భారత్ లో కొత్తగా 57,117 కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 57,117 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అదే సమయంలో 764 మంది కరోనా కారణంగా మరణించారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,95,988కు చేరగా, మృతుల సంఖ్య 36,511కి చేరింది. దేశంలో ఇప్పటివరకు 10,94,374 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 5,65,103 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 2,083 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 11 మంది మృతిచెందారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 64,786కు చేరుకోగా.. మృతుల సంఖ్య 530కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,754 యాక్టివ్ కేసులు ఉన్నాయి.