చలికాలంలో ఫిట్ గా ఉండాలంటే  ఈ 5 రకాల కూరగాయలు తినాలంతే.!

చలికాలంను జబ్బుల కాలం అని కూడా అంటారు. వాతావరణంలో మార్పుల కారణంగా శరీరం ఇబ్బందులకు లోనవుతుంది. ఇదే కాకుండా చలికాలంలో బ్యాక్టీరియా, వైరస్ ల వ్యాప్తి ఎక్కువ జరగడం వల్ల అంటువ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు చలికాలంలో చాలా బాధపడాల్సి ఉంటుంది. అయితే శరీరానికి మంచి రోగనిరోధక శక్తిని అందించి వ్యాధులు దరిచేరకుండా ఉండటానికి, శరీరం ఫిట్ గా ఉండటానికి ఈ 5 రకాల కూరగాయలను తప్పనిసరిగా తినాలి. అవేంటో తెలుసుకుంటే.. ముల్లంగి.. చలికాలంలో ముల్లంగి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.  దీంతో పుష్కలంగా ఫైబర్, నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని ఫిట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. క్యారెట్.. చలికాలంలో క్యారెట్ కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. క్యారెట్ లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది.   ఇది వ్యాధుల నుండి దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. పాలకూర.. చలికాలంలో తప్పనిసరిగా తినాల్సిన ఆకుకూరలలో పాలకూర మొదటిస్థానంలో ఉంటుంది. ఇందులో ఐరన్ సమృద్దిగా ఉంటుంది.  జీవక్రియను మెరుగ్గా ఉంచడంలో కూడా పాలకూర సహాయపడుతుంది. బీట్ రూట్.. చలికాలంలో రోజూ బీట్ రూట్ తినడం వల్ల శరీరానికి చెప్పలేనంత ప్రయోజనం కలుగుతుంది. బీట్ రూట్ రక్తాన్ని మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. బీట్ రూట్ జ్యూస్ ను ప్రతిరోజూ తాగుతుంటే స్టామినా పెరుగుతుంది. సొరకాయ.. సొరకాయ గురించి చాలామందికి సరిగా తెలియదు. ఆరోగ్యం మీద స్పృహ ఉన్నవారు సొరకాయను వంటల్లో వినియోగించడం కంటే  జ్యూస్ చేసుకుని తాగడానికి ఎక్కువ ఉపోగిస్తారు. ఇది బరువు తగ్గించడం నుండి శరీరాన్ని డిటాక్స్ చేయడం వరకు ఎన్నో రకాలుగా సహాయపడుతుంది. దీన్ని వంటల్లోనూ, జ్యూస్ గానూ తప్పకుండా చలికాలంలో తినాలి.                    *నిశ్శబ్ద.

షుగర్ కు ఇలా చెక్..!

జీవనశైలి సరిగ్గా లేకపోవడం, పోషకాల లోపం, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం వల్ల మధుమేహం సమస్య వస్తుంది. డయాబెటిస్‌లో షుగర్ లెవల్స్ అదుపులో లేకుంటే గుండె జబ్బులు, చర్మవ్యాధులు, యూటీఐ, కిడ్నీ ఫెయిల్యూర్, దంత సమస్యలు వంటి అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి ఈ పద్ధతులను అనుసరించవచ్చు. 1. మెంతి నీరు త్రాగాలి: ప్రతిరోజూ ఉదయం మెంతి నీరు తాగడం వల్ల డయాబెటిస్‌ను దూరం చేయవచ్చు. ఎందుకంటే మెంతి నీరు తాగడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్ల శోషణ మందగిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. మెంతి నీరు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో త్రాగవచ్చు. 2. దాల్చిన చెక్క నీరు త్రాగాలి: దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం.. భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం.. మధుమేహం-సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా రక్తంలో చక్కెర నిర్వహణకు తోడ్పడుతుంది. 3. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి: మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడానికి, ఒకరు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీ ఆహారంలో ముందుగా ఫైబర్, ప్రొటీన్లు,  కొవ్వులను తినండి. ఇలా చేయడం వల్ల శరీరంలో చక్కెర శాతం పెరగకుండా, మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 4. కొద్దికొద్దిగా తినండి: డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి, ఒకేసారి పూర్తి భోజనం తినడానికి బదులుగా చిన్న భోజనం 4 నుండి 5 సార్లు తినండి. ఇలా చేయడం వల్ల కడుపు నిండుతుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరగదు. 5. చియా సీడ్స్ డిటాక్స్: అల్పాహారం తర్వాత చియా సీడ్స్ డిటాక్స్ వాటర్ తీసుకోవడం వల్ల చక్కెర శోషణ మందగిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. చియా సీడ్స్ డిటాక్స్ నీటిలో ఒమేగా 3 పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 6. గోధుమలకు బదులుగా మిల్లెట్ తినండి: భోజనం, రాత్రి భోజనంలో గోధుమలకు బదులుగా రాగులతో చేసిన రోటీని మీ ఆహారంలో చేర్చుకోండి. మిల్లెట్ తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది.ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.  

99శాతం మంది పాలకూర వండటంలో తప్పు చేస్తున్నారట.. ఎలా వండితే మంచిది? లాభాలేంటంటే.!

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటిలో పాలకూరను సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. దీంట్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.  అందుకే దీన్ని పోషకాలకు పవర్ హౌస్ అని అంటారు. విటమిన్ ఎ, సి మరియు కె పుష్కలంగా ఉన్నాయి. ఇది మన రోగనిరోధక శక్తిని మెరుగుపరచడమే కాకుండా, దీని వినియోగం ఆక్సీకరణ ఒత్తిడి వల్ల వచ్చే వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. మన ఎముకలు ఆరోగ్యంగా మరియు దృఢంగా ఉండాలంటే బచ్చలికూర పుష్కలంగా తినాలని వైద్యులు కూడా సిఫార్సు చేస్తున్నారు. శరీరంలో హిమోగ్లోబిన్ పెరగాలంటే పాలకూర తినాలి. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనత వంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.  పాలకూరతో సూపులు, పన్నీర్ తో కలిపి వంటలు, పప్పు వంటివి తయారు చేస్తారు. అయితే చాలామంది పాలకూర వండటంలో తప్పులు చేస్తున్నారట. పాలకూర ఎలా వండాలంటే.. తాజాగా శుభ్రంగా ఉన్న పాలకూరను పచ్చిగానే సలాడ్ లో తినచ్చు. దీన్ని ఇతర కూరగాయాల వంటలలో చివరగా వేసి కాసింత వేపచ్చు. అయితే చాలామంది  మాత్రం దీన్ని మొదట నీళ్లలో ఉడికించి  ఆ తరువాత మళ్లీ చల్లనీళ్లో వేసి వేడి తగ్గాక పేస్ట్ చేసి కూరల్లో వాడుతుంటారు. ఇది ఎంతమాత్రం సరైన పద్దతి కాదు. పాలకూర చపాతీలు, పాలక్ పనీర్ కూర, పాలకూర సూప్ మొదలైనవన్నీ ఇలానే చేస్తారు. ఇలా చేయడం వల్ల పాలకూరలో పోషకాలన్నీ పోతాయి. రంగు తప్ప దీన్నుండి ఏమీ లభించదు. అయితే పాలకూరను టమోటా, మిరియాల పొడితో కలిపి తింటే శరీరం ఐరన్ గ్రహించే సామర్థ్యం పెరుగుతుందట. పాలకూర తింటే కలిగే లాభాలు.. గర్బిణీ స్త్రీలకు.. గర్భిణీ స్త్రీలకు పాలకూర చాలా మంచిది. ఇందులో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, ఇది గర్భిణీ స్త్రీకి అవసరమైన పోషకం. ఫోలిక్ యాసిడ్ శిశువును పుట్టుకతో వచ్చే లోపాల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. మధుమేహం .. పాలకూర మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా  ఉంటుంది. ఇందులో ఆల్ఫా-లిపోయిక్ యాసిడ్ ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్.   డయాబెటిక్ రోగులలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడం,  ఇన్సులిన్ నిరోధకతను పెంచడం ద్వారా ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. రక్తపోటు.. పాలకూరలో పొటాషియం ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడం సులభం అవుతుంది. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు పాలకూరను తప్పనిసరిగా తీసుకోవాలి. క్యాన్సర్.. క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయి, ఇవి క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేయడంలో ప్రభావవంతంగా ఉంటాయి. ఎముకలు.. పాలకూరలో లభించే విటమిన్ కె ఎముకలను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా కాల్షియం శోషణను పెంచుతుంది. విటమిన్ కె లోపం వల్ల ఎముకలు విరిగిపోయే అవకాశాలు పెరుగుతాయి. జీర్ణక్రియ.. పాలకూరలో ఐరన్ తో పాటు ఫైబర్,  నీటి శాతం  సమృద్ధిగా ఉంటాయి. దీని వినియోగం మలబద్ధకం సమస్యను నయం చేయడంలో సహాయపడుతుంది. మలబద్ధకం నుండి ఉపశమనానికి,  జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి బచ్చలికూర ఒక ఆరోగ్యకరమైన ఎంపిక. జాగ్రత్తలు.. పాలకూరలో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, ఇందులో ఉండే ఆక్సాలిక్ యాసిడ్ శరీరం  కాల్షియంను గ్రహించడంలో అడ్డుకుంటుంది. అంతేకాదు  దీన్ని ఎక్కువగా తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుంది. కాబట్టి పాలకూరను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకోకూడదు. అలాగే పాలకూరను ఎక్కువగా వండకూడు. ఎందుకంటే  ఇందులో ఉండే పోషకాలు నశించిపోయి ఆరోగ్యానికి అంతగా ఉపయోగపడదు. బచ్చలికూర నుండి పోషకాలు పుష్కలంగా లభించాలంటే   ఎక్కువ ఉడకబెట్టడం మానుకోవాలి.                                     *నిశ్శబ్ద  

మలబద్దకం సమస్య ఎందుకొస్తుంది? తగ్గడానికి ఏం చెయ్యాలంటే.!

మలబద్ధకం అనేది చాలా మంది  ఎదుర్కొనే సాధారణ సమస్య. ఈ సమస్య  చాలా చిన్నదిగా అనిపించినప్పటికీ ఇది  దీర్ఘకాలికంగా మారితే అది చాలా ఇబ్బంది పెడుతుంది.  సరైన జీవనశైలి, నీరు తక్కువగా  తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మలబద్ధకం సమస్య వస్తుంది. తినే ఆహారమే  మలబద్ధకం సమస్యకు కారణం అవుతుంది. కొన్ని ఆహార పదార్థాలు దీర్ఘకాలిక మలబద్ధకాన్ని తగ్గించడంలో కూడా   సహాయపడతాయి.  ప్రాసెస్ చేయబడిన ఆహారాలు మలబద్దకం రావడానికి గల కారణాలలో  మొదటి స్థానంలో ఉన్నాయి. వీటిలో చక్కెరలు ఎక్కువగానూ,  ఫైబర్ తక్కువగానూ ఉంటాయి. ఇవి   జీర్ణవ్యవస్థను నాశనం చేస్తాయి.   పేగు కదలికలు సాఫీగా జరగడానికి సహాయపడే ఫైబర్ లేకపోవడం వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది. మలబద్దకానికి కారణమయ్యే ఆహారాలు.. పాల ఉత్పత్తులు.. పాలు, పాల ఉత్పత్తులు కాల్షియం,  ఇతర పోషకాల  గొప్ప మూలం.  అయితే కొంతమంది లాక్టోస్ అసహనం కారణంగా మలబద్ధకంతో బాధపడవచ్చు. జున్ను,  పాలు వంటి పాల ఉత్పత్తులు కొంతమందికి మలబద్ధకం కలిగిస్తాయి, దీనివల్ల అసౌకర్యం,  మలం విసర్జించడంలో  కష్టం ఏర్పడుతుంది. అరటిపండు ఆశ్చర్యకరంగా పోషక విలువలు సమృద్దిగా ఉంటాయని చెప్పుకునే  అరటిపండు అధికంగా తీసుకుంటే మలబద్ధకాన్ని కలిగిస్తుంది. వీటిలో  పొటాషియం,  ఇతర ముఖ్యమైన పోషకాలు  పుష్కలంగా ఉన్నప్పటికీ, అరటిపండ్లలో పెక్టిన్  ఉంటుంది. ఇది మలబద్ధకం కలిగించే ఒక రకమైన కరిగే ఫైబర్. రెడ్ మీట్.. ఎర్ర మాంసంలో  ప్రోటీన్,  ఐరన్  పుష్కలంగా ఉన్పప్పటికీ ఇది జీర్ణవ్యవస్థకు సవాలుగా ఉంటుంది. అధిక కొవ్వు,  ఫైబర్ లేకపోవడం మలబద్ధకానికి ప్రధాన కారణం. ఆల్కహాల్ అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది, ఇది మలబద్ధకానికి దారితీయవచ్చు. ఆల్కహాల్ అధిక వినియోగం శరీరం నీటిని నిలుపుకోవడాన్ని దెబ్బతీస్తుంది, దీని వలన మలం గట్టిపడుతుంది. మలబద్ధకాన్ని నివారించడానికి ఏమి తినాలి? తృణధాన్యాలు, బ్రౌన్ రైస్, క్వినోవా, ఓట్స్,  వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. కాయధాన్యాలు, శనగలు,  బీన్స్ వంటి చిక్కుళ్ళు చేర్చుకోవాలి. ఆపిల్, బెర్రీ, స్ట్రాబెర్రీ, నారింజ, బత్తాయి,  రేగు వంటి  ఉన్న పండ్లను ఎంచుకోవాలి. బ్రోకలీ, క్యారెట్లు, బచ్చలికూర, మొలకలు వంటి కూరగాయలను  తీసుకోవడం పెంచాలి. నీరు బాగా తాగాలి.                                            *నిశ్శబ్ద.  

ఈ లక్షణాలు కనిపిస్తే శరరీంలో రోగనిరోధక శక్తి తగ్గినట్టే!

​శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోగనిరోధక శక్తి చాలా అవసరం. చాలావరకు చలికాలంలో జబ్బులు, అంటువ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే అధికశాతం మంది రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి  కషాయాలు,  రోగనిరోధక శక్తి పెంచే ఆహారాలు, చ్యవనప్రాశ్ వంటి లేహ్యాలు వాడతారు. అయితే శరీరంలో రోగనిరోధక శక్తి  లోపిస్తే శరీరం కొన్ని లక్షణాలను వ్యక్తం చేస్తుంది. ఆ లక్షాలేవీ లేకుండా ఊరికే ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు, పానీయాలు అతిగా తీసుకోవడం కూడా సమస్యను తెచ్చిపెడుతుంది. శరీరం అసౌకర్యానికి గురవుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉందనడానికి కనిపించే కొన్ని లక్షణాలేంటో తెలుసుకుంటే.. ఒత్తిడి, నిరాశ.. ఒత్తిడి, నిరాశ మనిషిలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్లే సంభవిస్తాయి. ఒత్తిడి శరీరంలో తెల్లరక్తకణాల పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఇవి శరీరానికి ఆర్మీ ఫోర్స్ లాంటివి.  ఇన్ఫెక్షన్లతో పోరాడి వాటిని విచ్చిన్నం చేసేది ఇవే. కాబట్టి ఒత్తిడి, నిరాశ అనేవి శరీరంలో తెల్లరక్తకణాలు తగ్గాయనడానికి సూచన,  తెల్లరక్తకణాలు లోపిస్తే రోగనిరోధక శక్తి లోపించింది అనడానికి సూచన. జలుబు, దగ్గు.. చలికాలంలో రెండు నుండి మూడు సార్లు జలుబు, దగ్గు రావడం సహజమే. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ వ్యాధులతో పోరాడే ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడానికి 3 నుండి 4 రోజుల సమయం పడుతుంది. ఆ తరువాత శరీరం సమస్యల నుండి కోలుకోవడానికి 6 నుండి 8 రోజుల సమయం పడుతుంది. కానీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే ఎక్కువ రోజులు జలుబు, దగ్గు వేధిస్తాయి. చెవి సమస్యలు.. చెవి సమస్యలు చాలామందిలో వాతావరణ మార్పుల వల్ల కలుగుతుంటాయి. సంవత్సరంలో నాలుగు సార్లకు మించి చెవి సమస్యలు వస్తున్నా, సంవత్సరంలో రెండు సార్లకు మించి న్యుమోనియా వస్తున్నా రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉన్నట్టు లెక్క. ఇలాంటి సమస్యలు వస్తే మాత్రం అస్సలు నిర్లక్ష్యంగా ఉేండకూడదు. కడుపు సమస్యలు.. ప్రతి వ్యక్తి రోగనిరోధక శక్తి 70శాతం జీర్ణవ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. జీర్ణవ్యవస్థ వల్లే బాక్టీరియా, సూక్ష్మజీవుల ఇన్పెక్షన్ల  నుండి ప్రేగులను రక్షిస్తాయి. మలబద్దకం, అతిసారం వంటి సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నట్టైతే  రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని అర్థం. గాయాలు.. శరీరంలో గాయాలు నయం కావడంలో ఇబ్బందులుంటే రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నట్టు అర్థం. చాలావరకు కాలిన, తెగిన, పడినప్పుడు తగిలిన గాయాల్లాంటివి  రోగనిరోధక శక్తి బాగుంటే అవే తొందరగా తగ్గిపోతాయి. కానీ రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే ఇవి తొందరగా మానవు. కొన్నిసార్లు అవి పుండ్లుగా మారి పెద్ద సమస్యలకు కూడా దారితీసే అవకాశం ఉండచ్చు. శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువ ఉందనడానికి ఇది కూడా కారణం.                                       *నిశ్శబ్ద.

చలికాలంలో చిలగడదుంప తింటే ఎన్ని లాభాలో తెలుసా?

సీజన్ ను బట్టి పండ్లు కూరగాయలు అందుబాటులోకి వస్తాయి. అలాంటి వాటిలో చిలగడ దుంప కూడా ఒకటి. చిలగడ దుంప ఎంత రుచిగా ఉంటుందో అంతకు మించి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఇది నారింజ, ఊదా, తెలుపుతో సహా వివిధ రంగులలో లభిస్తుంది. స్వీట్ పొటాటో స్పెషాలిటీ ఏంటంటే దానిని ఉడబెట్టి అయినా తినచ్చు, కూరల్లోనూ ఉపయోగించవచ్చు, పచ్చిగా కూడా తినవచ్చు. కొన్నిచోట్ల దీన్ని కాల్చి కూడా తింటారు. దీనివల్ల కలిగే ఉపయోగాలేంటో పూర్తీగా తెలుసుకుంటే.. పోషకాల నిధి.. చిలగడ దుంపను పోషకాల నిధి అని చెప్పవచ్చు.  కాల్షియం, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6, ఫోలేట్, పొటాషియం,  యాంటీఆక్సిడెంట్లు వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.ఇవి శరీరం తన విధులు సమర్థవంతంగా నిర్వహించడంలో సహాయపడతాయి. ఫైబర్ మూలం.. చిలగడదుంపలలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది.  రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. బీటా కెరోటిన్ చిలగడదుంపలో  అధిక మొత్తంలో బీటా కెరోటిన్  ఉంటుంది. ఇది  శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, రేచీకటి  నివారించడానికి,  మొత్తం కంటి ఆరోగ్యం నిర్వహించడానికి విటమిన్ ఎ ముఖ్యమైనది. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది చిలగడ దుంపలలో  సహజ చక్కెరలు ఉన్నప్పటికీ  తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. అంటే అవి చక్కెరను రక్తప్రవాహంలోకి నెమ్మదిగా విడుదల చేస్తాయి. ఇది బ్లడ్ షుగర్ ని మెరుగ్గా నియంత్రిస్తుంది. వెయిట్ లాస్  చిలగడ దుంపలో  ఫైబర్ తో పాటు  పోషకాలు ఉంటాయి. ఇవి రెండూ కలిసి ఎక్కువ ఆకలి నియంత్రించడంలో సహాయపడతాయి. అధిక కేలరీల తీసుకోడాన్ని నియంత్రిస్తాయి.  తద్వారా బరువు నిర్వహణకు సహాయపడుతుంది. గుండెను ఆరోగ్యం  చిలగడదుంపలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది, తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే పీచు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహకరిస్తుంది.                                          *నిశ్శబ్ద.

మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే..!

నేటికాలంలో చాలా మంది ఏదొక సమస్యతో ఒత్తిడికి గురవుతున్నారు. దీనివల్ల సమస్య పరిష్కారం కాకపోగా..ఇతర అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అయితే పెద్దవాళ్లు మాత్రమే కాదు..చిన్నారులు కూడా ఒత్తిడికి లోనవుతున్నారని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులుగా మీరే..దానికి సరైన పరిష్కారం చూపిస్తారు. అయితే పిల్లలు ఒత్తిడికి లోనవుతున్నట్లు మాకేలా తెలుస్తుందనే డౌట్ మీకు రావచ్చు. పిల్లలు ఒత్తిడికి లోనైనప్పుడు కొన్ని రకాల లక్షణాలు వారిలో కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు. అవి ఎలా ఉంటాయి? చిన్నారులను ఒత్తిడి నుంచి ఎలా బయటపడేయాలని..ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అనారోగ్యంతో ఉన్నారేమో గమనించాలి? కొంతమంది పిల్లలు ఒత్తిడికి లోనైనప్పుడు తలనొప్పి, కడుపునొప్పి వంటి సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు. అయితే ఇవిసాధారణంగా కూడా ఉంటాయనే సందేహం మీకు రావచ్చు. అయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని పిల్లల్లో తరచుగా ఈ సమస్య వస్తున్నట్లయితే..దానిని ఒత్తిడికిందే పరిగణించాలని నిపుణులు అంటున్నారు. టీచర్లు ఇచ్చిన హోం వర్క్ చేయలేకపోవడం, పరీక్షలకు సరిగ్గా సన్నద్ధం కాకపోవడం వల్ల ఒత్తిడికి లోనవుతుంటారు. ఇలాంటివి తల్లిదండ్రులకు చెబితే తిడతారన్న భయం కూడా వారిలో ఉంటుంది. ఇలాంటి సమయంలో వారిని మీరే దగ్గరకు తీసుకుని వారి సమస్యలేంటో అడిగే ప్రయత్నం చేయాలి. అలాగే వారికి ధైర్యం చెప్పాలి. సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించాలి. ఫోన్లో గేమ్స్ ఆడటం? సాధారణంగా పిల్లలు ఎక్కువగా ఫోన్లలో ఆటలు ఆడుతుంటారు. కొన్ని ఆటల వల్ల పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ కొన్ని మాత్రం పిల్లల్లో ఒత్తిడిని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారన్నా విషయం  కూడా వారికి తెలియదు. అలాని వారిని అసలు ఫోన్లకే దూరం చేయడం కూడా మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ఒకవేళ వారికి ఫోన్ ఇచ్చినా దానికంటూ కొంతసమయం మాత్రమే కేటాయించాలి. అలాగే వారు ఆడే ఆటలు చూసే వీడియోలపై కూడా ఓ కన్నేసి ఉంచడం అవసరం. ఏం తింటున్నారు..ఎలా తింటున్నారు? మనం ఆహారం తీసుకునే విధానంలో ఒత్తిడికి లోనవుతున్నామో లేదో సులభంగా తెలిసిపోతుందట. ఇది కేవలం పెద్దలకే కాదు..పిల్లలకు కూడా వర్తిస్తుందని నిపుణులు అంటున్నారు. మీ పిల్లలు అంతకుముందు కంటే ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం కానీ..తక్కువగా తీసుకోవడం కానీ జరుగుతుందంటే దానిని ఒత్తిడి కిందే పరిగణించాలని చెబుతున్నారు. వారు ఏదైనా విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తే ఇలా చేస్తారని అంటున్నారు. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తుంటే వారి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఏకాగ్రత? సాధారణంగా ఒత్తిడికి లోనైతే ఏ పనిని సరిగ్గా చేయలేం. ముఖ్యంగా చదువుల విషయంలో ఇది కనిపిస్తుంది. ఒత్తిడి అనేది ఎప్పుడూ బయటి అంశాలపైనే ఆధారపడదు. కొన్ని సందర్భాల్లో మనం చేసే పనులను కూడా నిర్వర్తించినప్పుడు కూడా ఒత్తిడికి గురవుతుంటాం. అలాగే పిల్లలు కూడా చదువు విషయంలో వారు పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోలేనప్పుడు ఒత్తిడికి లోనవుతుంటారు. ఈ క్రమంలో వారికి అండగా ఉంటూ తగిన సహకారం అందించడం చాలా ముఖ్యం. తద్వారా వారిని ఒత్తిడి నుంచి బయటపడేయవచ్చు అంటున్నారు నిపుణులు.  

సలాడ్ తినే అలవాటుందా? ఈ  అయితే ఈ నిజాలు తెలుసుకోండి..!

ఈమద్యకాలంలో చాలామంది ఓ ఆహారపు అలవాటును బాగా ఫాలో అవుతున్నారు. అదే సలాడ్. కొందరు పండ్లతో సలాడ్ తింటే.. మరికొందరు పచ్చిగా తినదగిన కూరగాయలతో సలాడ్ చేసుకుని తింటూంటారు. ఇది శరీరానికి ఆరోగ్యాన్ని, విటమిన్లను, పైబర్ ను సమృద్దిగా అందిస్తుందని.. బరువు నిర్వాహణలో తోడ్పడుతుందని చెబుతారు. అయితే సలాడ్ లు ఎప్పుడు తినాలి? ఏ సమయంలో తినాలి? ఎలా తింటే ఆరోగ్యం? ఎప్పుడు తినకూడదు? తెలుసుకుంటే.. సలాడ్ తింటే కలిగే ప్రయోజనాలు.. సలాడ్ లో చాలావరకు పచ్చికూరగాయలు ఉంటాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. మలబద్దకం సమస్య తగ్గిపోతుంది. చర్మం లోపలి కణాలు, శరీరానికి బయట కలిగే గాయలను తొందరగా తగ్గించడంలో సలాడ్లు తినడం సహాయపడుతుంది. దోసకాయ, బీట్ రూట్, పచ్చి ఉల్లిపాయ,నిమ్మకాయ, టమోటా మొదలైనవి పచ్చిగా తీసుకుంటే కాలేయ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. చలికాలంలో సలాడ్ తినడం గురించి చాలామంది సందిగ్ధంలో ఉంటారు. దీనికి కారణం పచ్చి కూరగాయలు తినడం వల్ల జలుబు, దగ్గు, తలనొప్పి వంటి సమస్యలు సులువుగా వస్తాయని. అయితే చలికాలంలో క్యారెట్, ముల్లంగి, క్యాబేజీ, ముల్లంగి రుచితో బీట్రూట్ ఆకారంలో ఉండే టర్నిప్ దుంపలు చలికాలపు సలాడ్ లో జోడించుకోవచ్చు. ఇవే కాకుండా పండ్లు కూడా తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో నీటి కొరత ఉండదు. సలాడ్ తినడానికి సరైన సమయం.. చాలామంది సలాడ్ అంటే ఎక్కువగా కీరా, క్యారెట్, టమోటాలను తింటూంటారు. వీటిని కూడా భోజనంతో పాటు తింటూంటారు. ముఖ్యంగా బిరియానీలతో పచ్చి ఉల్లిపాయ, క్యారెట్, నిమ్మకాయ, టమోటా వంటివి ఇవ్వడం చూస్తుంటాం.   వీటిని ఉడికించిన ఆహారంతో పాటు తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. జీర్ణసమస్యలు ఎదురవుతాయి.  ఉడికించిన ఆహారంలో ఉష్టోగ్రత, ఆహారం గుణాలు, సలాడ్ లోని ఉష్టోగ్రత, వాటి గుణాలు రెండూ వేరు వేరు కాబట్టి ఇది జరుగుతుంది. అందుకే సలాడ్ లను ఎప్పుడూ ఆహారానికి అరగంట ముందు తీసుకోవాలి. లేదా ఉదయం కాస్త ఆకలిగా ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చు. ఆహారంతో ఎందుకు తినకూడదంటే.. ఆహారంతో పాటు సలాడ్లు తీసుకోకూడదు అనడానికి  మరిన్ని కారణాలు ఉన్నాయి. ఆహార స్థితిని బట్టి దాన్ని జీర్ణం చేయడానికి శరీరంలో కాలేయం ఎంజైమ్ లను విడుదల చేస్తుంది.  దీనివల్లే ఆహారం జీర్ణం అవుతుంది. కానీ సలాడ్లు ఆహారంతో తీసుకోవడం వల్ల కాలేయం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. మరొక కారణం ఏమిటంటే.. చల్లని ఆహారం, ఉడికించిన ఆహారం రెండూ కలిపి తింటే ఆయుర్వేదం ప్రకారం జఠరాగ్ని మందగిస్తుంది. జఠరాగ్ని అనేది ఆహారాన్ని జీర్ణం చేసే శక్తి. సలాడ్లు ఆహారంతో కలిపి తీసుకోవడం దీర్ఘకాలం కొనసాగితే జీర్ణశక్తి మందగిస్తుంది.                                          *నిశ్శబ్ద.

ప్రోటీన్ పౌడర్లు కాదు.. ఈ డ్రింక్ 15రోజులు తాగితే చాలు.. శరీరం ఉక్కులా మారుతుంది!

ఎప్పుడూ అలసటగా,  బలహీనంగా ఉంటుందా? బద్దకంగానూ,  మోకాళ్లలో నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? వీటిని అధిగమించడానికి  జిమ్ కు వెళ్తున్నా, మార్కెట్‌లో లభించే ఖరీదైన ప్రొటీన్ పౌడర్‌లు తీసుకుంటున్నా అంత ఫిట్ గా అనిపించడం లేదా?   ఈ సమస్యలను గనుక ఎదుర్కొంటున్నట్లయితే, ప్రోటీన్ తీసుకునే విధానాన్ని మార్చుకోవాలి. నిత్యం బలహీనంగా ఉంటే శరీరంలో ప్రాణం ఉండదని, మోకాళ్లలో నొప్పులు వస్తుంటే మంచి ప్రోటీన్ అవసరం అని అర్థం. ఇంట్లోనే ఆరోగ్యకరమైన ప్రొటీన్‌ను ఎలా తయారు చేసుకోవచ్చో,  దాని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుంటే.. ప్రోటీన్ పౌడర్ కు కావలసిన వస్తువులు.. 60 గ్రాముల వేయించిన శనగలు 2 ఖర్జూరాలు. 1 అపటిపండు 1 గ్లాసు పాలు  బెల్లం రుచికి సరిపడా తయారువిధానం.. ముందుగా వేయించిన శనగలను మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇలా తయారుచేసిన పొడిని సత్తు అని అంటారు. ఇది బీహార్ లో ఫేమస్.  ఇందులో   ప్రోటీన్, కాల్షియం,  ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఈ  పొడిలో అరటిపండు, ఖర్జూరం, బెల్లం, పాలు వేసి కలపాలి.  అంతే ఎంతో పోషకరమైన ప్రోటీన్ డ్రింక్ సిద్దమైనట్టే. ప్రయోజనాలు.. ఈ మిశ్రమాన్ని కేవలం 15 రోజుల పాటు తీసుకోవడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు.  బలహీనతతో బాధపడుతున్నవారు దీనిని తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రొటీన్లే కాకుండా శరీర సామర్థ్యం పెరగడానికి  అవసరమైన అన్ని పోషకాలు దీంట్లో లభిస్తాయి. ఈ శక్తివంతమైన ప్రోటీన్ డ్రింక్ లో  కాల్షియం వల్ల  కేవలం 15 రోజుల్లోనే  శరీరంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. జిమ్ కు వెళ్లే అలవాటున్నా,వర్కౌట్లు చేస్తున్నా ఈ డ్రింక్  కు తీసుకుంటూ ఉంటే శరీరం దృడంగా మారుతుంది. ఎముకలు, కండరాలలో బలం పుంజుకుంటుంది. శరీరం ఉక్కులా మారుతుంది.                                                 *నిశ్శబ్ద.  

పాలలో కలిపి ఈ ఆహారాలు తీసుకుంటే విషంతో సమానం..

ఆహారమే ఆరోగ్యం. మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచి ప్రమాదకరమైన జబ్బులను సైతం తట్టుకునేలా చేస్తుంది. కానీ ఆరోగ్యం అనుకుంటూనే చాలామంది ఆహారం విషయంలో తప్పులు చేస్తారు. ఈ తప్పులు కాస్తా పెద్ద ముప్పులకు దారితీస్తాయి. చాలామంది సాధారణమేలే అనుకుంటూనే పాలతో కొన్ని పదార్థాలు మిక్స్ చేయడం లేదా పాలతో పాటు తినడం చేస్తుంటారు. అవి పాలతో పాటు తీసుకోగానే విషంతో సమానమైన నష్టాన్ని శరీరానికి కలిగిస్తాయి. ఆయుర్వేదం ఈ విషయాన్ని తెలిపింది కూడా.  ఈ ఆహారాలు కొన్ని అప్పటికప్పుడు వాటి ప్రభావం చూపకపోయినా అవి స్లో పాయిజన్ లా శరీరాన్ని, శరీరంలో అవయవాలను నిర్వీర్యం చేస్తాయి. పాలతో తినకూడని ఆ  ఆహారాలేంటో తెలుసుకుంటే.. పాలు.. చేపలు.. పాలు, చేపలు కలిపి వండటం, పాల ఉత్పత్తులైన పనీర్, పెరుగు, చీజ్ వంటి వాటితో కలిపి చేప వంటకాలను తయారుచేయడం అస్సలు చేయకండి. చేపలు, పాలు, పాల ఉత్పత్తులతో కలిస్తే ఆహారం విషపూరితం అవుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్ కు దారితీస్తుంది. జీర్ణాశయాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది. మరీ ముఖ్యంగా ఈ కాంబినేషన్ తింటే చర్మ సంబంధ సమస్యలు వస్తాయి. పాలు.. పుల్లని పండ్లు.. పుల్లని పండ్లను సిట్రస్ పండ్లు అని కూడా అంటారు. సిట్రస్ పండ్లలో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా పాలలో కాసింత నిమ్మరసం పడితే పాలు విరిగిపోవడం గమనించే ఉంటారు. అలాగే పనీర్ తయారీకి చాలామంది పాలలో నిమ్మరసం పోసి తయారుచేస్తుంటారు. అయితే పనీర్ ను మళ్లీ వేయించడం లేదా ఉడికించడం చేస్తారు కాబ్టటి అది తిన్నా పర్వాలేదు. కానీ పాలు-సిట్రస్ పండ్ల కాంబినేషన్ చాలా ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. కడుపులో  గందరగోళం ఏర్పరుస్తుంది. జీర్ణాశయాన్ని దెబ్బతీస్తుంది. పాలు.. బ్రెడ్డు.. చాలామంది ఇష్టంగా తినే కాంబినేషన్ ఇది. ఉదయాన్నే కొందరు దీన్ని అలవాటుగా తింటే.. ఆరోగ్యం బాలేనప్పుడు పాలు-బ్రెడ్డు తింటుంటారు. అయితే బ్రెడ్డులో కూడా ఈస్ట్ బ్రెడ్డును పాలతో తినడం మంచిది కాదు. ఇది కడుపులో అసౌర్యం కలిగిస్తుంది. జీర్ణాశయాన్ని బలహీనంగా మారుస్తుంది. జీర్ణాశయ గోడలను మెల్లగా శిథిలం చేస్తుంది. పాలు.. అరటిపండ్లు.. పాలు, అరటిపండ్లు చాలా మందికి ఇష్టమైన కాంబో. గ్లాసుడు పాలు, ఓ అరటిపండు తింటే దాదాపు రెండు గంటల సేపు ఆకలి అనే మాట మాట్లాడరు. ఈ కాంబినేషన్ వల్ల పుడ్ పాయిజనింగ్ వంటి ప్రమాదాలు ఏర్పడకపోయినా గొంతులో కఫానికి దారితీస్తుంది. ఇది శ్వాస సంబంధ సమస్యలకు, రోజంతా చికాకుగా ఉండటానికి కారణం అవుతుంది. పాలు.. పుచ్చకాయ, కర్బూజ.. పుచ్చకాయ, కర్బూజ వంటి పండ్లలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. ఈ పండ్లను పొరపాటున పాలతో తీసుకోకూడదు. చాలామంది ఈ పండ్లకు పాలు కలిపి మిల్క్ షేక్ తయారుచేసుకుని తాగడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఇవి తీసుకోవడం వల్ల జీర్ణసంబంధ సమస్యలు ఏర్పడతాయి. అంత ఈజీగా వదలవు. కేవలం పైన చెప్పుకున్నవే కాకుండా పాలతో పాటూ ఉప్పు, కారం, మాంసాహారం, ఆకు కూరలు వంటివి తీసుకోకూడదు.                                                          *నిశ్శబ్ద.

ఆహారాన్ని పదే పదే వేడి చేస్తున్నారా?

సాధారణంగా మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్ లో పెట్టేస్తాం. కూరలు, పప్పులు అయితే తప్పకుండా పెడుతుంటాం. కావాల్సినప్పుడు వాటిని బయటకు తీసుకుని వేడిచేసుకుని తింటుంటాం. ఇలా చేయడం వల్ల ఆహారం వేస్ట్ కాకుండా చేశామని అనుకుంటాం. కానీ అనారోగ్యానికి కోరి తెచ్చున్నట్లు అవుతుందని మీకు తెలుసా? -మాంసాహారం, గుడ్లు, పప్పులు వంటివన్నీ మాంసక్రుత్తులు ఎక్కువగా ఉండే పదార్థాలు. వీటిని మళ్లీ మళ్లీ వేడిచేసినట్లయితే వాటిలో ఉండే మాంసక్రుత్తులు విచ్చిన్నమవుతాయి. ఆమ్లాలు ఉత్పత్తై తిన్న ఆహారం జీర్ణం కాకుండా చేస్తాయి. వీటిని తాజాగానే తినడం మంచిది. అస్సలు నిల్వ చేయకూడదు. -ఆహారాన్ని మళ్లీ మళ్లీ వేడిచేయడం వల్ల అందులోని విటమిన్, సి, బి వంటిపోషకాలు నశించిపోతాయి. ఆ ఆహారం తిన్నాకూడా శరీరానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. - అన్నం, పాస్తా వంటివాటిని ఎంత కావాలో అంతే వండుకోవాలి. మిగిలిదాన్ని ఫ్రిజ్ లో పెట్టి వేడిచేసి తింటే హానికర బ్యాక్టీరియాని స్వయంగా శరీరంలోకి ఆహ్వానించినట్లవుతుంది. -ఆలుగడ్డ లేదా బ్రెడ్ వంటి పిండిపదార్థాలను మళ్లీ వేడి చేస్తే క్యాన్సర్ కరకాలు ఉత్పన్నమవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే వాటిని తాజాగా ఉన్నప్పుడే తినాలి. ఎక్కువసేపు వండటం, ఫ్రిజ్ లో స్టోర్ చేయడం కంటే కావాల్సినంతే వండుకోవడం వల్ల డబ్బు ఆదా అవుతుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.   

మౌత్ వాష్ వాడే అలవాటుందా? ఈ నిజాలు తెలుసుకోవాల్సిందే.!

నలుగురిలో మాట్లాడాలన్నా, నవ్వాలన్నా, అందరి ముందు ఆహారం తినాలన్నా దంత సంరక్షణ, నోటి ఆరోగ్యం బాగుండాలి. అయితే చాలామంది నోటి శుభ్రత, దంతాల రంగు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. నోరు దుర్వాసన లేకుండా తాజాగా ఉండాలన్నా, దంతాలు తెల్లగా ఉండాలన్నా  మంచి టూత్ పేస్ట్, మౌత్ వాష్ వాడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు పళ్లు సరిగ్గా తోముకోరనే కారణంతో వారికి మౌత్ వాష్ ఉపయోగిస్తుంటారు. కానీ మౌత్ వాష్ వాడటం ప్రమాదాలతో కూడుకుని ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అసలు మౌత్ వాష్ వాడటం ఎంతవరకు సేఫ్? వీటిని వాడితే జరిగేదేంటి? మౌత్ వాష్ లో ఏముంటుంది? మార్కెట్లో బోలెడు మౌత్ వాష్ లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అధిక మొత్తంలో ఇథనాల్ ఉంటుంది.  మరీ ముఖ్యంగా ఆల్కహాల్ నుండి సేకరించిన ఎసిటాల్డిహైడ్ అనే రసాయం ఉంటుంది. ఇది క్యాన్సర్ కారకం. క్యాన్సర్ రావడానికి ప్రేరేపిస్తుంది.  ఏ మౌత్ వాష్ అయినా సరే.. వాటిలో 25శాతం కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉంటుంది. ఎంత వరకు సేఫ్.. మౌత్ వాష్ సేఫా కాదా అనే విషయం గురించి వైద్యులు స్పష్టంగా చెబుతున్నారు. దంత సంరక్షణకు, నోటి శుభ్రతకు ఇది మంచిదే అయినప్పటికీ మౌత్ వాష్ ఎక్కువ వాడితే మాత్రం నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు. మౌత్ వాష్ ను మితంగా వాడితే అది దంతాల మీద మరకలను, దంతాల  మధ్యలో ఉండే మురికిని తొలగిస్తుంది. నోటికి తాజాదన్నాన్ని కూడా ఇస్తుంది. కానీ మౌత్ వాష్ ఎక్కువ  వాడటం వల్ల అది నోటి క్యాన్సర్ కు దారితీస్తుంది. మౌత్ వాష్ వాడితే జరిగేది ఇదే.. మౌత్ వాష్ వాడటం వల్ల కేవలం నోటి క్యాన్సర్ మాత్రమే కాదు.. తల, మెడ, క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని అధ్యనాలు చెబుతున్నాయి. వీటిని ఎక్కువగా వాడే వారి నోరు తొందరగా పొడిబారుతుంది. వీటిలో ఉండే ఆల్కహాల్ దీనికి కారణం అవుతుంది.  నోటి లోపలిచర్మం చాలా సున్నితంగా మారి నోటి పూతలు, నోటి పుండ్లు, నోటి క్యాన్సర్ తొందరగా రావడానికి కారణం అవుతుంది. అందుకే మౌత్ వాష్ లను వీలైనంత అవాయిడ్ చేయడం మంచిది. ఆరోగ్యకరమైన అలావాట్లు ఉంటే దంతాలు,నోరు సహజంగానే శుభ్రంగా ఉంటాయి.  ఒకవేళ నోటి ఆరోగ్యం, దంత సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు కానీ, ఇబ్బందులు  కానీ ఉంటే దంత వైద్యుడిని కలిసి సమస్య పరిష్కరించుకోవడం మంచిది.                                         *నిశ్శబ్ద.

చలికాలంలో జలుబు,దగ్గుకు చెక్ పెట్టే అమృతసమానమైన కషాయాలు..!

చలికాలంలో విపరీతమైన దగ్గు,జలుబు కారణంగా గొంతులో కఫం ఏర్పడుతుంది.  కొన్నిసార్లు గొంతు లోపల పేలుతుంది. దీనికారణంగా   రక్తస్రావం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. దగ్గు నుండి ఉపశమనం పొందడానికి కొన్ని ఆరోగ్యకరమైన కషాయాలను ఉపయోగించడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. ఈ కషాయాలలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ డయాబెటిక్, ఇమ్యూన్-బూస్టర్ లక్షణాలు ఉంటాయి. ఉదయాన్నే టీ, కాఫీలకు బదులుగా  వీటిని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే వీటిని బెస్ట్ మార్నింగ్ డ్రింక్స్ అంటారు. వాటిని ఎలా తయారు చేయాలో, వాటి ప్రయోజనాలేంటో తెలసుకుంటే.. అల్లం, పసుపు.. అల్లం  పసుపు కలపడం వల్ల యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, ఇమ్యూనిటీ బూస్టర్ లక్షణాలు పుష్కలంగా ఉండే ఎఫెక్టివ్ డికాక్షన్ తయారవుతుంది. ఈ డికాషన్ జలుబుతో పోరాడటమే కాకుండా జీర్ణక్రియకు సహాయపడుతుంది. తయారు విధానం.. తురిమిన అల్లం, పసుపు, మిరియాలు,  దాల్చిన చెక్కను నీటిలో 10-15 నిమిషాలు ఉడకబెట్టాలి. వడపోసి త్రాగే ముందు, కొద్దిగా తేనె, నిమ్మకాయ రసం కలిపి తీసుకోవాలి. తులసి తులసిని ఆయుర్వేదంలో శక్తివంతమైన మూలిక అంటారు. తులసి కషాయం అద్భుతమైన డీకాంగెస్టెంట్‌గా పనిచేస్తుంది, కఫాన్ని తొలగించడం ద్వారా దగ్గు నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.  యాంటీవైరల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాల వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తయారు విధానం.. తాజా తులసి ఆకులను తీసుకుని, మిరియాలు, లవంగాలు,  అల్లం ముక్క వేసి  నీటిలో ఉడకబెట్టాలి. కాసేపు మరిగిన తర్వాత రుచికి సరిపడా బెల్లం వేసి తాగాలి. దాల్చిన చెక్క ఒక అధ్యయనం ప్రకారం దాల్చినచెక్కలో పాలీఫెనాల్స్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఏలకులు కూడా  ఆక్సీకరణ ఒత్తిడి నుండి కణాలను రక్షిస్తుంది. తయారు విధానం.. దాల్చిన చెక్క,  ఏలకులు, అల్లం ముక్క  కొన్ని లవంగాలను నీటిలో ఉడకబెట్టాలి. కాసేపు మరిగిన తర్వాత వడకట్టి అందులో ఒక చెంచా తేనె వేసి సిప్ బై సిప్ తాగాలి. ఆయుర్వేద త్రిఫల.. ఉసిరి, కరక్కాయ, తానికాయల  మిశ్రమాన్ని త్రిఫల అంటారు. ఆయుర్వేదంలో ఇది శరీరాన్ని శుద్ది చేసి శరీరానికి కొత్త శక్తిని ఇస్తుందని చెబుతారు. రోజూ దీన్ని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తయారు విధానం.. ఒక చెంచా త్రిఫల పొడిని నీటిలో వేసి 5-10 నిమిషాలు తక్కువ మంట మీద మరిగించాలి. మెంతులు,ధనియాలు.. ఈ కషాయాన్ని తాగడం వల్ల రోగనిరోధక శక్తితో పాటు జీర్ణశక్తి పెరుగుతుంది. ఇది శ్వాసకోశ ఆరోగ్యాన్ని, రక్తంలో చక్కెరను కూడా బ్యాలెన్స్ గా ఉంచుతుంది.  టైప్ 2 డయాబెటిక్ రోగులలో రక్తంలో చక్కెర, పొట్ట కొవ్వు,  వేగంగా తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. తయారు విధానం.. మెంతి గింజలు, దనియాలు, మిరియాలు,  దాల్చిన చెక్కను నీటిలో వేసి మరిగించాలి. దీన్ని కాసేపు ఉడకబెట్టాలి.  తరువాత ఫిల్టర్ చేసి తాగాలి.                                        *నిశ్శబ్ద.  

చలికాలంలో వాము ఆకులు తప్పక తినాలి.. బెనిఫిట్స్ ఇవే..!

వాము ఆకుల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. మందంగా ఆకుల చివర కత్తిరించినట్టుగా  కనిపించే వాము ఆకులు చాలామంది ఇళ్లలోనే పెంచుకుంటారు.దీని వాసన ఘాటుగా ఉంటుంది. దగ్గు, జలుబు చేయగానే చాలామంది  ఈ ఆకులను తినమని సలహా ఇస్తుంటారు కూడా. అయితే ఈ వాము ఆకులు చలికాలంలో చాలా ఉపయోగపడతాయి. చలికాలంలో జలుబు, గొంతు సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. కేవలం వీటికే కాకుండా వాము ఆకు మరిన్ని సమస్యలకు అద్బుతమైన ఔషదంగా పనిచేస్తుంది. వాము ఆకుల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో పూర్తీగా తెలుసుకుంటే.. వాము ఆకులలో కాసింత ఉప్పు పెట్టి తాంబూలంలా చుట్టి నమిలి తినాలి. ఆ తరువాత గోరువెచ్చని నీరు తాగాలి. ఇలా చేస్తే కడుపునొప్పి సమస్య మంత్రించినట్టు మాయం అవుతుంది. వాము ఆకులలో విటమిన్-ఎ,సి, సెలీనియం, జింక్ వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కారణంగా ఇవి హార్మోన్స్ ను బ్యాలెన్స్ గా ఉంచడంలో సహాయపడతాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉన్న కారణం వల్ల వాము ఆకులను తిన్నప్పుడు కడుపులో మంట తగ్గుతుంది. కడుపులో యాసిడ్లకు ఇది చికిత్స చేస్తుంది. వాము ఆకుల్లో యాంటీ బాక్టీరియల్  లక్షణాలు ఉంటాయి. వీటిని బాగా నమిలి తినడం వల్ల నోటిలోని బాక్టీరియా మాత్రమే కాకుండా నోటి దుర్వాసన కూడా తగ్గిపోతుంది. వాము  ఆకులలో థైమోల్ అనే యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి శ్వాసకోశ ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతాయి. ఆయుర్వేదం మహిళలకు వాము ఆకులతో గొప్ప ఆరోగ్య చిట్కా సూచించింది. ఈ ఆకులను క్రమం తప్పకుండా తింటూ ఉంటే నెలసరి సమస్య వచ్చినప్పుడు అస్సలు నెలసరి నొప్పి సమస్యే ఉండదు. వాము ఆకులలో ఎక్స్ పెక్టరెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి దగ్గు, జలుబు లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఇవి గొంతు, ముక్కులలో రద్దీని క్లియర్ చేయడంలో సహయపడతాయి. అరచెంచా వాము ఆకులు, అరచెంచా మారేడు ఆకులను కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. ఇలా చేస్తే మధుమేహం ఉన్నవారిలో పాలీయూరియా పై ప్రభావం చూపిస్తుంది. దానివల్ల కలిగే నష్టాలను నియంత్రిస్తుంది. వాము ఆకులు, తెనె, కాసింత వెనిగర్ మూడూ కలిపి తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్ల సమస్య తగ్గుతుంది. విటమిన్-ఎ మెండుగా ఉన్న కారణంగా వాము ఆకులు తినే వారిలో కంటి చూపు ఆరోగ్యంగా ఉంటుంది. ఆ తరువాత కంటి సమస్యలు అస్సలు రాకుండా చేస్తుంది.                                                    *నిశ్శబ్ద.  

ఉదయం బ్రేక్ ఫాస్టులో వీటిని తినకండి..ఈ సమస్యలు తప్పవు.!

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉదయం అల్పాహారం ఆరోగ్యకరమైనదిగా ఉండాలి. దీని వల్ల రోజంతా శరీరంలో శక్తి ఉంటుంది.కానీ చాలా మంది అల్పాహారంలో అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటారు. వీటి వల్ల ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది.అంతేకాదు అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇవి శరీరాన్ని లోపల నుండి బోలుగా చేసి, వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి అందించవు. కాబట్టి, పొరపాటున కూడా బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తినకూడదు. అల్పాహారంలో తీసుకోకూడని కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెడ్, జామ్: చాలా మంది ఉదయం అల్పాహారంగా బ్రెడ్, జామ్ తినడానికి ఇష్టపడతారు. అంతే కాదు చాలా మంది పిల్లల టిఫిన్‌లో బ్రెడ్, జామ్ కూడా ప్యాక్ చేస్తారు. కానీ, బ్రెడ్, జామ్‌లో కొవ్వు, చక్కెర అధికంగా ఉంటుంది.  ఇది భవిష్యత్తులో ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. అందువల్ల, మీరు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలనుకుంటే, బ్రెడ్, జామ్ తినకండి. టీ, కాఫీలు తాగకూడదు :  ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం వల్ల శరీరంలో యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. దీని కారణంగా మీకు గ్యాస్, బర్నింగ్ సెన్సేషన్, వాపు సమస్యలు ఉండవచ్చు. కాఫీలో పెద్ద మొత్తంలో కెఫీన్ ఉంటుంది. కెఫిన్ వినియోగం ఆరోగ్యానికి చాలా హానికరం. పాన్‌కేక్‌లు, స్వీట్లు: మీరు ఉదయం పూట పాన్‌కేక్‌లను అస్సలు తినకూడదు. నిజానికి అల్పాహారం కోసం తీపి పదార్థాలు తినకూడదు. ఎందుకంటే ఉదయం పూట తీపి పదార్థాలు తినడం వల్ల మీ షుగర్ లెవెల్ పెరుగుతుంది. భవిష్యత్తులో మీరు డయాబెటిస్‌తో బాధపడవచ్చు. క్యాన్డ్ జ్యూస్‌లు, ఎనర్జీ డ్రింక్స్‌:  ఉదయం అల్పాహారంలో ఎప్పుడూ క్యాన్డ్ జ్యూస్ లేదా ఎనర్జీ డ్రింక్స్ తాగకండి. నిజానికి, క్యాన్డ్ జ్యూస్‌లో చాలా చక్కెర ఉంటుంది. దీన్ని రోజూ తాగడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. ఇది కాకుండా, ఈ ఎనర్జీ డ్రింక్ రక్తంలో చక్కెరను కూడా పెంచుతుంది.

అరటిపండుతో కలిపి ఈ ఆహారాలు అస్సలు తినకూడదు..

అరటిపండ్లు చిన్నా పెద్ద అందరికీ ఇష్టం. అన్ని తరగతుల వారికి అందుబాటులో ఉంటాయి. ఫలానా సీజన్ లోనే దొరుకుతాయనే బెంగ ఉండదు. పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిగినా, దేవుడి ముందు నైవేద్యం పెట్టాలన్నా పెద్ద పీట అరటిపండ్లకే ఉంటుంది. చాలామంది ప్రతిరోజూ అరటిపండ్లు తింటూంటారు. డైట్ మెనూలో భాగం చేసుకుని ఉంటారు.   వీటిలో పొటాషియం, ఫాస్పరస్, పెప్టిన్, గ్లూకోజ్, ప్రక్టోజ్, విటమిన్-సి, విటమిన్-బి6, ఫైబర్, ప్రోటీన్ మొదలైనవన్నీ ఉంటాయి. ఈకారమంగా ఇది మంచి పోషకాహార పండుగా పరిగణింపబడుతుంది. కానీ కొన్ని ఆహారాల కాంబినేషన్ ఆరోగ్యానకి మంచిది కాదని వైద్యులు చెప్పినట్టు.. అరటిపండుతో ఈ కింది ఆహారాలు తినడం అస్సలు మంచిది కాదు. ప్రూట్ సలాడ్ లో భాగంగా అరటిపండుతో పాటు బోలెడు పండ్లు తింటారు. అయితే వీటిలో సిట్రస్ పండ్లు ఉంటే మాత్రం కొంప మునిగినట్టే. అరటి పండును సిట్రస్ పండ్ల కాంబినేషన్ తో ఎప్పుడూ తినకూడదు. దీనివల్ల కడుపులో గందరగోళం, తలనొప్పి వంటి సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా నిమ్మ, స్ట్రాబెర్రీ, దానిమ్మ వంటి పండ్లతో అరటిని అవాయిడ్ చేయాలి. చాలామంది అరటిపండును బ్రెడ్ తో తింటుంటారు. బ్రెడ్ స్టైసెస్ మీద అరటిపండు ముక్కలు పెట్టి తేనె లేదా చాక్లెట్ సిరప్ వేసి పిల్లలకు కూడా అందిస్తుంటారు. కానీ అరటిపండ్లు, బేకింగ్ చేసిన ఆహారాలు కలిపి తినడం ఎంతమాత్రం మంచిది కాదు. బేక్ చేసిన ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం, అరటిపండ్లు జీర్ణం కావడానికి తక్కువ సమయం పడుతుంది. రెండూ కలిపి తింటే జీర్ణాశయ సామర్థ్యం తగ్గిపోతుంది. భోజనం తిన్నతరువాత చాలామంది పండు తింటూంటారు. ఎక్కువగా అరటిపండుకే ప్రాముఖ్యత ఇస్తారు. అయితే మాంసాహారం తో అరటిపండు తిన్నా, మాంసాహారం తిన్నవెంటనే అరటిపండు తిన్నా అది చాలా చెడు చేస్తుంది. మాంసంలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఇది అరటిపండుకు విరుద్దమైన ఆహారం. పైపెచ్చు మాంసాన్ని వండటానికి మసాలాలు కూడా ఉపయోగిస్తారు. మిల్క్ షేకులు ఈ కాలపు ఫెవరెట్ డ్రింకులు. శీతలపానీయాల వల్ల ఆరోగ్యం పాడవుతుంది, అందుకే మేము  ఆరోగ్యంగా ఉండేందుకు మిల్క్ షేక్ లు తాగుతాం అని బడాయి పోయేవారు ఈ విషయం వింటే షాకవుతారు. అరటిపండును ఎక్కువగా మిల్క్ షేక్ లలో వాడతారు. కానీ పాలు , అరటిపండు కలిపి తినడం జీర్ణాశయానికి అస్సలు మంచిది కాదు. ఇది అనారోగ్యానికి దారితీస్తుంది. టాక్సిన్ లు విడుదల చేస్తుంది. ఫుడ్ పాయిజన్ కు కారణమవుతుంది. జీర్ణసంబంధ సమస్యలకు దారితీస్తుంది.           *నిశ్శబ్ద.  

ఒకసారి వండిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తినచ్చా? చలికాలంలో ఈ నిజాలు తెలుసుకుని తీరాలి!

ఆహారం శరీరానికి శక్తిని ఇస్తుంది. మనిషి ఆయుష్షు చాలా వరకు  ఆరోగ్యకరమైన ఆహారం మీదనే ఆధారపడి ఉంటుంది. ఆహారం తరువాత వ్యాయామం, అలవాట్లు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. అయితే చలికాలంలో చాలామంది ఆహారం దగ్గరే పెద్ద తప్పు చేస్తారు. ఉదయం అయినా మధ్యాహ్నం అయినా వండిన ఆహారం అంతో ఇంతో మిగులుతూనే ఉంటుంది. చలికాలంలో ఆహారాన్ని చల్లగా తినలేక దాన్ని మళ్లీ వేడి చేస్తుంటారు. అయితే ఇలా వేడి చేయడం అస్సలు మంచిది కాదని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కింది ఆహారాలు అయితే పొరవాటున కూడా వేడి చేయకూడదని చెబుతున్నారు. ఈ ఆహారాల గోల ఏంటో తెలుసుకుంటే.. చలికాలంలో పొరపాటున కూడా మళ్లీ వేడి చేసి తినకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి. వాటిలో పాలకూర, క్యారెట్లు, ఆకుకూరలు, బీట్రూట్ వంటి నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలు ముఖ్యమైనవి. పాలకూరను చాలామంది పప్పుగానే వండుతారు. కొందర పనీర్ తో కూర చేస్తారు. వీటిని మధ్యాహ్నం వండితే చాలావరకు మిగులుతాయి. చూస్తూ వీటిని పడెయ్యలేరు. అలాగని చలికాలంలో వీటిని చల్లగానూ తినలేరు. అలాంటప్పుడు మళ్లీ వేడి చేసి వేడిగా తింటారు. మిగిలిన కూరగాయలు, ఆకుకూరలు కూడా ఇంతే.. రుచికరమైన, పోషకాలు కలిగిన ఆహారం కాబట్టి ముందు వెనుక ఆలోచించరు. కానీ ఇలా ఒకసారి వండిన ఆహారన్ని మళ్లీ వేడి చేస్తే వాటిలోని నైట్రేట్ లు వేడి వల్ల నైట్రోజినేస్ గా మారుతాయి. ఇవి శరీర కణాలకు హాని కలిగిస్తాయి. అన్నం గురించి అన్ని ఇళ్లలో కనిపించే సీన్ ఒకటే.. అన్నం మిగిలితే ఫ్రైడ్ రైస్, ఎగ్ రైస్, కలర్ రైస్ ఇలా చాలా రకాలు చేస్తారు. అయితే అన్నం ఒక్కసారి వండిన తరువాత మళ్లీ దాన్ని వేడి చేయకూడదు. ఫుడ్ స్టాండర్ ఏజెన్సీ ప్రకారం అన్నాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల పుడ్ పాయిజన్ జరిగే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే అన్నాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల అన్నంలో బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది ఫుడ్ పాయిజన్ కు కారణం అవుతుంది. మాంసాహారం పడెయ్యాలంటే ఎవ్వరికీ మనసొప్పదు. పైగా ఖరీదైన ఆహారం కూడా. మధ్యాహ్నం మిగిలితే రాత్రి, రాత్రి మిగిలితే దాన్ని ఫ్రిజ్ లో పెట్టి మళ్లీ మరుసటిరోజు కూడా తింటారు. అయితే చలికాలంలో మాంసాహారాన్ని వేడిగా తినాలనే జిహ్వ చాపల్యంతో  తిన్న ప్రతీ సారి వేడి చేసుకుని తింటారు. కానీ వండిన మాంసాన్ని మళ్ళీ వేడి చేస్తే చాలా ఈజీగా ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది. పైపెచ్చు జీర్ణసమస్యలు కూడా పెరుగుతాయి. ఆహార నిపుణుల ప్రకారం అధిక ప్రోటీన్ ఉన్న ఆహారంలో నైట్రోజన్ ఉంటుంది. అది శరీరానికి హాని చేస్తుంది. చాలా మంది ఇష్టంగా తినే ఆహారాలలో బంగాళాదుంపలు ఒకటి. బంగాళాదుంపలను ఒకసారి ఉడికించాక మళ్లీ వేడి చేయకూడదు. అలా చేస్తే బంగాళా దుంపల్లో క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది బంగాళాదుంపల్లో ఉండే విటమిన్-బి6, పొటాషియం, విటమిన్-సి వంటి పోషకాలను అన్నింటిని నాశనం చేసి శరీరానికి హాని కలిగిస్తుంది. పుట్టగొడుగులు మంచి పోషకాహారం. ముఖ్యంగా చలికాలంలో విటమిన్-డి కావాలంటే పుట్టగొడుగులు తినాల్సిందే. దీంతో చలికాలంలో పుట్టగొడుగులు బాగా తింటుంటారు. అయితే పుట్టగొడుగులను ఒకసారి వండిన తరువాత మళ్లీ వేడి చేయడం అస్సలు మంచిది కాదు. వీటిని ఒకసారి వండి మళ్లీ వేడి చేస్తే వాటిలో ఉన్న ప్రోటీన్, ఖనిజాలు విచ్చిన్నం అవుతాయి. అవి టాక్సిన్లను విడుదల చేసి శరీరానికి హాని కలిగిస్తాయి. జీర్ణవ్యవస్థను దారుణంగా దెబ్బతీస్తాయి.                                               *నిశ్శబ్ద.  

ఆహారంలో మునగాకు చేర్చుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?

ఆరోగ్యంగా ఉండటానికి ఆహారాలు ఎంతగానో తోడ్పడతాయి. సరైన ఆహారం తీసుకుంటే అసలు జబ్బుల గోల ఉండదు, అంతకు మించి మందుల తలనొప్పి అసలే ఉండదు. కానీ ఆహారాల మోజులో పడి కొందరు అనారోగ్యాలను తెచ్చుకుంటున్నారు. మన చుట్టూ ఎంతో సులువుగా లభించే ఆహారాలతోనే బోలెడు ఆరోగ్యం పొందవచ్చు. చాలాచోట్ల మునగ చెట్లు బాగా పెరిగి ఉంటాయి. వీటి కాయలు అయితే డబ్బు పెట్టి కొనాల్సి వస్తోంది. కానీ మునగాకు మాత్రం డబ్బు వెచ్చించకుండానే కోసుకోవచ్చు.  ఒకవేళ మునగ చెట్లు అందుబాటులో ఉంటే మాత్రం తరచుగా మునగాకును మిస్ కాకుండా తినండి.  కేవలం మునగాకే కాదు మునగ పువ్వులను కూడా  ఆహారంలో భాగంగా తీసుకుంటారు. మునగాకును పప్పు, కారప్పొడి, టీ వంటి వంటకాలుగానూ, మునగ పువ్వులను కూడా ఇదే విధంగానే వండుకుంటారు. చాలా మంది మునగాకును, మునగ పువ్వులను ఎండబెట్టి పొడి చేసుకుని వాటిని ఉపయోగించుకుంటారు. మార్కెట్లో కూడా మునగాకు పొడి డబ్బులు పోసి కొనాల్సి వస్తోంది. కాబ్టటి మునగాకును ఆహారంలో భాగం చేసుకోవాలి. దీనిలో పోషకాలేంటో.. దీనివల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుంటే.. మునగాకులో ప్రోటీన్, విటమిన్-బి6, విటమిన్-సి, విటమిన్-ఎ, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి మూలకాలు సమృద్దిగా ఉంటాయి. మునగాకు తరచుగా తీసుకుంటే ఎముకలు బలపడతాయి.  కాల్షియం తక్కువ ఉందని కాల్షియం ఆధారిత ఆహారం తీసుకున్నా ఎముకలు బలంగా మారకపోతే మునగాకును ఆహారంలో చేర్చుకోవచ్చు. మునగాకు అల్సర్లను తగ్గించంలో అద్బుతం చేస్తుంది. ఇందులో యాంటీ అల్సర్ గుణాలు ఉన్నాయి. అల్సర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు మునగాకును తింటూ ఉంటే సమస్య తొందరలోనే తగ్గిపోతుంది. అధికబరువు సమస్య ఇప్పట్లో పెద్ద తలనొప్పిగా మారింది. కానీ బరువు తగ్గించడంలో మునగాకు సమర్థవంతంగా పనిచేస్తుంది. దీన్ని రెగ్యులర్ గా ఆహారంలో తీసుకుంటూ ఉంటే బరువు తగ్గుతారు. ఇందులో ఉండే పైబర్  జీర్ణాశయ పనితీరు మెరుగుపరుస్తుంది. మునగాకులో ఉండే పైబర్ అధిక బరువు నియంత్రణకు సహాయపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ను అదుపు చేస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరానికి శక్తి అందించడంలో మునగాకుది అందె వేసిన చెయ్యి. దీన్ని తింటూ ఉంటే శరీరం బలంగా మారుతుంది. రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. అన్నింటి కంటే ముఖ్యంగా మునాకును మధుమేహం ఉన్నవారిని తినమని సిఫారసు చేస్తారు. కాస్త వైద్యం మీద అవగాహన ఉన్నవారి నుండి నైపుణ్యం ఉన్న వైద్యుల వరకు అందరూ మునగాకును తీసుకోమని సమర్థిస్తారు. మునగాకు ఆహారం ద్వారా విడుదలయ్యే చక్కెరలను నెమ్మది చేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఐరన్ లోపం ఉన్నవారు కూడా మునగాకు తినాలి. ఐరన్ లోపం దీర్ఘకాలం పాటూ కొనసాగితే అది రక్తహీనత సమస్యకు దారితీస్తుంది. ఐరన్ భర్తీ అయితే హిమోగ్లోబిన్ లెవల్స్ పెరిగి రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. మునగాకు తింటే కలిగే మరో అధ్బుతమైన లాభం.. జుట్టు పెరుగుదల. చాలామంది జుట్టు పెరుగుదల కోసం తలకు హెయిర్ ప్యాక్ లు, షాంపూలు, నూనెలు ఉపయోగిస్తుంటారు. కానీ మునగాకును ఆహారంలో భాగం చేసుకుంటూ ఉంటే చాలు. కేవలం నెల రోజుల్లోపే జుట్టు పెరుగుదల లోనూ, జుట్టు రంగు లోనూ, జుట్టు మందంగానూ మారుతుంది.                                                     *నిశ్శబ్ద.  

ఉదయం లేవగానే మెంతుల నీళ్లు తాగుతే అధిక బరువుకు చెక్ పెట్టొచ్చు..!

మెంతుల్లో చాలా పోషకాలు ఉంటాయి. ఐరన్, మాంగనీస్‌తో సహా మంచి మొత్తంలో ఫైబర్, ఖనిజాలను కలిగి ఉంటుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో మెంతి గింజల నీటిని తాగడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. దీని కోసం, రాత్రిపూట ఒక గ్లాసు శుభ్రమైన నీటిలో మెంతులు వేసి నానపెట్టండి. ఉదయాన్నే ఆ నీటిని బాగా ఫిల్టర్ చేసి ఖాళీ కడుపుతో త్రాగాలి. కావాలంటే మెంతి గింజలు కూడా తినొచ్చు. దీంతో శరీరంలో ఉండే టాక్సిన్స్ తొలగిపోతాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది:  ఖాళీ కడుపుతో మెంతుల గింజల నీరు తాగితే  షుగర్ అదుపులో ఉంటుంది. మెంతులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. ఇది డయాబెటిస్‌లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మధుమేహంతో బాధపడేవారు రోజూ ఉదయాన్నే మెంతి గింజల నీటిని తాగవచ్చు. గుండెకు మేలు చేస్తుంది: మెంతి నీరు గుండెకు చాలా మేలు చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించే హైపోకొలెస్టెరోలెమిక్ మూలకాలను కలిగి ఉంటుంది.  తద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని వినియోగం వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి, మీరు రోజూ మెంతి నీటిని కూడా తీసుకోవచ్చు. బరువు తగ్గుతుంది: మెంతి గింజల్లో ఫైబర్ ఉంటుంది.  ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. రోజూ ఉదయాన్నే మెంతుల నీళ్లు  తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది: మెంతి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. అజీర్ణం లేదా మలబద్ధకంతో సమస్యలు ఉన్నవారికి మెంతి నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మెంతిలో ఉండే డైజెస్టివ్ ఎంజైమ్‌లు ప్యాంక్రియాస్‌ను మరింత యాక్టివ్‌గా చేస్తాయి. ఇది జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది:  మీరు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో మెంతి గింజల నీటిని తాగుతే, మీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ సమస్యను నయం చేయవచ్చు. మెంతి గింజల నీటిని ఒక నెలపాటు క్రమం తప్పకుండా తాగితే, హెచ్‌డిఎల్ అంటే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని భావిస్తున్నారు.