Former Andhra Pradesh Chief Secretary LV Subramanyam

ఎల్వీ కి తప్పిపోయిన సీవీసీ ఛాన్స్!

కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌గా సంజయ్‌ కొఠారీ ఈ రోజు  బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఇప్పటివరకూ, ఏపీ ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వీ సుబ్రహ్మణ్యానికే ఆ పోస్టు దక్కుతుందన్న ప్రచారానికి తేరా పడినట్లయింది. ఇప్పటి వరకు ఆయన రాష్ట్రపతికి కార్యదర్శిగా వ్యవహరించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సమక్షంలో కొఠారీ నేడు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌(సీవీసీ) చీఫ్‌ పదవి గత జూన్‌ నుంచి ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఓ ఉన్నతస్థాయి కమిటీ కొఠారీని సీవీసీ చీఫ్‌గా గత ఫిబ్రవరిలోనే సిఫార్సు చేసింది. కానీ, ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో జాప్యం జరిగింది. కొఠారీ 1978 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. హరియాణా కేడర్‌లో పనిచేసిన ఆయన 2016లో పదవి విరమణ పొందారు. అనంతరం పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సెలెక్షన్‌ బోర్డ్‌(పీఈఎస్‌బీ) చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2017లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు కార్యదర్శిగా వెళ్లారు.

jawahar reddy on corona cases in ap

ఏపీ లో ఒక్క రోజులో 61 పాజిటివ్ కేసులు: జవహర్ రెడ్డి

ఆంధ్ర ప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 6,928 నమూనాలు పరీక్ష చేస్తే 61 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 61, 216 టెస్టులు చేశామని, మిలియన్ మందికి 1147 టెస్టులు చేసి దేశంలో నే అగ్రస్థానంలో ఉన్నామని, రాష్ట్రంలో కరోనా కేసుల శాతం 1.66 ఉందని, మిగిలిన రాష్ట్రాల తో పోలిస్తే ఇది చాలా తక్కువని ఆయన వివరించారు.  శ్రీకాకుళం జిల్లాలో 3 పాజిటివ్ కేసులు తేలాయని, పాత పట్నం మండలానికి చెందిన వీరిని ఆస్పత్రికి తరలించామని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో క్లస్టర్లు 196 కి పెరిగాయి.122 పట్టణ ప్రాంతాల్లో 74 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.కోవిడ్ రోగుల్లో ఆక్సిజన్ సాచురేషన్ తగ్గటం సహజం ఇందుకోసం 1900 పల్స్ ఆక్సీ మీటర్లు తెప్పించామని జవహర్ రెడ్డి చెప్పారు. ఎప్పటికప్పుడు ఆక్సిజన్  సాచురేషన్ లెవెల్ ను పరీక్ష చేసి తక్షణమే అందించాలని కోవిడ్ ఆస్పత్రులకు సూచనలు చేశామన్నారు.

nimmagadda ramesh kumar letter issue

నిమ్మగడ్డ నిజంగా హోమ్ శాఖకు లెటర్ రాయలేదా? 

నిమ్మగడ్డ రమేష్ కుమార్ మార్చ్ 18 వ తేదీన  సెంట్రల్ హోం డిపార్ట్ మెంట్ కు నిజంగా ఉత్తరం రాయలేదా? ఇది ఎవరో రాస్తే ఆయన సంతకం పెట్టి పంపించారనే భావన సర్వత్రా వ్యాపించింది. ఉత్తరం చదివిన ప్రతివారికి ఆ భావన కలుగుతోంది.దానిపై విచారణ చేయాల్సిందిగా కోరడం,విచారణ ప్రారంభం కావడం కూడా మనం చూశాం.విచారణలో వెలుగులోకి వస్తున్న అంశాలు చూస్తే కొంత ఆశ్చర్యం కలుగుతోంది.ఆయన,  పర్సనల్ సెక్రటరిగా ఉన్న సాంబమూర్తిగారిని సిఐడివారు విచారణ చేస్తే అది డెస్క్ టాప్ ముందు తయారుచేయడం,తర్వాత లాప్ టాప్ కు పంపడం,తర్వాత పెన్ డ్రైవ్ ద్వారా రమేష్ కుమార్ కు  పంపిితే ఆయన హోంశాఖకు పంపించినట్లుగా చెపుతున్నారు.  ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి చూస్తే డెస్క్ టాప్,లాప్ టాప్ లలో ఫార్మాట్ చేశారు.పెన్ డ్రైవ్ లో అయినా ఉందా అంటే దానిని ధ్వంసం చేశారు.ఏంటిది....ఇది దేనికి సంకేతం.ఇంతకుముందు వ్యక్తమైన అనుమానాలను బలపరుస్తున్నాయా ....లేదా....ఎస్....నిజంగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నప్పుడు అధికారికంగా లెటర్ రాస్తే దాని ఆధారాలను లేకుండా చేయాల్సిన పరిస్ధితి ఎందుకు వచ్చింది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న." అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు స్వతంత్రంగా వ్యవహరించలేదు...ఆయన ఒకరి చేతిలో కీలుబొమ్మలాగా వ్యవహరించారు.చంద్రబాబుగారు ఏమీ చెబితే అది చేశారు.ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టారు..టిడిపి కార్యాలయంలో తయారుచేసిన ఉత్తరం మీద మాత్రమే రమేష్ కుమార్ గారు సంతకం పెట్టారు తప్ప ఆయన ప్రిపేర్ చేసిన లెటర్ కాదు అనేటువంటి అనుమానాలు బలపడుతున్న సందర్భం," అంటూ వై ఎస్ ఆర్ సి పీ ఎం ఎల్ ఏ అంబటి రాంబాబు లేవనెత్తిన ప్రశ్న, కొత్త సందేహాలకు తావిస్తోంది.  221 దీనికి రిఫరెన్స్ నెంబర్ ఇస్తే, ఆ నెంబర్ ఏమిటని అడిగితే టిడిపి ఎంఎల్సి అశోక్ బాబు రాసిన లెటర్ కిచ్చిన నెంబర్ ను దీనికి ఇచ్చారు.  అంటే తప్పుచేసేటప్పుడు కచ్చితంగా ఆధారాలు వదిలిపెట్టి వెళ్తారనేది ఇక్కడ నిజమయిందన్న మాట అంటూ కూడా రాంబాబు విశ్లేషించారు.

ambati rambabu slams chandrababu

గోదావరి పుష్కరాల్లో ఎంతమందికి మరణానికి మీరు కారణమయ్యారు?

* చంద్రబాబుకు అంబటి రాంబాబు ప్రశ్న  నెలరోజుల లాక్ డౌన్ కాలంలో ఒక్క మంచి సలహా చంద్రబాబు ఇచ్చిన పాపాన పోలేదని, బురదచల్లే కార్యక్రమాన్ని కూడా హైద్రాబాద్ లో ఉండి చేస్తున్నారనీ, అపుడప్పుడు స్కైప్ లో వస్తారనీ వై ఎస్ ఆర్ సి పీ ఎం ఎల్ ఏ అంబటి రాంబాబు విమర్శించారు. సుధీర్ఘమైన ఉపన్యాసాలు చెబుతారు.మొన్న  టిడిపి ఎన్ ఆర్ ఐ మీటింగ్ లో చూశాను.వారంతా భజన చేస్తూ.... ఇప్పుడు మీరు ఉండి ఉంటే అద్భుతంగా,చాలా గొప్పగా ఉండేదంటూ మాట్లాడుతున్నారు.  ఏం అద్భుతంగా ఉండేదండి...సొల్లు చెప్పే కార్యక్రమం...గంటల తరబడి ఉపన్యాసాలు ఇచ్చి మీడియా స్పేస్ నంతా ఆక్రమించుకోవాలనే తాపత్రయం తప్ప మరోటి కనిపించడం లేదంటూ అంబటి రాంబాబు సెటైర్ విసిరారు. గోదావరి పుష్కరాలలో ఎంతమంది మరణానికి మీరు కారణమయ్యారు.అయితే మీకు,మాకు తేడా ఉంది.జగన్ గారికి గంటలతరబడి ఉపన్యాసాలు చెప్పేటందుకు ప్రావీణ్యత లేదు.పనిచేయడంలో మాత్రమే ఆయనకు ప్రావీణ్యత ఉంది. ఈరోజు రాష్ట్రంలో  ఐఏఎస్,ఐపిఎస్ అధికారులందరితోను కలసికట్టుగా టీమ్ వర్క్ చేస్తున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు. అందరితో రివ్యూలు చేస్తూ,చర్చిస్తున్నారు.ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా దానిని పరిష్కరించాలనే ప్రయత్నం చేస్తున్నారు. మీరు వేరే రాష్ట్రంలో  ఉన్నారు.ఆ రాష్ర్టానికి,ఏపికి హెరిటేజ్ ఫుడ్స్ నుంచి చెరి 30 లక్షల రూపాయలు చందా ఇచ్చారు.మీరు పర్సనల్ గా పదిలక్షలు ఇచ్చారు.రెండు రాష్ట్రాలు నాకు సమానమే అన్నారు.మంచిదే డబ్బులు ఇవ్వడంలో మీకు సమానం.కాని సలహాలు ఇవ్వడంలో సమానం ఎందుకు లేదండి.....అని అడుగుతున్నాను. ఆ రాష్ట్రంలో వారికి సలహాలు ఇవ్వరు.అక్కడ ఏమీ డిమాండ్ చేయరు.ఇస్తే కేసిఆర్ గారు దరువు వేస్తారనే భయం.ప్రధానమంత్రి నరేంద్రమోది,అమిత్ షా కాళ్లు పట్టుకుంటానికి ప్రయత్నం చేస్తారు.వాళ్లు మీకు కాళ్లు దొరకనివ్వరు, అంటూ రాంబాబు విమర్శించారు. అక్కడొక(తెలంగాణ) రకంగా వ్యవహరిస్తారు.ఇక్కడొక రకంగా వ్యవహరిస్తారు.ఇక్కడ రాళ్లు వేయడం ధర్మం కాదని చెబుతున్నాను. అదేమంటే చంద్రబాబు అంటున్నారు.ఏపి ప్రభుత్వం వాస్తవాలు దాస్తోంది.కరోనా రోగులు ఎంతమంది ఉన్నారో చెప్పడం లేదంట.వాస్తవాలు దాయాల్సిన అవసరం ఎందుకుంటుంది.ఎందుకు ఆ విధంగా బురదచల్లే కార్యక్రమం చేస్తారు.విమర్శలు చేస్తారు. మీతోపాటు బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఇదే విధంగా అన్నారు.హైకమాండ్ మొట్టికాయలు మొట్టినట్లు ఉంది.ఆయన సర్దుకున్నాడు.చంద్రబాబుతో ప్రయాణం చేయకండి దూరంగా ఉండండి.బాబుగారితో కలసి భజన చేయకండని బిజేపి జాతీయ అధ్యక్షుడు చెబితే ఆయన సర్దుకున్నారు. వాస్తవాలు చెప్పకుండా దాయడం అనేది ఈ ప్రభుత్వానికే కాదు ఏ ప్రభుత్వానికి కూడా ఉండటానికే వీల్లేదు.ఉన్న వాస్తవాలు స్పష్టంగా చెబుతున్నా కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు.ఇది దుర్మార్గమైన ఆలోచన.ఈ  సమయాన్ని మీరు ఎంచుకుని జగన్ గారి ప్రభుత్వంపై రాళ్లు వేసే ప్రయత్నం చేయడం ధర్మం కాదు. మీరు హైద్రాబాద్ లో ఉన్నారు.ఈ రాష్ట్రంలో మీకు ఇల్లుందన్నారు కదా.....పరిపాలన చేశారు.ఎందుకు ఈ రాష్ట్రానికి రారు.ఇక్కడ ఉండకండా అక్కడ దాక్కోవాల్సిన ఖర్మ ఏం పట్టింది.ఇది నైతికతేనా, అంటూ రాంబాబు ప్రశ్నించారు.  నేను ఉన్నాను ఈరోజున....గుంటూరులో ఉంటున్నాను...సత్తెనపల్లిలో నన్ను ఎన్నుకున్నారు.రెండురోజులకైనా సత్తెనపల్లి వెళ్లి అధికారులతో మాట్లాడకపోతే నాకు నిద్రపట్టదు.ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ఎలా  సహాయం చేయాలనే తాపత్రయం.ఆ తాపత్రయం మీ దగ్గర ఏది. పోనీ మీకు లేదు....మీకు 70  ఏళ్లు వచ్చాయి. మా లాగానే వృధ్ధులు ...కరోనా సోకితే ప్రమాదం.మీరు రావడం లేదు సరే మంచిదే.మీ అబ్బాయి,యువకుడు, ఆరోగ్యవంతుడు...మీ వారసుడు...మంగళగిరిలో పోటీచేసి దురదృష్టంకొద్ది ఓడిపోయాడు.ఆయన ఎందుకు ఈ రాష్ట్రానికి రాడు.ఆయన ఎందుకు సలహాలు ఇవ్వడు? మీకు సంబంధించిన ఎంఎల్ఏ ఒక్కరైనా సహాయకార్యక్రమాలలో పాల్గొన్నారా....సహాయం చేయాలనే ప్రయత్నం చేశారా.ఇళ్లకే పరిమితం అయి ఇళ్లల్లో కూర్చున్నారు.అదేమంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏ లు,మంత్రులు లాక్ డౌన్ లో బయటకువస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారూ అంటూ విమర్శలు చేస్తున్నారు. అలా చేస్తూ కరోనా వ్యాప్తి చెందేలా చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు. అందరికి మనవి చేస్తున్నాను.రాబోయే కాలం కరోనాతోనే మనం జీవించాలి.సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మన కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లాలి.ఈరోజు మా ఎంఎల్ ఏలు నియోజకవర్గాలలోని పేదవారిని ఎలా ఆదుకోవాలి....రెక్కాడితే గాని డొక్కాడని వారికి నాలుగువేళ్లు లోపలికి వెళ్లేలా ఏం చేయాలి....మనం సహాయం చేయాలా...ఎన్ జి ఓల ద్వారా సహాయం చేయించాలా అనే తాపత్రయంతో ఎంఎల్ ఏలు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ముందుకు వెళ్తుంటే వారిపై కూడా బురదచల్లుతున్నారు. గుంటూరులో ఎక్కువ కేసులు ఉంటే గుంటూరు ఎంఎల్ ఏ గారిది బాధ్యతా...నరసరావుపేటలో ఎక్కువ కేసులు ఉంటే నరసరావుపేట ఎంఎల్ ఏ గారిది బాధ్యతా...మా సత్తెనపల్లిలో ఒకే ఒక్క కేసు ఉంది.నేను గొప్పవాడినా కాదు.... కొన్ని ప్రత్యేక పరిస్ధితుల వలన....విదేశాలనుంచి వచ్చిన వారి వల్లనో.నిజాముద్ధీన్ కు వెళ్లి వచ్చినవారి వల్లనో కొన్ని ప్రాంతాలలో కరోనా వ్యాప్తి జరుగుతోంది.దానిని అరికట్టే విధంగా వ్యవహరించాలి తప్ప సందు దొరికింది కదా అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ ఏలపై బురదచల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఎంఎల్ ఏ నియోజకవర్గ ప్రజలపై ప్రేమాభిమానాలతో ఉండాల్సిన సమయం ఇది.వారికి సహాయం అందిస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండకపోతే చాలా ఇబ్బందులు పడే పరిస్దితి ఉంటుంది. ఈరోజు అనేక సేవాకార్యక్రమాలు జరుగుతున్నాయి.కూరగాయలు,మాస్కులు,శానిటైజర్లు ఇస్తున్నారు.ఈ మధ్య చంద్రబాబు అంటున్నారు....సేవాకార్యక్రమాలు చేయాలంటే వారు స్వయంగా చేయకూడదంట...తహసిల్దార్ కు చెప్పాలంట అని మాట్లాడుతున్నారు.నిజమే కరోనా వ్యాప్తి కాకుండా ఉండేందుకు సిస్టమాటిక్ గా చేయాలని ప్రభుత్వం వ్యవహరిస్తుంటే దానిని సైతం విమర్సించే విధంగా చంద్రబాబు ఆయన తాబేదార్లు పనిచేస్తున్నారు.ఇది సరైన విధానం కాదు. మీరు హైద్రాబాద్ లో కూర్చోండి...సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండండి...ఆ బంగ్లాలోనే ఉండండి....కాని ఈ విధంగా ప్రభుత్వాన్ని,వైద్యులను,ఐపిఎస్,ఐఏఎస్ అధికారులను డిమోరలైజ్ చేయాలనే విధంగా మీరు చూడటం సరైనవిధానం కాదు. చంద్రబాబుగారు మీరు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించకండి...బాధ్యతతో వ్యవహరించండి.సద్విమర్శలు చేయండి.మంచి సలహాలు స్వీకరించేందుకు ఈ ప్రభుత్వం చిత్తశుధ్దితో ఉందంటూ రాంబాబు చెప్పారు.

corona cases in andhra pradesh

ఏపీలో 1,016కు చేరిన పాజిటివ్ కేసులు

ఆంధ్ర ప్రదేశ్ లో గడిచిన 24గంటల్లో కొత్తగా 61 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క కరోనా పాజిటివ్ కేసు లేదనుకున్న శ్రీకాకుళం లో మూడు కేసులు నమోదు కావటంతో, ప్రజలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని, ఇది పోలీసు వారి అవసరం కాదని, ప్రజలు వారంతట వారే స్వీయ నిర్బంధం ఏర్పాటు చేసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు. వైద్యుల సూచన లను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని కూడా అధికారులు చెప్పారు.  ఇదిలా ఉండగా, గుంటూరు జిల్లా బాపట్లలో క్వారంటైన్ నుంచి 30మందిని డిస్చార్జ్ చేసిన అధికారులు. వీరంతా 28రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకుని రెండు సార్లు నెగటివ్ రిపోర్ట్ వచ్చిన వారు. మరో14రోజులు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని వీరికి సూచనలు జారీ చేశారు.

lockdown in telangana

దుకాణాలకు తెలంగాణాలో మాత్రం మే 7 వరకూ అనుమతి లేదు

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రజలు, వ్యాపారులు డిమాండ్ చేస్తుండటంతో కేంద్ర హోంశాఖ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అన్ని షాపులు ఇకమీదట తెరచుకోవచ్చని తెలిపింది. ఐతే... కొన్ని కండీషన్లు పెట్టింది. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌లో రిజిస్టర్ అయిన షాపులు మాత్రమే తెరవొచ్చని కేంద్రం తెలిపింది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పాలకుల అనుమతి తప్పనిసరి మార్గదర్శనం చేసింది. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం మే 7 వరకూ సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది కాబట్టి... తెలంగాణలో కేంద్రం రూల్ వర్తించదు. అదే ఏపీలో కేంద్ర వెసులుబాట్లు అమల్లో ఉన్నాయి కాబట్టి ఏపీలో అన్ని షాపులూ తెరచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే... కేంద్రం  చెప్పిన కండీషన్ల ప్రకారం షాపులు తెరచుకోవచ్చు.  దేశవ్యాప్తంగా షాపింగ్ మాల్స్ మాత్రం తెరవడానికి వీల్లేదు. మరో ముఖ్య విషయమేంటంటే, హాట్ స్పాట్లు, కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నచోట మాత్రం ఏ రాష్ట్రంలోనైనా సరే, షాపులు తెరవడానికి వీల్లేదు.  ఇప్పటివరకూ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కిరాణా షాపులు, నిత్యవసర, అత్యవసర, మందులు, ఫార్మసీ షాపులు మాత్రమే తెరవొచ్చని కండీషన్ పెట్టింది. ఇప్పుడు మాత్రం అన్ని రకాల షాపులూ తెరచుకోవచ్చునని వెసులుబాటు కల్పించింది. ప్రజలు సామాజిక దూరంపాటిస్తూ,మాస్క్, శానిటేజర్లు వాడుతూ, కేంద్రం, వివిధప్రభుత్వాలు ఇచ్చిన ఈ వెసులుబాటును వినియోగించుకోవాలి. లేకపోతే కరోనావైరస్ సామాజిక వ్యాప్తికి దోహదం అవుతుందని పలువురు ఆందోళ వ్యక్తం చేస్తూ, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కో‌రుతున్నారు. అంటే స్టేషనరీ షాపులు, బ్యూటీ సెలూన్స్, డ్రై క్లీనర్స్, ఎలక్ట్రికల్ స్టోర్స్ వంటివి అన్నీ తెరచుకోవచ్చు. ఐతే... రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి ఉండాలి. అలాగే... ఇదివరకట్లా అందరు ఉద్యోగులూ ఆ షాపుల్లో ఉండకూడదు. సగం(50%) మంది ఉద్యోగులతోనే నడపాలి. అలాగే సోషల్ డిస్టెన్స్ మెయింటేన్ చెయ్యాలి, అందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.

kurnool collector veerapandian on coronavirus

కర్నూలు జిల్లాలో 24 మందికి కరోనా నుంచి విముక్తి

కర్నూలు జిల్లాలో కరోనాను జయించిన 24 మందిని విశ్వభారతి  కోవిడ్ ఆస్పత్రి నుండి ఈ సాయంత్రం డిశ్చార్జ్ చేసినట్టు కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు. దీంతో ఇప్పటివరకు కర్నూలు జిల్లాలో 31 మంది కరోనా నుంచి విముక్తి పొందినట్టు చెప్పారు.  ఈ సాయంత్రం డిశ్చార్చ్ అయిన 24 మందిలో కర్నూలు నగరం 7 మంది;  నంద్యాల పట్టణం 7 మంది;  పాణ్యం - ఇద్దరు;  సిరివేళ్ళ-ఇద్దరు;  గడివేముల -ఒక్కరు; రుద్రవరం -ఒక్కరు; నందికొట్కూరు- ఇద్దరు; ఆత్మకూరు- ఒక్కరు; డోన్ - ఒక్కరు. వీరందరూ కూడా పురుషులే. కర్నూలు సమీపంలో ఉన్న విశ్వభారతి జిల్లా కోవిడ్ ఆస్పత్రికి వెళ్లి కరోనా విజేతలను, డాక్టర్లు, సిబ్బందిని అభినందించి... డిశ్చార్చ్ ఆయిన 24 మందికి ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల నగదు, ఫ్రూట్స్ కిట్స్ ను స్టేట్ కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ అజయ్ జైన్, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అందించారు, తర్వాత ప్రత్యేక వాహనాల్లో వారి వారి ఇళ్లకు పంపించారు.  ఈ నెల 6న జిల్లా కోవిడ్ ఆస్పత్రి విశ్వభారతి ఐసోలేషన్ వార్డులలో ఆ 24 మందికి నెగటివ్ ఫలితం రావడంతో ఈ రోజు సాయంత్రం డిశ్చార్జ్ చేసినట్టు విశ్వభారతి కోవిడ్ ఆస్పత్రి డాక్టర్లు వివరించారు.

what is the use with be the real man challenge

పనిలేని హీరోలు.. పనికిమాలిన ఛాలెంజ్ లు

రాజుగారు ఆయన వీపు ఆయన గోక్కున్నా భటులకు గొప్పే అన్నట్టుంది ప్రస్తుతం మన సెలెబ్రిటీల 'Be the real man' ఛాలెంజ్. 'మా హీరో అంట్లు తోమాడు, అసలు మా వాడు రియల్ హీరో అంటే' అని కొందరు తెగ మురిసిపోతున్నారు. అబ్బబ్బ ఆ డైరెక్టర్ ఇల్లు ఊడ్చాడు, అబ్బబ్బ ఆ హీరో దోసె వేశాడు, అబ్బబ్బ ఆ హీరో మొక్కలకు నీళ్లు పోశాడు. వీళ్ళు రియల్ హీరోస్ అంటే అని కొందరు ఓ భజన చేసేస్తున్నారు. ఏ? ఇలా ఇంట్లో పనులు ఎవరూ చేసుకోవట్లేదా?.. సెలబ్రిటీలు ఏమన్నా స్వర్గం నుండి ఊడిపడ్డారా ఏంటి? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నా మనకి వింతేనా?.. కొన్నిరోజులైతే మా హీరోకి తుమ్మొస్తే ఆయన చేతిని ఆయనే అడ్డుపెట్టుకున్నాడు అని కూడా మురిసిపోయేలా ఉన్నారు. అసలిలా సెలబ్రిటీలు వాళ్ళింట్లో పని వాళ్ళు చేస్తూ వీడియోలు పెట్టడం వలన సమాజానికి ఒరిగేదేంటి? పైసా కూడా ఉపయోగం లేదు. షూటింగ్ లు లేక ఇంట్లో ఖాళీగా ఉన్న సెలబ్రిటీలు.. ఇలా ఛాలెంజ్ లు, చీపురుకట్టలు అంటూ మనల్ని పిచ్చోళ్లను చేసి సొమ్ము చేసుకుంటున్నారు అంతే. ఈ రోజుల్లో దాదాపు సెలబ్రిటీలు అందరూ ఫేస్ బుక్ అని, ఇంస్టాగ్రామ్ అని, టిక్ టాక్ అని సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నారు. వాటికితోడు సొంతంగా యూట్యూబ్ చానల్స్ కూడా ఉన్నాయి. ఇంకేముంది తుమ్మినా దగ్గినా వీడియో చేస్తున్నారు. మనం ఎగబడి వీడియోలు చూస్తూ వాళ్ళ జేబులు నింపుతున్నాం. సెలబ్రిటీ లు ఏం చేసినా పబ్లిసిటీనే, ఏం చేసినా పైసలే. వీళ్ళు చేసే ఈ ఛాలెంజ్ ల వల్ల సమాజానికి పైసా కూడా ఉపయోగం లేదు. లాక్ డౌన్ వల్ల రోజువారీ కూలీల నుంచి రైతుల వరకు అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి వారికి ఎంతమంది సెలెబ్రిటీలు అండగా నిలబడ్డారు?. ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేస్తూ కాసులు సంపాదించడమే తప్ప.. వారిని కోటీశ్వరులను చేసిన సమాజం కోసం ఏం చేస్తున్నారు?. హీరోలు, డైరెక్టర్లు ఒక్కో సినిమాకి కోట్లు సంపాదిస్తున్నారు. యంగ్ హీరోలు, డైరెక్టర్లు ఒక్కో సినిమాకి 10-15 కోట్లు పైనే తీసుకుంటున్నారు. ఇక స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు అయితే ఒక్కో సినిమాకి 20-30 కోట్లు పైనే తీసుకుంటున్నారు. మా సినిమా అంత కలెక్ట్ చేసింది, ఇంత కలెక్ట్ చేసిందని గొప్పలు చెప్పుకుంటారు. అదంతా ఎవరి సొమ్ము?. సామాన్యులు కష్టపడి సంపాదించిన సొమ్ముతో సినిమాలు చూసి.. వాళ్ళని ఇంతటి వారిని చేశారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఏరియాల్లో ఉండేవారు అప్పట్లో సీడీలు, ఇప్పుడు ఒటిటి ప్లాట్ ఫార్మ్ లలో సినిమాలు చూస్తున్నారు. కానీ, అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ థియేటర్స్ లో సినిమాలు చూసి కలెక్షన్ల వర్షం కురిపించేది మాత్రం సామాన్యులే. రిక్షా తొక్కేవారు, ఆటో నడిపేవారు, కూరగాయలు అమ్మేవారు, రోజువారీ కూలీలు.. వారు కష్టపడి సంపాదించిన సొమ్ముతో థియేటర్ కెళ్ళి సినిమా చూస్తారు. మా హీరో అంటూ ఎక్కువసార్లు చూసి కలెక్షన్లు పెంచుతారు. అలా కలెక్షన్లు పెరగడం వల్లనే.. హీరోలకు, డైరెక్టర్లకు రెమ్యూనరేషన్స్ పెరిగి.. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. మరి వారిని ఇంతటివారిని చేసిన సామాన్యుల కోసం ఏం చేస్తున్నారు ఈ సెలబ్రిటీస్?. రోజువారీ కూలి లేక, కూలీలు కడుపు మాడ్చుకుంటున్నారు. పంట సరిగా పండక, పండిన పంటని కొనేవారు లేక, గిట్టుబాటు ధర లేక.. రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. వారి బాధలు సెలెబ్రిటీలకి పట్టవా?.  ఇంట్లో ఎవరి పనులు వాళ్ళు చేసి, ఏదో ఘనకార్యం చేసినట్టు ఓ నిమిషం వీడియో రిలీజ్ చేసి 'Be the real man' అంటే సమాజానికి ఒరిగేది ఏముండదు. సాటి మనిషికి సాయం చేసేవాడే నిజమైన మనిషి అని తెలుసుకొని.. సామాన్యులకు సాయం చేయండి. అంతేకాని ఇలా కాసుల కోసం ఛాలెంజ్ ల పేరిట ముడ్డి మూతి కడుక్కున్న వీడియోలు పెట్టకండి. మీకు ఇప్పటికే సమాజం చాలా ఇచ్చింది. ఇలాంటి సమయంలో ఎంతో కొంత తిరిగిఛ్చి రియల్ హీరోస్ అనిపించుకోండి. లేదంటే డమ్మీ హీరోలుగా మిగిలిపోతారు. ఇప్పటి నుంచి మనం కూడా కష్టకాలంలో సామాన్యులకు అండగా నిలిచిన సెలెబ్రిటీలనే ఆదరిద్దాం. ఇలా పైసల కోసం పబ్లిసిటీ చేసుకునే డమ్మీ హీరోలను పక్కన పెడదాం.

Ap govt works on shifting of capital

వస్తే ఉద్యోగులతో.. లేదంటే ఒంటరిగా.. రాజధాని తరలింపుపై జగన్ ప్లాన్ ఇదేనా?

ఏపీ రాజధాని అమరావతి తరలింపు విషయంలో కోర్టు మొట్టికాయలు వేస్తున్నా జగన్ ప్రభుత్వం మాత్రం అవేవీ పట్టించుకోకుండా ముందుకెళ్లేందుకు రంగం సిద్దం చేస్తోంది. వచ్చే నెలలో కరోనా వైరస్ లాక్ డౌన్, ఇతరత్రా వ్యవహారాలతో సంబంధం లేకుండా రాజధాని తరలింపు కోసం ప్రభుత్వం సర్వ ప్రయత్నాలు చేస్తోంది. అసెంబ్లీలో రాజధాని బిల్లులు ఆమోదం పొందకుండా ఎలా వెళతారని హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో అందుకు తగ్గ ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసే పనిలో ఏపీ  సీఎంవో బిజీగా ఉంది. నెల రోజుల వ్యవధిలో విశాఖకు తరలి వెళ్లేందుకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తోంది.  రాజధాని తరలింపు కోసం జగన్ సర్కారు ఈ ఏడాది జనవరిలోనే రంగం సిద్దం చేసింది. రాజధాని తరలింపు కోసం కీలకమైన రెండు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అసెంబ్లీ ఆమోదించినా... మండలి అడ్డుకోవడంతో అవి కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు అవి కాలాతీతం అయ్యాయన్న సాకుతో బిల్లులు ఆటోమేటిగ్గా ఆమోదం పొందినట్లే అనే వాదనను హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మరోసారి తెరపైకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అదే జరిగితే మరోసారి రాజ్యాంగ పరమైన చర్చకు తెరలేవక తప్పదు. సెలక్ట్ కమిటీ ఏర్పాటు విషయంలో సాంకేతిక అంశాలను కారణాలుగా చూపుతూ ఆలస్యం చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు అవి కాలాతీతం అయ్యాయన్న సాకును తెరపైకి తీసుకొచ్చేలా ప్రణాళిక రచిస్తున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వీటిపై హైకోర్టు ఎలా స్పందిస్తుందన్న దానిపై రాజధాని తరలింపు ఆధారపడి ఉంటుందని  చెప్తున్నారు. ఒక వేళ హైకోర్టులో ప్రభుత్వ వాదన నెగ్గితే ఉద్యోగులతో కలిసి మే నెలలోనే విశాఖ తరలి వెళ్లేందుకు సీఎం జగన్ రంగం సిద్దం చేసుకుంటున్నారు. అలా కుదరక హైకోర్టు అభ్యంతరాలు చెప్పే పక్షంలో తాను ఒంటరిగానైనా వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎంవో అదికారులకు ముందస్తు సంకేతాలు అందాయని చెబుతున్నారు. ఏదేమైనా వెళ్లడం ఖాయమన్న సంకేతాలను ప్రభుత్వ పెద్దలు అధికారులకు పంపుతుండటం ఇక్కడ గమనించాల్సిన అంశం.

petition in supreme court over elections

జగన్ ప్రయత్నాలకు సుప్రీంలో బ్రేక్ పడనుందా?

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం తగ్గిపోగానే మధ్యలోనే ఆగిపోయిన స్ధానిక ఎన్నికల పోరును తిరిగి ప్రారంభించేందుకు వైసీపీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇందుకు సుప్రీంకోర్టు బ్రేక్ వేయబోతోందా అంటే తాజా పరిణామాలు అవుననేలా ఉన్నాయి. కరోనా వైరస్ ప్రభావం తగ్గకముందే పలు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలపై సుప్రీంకోర్టులో నరేంద్రరెడ్డి అనే లాయర్ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. దీనిపై రేపో మాపో విచారణ జరగనుంది. వివిధ రాష్ట్రాల్లో స్దానిక ఎన్నికలతో పాటు రాజ్యసభ ఎన్నికలను సైతం నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తన పిల్ లో కోరారు.  ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ అక్కడి ప్రభుత్వాలు స్ధానిక ఎన్నికల నిర్వహణకు రంగం సిద్దం చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా ఏపీలో వైసీపీ ప్రభుత్వం ముందుకెళుతోంది. కరోనా లాక్ డౌన్ సమయంలోనూ ఎన్నికల కమిషనర్ ను మార్చి కొత్త కమిషనర్ ను నియమించిన ప్రభుత్వం.. స్ధానిక ఎన్నికలకు తమ పార్టీ నేతలను ప్రిపేర్ చేసే పనిలో బిజీగా ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ కరోనా తర్వాత సాధారణ పరిస్ధితులు నెలకొనే వరకూ ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని నరేంద్రరెడ్డి అనే న్యాయవాది ఈ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. కరోనా తగ్గకుండా ఎక్కడా ఎలాంటి ఎన్నికలు నిర్వహించకుండా రాష్ట్రాల ఎన్నికల కమిషన్లకు జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ ఆదేశాలు ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన తన పిటిషన్ లో అభ్యర్ధించారు. ఎన్నికలు వాయిదా వేయకపోతే ఓటర్ల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించినట్లేనని పిటిషనర్ తన పిల్ లో అత్యున్నత న్యాయస్ధానాన్ని కోరారు.  సుప్రీంకోర్టులో దాఖలైన తాజా ప్రజా ప్రయోజన వాజ్యం ఏపీలో స్ధానిక ఎన్నికల నిర్వహణ ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఇప్పటికే కరోనా ప్రభావం నేపథ్యంలో స్ధానిక ఎన్నికలను వాయిదా వేయడాన్ని సమర్ధించిన సుప్రీంకోర్టు.... మరోసారి ఈ పిల్ తో ఏకీభవిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి చిక్కులు తప్పకపోవచ్చు. కరోనా ప్రభావం తగ్గగానే స్ధానిక ఎన్నికల నిర్వహణకు వీలుగా ఏపీలో ఎన్నికల కమిషనర్ తో పాటు ప్రభుత్వ వర్గాలు కూడా సన్నద్దవుతున్న తరుణంలో ఈ పిల్ పై సుప్రీంకోర్టు ఆదేశాలు కీలకంగా మారబోతున్నాయి.

central govt guidelines on AC usage

ఏసీ, కూలర్ల వాడకంపై కేంద్రం మార్గదర్శకాలు!

ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్ల వినియోగం మరింత పెరగనుంది. అయితే కరోనా వైరస్ ఏసీలు, కూలర్ల కారణంగా మరింత వ్యాప్తి చెందుతుందని ప్రచారం జరుగుతుండడంపై కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. సొసైటీ ఆఫ్ హీటింగ్, రిఫ్రిజిరేటింగ్ అండ్ ఎయిర్ కండిషనర్ ఇంజినీర్స్ రూపొందించిన ఈ మార్గదర్శకాలు కేంద్రం విడుదల చేసింది.  దీని ప్రకారం, ఇళ్లలో ఏసీల వాడకంలో గది ఉష్ణోగ్రతను 24 నుంచి 30 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉండేలా చూసుకోవాలని, సంబంధిత తేమ శాతం 40 నుంచి 70 మధ్య ఉంటే మేలని సూచించింది. వ్యాధికారక క్రిముల వ్యాప్తి నివారణకు ఇవి సరైన ఉష్ణోగ్రతలని వివరించింది. తేమ వాతావరణంలో ఏసీని 24 డిగ్రీల సెంటిగ్రేడ్ కు దగ్గరగా సెట్ చేయాలి. పొడి వాతావరణంలో 30 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండేలా జాగ్రత్త పడాలి. గది నలుమూలలకు గాలి ప్రసరించేందుకు ఫ్యాన్లు వాడొచ్చు. పొడి వాతావరణం నెలకొని ఉంటే సంబంధిత తేమ శాతాన్ని 40 శాతం కంటే తక్కువ ఉంచరాదు. ఏసీలు ఆన్ లో ఉన్నప్పుడు రూమ్ కిటికీలు పాక్షికంగా తెరిచి ఉంచాలి. ఏసీ గాలి అక్కడే పరిభ్రమించకుండా, సహజసిద్ధమైన రీతిలో శుభ్రపడుతుంది.  ఏసీలు వాడుతున్నప్పుడు బయటి నుంచి వచ్చేగాలి ఫ్రెష్ గా ఉండాలంటే కిచెన్, టాయిలెట్లలో ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఆన్ చేసి ఉంచాలి. తద్వారా బయటి నుంచి దుమ్ము, ధూళితో కూడిన గాలిని నిరోధించవచ్చు. పరిశుభ్రమైన గాలి ప్రసరించాలంటే ఎవాపరేటివ్ కూలర్లు గాలిని బయటి నుంచి స్వీకరించేలా ఉండాలి. ఎవాపరేటివ్ కూలర్లలో నీటి ట్యాంకులను శుభ్రపరచాలి. క్రిమినాశని రసాయనాలతో శుద్ధి చేయాలి. ఒకసారి వాడిన నీటిని తొలగించేందుకు తగిన ఏర్పాట్లు ఉండాలి. కూలర్ల నుంచి వచ్చే తేమతో కూడిన గాలిని బయటికి పంపేందుకు కిటికీలు తెరిచే ఉంచాలి. పోర్టబుల్ ఎవాపరేటివ్ కూలర్లు బయటి నుంచి గాలిని స్వీకరించే ఏర్పాట్లు కలిగి వుండవు కనుక, ఆ తరహా కూలర్ల వాడకం నిలిపివేయాలి. ఫ్యాన్లు తిరిగే సమయంలో గది కిటికీలు పాక్షికంగా తెరిచి ఉంచాలి. సాధారణ ఫ్యాన్లు తిరిగే సమయంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఆన్ లో ఉండే మరీ మంచిది. మెరుగైన రీతిలో గదిలోని గాలి ఎప్పటికప్పుడు శుభ్రపడే అవకాశం ఉంటుంది.

meat shops closed in tirupati

తిరుపతిలో చికెన్, మటన్ దుకాణాలు బంద్!

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో కరోనా వైరస్  లాక్ డౌన్ అమల్లో ఉంది మరియు రెడ్ జోన్లు నమోదు కావడం, నగరంలో అంటు వ్యాధులు ప్రబలకుండా ఉండుటకు ఆదివారం నాడు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో చికెను, చేపలు, మటను దుకాణాలు తెరువరాదని నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.  లాక్ డౌన్ ముగిసేవరకు ప్రతి ఆదివారం తిరుప‌తి నగరంలో చేపలు, చికెన్ మరియు మటన్ దుకాణాలు తెరవకూడదు. ఈ చర్య ప్రజాఆరోగ్యమును  దృష్టిలో వుంచుకొని తీసుకున్న ముందు జాగ్రత్త చర్య అట్లు సూచనలు పాటించక దుకాణములు తెరిచిన యెడల చట్ట పరమైన చర్యలు తీసుకోబడును. ఈ నిబంధనలు ఉల్లంఘించిన యెడల దుకాణం సీజ్ చేసి, ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామ‌ని మున్సిప‌ల్ క‌మీష‌న్ హెచ్చ‌రిస్తూ ఆదేశాలు ఇచ్చారు. తిరుప‌తి నగరపాలక సంస్థ పరిధిలో చికెన్, మటన్ దుకాణాలు తెరిచినచో కాల్ సెంటర్ 0877-2256766 కి స‌మాచారం ఇవ్వాల‌ని క‌మీష‌న‌ర్ కోరారు.

Home Ministry allows neighbourhood shops to reopen

అన్ని షాపులు తెరచుకోవచ్చు! హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు

లాక్‌డౌన్ వేళ వినియోగదారులకు ఊరటనిస్తూ నిబంధ‌న‌ల‌కు లోబ‌డి అన్ని షాపులు తెరచుకోవచ్చ‌ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ★ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రజలు, వ్యాపారులు డిమాండ్ చేస్తుండటంతో కేంద్ర హోంశాఖ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది.  ★ దేశవ్యాప్తంగా అన్ని షాపులు ఇకమీదట తెరచుకోవచ్చని తెలిపింది.  ★ ఐతే... కొన్ని కండీషన్లు పెట్టింది. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌లో రిజిస్టర్ అయిన షాపులు మాత్రమే తెరవొచ్చని కేంద్రం తెలిపింది.  ★ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పాలకుల అనుమతి తప్పనిసరి మార్గదర్శనం చేసింది. ★ ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం మే 7 వరకూ సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది కాబట్టి... తెలంగాణలో కేంద్రం రూల్ వర్తించదు. ★ అదే ఏపీలో కేంద్ర వెసులుబాట్లు అమల్లో ఉన్నాయి కాబట్టి ఏపీలో అన్ని షాపులూ తెరచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే... కేంద్ర చెప్పిన కండీషన్ల ప్రకారం షాపులు తెరచుకోవచ్చు.  ★ దేశవ్యాప్తంగా షాపింగ్ మాల్స్ మాత్రం తెరవడానికి వీల్లేదు. ★ మరో ముఖ్య విషయమేంటంటే, హాట్ స్పాట్లు, కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నచోట మాత్రం ఏ రాష్ట్రంలోనైనా సరే, షాపులు తెరవడానికి వీల్లేదు.  ★ ఇప్పటివరకూ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కిరాణా షాపులు, నిత్యవసర, అత్యవసర, మందులు, ఫార్మసీ షాపులు మాత్రమే తెరవొచ్చని కండీషన్ పెట్టింది.  ★ ఇప్పుడు మాత్రం అన్ని రకాల షాపులూ తెరచుకోవచ్చునని వెసులుబాటు కల్పించింది. ★ ప్రజలు సామాజిక దూరంపాటిస్తూ,మాస్క్, శానిటేజర్లు వాడుతూ, కేంద్రం, వివిధప్రభుత్వాలు ఇచ్చిన ఈ వెసులుబాటును వినియోగించుకోవాలి. ★ లేకపోతే కరోనావైరస్ సామాజిక వ్యాప్తికి దోహదం అవుతుందని పలువురు ఆందోళ వ్యక్తం చేస్తూ, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కో‌రుతున్నారు. ★ అంటే స్టేషనరీ షాపులు, బ్యూటీ సెలూన్స్, డ్రై క్లీనర్స్, ఎలక్ట్రికల్ స్టోర్స్ వంటివి అన్నీ తెరచుకోవచ్చు. ★ ఐతే... రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి ఉండాలి. అలాగే... ఇదివరకట్లా అందరు ఉద్యోగులూ ఆ షాపుల్లో ఉండకూడదు.  ★ సగం(50%) మంది ఉద్యోగులతోనే నడపాలి. ★ అలాగే సోషల్ డిస్టాన్స్ మెయింటేన్ చెయ్యాలి.  ★ అలాగే అందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.

tdp leader chengal rayudu slams ysrcp

151 మంది ఎమ్మెల్యేలుంటే చట్టాన్ని పాటించరా? చట్టానికి అతీతులా?

లాక్ డౌన్ ఉల్లంఘించిన నేతలపై కేసులెందుకు పెట్టడం లేదో డీజీపీ సమాధానం చెప్పాలి. సభలు నిర్వహించిన వైసీపీ నాయకులపై 307 సెక్షన్ కింద కేసు పెట్టాలని టిడిపి నేత‌ భత్యాన చెంగల్రాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లింఘించిన వారిపై మార్చి 25 నుండి 31 వరకు 75 వేల కేసులు, మొత్తంగా లక్షకు పైగా కేసులు రిజిస్టర్ చేశామని డీజీపీ గౌతం సవాంగ్ గారు చెబుతున్నారు.  లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నందుకు చెంగల్రాయుడు ధన్యవాదాలు తెలిపారు. శ్రీకాళహస్తి, కర్నూలు నగరం ఆంధ్రప్రదేశ్ కు వుహాన్ నగరంలా తయారయ్యాయి. శ్రీకాళహస్తిలో ట్రాక్టర్లతో ర్యాలీ చేయించిన వైసీపీ ఎమ్మెల్యే బియ్యం మధుసూధన రెడ్డి దీనంతటికీ బాద్యుడు. అతను నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న వాహనాల్లో ఎన్నింటిపై కేసులు పెట్టారు. వాటిలో ఎన్ని సీజ్ చేశారు.? సూళ్లూరుపేటలో దాతలు ఇచ్చిన సరుకులను పంపిణీ చేసే నెపంతో మరో ర్యాలీ నిర్వహించారు. వాటిలో ఎన్ని వాహనాలపై కేసులు పెట్టి సీజ్ చేశారు.? ఏ 2 విజయసాయి రెడ్డి శ్రీకాకుళం నుండి అమరావతి, హైదరాబాద్ నిరంతరంగా తిరుగుతున్నారు. అతనిపై ఎలాంటి కేసులు పెట్టారు.?  తెనాలి, కొండెపి, పలమనూరు, నగరిలో శాసన సభ్యులు ఎన్ని కార్యక్రమాలు నిర్వహించారో మీకు తెలియదా.? వారిపై ఎన్ని కేసులు నమోదు చేశారు.? పలమనేరులో బ్రిడ్జి ప్రారంభించడం కోసం దండోరాగా వెళ్లారు. పుత్తూరు సుందరయ్య కాలనీలో లక్ష పెట్టి బోరు వేసినందుకు.. వెయ్యి మందిదతో పూలు జల్లించుకున్నారు. ఆయా కార్యక్రమాలకు సంబంధించి ఎన్ని కేసులు నమోదు చేశారో డీజీపీగారు బహిర్గతం చేయాలి. శ్రీకాళహస్తిలో వచ్చిన 60 కేసులకు ఎమ్మెల్యే నిర్వహించిన ర్యాలీ ఫలితమే. వెంటనే ఐపీసీ 307 సెక్షన్ కింద ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి. చంద్రబాబు నాయుడు గారు జగ్జీవన్ రావ్ జయంతి, పూలే జయంతి, అంబేద్కర్ జయంతి సందర్భంగా వారి వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఇంట్లోనే నిర్వహించమని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు దేశం నేతలంతా అదే పాటించారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం వందలు, వేల మందిని పోగేసి కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సభలు, సమావేశాలు నిర్వహించిన వారిలో ఎంత మందిపై కేసులు నమోదయ్యాయో డీజీపీగారు ప్రకటించాలి. గోవా, మణిపూర్, కేరళ వంటి రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారో కనిపించడం లేదా.? దేశ విదేశాల నుండి లక్షలాది మంది వచ్చే గోవా ఇప్పటికీ గ్రీన్ జోన్ గా ఉందంటే.. అక్కడి ప్రభుత్వం ఎంత కృషి చేస్తుందో చూడండి. మణిపూర్ పర్వతాలతో నిండిన ప్రాంతం. అక్షరాస్యత అత్యల్పం. అయినా అక్కడ కరోనా కేసులు లేవు. కారణం ప్రబుత్వం తీసుకుంటున్న చర్యలు కాదా.?  కరోనా వైరస్ ఎంతో ఆత్మాభిమానం కలిగినది. మనంగా వెళ్లి పిలిస్తేనే రాదు. వచ్చాక మనల్ని వదలదని వైసీపీ నేతలు గుర్తించాలి. కిలో బియ్యం, అరకిలో టమాటా, పావుకిలో నూనె 10 మందికి ఇస్తే వెయ్యి మందిని గుమిగూడుస్తున్నారు. కోట్ల వేతనాలు చెల్లిస్తూ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఆ వ్యవస్థ ఏం చేస్తోంది.? మణిపూర్ లో వాలంటీర్లు లేరు కానీ.. సరుకులు ఎంత క్రమశిక్షణతో పంచుతున్నారో ప్రబుత్వానికి కనిపిస్తోందా.? దేశంలోని రెడ్ జోన్లను గ్రీన్ జోన్లుగా మార్చేందుకు అధికారులు, నాయకులు పాటుపడాలని ప్రధాని మోడీగారు పిలుపునిస్తే..  మన రాష్ట్రంలో గ్రీన్ జోన్ గా ఉన్న వాటిని రెడ్ జోన్లుగా మారుస్తున్నారు. శ్రీకాకుళంకు చెందిన ఎమ్మెల్యే అప్పలరాజు, మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఏడు జిల్లాలు దాటుకుని అమరావతికి వచ్చారు. స్పీకర్ అయితే ఏకంగా బహిరంగ సభ పెట్టారు. ఫలితం ఇప్పటి వరకు గ్రీన్ జోన్ గా ఉన్న శ్రీకాకుళంలో ఒక్కసారిగా మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో సారాయి ఏరులై పారుతోందని, ఎక్సైజ్ శాఖ నిద్రపోతోందని స్పీకరే స్వయంగా చెప్పారంటే ప్రభుత్వం ఎలా పని చేస్తుందో ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. మార్చి 25 నుండి లాక్ డౌన్ అమలులో ఉంది. ఎక్కడా ఎలాంటి రవాణా జరగకూడదు. కానీ.. కోడూరులో జిని పెక్ సంస్థ 5 ర్యాకుల బైరైటీస్ మద్రాసుకు పంపించింది. దానికి అక్కడి సీఐ నో అబ్జక్షన్ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక, మట్టి లారీలు ఇష్టానుసారంగా తిరుగుతుంటే.. ప్రజలే అడ్డుకోవాల్సి వచ్చింది. ఆ వాహనాలు ఎందుకు సీజ్ చేయలేదో డీజీపీ గారు సమాధానం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం అంత్యక్రియలకు మాత్రమే 20 మందిని అనుమతిస్తారు.  కానీ అధికార పార్టీ నేతలు ఇంత మందిని వెంటేసుకుని తిరుగుతుంటే పోలీసు యంత్రాంగం ఏం చేస్తోంది.? ర్యాలీలకు పోలీసులే ఎస్కార్ట్ కల్పించడం దుర్మార్గం కాదా.? పోలీస్ స్టేషన్ల ముందే సభలు జరుగుతుంటే పట్టించుకోరా.? కర్నూలులో ఐసోలేషన్ లో ఉన్న తమ బంధువులను ఎమ్మెల్యే పరామర్శించి వచ్చాడంటే దుర్మార్గం కాదా.? రాష్ట్ర వ్యాప్తంగా 500 వరకు ర్యాలీలు, సభలు, సమావేశాలు జరిగాయి.  మీకు సమాచారం లేదా.? మీ ఇంటిలిజెన్స్ పనిచేయడం లేదని చెప్పడం వివరాలన్నీ మీకు అందిస్తాం. డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నవారిపై కేసులు నమోదు చేయడానికి డీజీపీ ఎందుకు ఆలోచిస్తున్నారు.? యూపీ ముఖ్యమంత్రి ఆధిత్యనాథ్ గారి తండ్రి చనిపోతేనే వెళ్లలేకపోయారంటే... అతని చిత్తశుద్ధి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. డాక్టర్లు కూడా కరోనా బారిన పడుతుంటే ప్రభుత్వ వైఫల్యం కాదా..? సామాన్యులు ఏదో అవసరంపై రోడ్డుపైకి వస్తే కేసులు పెడుతున్నారు. చితక్కొడుతున్నారు. కనగరాజ్ గారు చెన్నై నుండి అమరావతి వరకు ఎలా వచ్చారు.? అతనిపై ఎందుకు కేసు పెట్టలేదు.? చట్టం, న్యాయం అందరికీ సమానమని పోలీసు బాస్ గా మీరెందుకు గుర్తించడం లేదు.? 151 మంది ఎమ్మెల్యేలుంటే చట్టం పాటించరా.? మీరేమన్నా చట్టానికి అతీతులా.? చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని గౌరవించి ఇంట్లో ఉన్నారు. మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తూ.. చట్టాన్ని పాటిస్తున్నవారిని అవహేళన చేస్తారా.?

coronavirus is danger than swine flu

స్వైన్ ఫ్లూ కంటే వేగంగా విస్తరిస్తున్న‌ కరోనా!

వైరస్ నివారణకు అప్రమత్తంగా ఉంటూ ముందు జాగ్రత్తలు తీసుకోవటం వల్లనే ఈవైరస్ ను నిర్మూలించగలమని నిమ్స్ ఆస్పత్రి వైద్య నిపుణులు డాక్టర్ స్వరూప రెడ్డి తెలిపారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో కరొనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిమ్స్ ఆస్పత్రి వైద్య నిపుణులు డాక్టర్ స్వరూప రెడ్డి, అపోలో ఆసుపత్రి వైద్య నిపుణులు డాక్టర్ నాగరాజులు మాట్లాడారు.  ఈ సందర్భంగా. డాక్టర్ స్వరూప రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా వైరస్ ప్రబలుతుందని అన్నారు. ఈవైరస్ బీటా కరొనా కుటుంబానికి చెందింది అని, మిగతా వైరస్ కంటే ఈ వైరస్ బరువు ఎక్కువ అని అన్నారు. స్వైన్ ఫ్లూ కంటే వేగంగా విస్తరిస్తోందని అన్నారు. కరోనా వైరస్‌ నివారణకు మందు లేదని, సామాజిక దూరం పాటించడం ద్వారానే దీనిని అరికట్టవచ్చని అన్నారు. వైద్య, పోలీస్‌, అగ్నిమాపక, ఇతర శాఖలు ఈ కరోనా వైరస్‌ నిరోధానికి అహర్నిశలూ కృషి చేస్తున్నాయని అన్నారు. ప్రజలు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను గౌరవించి అత్యవసరం అయితేనే బయటకు రావాలని చెప్పారు. తలనొప్పి, జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటె కరోనా వైరస్ సోకినట్టుగా గుర్తించవచ్చని తెలిపారు.  కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తరువాత దగ్గు వస్తుందని, ఈ దగ్గు ఒక్కోసారి గంట వరకు ఉంటుందని తెలిపారు.  అలానే జ్వరం తలనొప్పి కూడా వస్తాయని,అదే విధంగా శ్వాస  తీసుకోవడంలో ఇబ్బందులు వస్తుంటాయని అన్నారు. ఈ లక్షణాలు ఉంటె కరోనా వైరస్ వచ్చినట్టే అని చెప్పొచ్చని అన్నారు.   ఈ లక్షణాలను గుర్తిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు . సెంట్రల్ ఏసీలకు దూరంగా ఉండాలని తెలిపారు. డిస్చార్జ్ అయిన తర్వాత కూడా జాగ్రత్తలు పాటించాలని ,ఇంట్లో నే ఉండాలని అన్నారు. న్యూస్ పేపర్, పాల పాకెట్ల వాడకం విషయంలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ప్లాస్టిక్, స్టీల్, వంటి వస్తువులు పై వైరస్ ఎక్కువ కాలం ఉంటుందని, ఎక్కువ సార్లు చేతులను శుభ్రంగా కడగాలని తెలిపారు.ఈ వైరస్ కు వాక్సిన్ ప్రయోగ దశలో ఉన్నాయని, ప్రస్తుతం ఐసీయంఆర్ సూచనల ప్రకారం భాదితులకు వైద్యం అందిస్తున్నామని అన్నారు. క్వారంటైన్ కాలం పొడగించటం వల్ల బాధితులకు మరింత మేలు చేకూరుతుందని అన్నారు. అపోలో ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నాగరాజు గొర్ల మాట్లాడుతూ విధిగా చేతులు కడుకోవడం తో చాలా వరకు వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు అన్నారు.చేతులను కనీసం 30 సెకన్ల పాటు సానిటైజర్ తో కానీ 60 సెకన్ల పాటు కడుకోవాలన్నారు.కరోనా వ్యాధి వచ్చి తగ్గిన వారు డిశ్చార్జ్ ఆయిన తర్వాత కూడా 14 రోజుల పాటు తప్పనిసరిగా క్వారంటైన్ లో డాలన్నారు.చంటిబిడ్డలకు తల్లి పాలు ఇస్తే వైరస్ సోకే ఆస్కారం లేదని స్పష్టం చేశారు. కరోనా వ్యాధి వలన చనిపోయే వారి సంఖ్య కూడా చాలా తక్కువగా ఉందన్నారు. వైద్యుల సలహా మేరకే క్లోరోక్విన్ వాడలే తప్ప ఇష్టం వచ్చి నట్లు వాడితే వేరే ఆరోగ్య సమస్యలు బారిన పడే అవకాశం ఉందన్నారు.  ముఖ్యంగా వయస్సు లో పెద్ద వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బ్లడ్ షుగర్స్ ను అదుపులో ఉంచుకోవలన్నారు.వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు తప్పనిసరిగా భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించాలన్నారు.ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ ను పాటిస్తునే మానసిక, శారీరిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని సూచించారు.రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు సమతుల్య ఆహారం తో పాటు వ్యాయామం , యోగ, ధ్యానము లాంటి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ డైరెక్టర్ నాగయ్య, ఇంచార్జి సి.ఐ.ఇ. విజయభాస్కర్ రెడ్డి, డిడి శ్రీనివాస్, ఆర్.ఐ.ఇ. రాధా కిషన్ , ఏడి యామిని,తదితరులు పాల్గొన్నారు.

కిమ్ ఎందుకు కనిపించట్లేదు!

ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అనారోగ్యం నేపథ్యంలో చైనా  ఓ వైద్య బందాన్ని ఉత్తర కొరియాకు పంపింది. చైనీస్‌ కమ్యూనిస్ట్‌ పార్టీకి చెందిన లైనిస్‌ డిపార్టమెంట్‌ నేతృత్వంలో ముగ్గురు వైద్యుల బృందాన్ని ఆ దేశానికి పంపినట్ల ఓ ప్రముఖ పత్రిక పేర్కొంది. అయితే కిమ్‌ ఆరోగ్యంపై మాత్రం చైనా ఎలాంటి ప్రకటన చేయలేదు.  అయితే  అధినేత ఆరోగ్యంపై దక్షిణ కొరియా స్పందించింది. కిమ్‌కు ఎలాంటి సమస్య లేకపోవచ్చిని ఆయనపై వస్తున్న వదంతులను కొట్టిపారేసింది.   రెండు రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కిమ్‌పై వస్తున్న వార్తల్లో నిజం లేకపోవచ్చని అన్నారు. ఈ నేపథ్యంలో చైనా వైద్య బృందాన్ని ఉత్తర కొరియాకు పంపించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  కరోనా లాంటి విపత్తులో కూడా చైనా దేశం ఉత్తర కొరియాకు వైద్యులను పంపడంతో నిజంగానే కిమ్‌ ఆరోగ్యం క్షిణించి ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కిమ్ ఎందుకు కనిపించట్లేదన్నది తెలియాల్సి ఉంది.

కోతులపై విష ప్ర‌యోగం! తిరువణ్ణామలైలో కలకలం!

కరోనా నేపథ్యంలో పర్యాటక ప్రాంతాలలో కోతుల బాధలు వర్ణణాతీతం.. ఇదిలా ఉండగా మానవత్వం పూర్తిగా మరచిన కొందరు నికృష్టులు ఆకలితో అలమటిస్తున్న కోతులకు విషంపెట్టి హతమార్చడం తిరువణ్ణామలైలో కలకలం రేపింది. తిరువణ్ణామలై అటవీ ప్రాంతంలో ఓ చోట పది కోతులు మరణించి ఉండటాన్ని గిరిజనులు గుర్తించి, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.  వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులకు చాలా కోతులు మరణించి కనిపించాయి.. ఈ కోతులు మరణించిన ప్రాంతానికి కూత వేటు దూరంలో అరటి పండ్లు పడి ఉండటంతో వాటిని పరిశీలించగా విషం ఉన్నట్టు గుర్తించారు. ఇకపోతే ఇంతటి కిరాతకానికి ఒడిగట్టిన వారి కోసం పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. ఎంత దారుణం ఆకలితో అలమటిస్తున్న కోతులకు అరటి పండులో విషం పెట్టి చంపడం.. మనుషులు రోజు రోజుకు ఎంత కౄరంగా ఆలోచిస్తున్నారు.  మ‌రో ప్ర‌క్క‌ ఈ కరోనా వల్ల ఆకలితో అలమటిస్తున్న వారెందరో ఉన్నారు.. కేవలం ఈ ఆకలి మనుషులకే కాదు.. ఈ సృష్టిలోని ప్రతి ప్రాణి సొంతం.. అందుకే ఇప్పుడు ఈ ఆకలి సెగ జంతువులకు, పక్షులకు కూడా తగిలింది.. మనుషులంటే అన్నమో రామచంద్ర.. అని అడుక్కుంటారు.. ఎదోలా కడుపు నింపుకుంటారు.. కానీ మూగజీవాలు మనుషుల్లా ఆలోచించలేవు.. మోసాలు చేసి పొట్టనింపుకోవు.. పరిస్దితులు మామూలుగా ఉంటే వాటికి కూడా కాస్త ఆహారం దొరికేది. కానీ లాక్‌ డౌన్‌ వల్ల మూగ జీవాల పరిస్దితి చాలా దారుణంగా మారింది.. ప్రస్తుత పరిస్దితుల్లో ఆకలితో అన్ని జంతువులు అలమటిస్తున్నాయి.

సముద్రంలోకి 19 వేల తాబేలు పిల్లలు!

సముద్రపు తాబేళ్లు డిసెంబరు నుంచి ఏప్రిల్‌ వరకు తీరానికి వచ్చి ఇసుకలో గుంత తవ్వి గుడ్లు పెట్టి కప్పి వెళతాయి. ఒక తాబేలు 140 నుంచి 170 వరకు గుడ్లు పెడుతుంది. కుక్కలు, పక్షుల నుంచి గుడ్లను రక్షించే పనులను అటవీ శాఖ చేపట్టి, ఆ గుడ్లను సేకరించి కేంద్రంలో ఉంచి, అవి పొదిగిన అనంతరం పిల్లలను సముద్రంలోకి వదిలిపెడుతున్నారు. బీసెంట్‌ నగర్‌, పళవేర్కాడు, కోవలం సముద్రతీరాల్లో ఉన్న తాబేలు గుడ్ల పొదిగింపు కేంద్రాల నుంచి పొదిగిన 19 వేల తాబేలు పిల్లలను సముద్రంలో వదలిపెట్టారు.  బీసెంట్‌నగర్‌, పళవేర్కాడు, కోవలం సముద్రతీరాల్లో ఏర్పాటుచేసిన గుడ్ల భద్రతా కేంద్రాల్లో 30 వేల గుడ్లను సేకరించగా, 19 వేల పిల్లలు బయటకు వచ్చాయి. వారిని గురువారం అటవీ శాఖ సిబ్బంది సముద్రంలో వదలిపెట్టారు. మిగిలిన గుడ్ల నుంచి వచ్చే పిల్లలను అంచెలంచెలుగా సముద్రంలోకి వదలిపెడతామని అధికారులు తెలిపారు. గత ఏడాది 50 వేల గుడ్లును సేకరించగా 40 వేల పిల్లలు బయటకు వచ్చాయని వారు తెలిపారు.

శ్రీకాళహస్తి లో వైర‌స్ ఇలా పాకింది!

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి వాసుల్నిక‌రోనా చెమ‌ట‌లుప‌ట్టిస్తోంది. ప్రముఖ శైవక్షేత్రంగా విరసిల్లే ఈ ఊరు ఇప్పుడు కరోనా భయంతో చిగురుటాకులా వణికిపోతోంది. మరింత దారుణమైన విషయం ఏమంటే.. కరోనా బాధితుల్లో ఏకంగా పదిహేడు మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం. చిత్తూరు జిల్లాలో 73 పాజిటివ్ కేసుల్లో యాభైకు పైనే ఒక్క శ్రీకాళహస్తి పట్టణంలో నమోదు కావటం ఇప్పుడు సంచలనంగా మారింది.  మార్చి 18న లండన్ నుంచి శ్రీకాళహస్తికి వచ్చాడో యువకుడు. కరోనా లక్షణాలతో ఆసుపత్రికి వెళ్లగా.. అతనికి వైరస్ సోకిన వైనాన్ని మార్చి 25న గుర్తించారు. అప్పటికే అతను కుటుంబ సభ్యులు.. బంధువులతో గడిపాడు. ఊరి చివర ఉన్న దాబాలకు వెళ్లాడు. సదరు యువకుడికి పాజిటివ్ అని తేలిన వెంటనే.. అతడి కుటుంబ సభ్యుల్ని మాత్రమే క్వారంటైన్ కు తరలించారు. అంతే తప్పించి.. అతడు ఎవరెవరిని కలిశాడు? ఎక్కడెక్కడకు వెళ్లాడన్న విషయాన్ని ఆరా తీసి.. వారందరిని క్వారంటైన్ కు తరలించి ఉంటే.. మూలంలోనే ముగిసి పోయేది. కానీ.. అధికారులు ఇక్కడో పెద్ద తప్పు చేశారు. పాజిటివ్ గా తేలిన వ్యక్తి కాంటాక్టు అయిన వారందరిని వదిలేశారు. దీనికి ఫలితంగా అతడు కాంటాక్టు అయిన వారిలో నలుగురికి.. అతని స్నేహితుడికి పాజిటివ్ గా తేలింది. ఈ సందర్భం లో అయినా.. ఈ ఐదు కేసులతో సంబంధం ఉన్న వారిని.. వారు కాంటాక్టు అయిన వారిని గుర్తించి ఉంటే బాగుండేది. కానీ.. ఆ సందర్భంలోనూ అధికారులు స్పందించింది లేదు. ఇది రెండో తప్పు. ఇలాంటి వేళలోనే మర్కజ్ లింకు ఊరికి వచ్చింది. శ్రీకాళహస్తి నుంచి ఢిల్లీ సమావేశాలకు వెళ్లిన 13 మంది ఊరికి తిరిగి వచ్చారు. కేంద్ర నిఘా విభాగం హెచ్చరించే వరకూ వారిని గుర్తించే విషయంలో అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. దీంతో వారిని గుర్తించే విషయంలో ఆలస్యం చోటు చేసుకోవటంతో పాటు.. రిజర్వేషన్ లేకుండా వచ్చిన కొందరిని గుర్తించే విషయంలోనూ అధికారులు ఫెయిల్ అయ్యారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించటంతో అతన్ని క్వారంటైన్ కు తరలించారు. అతడితో పాటు అతడి భార్యను కూడా పంపారే కానీ పిల్లల్ని వదిలేశారు. బ్యాడ్ లక్ ఏమంటే.. అధికారులు విస్మరించిన పిల్లల్లో ఒకరికి పాజిటివ్ రావటం.. అతడి కారణంగా పలువురికి పాజిటివ్ గా తేలింది. ప్రైమరీ నుంచి కాంటాక్టులకు అంటుకోవటం.. సెకండరీ కాంటాక్టును గుర్తించే విషయంలో జరిగిన పొరపాట్లు ఈ రోజున శ్రీకాళహస్తి పట్టణం ప్రమాదపు అంచుల వరకూ చేరే పరిస్థితికి కారణమైంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో స్థానిక అధికారుల నిర్లక్ష్యం.. తప్పులే ప్రజలకు శాపంగా మారింది.