రాణా కపూర్‌కు, ప్రియాంక గాంధీకి మధ్య సంబంధం ఏమిటి?

యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు ప్రియాంక గాంధీ నుంచి పెయింటింగ్ ఎందుకు కొన్నారు? ఇప్పుడు ఈ వ్యవహారానికి రాజకీయ రంగు కూడా పులుముకుంది. దేశంలో ప్రతి ఆర్థిక నేరానికీ గాంధీల కుటుంబంతోనే లోతైన సంబంధాలు ఉంటున్నాయి. సోనియా గాంధీకి విజయ్ మాల్యా అప్‌గ్రేడెడ్ విమాన టికెట్లు పంపేవారు. మన్మోహన్ సింగ్, చిదంబరంతో ఆయనకు సంబంధాలు ఉండేవి. నీరవ్ మోదీ నగల కలెక్షన్‌ను రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఆయన బ్యాంకును మోసం చేశారు. ప్రియాంక వాద్రా నుంచి రాణా కపూర్ పెయింటింగ్స్ కొన్నట్లు ఇప్పుడు వెల్లడైంది'' అని అమిత్ మాలవీయ్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా దుమారాన్ని రేపుతున్నాయి. ప్రియాంక గాంధీపై వచ్చిన ఆరోపణల గురించి కాంగ్రెస్ పార్టీ నేత అభిషేక్ సింఘ్వీ ఘాటుగా స్పందించారు. ఎమ్ఎఫ్ హుస్సేన్ రాజీవ్ గాంధీ చిత్రాన్ని వేశారు. దాన్ని గాంధీ కుటుంబం రాణా కపూర్‌కు రూ.2 కోట్లకు విక్రయించింది. ఇదంతా 2010లో జరిగిన వ్యవహారం'' అని వివరించారు. రాణా కపూర్ చెక్ రూపంలో ప్రియాంక గాంధీకి ఆ చెల్లింపు చేశారని, ఆ వివరాలను ప్రియాంక ఐటీ రిటర్న్స్‌లోనూ చూపించారని అభిషేక్ చెప్పారు. ఎమ్ఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ ఒకటి ఇటీవల రూ.13.44 కోట్లకు అమ్ముడుపోయిందన్న విషయాన్ని అభిషేక్ గుర్తుచేశారు. బీజేపీ అసలు విషయం మీద నుంచి దృష్టి మరల్చేందుకే తాజా ఆరోపణలు చేసిందని అన్నారు. ''మోదీ నిర్వహించిన ప్రముఖ అంతర్జాతీయ సదస్సుకు 2020 మార్చి దాకా రాణా కపూర్ ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న విష‌యాన్ని గుర్తు చేశారు. యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. ఈడీ కస్టడీలో తీసుకున్నారు. రాణా కపూర్ కుటుంబ సభ్యుల కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. రాణా కపూర్ కూతురు రోష్నీ కపూర్‌ను లండన్ వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారు. ముంబయి ఎయిర్‌పోర్ట్‌లోనే ఆమెను ఆపేశారు.

ఎన్నిక‌ల వాయిదాపై గుస‌గుస‌లు రుస‌రుస‌లు!

  కొన్ని వివాదాల కారణంగా 3 కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీల్లో ఎన్నికలను వాయిదా వేశారు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్, అర్బన్ డెవలోపమెంట్ అథారిటీలో పలు గ్రామ పంచాయతీలను ప్రభుత్వం విలీనం చేసింది. అలాంటి గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించ‌డం లేదు. అమరావతి పరిధిలోని గ్రామాల్లో పంచాయతీలలో కూడా ఎన్నికలు నిలిపివేశారు. అమరావతి క్యాపిటల్ సిటీ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినందున ఆయా గ్రామాల్లో పంచాయతీ, ఎంపిటిసి, జడ్పీటీసిలకు ఎన్నికలు నిర్వహించ‌డం లేదు. ఎన్నిక‌లు వాయిదా వేసిన ప్రాంత‌ల గురించి రాష్ట్రంలో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం లో ఎలక్షన్ లేదు. రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం లో ఎన్నికలు వాయిదా. బుచ్చయ్య చౌదరి రాజమహేంద్రవరంలో ఎన్నికలు వాయిదా. జనసేన పవన్ కళ్యాణ్ ఓడిపోయిన భీమవరంలో కూడా ఎన్నికలు వాయిదా. నిమ్మల రామానాయుడు గారి నియోజకవర్గం పాలకొల్లు లో ఎన్నికలు వాయిదా. నారా లోకేష్ మంగళగిరి లో ఎన్నికలు వాయిదా. దివంగ‌త డా.కోడెల శివ ప్రసాద్ గారి నరసరావుపేట లో ఎన్నికలు వాయిదా. తమ్మినేని సీతారామ్ (స్పీకర్) నియోజకవర్గం ఆముదాలవలస లో ఎన్నికలు వాయిదా. పేదల రేషన్ బియ్యం స్కామ్ చేసిన ఎవడమ్మ మొగుడి నానీ నియోజకవర్గం గుడివాడ లో ఎన్నికలు వాయిదా. చివరికి శుక్రవారం కోర్టు హాజరుదారు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఇల్లు ఉన్న 'తాడేపల్లి'లో కూడా ఎన్నికలు వాయిదా ప‌డ‌డం వెనుక మ‌త‌ల‌బు ఏమిట‌ని రాష్ట్ర ప్ర‌జ‌లు గుస‌గుస‌లాడుకుంటున్నారు.

కొత్త రిజ‌ర్వేష‌న్ లెక్కింపు విధానంలో ఓ.సి.ల‌కు అన్యాయం!

స్థానిక సంస్థ‌ల రిజ‌ర్వేష‌న్ ల‌కు సంబంధించిన గ‌తంలో వున్న లెక్కింపు విధానాన్ని పూర్తిగా మారుస్తూ 559, 560 జీవోలు ప్ర‌భుత్వం జారీ చేసింది. పంచాయతీ రాజ్ చట్టం1994 పెట్టిన తరువాత, గత 25 సంవత్సరాలుగా, అవలంభించిన విధానాన్ని తప్పించి, పూర్తి భిన్నంగా, ఈ జీవో లను విడుద‌ల చేశారు. బహుశా భారత దేశంలో, ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి విధానం లేదు. దీనిపై రాజ‌కీయ పార్టీలు అంత‌గా దృష్టి పెట్ట‌లేదు. రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా మార్చిన విధానం, తేడాల‌ను గమనించ‌లేదు. ఈ జీవోల్లో తెలిపిన‌ట్లు కొత్త విధానంలో మేజర్ పంచాయితీలన్నీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో కి వెళతాయి. ఆ తదుపరి పెద్ద పంచాయతీలు బి.సి. క్యాటగిరిలోకి వెళతాయి. మిగిలిన చిన్న పంచాయితీలు మాత్రమే జ‌న‌ర‌ల్ గా మిగులుతాయి. ఒక వేళ 100% ఎస్సీ జ‌నాభా ఉన్న చిన్న పంచాయితీలు కూడా జ‌న‌ర‌ల్‌ గా మిగులుతాయి. అంతే కాదు 100% బి.సి.లు ఉన్న చిన్న పంచాయితీలు కూడా జ‌న‌ర‌ల్‌గా మిగులుతాయి. ఆ చిన్నపంచాయితీల్లో ఓసీ లు నిలబడే అవకాశం ఉండదు. ఇందువలన ఓసీ లు నిలబడే అవకాశం ఉండదు. ఓసీలు ఇక్క‌డ న‌ష్ట‌పోవ‌ల్సిందే. ఇదొక రాజకీయ ఎత్తుగడలో భాగం. విపక్ష రాజకీయ పార్టీలు, ఈ తేడాని గమనించలేదు. గత 25 సంవత్సరాలుగా ఎస్టీ, ఎస్సీ, బి.సి.ల‌ ల, పంచాయతీ జ‌నాభా/ పంచాయతీ జ‌నాభా తో ప‌ర్సంటేజ్‌లు తయారు చేసి, వాటి ఆధారంగా, ఎక్కువ ప‌ర్సంటేజ్ ఉన్న పంచాయతీలను, సంబంధిత, క్యాటగిరీకి కేటాయించేవారు. ఇప్పుడు ఈ కొత్త జోవో ల ద్వారా, లెక్కింపు విధానాన్ని పూర్తిగా మార్చారు. ఈ కొత్త విధానం ప్రకారం ఎస్టీ, ఎస్సీ, బిసి పంచాయతీ జ‌నాభా/ఎస‌్టీ, ఎస్సీ, బి.సి. మండ‌ల జ‌నాభాతో ప‌ర్సంటేజ్‌లు త‌యారు చేసి వాటిలో ఎక్కువ శాతం ఉన్న పంచాయతీలను కేటాయిస్తున్నారు. ఇది గత25 సంవ‌త్స‌రాలుగా అవలంభిస్తున్న విధానానికి భిన్నంగా ఉంది. ఈ తేడాను గమ యించగలరు. ఈ విధానంలో ఓ.సి.లు వారికి చెందవలసిన అవకాశాలు కోల్పోతున్నారు. కేవలం పంచాయితోల్లోనే కాదు, ఎం.పి.టి.సిలూ, జ‌డ్పీటిసిలు, ఎం.పి.పిలు, జ‌డ్పీ ఛైర్‌ప‌ర్స‌న్ మునిసిపల్ కౌన్సిలర్లు, చైర్మన్స్, అన్నింటిలో మార్పులు వస్తాయి. స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో బీసీలను వైసీపీ దారుణంగా మోసం చేసిందని కొన్ని జిల్లాల్లో రిజర్వేషన్లలో సగానికి పైగా కోతపెట్టిందని మండిపడ్డారు చంద్రబాబు. జడ్పీటిసి స్థానాల్లో నెల్లూరులో 13%, ప్రకాశంలో 19.64%, పశ్చిమ గోదావరిలో 18.75%, కృష్ణా 20.41%, తూర్పుగోదావరి 20.97%, విశాఖలో 20.51% కు బీసీలను పరిమితం చేశారని అన్నారు. బీసీలకు న్యాయం చేసేందుకు టీడీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అందుకే ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి 34% పైగా స్థానాలను బీసీలకు కేటాయించామన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని పరిరక్షించుకునేందుకు బీసీలందరూ ఏకంకావాలని పిలుపునిచ్చారు.

టీడీపీలో బాలకృష్ణ పట్టు కోల్పోతున్నారా ?

తన సొంత మ‌నిషి పార్టీ ఫిరాయింపుని ఆపుకోలేని హీరో బాల‌కృష్ణ పార్టీకి వారసుడు ఎలా అవుతాడు? పార్టీని ఏమి ఉద్ధరిస్తాడు? ఇదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో తాను పదవులు సీట్లు ఇప్పించుకున్న నేతలు ఇప్పుడు ఆయన మాట వినడం లేదా ? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. టీడీపీలో ఒకప్పుడు తనను నమ్ముకున్న నేతలకు పదవులు సీట్లు ఇప్పించుకున్నారు బాలకృష్ణ. ఈ విషయంలో చంద్రబాబు కూడా బాలయ్యకు అడ్డు చెప్పలేదనే టాక్ ఉంది. అయితే టీడీపీ అధికారం కోల్పోయిన తరువాత సీన్ మారిపోయింది. బాలకృష్ణ సహకారంతో ఎఫ్‌డీసీ చైర్మన్‌ అయిన సినీ నిర్మాత, టీడీపీ మాజీ నేత అంబికా కృష్ణ బీజేపీలో చేరిపోయారు. తాను పార్టీ మారే విషయాన్ని బాలకృష్ణకు ముందుగానే చెప్పానని ఆయన ఆ తరువాత చెప్పుకొచ్చారు. తాజాగా బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు, స్నేహితుడిగా చెప్పుకునే కనిగిరి మాజీ ఎమ్మెల్యే బాబూరావు కూడా వైసీపీలో చేరిపోవడం బాలకృష్ణ, అభిమానులు, టీడీపీ శ్రేణులకు షాక్ ఇస్తోంది. 2014లో బాలయ్య సహకారంతోనే కనిగిరి టీడీపీ టికెట్ తెచ్చుకున్న బాబూరావు... ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2019లో చంద్రబాబుకు ఆయనకు కనిగిరి నుంచి కాకుండా మరో స్థానం నుంచి టికెట్ కేటాయించారు. దీంతో చాలాకాలంగా పార్టీ వ్యవహారాలకు బాబూరావు దూరంగా ఉంటున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎం కాగానే పార్టీ మారుదామని బాబురావు భావించినా బాలయ్య టీడీపీలోనే ఉండమని కోరడంతో ఇన్నాళ్లు అయిష్టంగానే పార్టీలో కొనసాగారు. తనకు రాజకీయాల కంటే బాలయ్యతో సంబంధాల ముఖ్యమని కదిరి బాబురావు గతంలోనే తెలిపారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీలోకి చేరడానికి ఇదే మంచి సమయమని బాబురావు భావించారు. వైసీపీలో చేరి స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సత్తా చూపిస్తే భవిష్యత్తు బాగుంటుందని బాబురావు అనుకుంటున్నారు. ఈ మేరకు వైసీపీలో చేరే విషయమై బాలయ్యతో మాట్లాడి ఒప్పించినట్లు తెలుస్తోంది. టీడీపీలో ఉంటే తనకు రాజకీయ భవిష్యత్తు లేదని, అందుకే వైసీపీలో చేరుతున్నట్లు బాబురావు బాలయ్యకు ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో బాలయ్య కూడా సరే..మీ ఇష్టం..అని ఒప్పుకున్నట్లు సమాచారం. బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బాబురావు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్ స్వయంగా బాబురావుకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాపు సామాజికవర్గానికి చెందిన కదిరి బాబురావు చేరికతో జిల్లాలో ప్రకాశం జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని వైసీపీ భావిస్తోంది. మొత్తంగా తనకు అత్యంత సన్నిహితుడైన బాలయ్యకు చెప్పి మరీ బాబురావు వైసీపీలో చేరడం టీడీపీ శ్రేణులను నివ్వెరపరుస్తోంది. తన బావమరిది బాలయ్య దగ్గరుండి మరీ బాబురావును వైసీపీలోకి పంపించడం పట్ల చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాడు. బాలయ్య రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెడతారని టీడీపీ వర్గాలు భావించాయి. కానీ అలా జరగలేదు. బాబూరావు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. దీంతో టీడీపీ నేతల బాలకృష్ణ మాటలు కూడా వినడం లేదనే చర్చ పార్టీలో మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల నేప‌థ్యంలో ఒక్కొక్కరుగా ఆపార్టీని వీడి అధికార వైసీపీ కండువా కప్పుకుంటున్నారు. ఈ పరిణామాలతో టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. కీలక నేతలంతా పార్టీని వీడుతుండటంతో చంద్ర‌బాబునాయుడికి దిక్కుతోచ‌ని స్థితి ఏర్ప‌డింది. టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా సైకిల్ దిగేసి…ఫ్యాన్ కిందకు చేరుతున్నారు..డొక్కామాణిక్య వర ప్రసాద్, రెహమాన్, సతీష్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, పాలకొండ్రాయుడు ఇలా రోజుకో టీడీపీ నేతలు వైసీపీ కండువా కప్పుకుంటున్నారు. సొంత పార్టీలోనే కాదు ప్ర‌భుత్వంలోనే ఎమ్మెల్యే బాలకృష్ణకు ప్రాధాన్యత కల్పించడం లేదని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎక్కడైనా ప్రభుత్వ కార్యక్రమాలు చేపడితే పార్టీలను పక్కన పెట్టి ప్రొటోకాల్‌ పాటిస్తారని అయితే లేపాక్షిలో నిర్వహించే ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ ఫొటో ఎక్కడా కనిపించడం లేద‌ట‌. కేవలం ఆహ్వాన పత్రికలో పేరు తప్ప, సభావేదిక, ఆహ్వాన తోరణాలు, ఫ్లెక్సీల్లో ఎక్కడా ఫొటో కనిపించడం లేదు.

నాటుసారా కేంద్రాల‌పై మెరుపు దాడులు

నాటుసారా నిల్వలు ఉన్నాయనే సమాచారం మేరకు జిల్లాను జల్లెడ ప‌డుతున్నారు. 10 వేల మంది సిబ్బందితో పోలీసు, ఎక్సైజ్ శాఖ మెరుపుదాడులు చేస్తూ హ‌డ‌లెత్తిస్తున్నారు. ఎన్నికల్లో పూర్తిగా మద్యం, డబ్బు పంపిణీని కట్టడి చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్న మెరుపు దాడులు. ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ గౌతమ్ సవాంగ్ డైరెక్ష‌న్‌లో ఇటీవ‌ల ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్ కు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ మరియు డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల మెరుపు దాడులు ప్రారంభించారు. పోలీస్, ఎక్సైజ్ శాఖ సమన్వయంతో నాటు సారా తయారీ కేంద్రాలపై బుధ‌వారం తెల్ల‌వారుఝాము 4 గంటల నుండి దాడులు కొన‌సాగుతున్నాయి. పదివేల మంది సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. వందలాది మంది పోలీస్ అధికారులతో కూడిన బృందాలతో , అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలు, ప్రొబేషనరీ ఐపీఎస్, సిఐలు,ఎస్సైలు, మొత్తం పది వేల మంది సిబ్బందితో రాష్ట్ర వ్యాప్తంగా మెరుపు దాడులు చేస్తున్నారు. నాటుసారా నిల్వలు ఉన్నాయనే సమాచారం మేరకు జిల్లాను జల్లెడ పడుతున్నారు. ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో బెల్లం ఊట నిల్వలు, నాటుసారా నిల్వలను ధ్వంసం చేశారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిరోజుల పాటు మద్యం సరఫరాను నిలిపివేశారు. ఈనెల 12 నుంచి 29 వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఎన్నికల్లో ఓటర్లపై డబ్బు, మద్యం ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 21 నుంచి పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది.

మందులు కొనాల్సిన డబ్బులతో కాస్మొటిక్స్ కొంటున్నారా?

ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో అవినీతి జ‌రిగిన‌ట్లు తెలిస్తే క్ష‌మించే ప్ర‌స‌క్తే లేద‌ని అలాంటి వారు ఎవ‌రైనా స‌రే విడిచిపెట్టేది లేద‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హెచ్చ‌రించారు. అవినీతి ఉండకూడదని, వ్యవస్థల్లో ఉన్న అవినీతిని ఏరిపారేయాలి ఆయన అధికారులకు సూచించారు. అవినీతివల్ల పేదలైన కార్మికులు తీవ్రంగా నష్టపోతారని, మందుల కొనుగోలులో పారదర్శకత ఉండాలన్నారు. రోగుల‌కు మందులు కొనాల్సిన డబ్బులతో కాస్మొటిక్స్ కొన‌డం దారుణ‌మ‌ని ముఖ్య‌మంత్రి మండిప‌డ్డారు. కొనుగోలు చేసిన మందుల్లో జీఎంపీ ప్రమాణాలు ఉండాలని, ఈఎస్‌ఐ బిల్లులు ఎప్పటికప్పుడు విడుదల చేయాలని పేర్కొన్నారు. వైద్యసేవల్లో నాణ్యత కోసం ఇప్పటికే కొన్ని ప్రమాణాలు నిర్దేశించుకున్నామని, ఆ ప్రమాణాలు ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో ఉండేలా చూడాలని చెప్పారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక బోధన ఆస్పత్రితో పాటు నర్సింగ్‌ కాలేజీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న బోధన ఆస్పత్రుల సంఖ్య 11 నుంచి 27కు పెంచుతున్నందునా పెద్ద సంఖ్యలో వైద్యులు ఈ కాలేజీల నుంచి వస్తారన్నారన్నారు. వీరి సేవలనుకూడా ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో వినియోగించుకునేలా చూడాలని సీఎం జగన్‌ అధికారులకు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖతో అనుసంధానమై ఈఎస్‌ఐ ఆస్పత్రులను కూడా పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, ఆసుపత్రితో సేవల మెరుగు కోసం ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు. కాగా ఆ మేరకు చర్యలు తీసుకోవాలని చెప్పిన ఆయన కాలుష్య నివారణపైనా కూడా గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మ‌రో కొత్త వైర‌స్ వ‌చ్చిప‌డింది!

అంతు చిక్క‌ని ఈ వైర‌స్ కోళ్ల నుంచి గబ్బిలాలకు వ‌స్తుంద‌ట‌. అసలే కరోనా భయంతో బిక్కబిక్కుమంటూ ప్ర‌జ‌ల‌కు ఇది షాక్‌కు గురిచేస్తోంది. ఇటీవలి కాలంలో అంతుచిక్కని వైరస్ ప్రభలడంతో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడ్డాయి. అంతుచిక్కని వైరస్ వల్ల ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గంలోనే లక్షకు పైగా కోళ్లు చనిపోవడం అప్ప‌ట్లో సంచలనంగా మారింది. చిక్ సీడ్ తయారు చేస్తున్న కంపెనీల ప్రతినిధులు విజయవాడ , హైదరాబాద్ లోని ల్యాబ్ లకు తీసుకువెళ్లి టెస్టులు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వైరస్ ను అరికట్టే వాక్సిన్ ను కనిపెట్టలేక పోతున్నారు. వైరస్ తో చనిపోయిన కోళ్ల ను కాల్చివేసి పూడ్చాలని పశువైద్య అధికారులు ఫారాల నిర్వాహకులకు సూచించి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులే కేరళలో నెలకున్నాయి. అయితే అక్కడ కోళ్లు మాత్రమే కాదు గబ్బిళాలు కూడా చనిపోవడం ప్రజలను కలవరపెడుతోంది. కేర‌ళ‌లోని కొజిక్కొడె జిల్లాలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే జంతు సంబంధిత అధికారులకు సమాచారం అందించడంతో, వారు వచ్చి చనిపోయిన గబ్బిళాల నుంచి శాంపిల్స్ సేకరించారు. పరీక్షల కోసం చనిపోయిన గబ్బిలాల నుండి నమూనాలను సేకరించారు. చనిపోయినవాటిన్నింటిని కాల్చి బూడిద చేశారు. పరీక్ష ఫలితాలకు కొన్ని రోజులు సమయం పడుతుంది 'అని జిల్లా పశుసంవర్ధక అధికారి డిఆర్ కెవి ఉమా అన్నారు. కొజిక్కెడ్ జిల్లాలో రెండు పౌల్ట్రీ ఫామ్స్‌లో బర్డ్ ఫ్లూ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కోళ్లు వందల సంఖ్యలో చనిపోవడంతో టెస్టులు చేసిన అధికారులు.. Type-A Influenzaకు సంబంధించిన H5, H7 వైరస్‌ అందుకు కారణంగా నిర్ధారించారు. దీంతో వెంటనే అలర్టయిన రాపిడ్ రెస్పాన్స్ టీమ్, ఆ కోళ్ల ఫామ్స్‌కు ఒక కిలోమీటర్ పరిధిలో సంచరిస్తోన్న 1200వరకు రకరకాల పక్షుల నమూనాలను సేకరించారు. ఆ కోళ్ల ఫారం నుంచే వైరస్ గబ్బిలాలకు సోకిందని ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతానికి 10కిలోమీటర్ల దూరం వరకూ షాపుల్లో కోళ్లను, గుడ్లను అమ్మకాలను నిషేదించారు. నష్టపోయినవారిని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని అధికారులు హామి ఇచ్చారు.

అమ‌రావ‌తిలో ఇక ఐదు జోన్లు

వెనుకబడిన వర్గాల ఇళ్ల నిర్మాణం కోసం రాజధాని అమ‌రావ‌తిలో కొత్తగా జోన్ ఏర్పాటు చేశారు. రాజధాని అమరావతి బృహత్‌ ప్రణాళిక(మాస్టర్‌ప్లాన్‌)లో కొన్ని మార్పులు చేశారు. రాజధానిలో ఇప్పటివరకు 4నివాస జోన్లు ఉండేవి. కొత్తగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌)/అందుబాటు ధరల్లో గృహ నిర్మాణ జోన్ ఆర్‌-5 ఏర్పాటు చేస్తూ సీఆర్‌డీఏ ముసాయిదా ప్రకటన విడుదల చేసింది. రాజధానిలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలోని 967.25 ఎకరాలను నివాస ప్రాంతాలుగా బదలాయిస్తున్నారు. అందులోని 900.97 ఎకరాలను ఆర్‌-5 జోన్‌గా ఏర్పాటు చేస్తూ తాజాగా మరో ముసాయిదా ప్రకటన వెలువడింది. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే 15 రోజుల్లోగా తెలియజేయాలని సూచించింది. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం రాజధానిలో ఇంతవరకు ఆర్‌-1(ప్రస్తుత గ్రామాలు), ఆర్‌-2(తక్కువ సాంద్రత గృహాలు), ఆర్‌-3(తక్కువ నుంచి మధ్యస్థాయి సాంద్రత కలిగిన గృహాలు), ఆర్‌-4(హైడెన్సిటీ జోన్‌) పేర్లతో 4రకాల నివాస జోన్లు ఉండేవి. ఆర్‌-5 జోన్‌లో అనుమతించే నిర్మాణాలు ఇలా వుంటాయి. ఒకదాన్ని ఒకటి అనుకుని నిర్మించిన గృహాలు(అటాచ్డ్‌), వేర్వేరుగా నిర్మించిన గృహాలు(డిటాచ్డ్‌), రో హౌసింగ్‌ అపార్ట్‌మెంట్లు, గ్రూప్‌ హౌస్‌లు. ఏటీఎం వంటి ప్రజోపయోగ సదుపాయాలు, దుకాణా లు. హోం ఆఫీసులు, మత, ఆధ్యాత్మిక కేంద్రాలు. ఇలాంటి నిర్మాణాల‌ను సీఆర్‌డీఏ నుంచి ముందస్తు అనుమతితో చేపట్టేందుకు వీలుంది. సర్వీస్‌ అపార్ట్‌మెంట్లు, పారిశ్రామిక యూనిట్లు, ప్రింటింగ్‌ ప్రెస్‌లు, హైపర్‌మార్కెట్‌, షాపింగ్‌ మాల్స్‌, సినిమా హాళ్లు ఈ జోన్‌లో అనుమ‌తించ‌రు.

అంపశయ్య మీద 10 జన్ పథ్

అంపశయ్య మీద భారత జాతీయ కాంగ్రెస్. అవునా, ఇది నిజమేనా? ఈ దేశానికి స్వతంత్రం తీసుకువచ్చిన మహా నాయకులు  నడిపించిన పార్టీ ఈ రోజు వయసు మీద పడి మెలమెల్లగా తన పూర్వ ప్రాభవాన్ని కోల్పోతోందా? ఒక్క సరి చరిత్రలోకి వెళితే.... 1960 దశకంలో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర సంక్షోభం. కామరాజ్, నిజలింగప్ప, మొరార్జీ దేశాయ్ వంటివారు ఒకవైపు. ఇందిరా, జగ్ జీవన్, వై బి చవాన్, సి సుబ్రహ్మణ్యం వంటివారు మరో వైపు. పార్టీ రెండుగా చీలింది. దశాబ్ద కాలంలో పరిస్థితులు మారాయి. తర్వాత ఇందిరా గాంధీ ప్రాబల్యం పెరగడంతో మళ్ళీ ఇందిరను నాయకురాలిగా అంగీకరించారు.  1990 దశకంలో కాంగ్రెస్ పార్టీలో మరోసారి సంక్షోభం. సీనియర్ నేతలు తివారి నేతృత్వంలో పార్టీలో చీలిక. సోనియా నాయకత్వానికి సవాల్. శరద్ పవార్, మమతా బెనర్జీ వంటివారు సోనియా నాయకత్వాన్ని వ్యతిరేకించారు. దశాబ్ద కాలంలో పరిస్థితులు మారాయి. నాయకులు సోనియాగాంధీ నాయకత్వాన్ని అంగీకరించలేదు కానీ బయటనుండి బలపర్చారు. విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. 2020 దశకంలో కాంగ్రెస్ పార్టీలో మరో సంక్షోభం. వయస్సు రీత్యా నాయకత్వం నుండి తప్పుకున్న సోనియా. పార్టీని నడిపించలేక తప్పుకున్న రాహుల్. వృద్ధ జంబూకల మధ్య నిలువలేక వెళ్లిపోతున్న యువతరం.  సమర్ధవంతమైన నేత లేక చేతులెత్తేస్తున్న నాయకత్వం. మరి 2040 దశకం...ఎలా ఉంటుంది ? ఇది ప్రస్తుతం పార్టీ ని కుదిపేస్తున్న ప్రశ్న. జ్యోతిరాదిత్య లాంటి లాయలిస్టుల నిష్క్రమణ తో, మధ్య భారతం లో శూన్యాన్ని కాంగ్రెస్ పార్టీ అనివార్యంగా ఆహ్వానించింది.  కాంగ్రెస్ కి ప్రాణం పోసిన ఆ నలుగురు నాయకుల కొడుకులే ఆ పార్టీ కి సమాధి కడుతున్నారు. ఏ నలుగురు  నాయకులు అయితే కాంగ్రెస్ కి ప్రాణం పోశారో వారి మరణం విషాదం ... వారి కొడుకులకు అవమానం ---- వారి కొడుకులు ఇప్పటికి ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు. మూడో నాయకుడు అయ్యే దారిలో ఉన్నాడు.  నాలుగో నాయకుడు కూడా నిజం తెలుసుకుంటాడు. రాజేష్ పైలట్ 2000 లో తీవ్రమైన రోడ్డు ప్రమాదo లో మరణం  మాధవరావు సింధియా 2001 లో హెలికాఫ్టర్ లో ప్రయాణిస్తుండగా మరణం .... వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 2009 లో హెలికాఫ్టర్ లో ప్రయాణిస్తుండగా మరణం  దూర్జీ ఖండూ 2011 లో హెలికాఫ్టర్ లో ప్రయాణిస్తుండగా మరణం ....వీరి మరణం తర్వాత వీరి కుమారులకు  తీవ్రమైన అవమానాలు జరిగాయి. పార్టీ వదిలి వెళ్లే వరకు వేధించారు ... వేధిస్తున్నారు... వెళ్లినా వేధిస్తున్నారు.... ఇప్పటికి ఫెమా ఖండూ, వై ఎస్  జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రులు అయ్యారు.  ఇప్పుడే జ్యోతిరాదిత్య సింధియా ముఖ్య మంత్రి అవుతాడు అనే నమ్మకం వచ్చింది. కాదు కాదు.... జోతిరాధిత్య ను పదే పదే అవమానాలకు గురి చేయటం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఆ అవకాశాన్ని కల్పించింది. ఇక సచిన్ పైలెట్ కూడా కాంగ్రెస్ బయటకి వస్తే కాంగ్రెస్ కి సమాధి ఖాయం అనే అభిప్రాయం బలంగా కనిపిస్తోంది. ప్రజలు మెచ్చే నాయకులకి పదవులు ఇవ్వాలి ... 10 జనపథ్ నుండి వచ్చే వారికి కాదనే డిమాండ్ పార్టీ లో బలంగా వినిపిస్తోంది.

నానక్ రామ్ గూడలో అమెరికా కాన్సులేట్

హైద‌రాబాద్‌లో నిర్మాణం అవుతున్న‌ నూతన అమెరిక‌న్ కాన్సుల్‌ జనరల్‌ కార్యాలయం ఒక్క తెలంగాణ రాష్ట్రానికే కాక ఇతర రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉండ‌బోతోంది. వచ్చే ఏడాది నుంచి నూతన భవనం అందుబాటులోకి వస్తుంది. నానక్ రాం గూడలో నిర్మిస్తున్నఅమెరికా నూతన కాన్సుల్ జనరల్ కార్యాలయానికి సంబంధించిన టాపింగ్ ఔట్ కార్యక్రమంలో జ‌రిగింది. వ‌చ్చే సంవ‌త్స‌రం నుంచి మొత్తం కార్య‌క్ర‌మాలు నాన‌క్‌రాం గుడ నుంచి జ‌రుగుతాయి. హైద‌రాబాద్ సంస్కృతిని ప్ర‌తిబింభిస్తూ నిర్మాణ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంతో జ‌రుగుతున్నాయి. అమెరికా అంబాసిడర్‌ కెన్నత్‌ ఐ జస్టర్‌తో కలిసి మంత్రి కేటీఆర్‌ పాల్గొని మాట్లాడారు. కాన్సుల్‌ జనరల్‌ కార్యాలయం హైదరాబాద్‌ నగర సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నంగా నిలుస్తుందని అన్నారు. దక్కను పీఠభూమి నిర్మాణ శైలిని, హైదరాబాద్‌ సహజత్వానికి దగ్గరగా కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని అమెరికా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అమెరికా తెలంగాణ మధ్య స్నేహపూర్వక బంధం ఉందని, భవిష్యత్తులో ఇది మరింత బలోపేతమవుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అమెరికా, భారత్‌ మధ్య సత్సంబంధాలు కలిగి ఉండటం ప్రపంచానికి మేలు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇక్కడికి భారీ కాన్సుల్‌ జనరల్‌ కార్యాలయం రావడం రాష్ట్రానికి గర్వకారణమని ఆయన అన్నారు. పరిశ్రమల ఏర్పా టుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న టీఎస్‌ ఐపాస్‌ బాగుందని అమెరికా అంబాసిడర్‌ కెన్నత్‌ ఐ జస్టర్‌ కొనియాడారు. హైదరాబాద్ నగరం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని, ఇలాంటి నగరంలో భారీ కాన్సుల్ జనరల్ కార్యాలయం రావడం ఇక్కడి పౌరులకే గాక ఇతర రాష్ట్రాల పౌరులకు కూడా సౌకర్యంగా ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. రానున్న రోజుల్లో అమెరికా మరియు తెలంగాణల మధ్య మరింత దృఢమైన బంధం ఏర్పడుతుందన్న విశ్వాసాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య స్సంబంధాల కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత దేశ ప్రధాని మోడీ ఈ దిశగా కృషి చేస్తున్నారని తెలిపారు. తాజాగా ఇండియాలో పర్యటన విజయవంతానికి భారత్లో అమెరికా రాయబారి కెన్నెత్ జేస్టర్ కృషి చేశారన్నారు.

పరిమళ్ రాజ్యసభ సభ్యత్వం వెనుక పరిమళించిన క్విడ్ ప్రో కో ఏంటి?

రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్ధులను ముఖ్యమంత్రి, వైసీపీ అద్యక్షుడు జగన్ ఖరారు చేశారు. శాసన మండలి రద్దు గురించి పట్టుదలగా ఉన్న జగన్ మండలి రద్దుతో మంత్రి పదవులు కోల్పోతున్న మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లకు రాజ్యసభ స్థానాలు ఖరారు చేశారు. వీరితో బాటు తనకు అత్యంత నమ్మకస్తుడైన ప్రముఖ పారిశ్రామికవేత్త, తన ఆదాయ వనరుల పెరుగుదలలో ఒక పాత్ర పోషించిన అయోధ్య రామిరెడ్డికి కూడా రాజ్యసభకు పంపి న్యాయం  చేశారు. ఇక మిగిలిన నాలుగో స్థానంలో కేసిఆర్ బాటలో నడుస్తున్న జగన్ ఆయనలానే కుటుంబసభ్యులకు ప్రాధాన్యమిస్తూ.. చెల్లెలు షర్మిలకు అవకాశం ఇస్తారని అందరూ భావించినా అందుకు భిన్నంగా కొత్త అభ్యర్ధిని, రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తిని ఖరారు చేశారు. ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ముఖ్యమంత్రి జగన్ ని కలిసిన విషయం తెలిసిందే. జగన్ తో సమావేశం సందర్భంగా ముఖేష్ అంబానీ పరిమళ్ నత్వానీకి రాజ్యసభ టిక్కెట్ ప్రతిపాదన ఆయన ముందు ఉంచారు. పారిశ్రామికవేత్త ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు అయిన పరిమళ్ నత్వానీకి రాజ్యసభ స్థానం కేటాయించాల్సిందిగా ముఖేష్ జగన్ ను కోరారు. తనకు మూడు రోజుల సమయం ఇస్తే ఆలోచించి చెబుతాన్న జగన్ బాగా ఆలోచించి తన చెల్లెల్ని కాదని పరిమళ్ నత్వానీకి రాజ్యసభ టిక్కెట్ ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇంతవరకూ అందరికీ తెలిందే..ఇక్కడే కొందరు రకరకాల కొత్త ప్రశ్నలు లేవదీస్తున్నారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణంలో రిలయన్స్ పాత్ర ఉందని అప్పట్లో తన పత్రికలో, చానల్లో కధనాలు రావడమే కాకుండా అప్పట్లో  వైసీపీ కార్యకర్తలు రిలయన్స్ సంస్థల మీద దాడులు చేసిన విషయం కూడా అందరికీ తెలుసు.  జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వం ఆ కేసులను ఉపసంహరించుకుంది కూడా. ఇప్పుడు అదే సంస్థ అధినేత సిఫారసుతో రిలయన్స్ కార్పోరేట్ దిగ్గజుడైన పరిమళ్ నత్వానీని వైసీపీ నుంచి రాజ్యసభకు పంపడం చర్చనీయాశం అయింది. ఇప్పటికే క్విడ్ ప్రో కో కేసుల్లో ఉన్న జగన్ ఈ డీల్ ఊరికే కుదుర్చుకుని ఉండడని పరిశీలకులు అంటున్నారు. ఇక్కడే కొంత మంది ఒక అడుగు ముందుకేసి కొత్త వాదనలు తెరపైకి తెస్తున్నారు. చరిత్రలో తండ్రి బతికుండగా ఏ కొడుకూ రాజకీయంగా అంతగా రాణించలేదని జగన్ కూడా ఆ కోవకే చెందుతారనీ, అందుకే తండ్రి మరణానికి కారకులని ముద్ర వేసిన సంస్థకు చెందిన వ్యక్తికి పదవి కట్టబెట్టి, కేసులు చుట్టి పెట్టి.. తాను ముఖ్యమంత్రి అవ్వడానికి పరోక్షంగా సాయపడినందుకు ఋణం తీర్చుకున్నారని అంటున్నారు. ఈ విషయాన్ని ప్రతి పక్షం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేసింది కూడా. మొత్తానికి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్న విషయాన్ని జగన్ మరో మారు నిజం చేశారు.

కేరళలో మరో ఆరు కరోనా పాజిటివ్ కేసులు.. మార్చి ఆఖరు వరకూ అన్నీ బంద్‌!

కరోనా ధాటికి కేరళ సంచలన నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి మార్చి ఆఖరు వరకూ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు కేరళ సీఎం పినరయి విజయ్ ప్రకటన చేశారు. ఏడో తరగతి పైబడిన విద్యార్థుల పరీక్షలు మాత్రం కొనసాగుతాయని తెలిపారు. ఈ నెల మొత్తం ప్రభుత్వ పరమైన వేడుకలు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. సినిమా హాళ్లు డ్రామా కంపెనీలు తెరవద్దని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పటికే నిశ్చయమైన పెళ్లిళ్లు మాత్రమే జరపాలని.. అవి కూడా తక్కువ మందితో నిర్వహిస్తే మంచిదని అన్నారు. మత సంబంధమైన వేడుకలు కూడా నిర్వహించొద్దని ఆదేశించారు. ఇప్పటివరకూ కేరళ వ్యాప్తంగా దాదాపు 1116 కరోనా అనుమానితుల వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. క‌రోనా ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్‌లపైనే కాదు.. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్, మల్టీప్లెక్స్‌లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్‌తో చాలా మాల్స్‌తో పాటు థియేటర్స్‌ ఇపుడు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కొత్త సినిమాల విడుదలను కూడా ఆపేశారు.ఎక్కువమంది ఒక్క చోట ఉండే ప్రదేశాల్లో ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తాజాగా కేరళలో కరోనాకు సంబంధించిన మరో ఆరు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో తక్షణ చర్యల్లో భాగంగా అత్యధిక మంది గూమిగూడే ప్రదేశాలైన థియేటర్స్, మాల్స్, ఎగ్జిబిషన్‌కు సంబంధించిన వాటిని ఈ నెల 31 వరకు నిరవధికంగా బంద్ చేస్తున్నట్టు అక్క‌డి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలు 

ఏపీలో స్థానిక సంస్థలకు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు లకు నామినేషన్లు దాఖలు ప్రక్రియ మొదలయింది. 13 జిల్లాల జిల్లా పరిషత్తు ప్రాదేశిక, మండల పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాల పరిధిలో జిల్లాల  వారిగా సోమవారం దాఖలు అయిన నామినేషన్ లు వివరాలు.. రాష్ట్రంలోని 652 జిల్లా పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గ లకు గాను అభ్యర్థులు 68 నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రంలోని 9947 మండల పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గ లకు గాను అభ్యర్థులు 771 నామినేషన్లు దాఖలు చేశారు.  జిల్లా పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాలు: శ్రీకాకుళం38 కి గాను 1, విజయనగరం 34  కి గాను 2,విశాఖపట్నం 39 కుగాను 3, తూర్పుగోదావరి 61 కు గాను 2, పశ్చిమగోదావరి 48 కి గాను 6, కృష్ణా 46 కుగాను 2,  గుంటూరు 54 కుగాను 2, ప్రకాశం 55 కుగాను 6,  ఎస్పీ ఎస్సార్ నెల్లూరు 46 కుగాను 7,  కర్నూలు 53 కుగాను  సున్నా, అనంతపురం 63 కుగాను 9,  చిత్తూరు 65 కు గాను 22, వై ఎస్ ఆర్ కడప 50 కుగాను 6 నామినేషన్ లు దాఖలు అయ్యాయి. మండల పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాల నామినేషన్ల వివరాలు: శ్రీకాకుళం  667 కు గాను 40, విజయనగరం 549 కుగాను 14, విశాఖపట్నం 651 కుగాను 38, తూర్పుగోదావరి 1086 కుగాను 93, పశ్చిమగోదావరి  863 కుగాను 71, కృష్ణా  723 కుగాను 50, గుంటూరు(805) కుగాను 32,  ప్రకాశం లో 47,  ఎస్పీ నెల్లూరు లో  39,  కర్నూలు లో 37, అనంతపురం లో 78, చిత్తూరు లో 213, వై ఎస్ ఆర్ కడప జిల్లాలో  19 నామినేషన్ లు దాఖలు అయ్యాయి.

స్థానిక సంస్థల ఎన్నికల పరశీలకుల్లో ఐదుగురు ఐఎఎస్ అధికారుల మార్పు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థలకు ఎన్నికల పరిశీలకులలో ఐదుగురు ఐ ఏ ఎస్ అధికారులను మార్చింది. ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్  ఈ విషయం వెల్లడించారు.ఎన్నికల పరిశీలకులు గా 13 జిల్లాలకు  సీనియర్ ఐ ఏ ఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్  ఇప్పటికే నియమించిన విషయం . వారితో పాటుగా మరో నలుగురు ఉన్నతాధికారులను రిజర్వు లో ఉంచింది.  జిల్లాల వారిగా - టి.బాబు రావు నాయుడు - కర్నూలు,  లతకార్ శ్రీకేష్ బాలజీరావు - కృష్ణ జిల్లా , హెచ్. అరుణ్ కుమార్ - తూర్పు గోదావరి జిల్లా,    పి.ఎ.  శోభా - విజయనగరం జిల్లా, కె. హర్షవర్ధన్ - అనంతపురం జిల్లా, సిదర్ధ్ జైన్ -  చిత్తూరు జిల్లా,  బి. రామారావు -  శ్రీకాకుళం జిల్లా,  వివేక్ యాదవ్  - ప్రకాశం జిల్లా , ప్రవీణ్ కుమార్ - విశాఖపట్నం జిల్లా,  పి. బసంత్ కుమార్  - ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా , పి. రంజిత్ బాషా - వైయస్ఆర్ కడప జిల్లా,   కాంతిలాల్ దండే - గుంటూరు జిల్లా, హిమాన్షు శుక్లా -  పశ్చిమ గోదావరి జిల్లా లకు ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరిస్తారని  రమేష్ కుమార్ వెల్లడించారు.

హైకోర్టు తీర్పుతోనే అసలైన హొలీ: నారా లోకేష్ 

పంచాయతీ భవనాలకు రాజకీయ పార్టీల రంగులు తొలగించాలని హైకోర్టు ఆదేశం  చెడు పై మంచి గెలిచిన రోజున రంగులు చల్లుకొని హోలీ జరుపుకుంటాం. అదే హోలీ రోజున ప్రభుత్వ భవనాలకు వైకాపా వేసిన రంగులు చెరిపేయాలని కోర్టు తీర్పివ్వడం చెడు పై మంచి సాధించిన విజయం, అంటూ తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. హొలీ పండుగ రోజున ఈ తీర్పు వెలువడటం పై లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. పేద వాడికి అన్నం పెట్టడానికి మనసొప్పలేదు. 1400 కోట్ల ప్రజాధనం పోసి వేసిన రంగులు చెరిపేందుకు మరో 1400 కోట్లు? ఇదేనా రివర్స్ పాలన?, అని కూడా ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.  పంచాయతీ భవనాలకు రాజకీయ పార్టీల రంగులు తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. పంచాయతీ భవనాలు, ప్రభుత్వ భవనాలకు సీఎస్‌ నిర్ణయం ప్రకారం పది రోజుల్లో మళ్లీ రంగులు వేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేసినట్లు ఆధారాలను నివేదిక రూపంలో సమర్పించాలని సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది. గుంటూరు జిల్లా పల్లపాడుకు చెందిన ముప్పా వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

మోషా క‌లిపారు వారిద్ద‌రినీ!

మోదీ, అమిత్‌షా జోక్యంతో అంబానీ జ‌గ‌న్‌ల మ‌ధ్య వున్న వైర్యం తొలిగింది. వారి మ‌ధ్య వున్న శ‌త్రుత్వాన్ని వ‌దులుకుని ఒక్క‌టైయ్యారు. బిజెపి-జ‌గ‌న్ కు ఉన్న అవ‌స‌రాలే వారి బంధాన్ని ప‌టిష్టం చేసిందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. వైసీపీ-బీజేపీ మధ్య కొన‌సాగుతున్న రహస్య ప్రేమ న‌త్వానీని రాజ్య‌స‌భ‌కు పంప‌డానికి మార్గం సుగ‌మం చేసింది. త‌మ‌ ప్రేమ‌కు గుర్తుగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ బిజెపికి రాజ్య‌స‌భ సీటు గిఫ్ట్ గా ఇచ్చారు. పార్టీలో రాజ్య‌స‌భ సీటు కోసం తీవ్ర‌మైన పోటీ వున్న‌ప్ప‌ట్టికీ వారంద‌రినీ కాద‌ని నత్వానీ ఎంపిక చేసి తన ప్రేమ‌ను చాటుకున్నారు జ‌గ‌న్‌. రాజ్యసభ ఎన్నికలు బీజేపీ వైసీపీ బంధాన్ని నిజం చేశాయి. రాజ్యసభలో బీజేపీకి బలం లేదు. ఈ నేపథ్యంలో వైసిపి అవ‌స‌రం బిజెపికి వుంది. జగన్ అయితే కేసుల కోసమైనా, తామ మాట వింటారన‌ది బిజెపి ధీమా. అటు, వైసీపీ అధినేత జగన్‌కూ తనకున్న కేసుల అవసరాల దృష్ట్యా కేంద్రంలో బీజేపీ సహకారం తప్పనిసరి. బీజేపీ జగన్‌ను వదులుకునేందుకు సిద్ధంగా లేదన్నది సుస్పష్టం. జగన్ పార్టీకి లోక్‌సభ-రాజ్యసభలో బలం ఉంది. కాబట్టి ఆయనను వదులుకునేంత తెలివి తక్కువ పని బీజేపీ చేయదు. అంత అవసరం కూడా ఆ పార్టీకి లేదు. వైసీపీతో తెరచాటు స్నేహం చేస్తే, ప్రజలు ఏమనుకుంటారోనన్న భయం కూడా లేదు. ఎందుకంటే ఏపీలో బీజేపీకి ఎలాగూ బలం లేదు. కాబట్టి, కొత్తగా వచ్చిన నష్టమేమీ లేదు. రాజ్యసభలో బిల్లులు పాస్ కావాలి. కమలానికి ఫ్యాను గాలి అవసరం వుంది. అదే బిజెపి లెక్కా. అంబానీల‌కు ప్ర‌భుత్వంలో పనులు చేసి పెట్టే పెద్ద మ‌నిషే నత్వానీ. అయితే బీజేపీకి రాజ్యసభలో బలం లేదు. నత్వానీని పార్టీ పరంగా, రాజ్యసభకు పంపించే అవకాశాలు లేవు. కాబట్టి, బీజేపీ ఢిల్లీ పెద్దలు జగన్‌తో సంబంధం కలిపారు. నత్వానీకి రాజ్యసభ సీటివ్వడం అనేది ప్రధాన అజెండాగా ప్రధానితో జగన్ భేటీ తర్వాత, అమిత్‌షాతో స‌మావేశం జ‌రిగింది. నత్వానీకి ఏపీ నుంచి రాజ్యసభకు రంగం సిద్ధం చేసి, జగన్‌తో మాట్లాడుకోండని చెప్పిన తర్వాతనే, ముఖేష్ అంబానీ ఆయనను వెంటబెట్టుకుని జగన్‌ను కలిశారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల్ని చూసి ఏపీ బీజేపి నేత‌లు విష‌యాన్ని అర్థం చేసుకోలేక గిల‌గిల కొట్టుకుంటున్నారు. ఇంత‌కు త‌మ‌కు వైసీపీ మిత్రపక్షమో, శత్రుపక్షమో తేల్చుకోలేకపోతున్నారు. అధికార పార్టీకి వ్య‌తిరేకంగా రాష్ట్ర సమస్యల పై తాము రోజూ యుద్ధం చేస్తుంటే ఢిల్లీ పెద్దలు మాత్రం ముఖ్య‌మంత్రితో తెరచాటు వ్య‌వ‌హారం చేయ‌డాన్ని మింగ‌లేక క‌క్క‌లేక నోరెళ్లబెడుతున్నారు. బీజేపీ నాయకురాలైన సంచయితకు సింహాచలం ఆలయ చైర్మన్ పదవి ఇచ్చినప్పుడే, ఢిల్లీ స్థాయిలో వైసీపి-బీజేపీ మధ్య ఉన్న పవిత్రబంధమేమిటో అర్ధమయి పోయింది. నత్వానీ ని రాజ్య‌స‌భ‌కు పంపి త‌మ నేత జ‌గ‌న్‌ను కాపాడుకోవ‌డానికి మ‌రోసారి పార్టీ నేత‌లు త్యాగం చేయాల్సి వ‌చ్చింది. రాజ్యసభ ఎన్నికల్లో సీటు కోసం, ఒంగోలులో తన స్థానాన్ని త్యాగం చేసిన వై.వి.సుబ్బారెడ్డి. వైసీపీలో చేరితే ఎం.పీ సీటు ఇస్తారని ఆశపడి చేరిన బీద మస్తాన్‌రావు. విపక్షంలో ఉండగా పార్టీని ఆర్ధికంగా ఆదుకున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి. కాపు కోటాలో సీటు వస్తుందని ఆశించిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. వీరందరికంటే, అన్న జైలులో ఉంటే పాదయాత్ర చేసి పార్టీని బతికించిన చెల్లెమ్మ షర్మిలల‌ ఆశ‌ల్ని అడిఆశ‌లు చేసి పరిమళ్ నత్వానీ అనే గుజరాతీయుడికి ముఖ్య‌మంత్రి జగన్ ఎం.పీ సీటివ్వడం రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జగన్ జైలులో ఉండగా, వైవి సుబ్బారెడ్డి ఆయనను, ఆయన కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడారు. ఆయనకూ ఈసారి నిరాశే ఎదురయింది. అన్న అరెస్టయి జైలులో ఉంటే, కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా చెల్లెలు షర్మిల చేసిన పాదయాత్ర, పార్టీని బతికించింది. అయినా, ఆమె త్యాగానికి ఇప్పటివరకూ ప్రతిఫలం లేదు. మ‌రో వైపు తన భర్త మృతికి రిలయన్స్ కారణమని ఆరోపించిన వైఎస్ విజయలక్ష్మి ఆరోపణలు, తన తండ్రి మృతిపై సీబీఐ విచారించాలన్న జగన్ డిమాండు, తమ ప్రియతమ నేత వైఎస్ మృతికి అంబానీలే కారణమన్న ఆగ్రహంతో, వారి సంస్థలను తగులబెట్టిన వైఎస్ వీరాభిమానుల వీరంగాన్ని రాష్ట్ర ప్ర‌జ‌లు ఇంకా మర్చిపోలేదు. ముఖేష్ అంబానీ సీఎం జగన్ నివాసానికి రావడం రాజ్యసభ సీటు కోరడం నత్వానీకి రాజ్యసభ సీటివ్వడం చ‌క‌చ‌క జ‌రిగిపోయాయి. అంతే. తన తండ్రి మృతికి కారణమయ్యారని ఆరోపించిన, అదే అంబానీ కుటుంబ విధేయుడైన నత్వానీకి సీటివ్వడం వైసీపి కార్య‌క‌ర్త‌ల‌కు మింగుడుప‌డ‌డం లేదు. ముఖేష్ అంబానీ-జగన్ మధ్య కేజీ బేసిన్ గ్యాస్ యుద్ధం జరిగిందని తెలుసు. వైఎస్ హెలికాప్టర్ మృతి వెనుక, కాంగ్రెస్-అంబానీ కుటుంబ హస్తం ఉందని స్వయంగా జగన్ మీడియా సాక్షి ఆనాడు కోడై కూసింది. స్వయంగా జగన్ మాతృమూర్తి విజయమ్మ కూడా అదే ఆరోపించారు. అటు జగనన్న కూడా అంబానీ కుటుంబంపై అనుమానం వ్యక్తం చేశారు. వాస్త‌వానికి జగన్ మనస్తత్వం ప్రకారం చూస్తే అంబానీకి మాట్లాడే అవకాశమే ఇవ్వడ‌నిపిస్తుంది. వీలైతే రిల‌య‌న్స్ కంపెనీల‌కు ఏపీలో నిలవ నీడ లేకుండా చేస్తాడేమో అనుకునేవారు వైసిపి కార్య‌క‌ర్త‌లు. కానీ, అలాంటి అంబానీ సిఫార్సు చేసిన వ్యక్తికి, ఏకంగా రాజ్యసభ సీటే ఇచ్చారంటే.. జ‌గ‌న్ అవసరం ఏమిటన్నది ఇట్టే అర్ధమవుతుంది. దీన్నిబట్టి, జ‌గ‌న్ చెప్పే మాటలకు, చేసే పనులకు ఎలాంటి సంబంధం లేదని, జగన్ కూడా ముదిరిన‌ రాజకీయ నాయకుడే అని తేలిపోయింది. మత మార్పిళ్లు, అన్యమత ప్రచారం, స్వాముల యాగీ అంతా ప్రచారానికే తప్ప, దానితో బీజేపీకి వచ్చే నష్టమేమీ లేదు. పాపం ఈ లోగుట్టు, తెరవెనుక బాగోతం తెలియక బీజేపీ సంప్రదాయవాదులు చొక్కాలు చించుకుంటున్నట్లు కనిపిస్తోంది.

ఖజానా ఖర్చుతో ప్రకటనల ఫోటోలు, సందేశాల బహిరంగ ప్రదర్శన పై నిషేధం

స్థానిక సంస్థలకు ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ప్రవర్తనా నియమావళి) అమలులో ఉన్న దృష్ట్యా   ఖజానా ఖర్చుతో ప్రకటనలపై ఫోటోలు, సందేశాలను ప్రదర్శించడం, బహిరంగ ప్రదర్సనకు ఉంచడంపై నిషేధం విధించినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ ప్రకటించారు. అదేవిధంగా  ప్రస్తుతం జీవించి ఉన్న నాయకుల విగ్రహాలను కవర్ (ముసుగువెయ్యడం) చేయడం తప్పనిసరి అన్నారు.  ప్రభుత్వ నిధులతో నిర్మించిన ప్రజా జీవితంలో చురుకుగా ఉన్న వారికి  చెందిన  ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ ల ద్వారా  , ప్రభుత్వ భవనాలపై బహిరంగ ప్రదర్శన లు నిషేధం అమలు రావడం జరిగిందన్నారు. మార్చి 7వ తేదీ  ఎమ్ సిసి  అమల్లోకి వచ్చినందున ఎన్నికల మోడల్ ప్రవర్తనా నియమావళి స్థానిక సంస్థలకు ఎన్నికలు పూర్తయ్యే వరకు అమలులో ఉంటుందన్నారు.  ఎన్నికల ను సజావుగా నిర్వహించడానికి ,  మోడల్ ప్రవర్తనా నియమావళి న్యాయమైన, సమతుల్యమైన,  నిష్పాక్షికమైన రీతిలో అమలు చేస్తామన్నారు.   ఎన్నికలను నిర్వహించే కాలంలో ప్రభుత్వ వ్యయంతో విగ్రహాలు, ఛాయాచిత్రాలు,  సందేశాలను ప్రదర్శించడానికి  వీలులేదన్నారు.   ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో లభించే మంత్రులు, రాజకీయ నాయకులు లేదా రాజకీయ పార్టీలకు సంబంధించిన అన్ని ఛాయా చిత్రాలను తొలగిస్తామనీ , వాటి విషయమే చర్యలు తీసుకుంటామని, ప్రక్షాళన లో భాగంగా వాటి తొలగింపునకు ఎన్నికల కమిషన్ ద్వారా చర్యలు తీసుకుంటామని తెలిపారు.  అన్ని రాజకీయ నాయకుల ఛాయాచిత్రాలు రాష్ట్ర విభాగాల అధికారిక వెబ్‌సైట్ల నుండి తొలగించాలని స్పష్టం చేశామన్నారు.   అదేవిధంగా అన్ని హోర్డింగ్‌లు, ప్రకటనలు మొదలైనవి, ప్రభుత్వ నిధులతో, ఏదైనా జీవన రాజకీయ నాయకులు లేదా రాజకీయ పార్టీల విజయాలు సాధించటానికి  అనుకూలంగా ప్రభావం   చూపే వాటిని  వెంటనే తొలగించాలన్నారు.  ప్రజా జీవితంలో చురుకుగా ఉన్న ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులు మరియు ఇతర రాజకీయ కార్యకర్తల ఛాయాచిత్రాలను ప్రభుత్వ భవనాలు, ప్రాంగణాల్లో ప్రదర్శించడం పై నిషేధం ఉందన్నారు.  ఈ సూచన జాతీయ నాయకులు, కవులు మరియు గతంలోని ప్రముఖ చారిత్రక వ్యక్తుల చిత్రాలకు లేదా భారత రాష్ట్రపతి మరియు గవర్నర్ల చిత్రాలకు వర్తించదని,  వీటిని ప్రదర్శించబడటం కొనసాగించవచ్చు అని స్పష్టం చేశారు . రాజకీయాల్లో ఇప్పటికీ చురుకుగా ఉన్న రాజకీయ పార్టీల జీవన నాయకుల విగ్రహాలను ప్రభుత్వ నిధులతో నిర్మించినట్లయితే వాటిని వెంటనే తొలగించాలని పేర్కొన్నారు. , ప్రజా నిధులతో నిర్మించిన గత నాయకుల విగ్రహాలను కవర్ చేయవలసిన అవసరం లేదు. ఎన్నికల కోడ్ అమలు చేసిన తరువాత ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు ఆధ్వర్యంలో ఉత్పత్తి చేయాల్సిన విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, మోడల్ ప్రవర్తనా నియమావళిలో రాజకీయ కార్యకర్తలు, పార్టీల ఛాయాచిత్రాలు లేదా సందేశాల చిహ్నాలు ఉండకూడదన్నారు.  ఈ సూచనలు ఇప్పటి వరకు అమలు చేయనట్లయితే, వెంటనే అమలు చేయలని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ సూచనలను అతిక్రమించి ,  వాటి అమలులో లోపభూయిష్టంగా వ్యవహరిస్తే  తీవ్రంగా పరిగణిస్తామని  రమేష్ కుమార్ హెచ్చరించారు.

రాజ్యసభకు పరిమళ్ నత్వానీ ఎంపికతో ఏపీ లాభపడుతుందా?

రాజ్యసభ కు వై ఎస్ ఆర్ సి పి  నుంచి ఓ గుజరాతి వాసి అయిన పరిమళ్ సత్వానీ ని జగన్ పంపడం వెనుక  రహస్యం ఏమిటి? ఆంధ్ర ప్రదేశ్ క్యాపిటల్ కారిడార్స్ లో ప్రస్తుతం ఈ ప్రశ్న షికార్లు చేస్తోంది.  ఏపి కి ప్రత్యేక హోదా - రాయితీలతో కూడిన విభజన హామీలకు, పోలవరం ప్రాజెక్ట్ కు, ప్రధానం గా కాకినాడ పెట్రో కెమికల్, కాస్మొటిక్ బారి ఇండస్ట్రీ కి , రామాయపట్నం మేజర్ పోర్ట్ కి, కడప ఉక్కు ఫ్యాక్టరీ కి, విశాఖపట్నం రైల్వే డివిజన్ తో కూడిన రైల్వే జోన్ కి, శ్రీకాకుళం, రాజమండ్రి, అనంతపురం ప్రాంతాలలో హై కోర్టు బెంచ్ లకి కేంద్ర ప్రభుత్వం నుండి నత్వానీ సాధించి పెట్టగలరా, అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఏపిలో గల అపార గ్యాస్ నిక్షేపాలకు, చమురు సంపద దోపిడీలకు మరింత ప్రమాదం పొంచి వుందా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్న రాజకీయ వర్గాలు, పరిమళ్ నత్వానీ మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయం లో ఏ మేరకు నిబద్ధత తో వ్యవహరిస్తారని ప్రశ్నిస్తున్నాయి.  ఏపి లో గల కోనసీమ నుండి వేల కోట్లు విలువ చేసే చమురు, గ్యాస్ నిక్షేపాలను అన్వేషణ కారణంగాను, నిత్యం ఆ నిక్షేపాలు రవాణా కారణంగా నష్టపోతూ ప్రమాదపు అంచులలో వున్న కోనసీమ ప్రాంత  భద్రత కు, అభివృద్ధికి ఒక 1000 కోట్లు  సహాయ నిధిని కేంద్రం నుండి, రిలయన్స్ సంస్థ నుంచి పరిమళ్ నత్వాన్నీ విడుదల చేయించగలరా, అని కూడా పొలిటికల్ కారిడార్లు ప్రశ్నిస్తున్నాయి.  చెన్నై కేంద్రం గా వున్న ఓ ఎన్ జీ సి  ప్రధాన కార్యాలయాన్ని రాజమండ్రి ప్రాంతానికి తరలించ గలరా,  చమురు, గ్యాస్ కాలుష్య  భాదితులైన ఏపి ప్రజలకు వంట గ్యాస్ ధర 250 రూపాయలకే  పంపిణి చేయించ గలరా అని కూడా రాజకీయ పార్టీలు పరిమళ్ నత్వానీ కి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. వీటిలో ఏ ఒక్క దానికైనా నత్వానీ ద్వారా  ఏపి కి మేలు జరుగుతుందా, లేక  వైసిపి పార్టీలో రాజ్యసభకు సమర్థులు లేరా అనే వాస్తవాన్ని అంగీకరించే విధంగా ఆ శ్రేణులు బహిరంగ ప్రకటన చేయగలరా అని మరి కొందరు సూటిగా పరిమళ్ నత్వానీ కి ప్రశ్నలు సంధిస్తున్నారు.