొత్తగా రెండు వేల రూపాయల నోట్లను విడుదల చేసింది ఆర్బీఐ. అయితే అది కూడా కొద్దికాలమే ఉంటుందని అప్పట్లోనే విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అందుకు అనుగుణంగానే రెండు వేల రూపాయల నోటు ముద్రణ తగ్గిపోతూ వచ్చింది. 2016 -17 ఆర్థిక సంవత్సరంలో 3,542.991 మిలియన్ ల రెండు వేల రూపాయల నోట్లను ప్రింట్ చేసిన ఆర్బీఐ, 2017-18 ఆర్థిక సంవత్సరంలో 111.507 మిలియన్ నోట్లు, 2018-19 సంవత్సరంలో 46.690 మిలియన్ నోట్లను మాత్రమే ప్రింట్ చేసింది. ఈ ఏడాది ఒక్క రెండు వేల రూపాయల నోటును కూడా ఆర్బిఐ ముద్రించలేదు. ఇదే విషయాన్ని సమాచార హక్కు చట్టం కింద ఆర్బీఐ స్పష్టం చేసింది. రెండు వేల రూపాయల నోట్ల వల్ల మనీ ల్యాండరింగ్ కేసులు పెరుగుతున్నట్లు గ్రహించిన కేంద్రం నోట్ల ముద్రణ నిలిపేయాల్సిందిగా ఆర్బీఐని సూచించినట్టు తెలుస్తున్నది. ముద్రణ నిలిపివేసినా నోట్లు చలామణిలోనే ఉంటాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.

అధిక చార్జీలతో ప్రయాణికులను దోచుకుంటున్న తాత్కాలిక డ్రైవర్లు,కండక్టర్లు...

  టికెట్ ధరకు ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటాం, రద్దీకి సరిపడా బస్సులు నడుపుతున్నాం ఇది ప్రభుత్వం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తరచూ చేస్తోన్న ప్రకటన. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఎక్కడా బస్సులు సరిపోవటం లేదు, నడుస్తున్న బస్సుల ఆదాయానికి సంబంధించిన లెక్కా పత్రం లేదు. అడిగేవారు లేకపోవడంతో ప్రయాణికులు దోపిడీకి గురవుతున్నారు. సమ్మె నేపథ్యంలో నడుపుతున్న ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. ఒక్కో బస్సులో పరిమితికి మించి ప్రయాణాలు చేస్తున్నారు, మరోవైపు ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. తీరా లెక్కలేసే సరికి నష్టాలు వస్తున్నాయని అంటున్నారు ఆర్టీసీ అధికారులు. సమ్మె నేపథ్యంలో పెద్ద సంఖ్యలో బస్సులు నడుపుతున్నా టిక్కెట్ ఇవ్వడం లేదు, టిక్కెట్ వ్యవస్థపై ఆర్టీసీ కసరత్తు చేయకపోవడంతో తాత్కాలిక కండెక్టర్ లు నోటిమాటగా ప్రయాణికుల నుంచి చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారమంతా గుడ్డి లెక్కన సాగుతోంది. అడిగేవారు లేకపోవటంతో తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తున్న చాలా మంది కండెక్టర్ల పంట పండుతోంది. అధిక చార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది, దీంతో అధికారులంతా హడావుడిగా ఏర్పట్లు చేశారు. హెవీ లైసెన్స్, బ్యాడ్జి నెంబర్ ఉన్న వారిని పరీక్షించి తాత్కాలిక డ్రైవర్ లుగా నియమించారు. అలాగే పదో తరగతి పాసైన వారికి కండెక్టర్ లుగా అవకాశం కల్పించారు. సమ్మె మొదలైన నాలుగైదు గంటల్లోనే ఈ ప్రక్రియ పూర్తైంది, చేరిక సందర్భంగా ఆయా కండెక్టర్ లకు వసూలు చేయాల్సిన టిక్కెట్ చార్జీల వివరాలు ఇచ్చారు. అయినప్పటికీ కొందరు సాధారణ టికెట్ రుసుంలకు మించి ఎవరికి తోచినంతగా వాళ్లు వసూలు చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో కండెక్టర్ లు బలవంతపు వసూళ్ళు చేస్తున్నారు, ప్రశ్నించే ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. నైపుణ్యం లేని డ్రైవర్ లు ఇష్టారాజ్యంగా బస్సులు నడుపుతూ ప్రయాణికుల్ని బెంబేలెత్తిస్తున్నారు. నిజానికి ప్రైవేటు డ్రైవర్ లు, కండెక్టర్ లను తీసుకున్నా ప్రయాణ చార్జీల్లో ఎలాంటి మార్పులూ ఉండవని అధికారులు ప్రకటించారు. నిర్ణీత ఛార్జీలు మాత్రమే వసూలు చేయాలని ఆదేశించారు. అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు, బస్సుల్లో ధరల పట్టికలను ఏర్పాటు చేశారు. అయినా క్షేత్రస్థాయి పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదు, పర్యవేక్షణ లేకపోవటంతో అధికారుల ఆదేశాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. అసిఫాబాద్ లో అధిక చార్జీల వసూలుపై అక్కడి ప్రయాణికులు ఏకంగా జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు. ఆయన కండెక్టర్ ను మందలించి డబ్బులను ప్రయాణికులకు తిరిగి ఇప్పించారు. అయినా కొన్ని ఏరియాల్లో కండెక్టర్ లు అధిక మొత్తంలో వసూలు చేస్తూనే వున్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. తగినన్ని వాహనాలూ అందుబాటులో లేకపోవటంతో ఉన్న బస్సుల్లోనే ఎక్కుతున్నారు. ఫిర్యాదులు చేసినా పట్టించుకునే వారు లేకపోవటంతో కండెక్టర్ లు అడిగినంత సొమ్ము చెల్లిస్తున్నారు. రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్ చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో పరిస్థితికి ఏమాత్రం పొంతన లేకుండా పోతోంది. సహజంగా ప్రతి రోజూ ఒక డిపో పరిధిలో ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి, ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నాయి ఎందరు ప్రయాణం చేస్తున్నారు, లెక్కలకు సంబంధించిన ఆక్యుపెన్సీ రేషియో ఒక క్రమ పద్ధతిలో చూస్తారు. అయితే సమ్మె మొదలైనప్పటి నుంచి ఆ పద్ధతి పూర్తిగా అటకెక్కింది. ఈ లెక్కలకు సంబంధించి ఎక్కడా పారదర్శకత లేదు, కేవలం బస్సులు నడపడం మినహా లెక్కాపత్రం లేకుండా పోతోంది. షెడ్యూల్ ప్రకారం బస్సులు నడవక పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆరు డిపోల పరిధిలో ఆరు వందల ఇరవై నాలుగు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులున్నాయి. సమ్మె కారణంగా ఎక్కడికక్కడ తాత్కాలిక డ్రైవర్ లు, కండెక్టర్ లను నియమించుకున్నారు. వీటికి అదనంగా ప్రైవేటు బస్సులు, మ్యాక్సీ క్యాబ్స్, ఇతర వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. పండుగ సీజన్ కావడంతో ప్రతి వాహనం కిక్కిరిసిపోతోంది. అన్ని రూట్ల లోనూ భారీగా కలెక్షన్ లు వచ్చాయి, ఒక్కో బస్ లో పరిమితికి మించి ప్రయాణికులను చేరవేస్తున్నారు. కొన్ని బస్సుల్లో డ్రైవర్ లు, కండెక్టర్ లు కలిసి కలెక్షన్స్ లో కొంత భాగాన్ని నొక్కేస్తున్నారు. ఇక డిపోకు చేరుకున్న బస్సుల లెక్కల్లోనూ పారదర్శకత లేకుండా పోతోంది, ఇలాంటి సందర్భాల్లో లాభాల కంటే ప్రయాణికుల సౌకర్యమే తమకు ముఖ్యమని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పేరిట ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛను చాలా మంది తాత్కాలిక కండక్టర్ లు, డ్రైవర్ లు సొమ్ము చేసుకుంటున్నారు. లెక్కాపత్రం లేకపోవటం తో సమ్మె కాలం దొచుకున్నోడికి దోచుకున్నంతగా మారుతోంది.

జూపూడి ప్రభాకర్ పై వైసీపీ క్యాడర్ ఆగ్రహం...

  ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జూపూడి ప్రభాకర్ పై వైసీపీ క్యాడర్ తెగ మండిపడుతోంది. పార్టీ ఓటమిపాలైనప్పుడు టిడిపి లో చేరి ఇప్పుడు అధికారంలోకి రాగానే తిరిగి వైసీపీ లో చేరారని ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీలో క్యాడర్ తో పాటు కొంత మంది నాయకులు కూడా జూపూడిపై ఫైర్ అవుతున్నారట, ఎన్నికల ఫలితాల ముందు వరకూ తెలుగు దేశం పార్టీలో జూపూడి ప్రభాకర్ ముఖ్య నేతగా పని చేశారు.  అయితే 2014 ఎన్నికల ఫలితాల ముందు వరకూ ఆయన వైసీపీలో కీలకంగా వ్యవహరించారు. 2014 ఎన్నికల సమయంలో ప్రకాశం జిల్లా కొండపి నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి జూపూడి ప్రభాకర్ ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల్లో వైసిపి పరాజయం పాలవడంతో పెద్దగా టైం తీసుకోకుండా జూపూడి ప్రభాకర్ టిడిపిలోకి జంపైపోయారు. ఎమ్మెల్సీ పదవి గుమ్మం ముందు వరకూ వచ్చినా సాంకేతిక కారణాలు అడ్డం పడ్డాయి, ఆ వెంటనే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి జూపూడి ప్రభాకర్ ని వరించింది. దీంతో తెలుగు దేశం పార్టీలో ఆయన కీలకంగా వ్యవహరించారు. పార్టీ కార్యక్రమాల్లో ప్రెస్ మీట్లలో ఆయన ప్రభావం స్పష్టంగా కనిపించేది. వైసిపిలో ఉన్నప్పుడు జగన్ కి సన్నిహితంగా వ్యవహరించిన జూపూడి ప్రభాకర్.. టీడీపీలో చేరాక ఆయనపైనే విమర్శలు, సెటైర్ లు కూడా వేశారు. 2019 ఎన్నికల్లో తిరిగి పోటీ చేయాలని జూపూడి భావించారు. గతంలో ఓటమి పాలయిన కొండపి నుండి మరోసారి పోటీ చేసేందుకు ఆయన ప్రయత్నించారు. టిడిపి టికెట్ దక్కించుకునేందుకు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే స్వామితో పోటీ పడ్డారు. కానీ, చివరి నిమిషంలో పార్టీ టికెట్ స్వామికే దక్కింది. దీంతో నామినేటెడ్ పదవిపై ఆశతో ఎన్నికల బరి నుండి తప్పుకున్న జూపూడికి టిడిపి ఓటమి జీర్ణించుకోలేని అంశంగా మారింది. ఆ క్రమంలో సొంత గూటికి చేరుకునేందుకు జూపూడి వైసీపీ నేతలతో చర్చలు జరిపి సక్సెస్ అయ్యారు. అయితే వైసీపీ నుండి బయటకు వెళ్లిన సమయంలో జూపూడి ప్రభాకర్ చేసిన కామెంట్ లను వైసీపీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతుందట.  జూపూడి ప్రభాకర్ టిడిపి లో ఉన్న సమయంలో చేసిన కామెంట్ లకు సంబంధించి తేదీలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూపూడి ప్రభాకర్ ని వైసిపి అధిష్టానం తిరిగి పార్టీలో చేర్చుకున్నా వైసీపీ క్యాడర్ మాత్రం తాము క్షమించబోమని పోస్టులు పెడుతోంది. జూపూడి ప్రభాకర్ తప్పి పోయిన గొర్రెపిల్లలా పక్కదారి పట్టామని బహిరంగంగా చెప్పినా వైసీపీ క్యాడర్ మాత్రం జూపూడిపై విమర్శలు గుప్పిస్తూనే ఉంది. సొంత గూటికి చేరుకున్న జూపూడిపై వైసీపీ క్యాడర్ ఆగ్రహం ఎప్పటికి చల్లారుతుందో చూడాలి.  

దగ్గుబాటి అసలు వ్యూహం ఏంటి?

  జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కోసం ఇన్ చార్జ్ చైర్మన్ గా పరుచూరు నియోజకవర్గానికి చెందిన రావి రామనాధం బాబును నియమించేందుకు రంగం సిద్ధమైంది. ఆ విషయమే జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి స్పష్టత ఇచ్చినట్టు సమాచారం. అదే సమయంలో డీసీఎంఎస్ చైర్మన్ పదవికి నాగులుప్పలపాడు మండలానికి చెందిన పిచ్చిరెడ్డి పేరు కూడా దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. సీనియర్ నాయకుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు కుటుంబ రాజకీయ వ్యవహారాలపై ఇటీవల అధికార పార్టీ దృష్టి సారించి సరికొత్త నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అదే నియోజకవర్గానికి చెందిన రావి రామనాధం బాబుకు జిల్లా స్థాయి నామినేటెడ్ పదవిని కట్టబెట్టాలన్న నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. పార్టీ నియోజక వర్గ ఇంచార్జ్ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. డాక్టర్ దగ్గుబాటి నుంచి స్పష్టత రాకపోవడం కూడా అందుకు ఓ కారణంగా భావిస్తున్నారు. పురందేశ్వరిని బిజెపికి రాజీనామా చేయించి వైసీపీలో చేరుతారని విషయంలో అధికార పార్టీ ముఖ్య నాయకులలో అనుమానాలున్నాయి. ప్రస్తుతం ఆయన జగన్ ను కలిసిన తర్వాత కూడా నియోజకవర్గానికి రాకపోవటాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు ఆలోచనతో దగ్గుబాటి ఉన్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతానికి వైసీపీ నియోజక వర్గ ఇంచార్జ్ పదవి కోసం పలువురు పోటీ పడుతున్నారు. అందులో రామనాధం బాబు పేరు ముందు ఉన్నప్పటికీ ఆయనకు సెంట్రల్ బ్యాంక్ పదవి దక్కుతున్నందని వైసీపీ నాయకత్వం మున్ముందు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.అయినప్పటికీ ఆయన వైపు నుంచి సమాచారం కోసం మరి కొద్ది రోజులు వేచి చూడాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మహారాష్ట్ర ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టోని విడుదల చేసిన నడ్డా...

  మహారాష్ట్ర ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించటంలో జోరందుకుంటోంది అధికార బీజేపీ. ఎన్నికల్లో ప్రధాన అస్త్రం అయినటువంటి మేనిఫెస్టోని విడుదల చేసింది. ఫూలే సావర్కర్ లకు భారతరత్న ఇప్పించటం దగ్గరి నుంచి ఐదేళ్లలో కోర్టు ఉద్యోగాల వరకు మేనిఫెస్టోని జనరంజకంగా ఉండేటట్టు చూసుకుంది. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా చేతుల మీదుగా మేనిఫెస్టోని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం ఫడ్నవీస్ ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. మేనిఫెస్టోకీ సంకల్ప పత్ర్ అనే పేరును కూడా పెట్టారు. జ్యోతిబాపూలే, సావిత్రిబాయిఫూలే, వీర్ సావర్కర్ లకు భారతరత్న వచ్చేలా ప్రయత్నిస్తామన్నారు. మహిళల సేఫ్టీ ప్యాడ్లను ఒక రూపాయికే అందించటం, ప్రభుత్వాసుపత్రుల్లో ఆయుర్వేద వైద్యాన్ని పెంచటం, ప్రతి జిల్లా కేంద్రంలో ఓ యోగా కేంద్రం, అటల్ విజ్ఞాన్ కేంద్రాన్ని నెలకొల్పడమే కాక మహారాష్ట్ర జీడీపీని ట్రిలియన్ డాలర్ లకు తీసుకెళ్లి రికార్డులకు ఎక్కిస్తామని హామీలు ఇచ్చారు.ఇక 2020 కల్లా అంబేద్కర్ మెమోరియల్ ను పూర్తి చేస్తామన్నారు. ప్రతీ గ్రామ పంచాయతీని బ్రాడ్ బ్యాండ్ ద్వారా కలపడం, వీర మరణం పొందిన జవాన్ లు, పోలీసుల కుటుంబాలకు ప్రత్యేక వసతులు కల్పించేలా చేస్తామని హామీ ఇచ్చారు. 2022 కల్ల మహారాష్ట్రలో ఉన్న ప్రతీ ఇంటికీ మంచినీటి సరఫరా చేస్తామన్నారు బీజేపీ నేతలు. అయిదేళ్లలో కోర్టు ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్నారు. అదే సమయంలో మహారాష్ట్రని కరువు రహితంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఇక మహారాష్ట్ర రైతులకు పన్నెండు గంటల విద్యుత్ సరఫరా కూడా చేసామని హామీ ఇచ్చారు బీజేపీ నేతలు. ఇక ఈ మేనిఫెస్టోలోని పనులు అన్నింటిని నిజంగా అమలు చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి.