కన్నా లక్ష్మీ నారాయణ ఏపీ లో లేరా, అంటూ బొత్స సెటైర్లు!
* విశాఖలో కరోనా రావాలని చంద్రబాబు కోరుకుంటున్నారా..?కరోనా కేసులను మేం దాస్తే.. చంద్రబాబు బయటపెట్టొచ్చుగా..? ఏంటండి ఈ మాటలు: బొత్స
* ప్రజల్లో ఆందోళన పెంచే విధంగా చంద్రబాబు కామెంట్లు చేస్తున్నారు: బొత్స
* రాయపాటి ఈరోజు ఒకటి మాట్లాడతారు...తర్వాత నా భావం అదికాదంటారు....అతనేదో ఓ భావం చెబితే మనం కరెక్ట్ గా రియాక్ట్ అవ్వచ్చు
కన్నా లక్ష్మీనారాయణ ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నారా, లేరా అనే డౌట్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు సడెన్ గా వచ్చింది. కరోనా పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై శ్వేతపత్రం ప్రకటించాలని రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ డిమాండ్ చేశారనే అంశాన్ని, బొత్స ముందు ప్రస్తావించగా, ఆయన పై విధంగా స్పందించారు. " ప్రతిరోజు కరోనా నియంత్రణ చర్యలు, ఇతర అంశాలపై ప్రభుత్వం వివరాలు ఎప్పటికప్పుడు వెల్లడి చేస్తోంది. కన్నాలక్ష్మీనారయణగారు ఈ రాష్ట్రం లో లేరా", అని మంత్రి బొత్సవ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం,వ్యవసాయఉత్పత్తులకు ఎటువంటి ఇబ్బందిలేకుండా మధ్దతు,గిట్టుబాటుధరలు వచ్చేవిధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, కరోనా లాక్ డౌన్ అంశంలో కేంద్రప్రభుత్వంతో రాష్ట్ర అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకువెళ్తున్నారని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో కరోనా టెస్టుల సామర్ధ్యం పెంచుకున్నాం.ఫిబ్రవరి లో 50 మందికి కూడా టెస్ట్ లు చేసే సామర్ధ్యం లేని పరిస్దితినుంచి నేడు రోజుకు 2 వేల పైబడి నిర్ధారణ టెస్టులు నిర్వహించేలా చేయగలిగామని బొత్స పేర్కొన్నారు. పది నిమిషాల్లో టెస్టు రిజల్ట్స్ వచ్చే ఎక్విప్ మెంట్ సిద్దంగా ఉంది.లక్ష కరోనా టెస్టింగ్ కిట్లను స్పెషల్ ఫ్లైట్ లో విదేశాలనుంచి తెప్పించి అందుబాటులోకి తెచ్చామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వాలంటరీవ్యవస్ద ద్వారా ప్రతి ఇంట్లో ఆరోగ్యపరిస్దితులు తెలుసుకుని, కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.
రెడ్ జోన్లలో మందులు,నిత్యావసరాలు,కూరగాయలు అందిస్తున్నాం.నిత్యం ముఖ్యమంత్రి సమీక్షచేస్తూ అధికారులకు సూచనలు చేస్తున్నారని మంత్రి చెప్పారు. ఈ రకంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంటే చంద్రబాబు, టీడీపీ చేసే తప్పుడు ప్రచారం బాధ కలిగిస్తోందని బొత్స వాపోయారు. " పేదల ప్రాణాలతో ఆడుకోవద్దని చంద్రబాబు అంటున్నారు.సూటిగా ఆయనను అడుగుతున్నాను. హైదరాబాదులో కూర్చొన్న చంద్రబాబుకు,ఆయన కుమారుడికి ఏపీలో ఏం జరుగుతుందో తెలియడం లేదు. మీకున్న ఛానల్స్,పత్రికలు రాజకీయకోణంలో ఆలోచన చేస్తున్నారు తప్పితే మరేం చేయడంలేదు.దేశంలో కరోనా టెస్ట్ లు అత్యధికంగా చేస్తున్న ఐదారు రాష్ట్రాలలో ఏపి ఉందా... లేదా... ఇది వాస్తవం కాదా," అని బొత్స ప్రశ్నించారు.
వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శలు చేయడం సరి కాదు.పరీక్షల విషయంలో ఏపీ మిగిలిన రాష్ట్రాలకంటే ముందంజలోనే ఉంది. చంద్రబాబు మాట్లాడుతున్నమాటలు దివాళాకోరు రాజకీయాలు కాదా... .ఇక్కడ పొరపాట్లు జరిగాయని చెప్పండి. లోటుపాట్లుంటే సరిదిద్దుకుంటాం.. కానీ అడ్డగోలుగా రాష్ట్రంలో ఏమీ జరగడంలేదు.. ఏం చేయడం లేదంటూ విమర్శలు చేయడం సరికాదన్నారు. విశాఖలో కరోనా పరీక్షలు చేయడం లేదని....వాస్తవాలు చెప్పడం లేదని ఎందుకంటే.... రాజధానిని అక్కడకు తరలిస్తారని, ఆ ఎఫెక్ట్ పడుతుందనే దిశగా టీడీపీ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
" హైదరాబాదులో పాజిటీవ్ కేసులున్నాయని తెలంగాణ రాజధానిని మార్చేస్తారా..?...ముంబైలో పాజిటీవ్ కేసులున్నాయని మహారాష్ట్ర రాజధానిని మార్చేస్తారా..?మీకు ఆలోచన ఉందా...భాధ్యతఉందా...మీరు మనుషులా...విమర్శలు చేసే ముందు అర్ధం ఉండక్కర్లేదా..? కరోనా కేసులు దాచేస్తే.. ఎంత ప్రమాదమో మాకు తెలీదా..? ప్రతి అంశాన్ని సూక్ష్ణస్దాయిలో పరిశీలన చేసి సిఎం నిర్ణయాలు తీసుకుంటున్నారు," అని బొత్స తీవ్ర స్వరంతో చెప్పారు. మీ నేతలకు ఏమైంది బుధ్ది....విశాఖలో రెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి.పెద్ద పెద్ద ఆస్పత్రులు పది ఉన్నాయి.అక్కడ ఉన్నవాటిని స్టాండ్ బైలో పెట్టాం.అత్యవసరపరిస్థితులు వచ్చినా తట్టుకునేవిధంగా కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుందని కూడా మంత్రి వివరించారు. పేషంట్లకు ఎలా చికిత్స అందించాలి.ఎంతమంది డాక్టర్లు ఉండాలి అనే ఇతర అంశాలను సైతం పరిగణనలోనికి తీసుకుని ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. శాంపిల్ లెక్కలు చెబుతుంటే ఈ లెక్కలకు ఆ లెక్కలకు పొంతనలేదంటూ మాట్లాడుతున్నారు.ఇదేమైనా ఆర్దికలెక్కలా...ఏ ఒక్కరికైనా సరే ఆరోగ్యానికి సంబంధించిగాని,క్వారంటైన్ సెంటర్లలో ఇబ్బందులు ఉంటే అవి మాకు చెప్పండని కూడా బొత్స సూచించారు.