What is the relationship between colors and diseases

కలర్స్ కు వ్యాధులకు సంబంధం ఏంటి? టాబ్లెట్స్ వేర్వేరు కలర్స్ లో ఎందుకుంటాయి..?

  ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు, నలతగా ఉన్నప్పుడు వైద్యుడిని కలపడం సహజమే.  వైద్యులు జబ్బు నయం కావడానికి కొన్ని రకాల టాబ్లెట్స్ రాసి ఇస్తారు. అయితే ఈ టాబ్లెట్స్ అన్నీ ఒకే రంగులో ఉండవు.  ఒక్కో రకం టాబ్లెట్ ఒక్కో రంగులో ఉండటం చూడవచ్చు. అసలు టాబ్లెట్స్ ఎందుకు ఇలా వేరువేరు రంగులలో ఉంటాయి? వ్యాధులకు,  టాబ్లెట్ల రంగులకు లింక్ ఏంటి? ఇవన్నీ యాదృశ్చికంగా అలా తయారవుతాయా లేక దీని వెనుక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? ఈ విషయాల గురించి తెలుసుకుంటే.. ఎరుపు, నీలం, ఆకుపచ్చ,  పసుపు.. ఇలా టాబ్లెట్లు చాలా రకాల రంగులలో ఉంటాయి.  టాబ్లెట్లు అన్నీ ఒకే రంగులో ఉంటే వాటిని  మింగడానికి ఏదైనా సమస్య ఉంటుందని ఎప్పుడైనా అనిపించిందా? టాబ్లెట్లకు ఉండే రంగు ఎప్పుడైనా మనసును ప్రభావితం చేసిందా? ఇవన్నీ చాలామంది పట్టించుకోరు. కానీ  టాబ్లెట్ల తయారీ సంస్థలైన ఫార్మసీ సంస్థలు ప్రణాళికా బద్దంగానే ఇలా మందులను రంగురంగులలో తయారు చేస్తాయని అంటున్నారు. పేషెంట్లకు జరిగే మేలు.. ఒక రోగి ఒకేసారి ఎక్కువ మందులు తీసుకున్నప్పుడు, వివిధ రంగుల మాత్రలు ఉంటే ఏ టాబ్లెట్ దేనికి వేసుకుంటున్నాం అనే విషయం గుర్తించడానికి సహాయపడుతుంది. అన్ని మాత్రలు ఒకేలా తెల్లగా ఉంటే రోగులకు మందులను గుర్తుంచుకోవడం కష్టం అవుతుంది. ఇది ముఖ్యంగా వృద్ధులకు,  దృష్టి లోపం ఉన్నవారికి ఇబ్బంది. అందుకే టాబ్లెట్లు వైద్యులు,  ఫార్మసిస్ట్‌లకు  సులభం.. మెడికల్ స్టోర్లలో పనిచేసే వైద్యులు,  ఫార్మసిస్ట్‌లు కూడా మందులను త్వరగా గుర్తించడానికి వాటి రంగులపై ఆధారపడతారు. ఇది తప్పు జరిగే అవకాశాన్ని తగ్గిస్తుంది.  సరైన ఔషధం రోగికి చేరుతుంది. ఔషదం ప్రభావం.. చాలా సార్లు కంపెనీలు మందుల రంగును రోగి మనస్సును కూడా ప్రభావితం చేసే విధంగా ఎంచుకుంటాయి. కొన్ని ఉదాహరణలు గమనిస్తే.. నీలం, ఆకుపచ్చ మాత్రలు: సాధారణంగా నొప్పి నివారణ మందులు, ఆందోళన నివారణ, మత్తుమందుల కోసం ఈ రంగులు ఉపయోగిస్తారు ఎందుకంటే ఈ రంగులు మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. ఎరుపు,  నారింజ మాత్రలు: శక్తిని పెంచేవి లేదా వేగంగా పనిచేసే మాత్రలలో ఈ రంగులు వాడతారు ఎందుకంటే ఈ రంగులు శక్తి,  శరీర పనితీరు పెరుగుదలను సూచిస్తాయి. నలుపు,  ముదురు గోధుమ రంగు మాత్రలు: వీటిలో ఐరన్, విటమిన్ సంబంధిత మందులు ఉంటాయి. ఇవి శరీరంలో పోషకాలను పెంచడానికి పనిచేస్తాయి. సూర్యకాంతి,  ఔషధ రక్షణ.. కొన్ని మందులు ఎండలో త్వరగా చెడిపోతాయి. అందుకే కంపెనీలు ఔషధాన్ని సూర్యకాంతి నుండి రక్షించడంలో సహాయపడే రంగులను ఎంచుకుంటాయి. ముదురు రంగు పూత ఔషధ నాణ్యతను ఎక్కువ కాలం పాటు ఉండేలా చేస్తుంది. రుచి,  వాసన.. కొన్ని మందులు చాలా చేదుగా ఉంటాయి,  రోగులకు వాటి రుచి నచ్చదు. ఈ రంగు పూత ఔషధాన్ని ఆకర్షణీయంగా కనిపించడమే కాకుండా దాని చేదు రుచిని దాచిపెడుతుంది. దీని వలన రోగులు దానిని మింగడం సులభం అవుతుంది. పిల్లలను ఆకర్షించడానికి.. పిల్లలకు మందులు ఇవ్వడం చాలా కష్టమైన పని. అందుకే కంపెనీలు చాక్లెట్, స్ట్రాబెర్రీ, నారింజ రుచిగల సిరప్‌లు,  రంగురంగుల చూయింగ్ టాబ్లెట్‌లను తయారు చేస్తాయి. వ్యాధిని బట్టి మందుల రంగులు నిర్ణయించబడతాయా? సరళంగా చెప్పాలంట, ఔషధం యొక్క రంగు వ్యాధిపై ఆధారపడి ఉండదు. కానీ రోగి  మానసిక స్థితి, ఔషధం  గుర్తింపు,  దాని భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇది నిర్ణయించబడుతుంది. అయితే కొన్నిసార్లు వైద్యులు మానసిక ప్రభావాల కోసం నిర్దిష్ట రంగుల మందులను కూడా  రాసిస్తుంటారు.                                           *రూపశ్రీ.

Straw Berry health Benefits

స్ట్రాబెర్రీలు తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయని తెలుసా?

   స్ట్రాబెర్రీ ఒక రుచికరమైన,  ఆరోగ్యకరమైన పండు. ఇది "సూపర్ ఫుడ్" కంటే తక్కువ కాదు.  ప్రత్యేక రుచి,  ఆరోగ్య ప్రయోజనాల విషయంలో దీనికంటూ ఓ రేంజ్ ఉంది. స్ట్రాబెర్రీలను ఎక్కువగా చల్లని ప్రాంతాల్లో పండిస్తారు.  అమెరికా,  యూరప్‌లలో ఎక్కువగా పండిస్తారు. భారతదేశంలో దీనిని ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్,  మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో సాగు చేస్తారు. స్ట్రాబెర్రీలలో విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు,  ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. స్ట్రా బెర్రీలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నయాని అంటున్నారు ఆరోగ్య  నిపుణులు.  అవేంటో తెలుసుకుంటే.. రోగనిరోధక శక్తి.. స్ట్రాబెర్రీలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది వ్యాధులతో పోరాడే శరీర సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఇది జలుబు, దగ్గు, ఇతర కాలానుగుణ వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. చర్మం.. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి,  ఎలాజిక్ ఆమ్లం చర్మ కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఇది ముడతలను తగ్గించడంలో, మచ్చలను తగ్గించి చర్మాన్ని కాంతివంతం చేయడంలో,  చర్మ ఛాయను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యం..  స్ట్రాబెర్రీలలో మంచి మొత్తంలో పొటాషియం,  యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి.  గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది  జీర్ణవ్యవస్థ.. స్ట్రాబెర్రీలలో  ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.  మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. ఇది కడుపుని తేలికగా ఉంచుతుంది.  జీర్ణక్రియను సరిగ్గా చేస్తుంది. బరువు.. స్ట్రాబెర్రీలలో కేలరీలు తక్కువగా ఉంటాయి.  ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. అతిగా తినకుండా నిరోధిస్తుంది. కంటి చూపు.. ఇందులో ఉండే విటమిన్ సి,  యాంటీఆక్సిడెంట్లు కళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది కంటిశుక్లం,  ఇతర కంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. క్యాన్సర్‌.. స్ట్రాబెర్రీలలో ఎలాజిక్ ఆమ్లం, ఇతర యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది.  వ్యాధుల నుండి రక్షిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు.. ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది మధుమేహ రోగులకు సురక్షితమైన,  ఆరోగ్యకరమైన పండు.                                          *రూపశ్రీ.

Non Stick Pans usage side effects

నాన్ స్టిక్ వంటపాత్రలు ఎంత చేటు చేస్తాయో తెలుసా?

  ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఇంట్లో నాన్-స్టిక్ వంట సామాగ్రిని ఉపయోగించడం సర్వసాధారణమైపోయింది. ఈ పాత్రలు వంటను సులభతరం చేస్తాయి, వంట చేసేటప్పుడు పదార్థాలు మాడిపోవడం, వంటపాత్రలకు అతుక్కుపోవడం వంటి సమస్యలు ఉండవు. అయితే నాన్-స్టిక్ వంట సామాగ్రిని ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రమాదాలు కూడా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నాన్-స్టిక్ వంట సామాగ్రిని ఉపయోగించడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుంటే.. విషపూరిత రసాయనాల ప్రమాదం.. నాన్-స్టిక్ వంట సామాగ్రిని తయారు చేయడానికి పాలిటెట్రాఫ్లోరోఎథిలిన్ (PTFE) అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు. ఇది ఆహారం అంటుకోకుండా నిరోధించే సింథటిక్ పదార్థం. అయితే ఈ పాత్రను వేడెక్కినప్పుడు, అది రసాయనికంగా విచ్ఛిన్నం కావడం ప్రారంభమవుతుంది. విషపూరిత పొగలను విడుదల చేస్తుంది. ఈ పొగలను పీల్చడం వల్ల తలనొప్పి, తలతిరుగుడు,  ఫ్లూ లాంటి లక్షణాలు వస్తాయి.  ఈ పొగ వాతావరణంలో ఎక్కువ సేపు ఉండటం వల్ల ఆరోగద్య సమస్యలు కూడా వస్తాయి. పెర్ఫ్లోరోక్టానోయిక్ యాసిడ్ (PFOA) ప్రమాదాలు.. నాన్-స్టిక్ వంట సామాగ్రిని తయారు చేసే ప్రక్రియలో PFOA అనే రసాయనాన్ని కూడా ఉపయోగిస్తారు. ఈ రసాయనం ఆరోగ్యానికి హానికరం.  PFOA  వల్ల క్యాన్సర్, థైరాయిడ్ రుగ్మతలు, కాలేయం దెబ్బతినడం,  రోగనిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. ఇప్పుడు చాలా కంపెనీలు PFOA లేని ఉత్పత్తులను తయారు చేస్తున్నప్పటికీ కొన్నింటిలో ఈ రసాయనం ఉండే అవకాశం ఉంది. హానికరమైన పదార్థాల విడుదల.. నాన్-స్టిక్ వంట సామాగ్రిని చాలా ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర వేడి చేసినప్పుడు, దాని పూత విచ్ఛిన్నం కావడం ప్రారంభమవుతుంది. ఈ చిన్న కణాలు ఆహారంలోకి కలిసిపోతాయి. ఈ కణాలు శరీరంలోకి వెళ్లిన తర్వాత విషపూరితంగా మారవచ్చు. దీనివల్ల జీర్ణవ్యవస్థ, కాలేయం,  మూత్రపిండాలు దెబ్బతింటాయి . దీర్ఘకాలిక వాడకం.. నాన్-స్టిక్ వంట సామాగ్రిని ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల శరీరంలో రసాయనాలు పేరుకుపోతాయి. ఈ రసాయనాలు శరీరంలో నెమ్మదిగా పేరుకుపోయి దీర్ఘకాలంలో తీవ్రమైన వ్యాధులకు కారణమవుతాయి. ముఖ్యంగా, ఇది హార్మోన్ల అసమతుల్యత,  సంతానోత్పత్తి సమస్యలను కలిగిస్తుంది. పర్యావరణంపై ప్రభావం.. నాన్-స్టిక్ వంట సామాగ్రిని తయారు చేయడం,  తరువాత పాడైపోయిన నాన్ స్టిక్ పాత్రలను  నాశనం చేసే ప్రక్రియ కూడా పర్యావరణానికి హాని కలిగిస్తుంది. ఈ పాత్రలలో ఉపయోగించే రసాయనాలు ప్రకృతిలో త్వరగా కరగవు,  పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి . దీనివల్ల మనుషులకే కాదు, జంతువులు, మొక్కలు కూడా నష్టపోతాయి.                                   *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

Summer Health Tips

వేసవికి ముందు ఆహారంలో ఈ 5 అలవాట్లు చేసుకుంటే సీజన్ అంతా సేఫ్..!

  వేసవి కాలం ఎండవేడితో పాటు చాలా రకాల  ఆహ్లాదకర విషయాలను వెంటబెట్టుకు వస్తుంది.  అయితే ఆరోగ్యానికి కూడా అంతే సవాలు విసురుతుంది. మండే ఎండలు, వేడి, చెమట,  తేమ..  మన శక్తిని హరించడమే కాకుండా కడుపు నొప్పి, డీహైడ్రేషన్ వంటి  సమస్యలు, చర్మ సమస్యలు,  బలహీనమైన రోగనిరోధక శక్తి వంటి సమస్యలను కూడా కలిగిస్తాయి. వేసవిలో తరచుగా అనారోగ్యానికి గురికాకుండా ఉండాలంటే  ఆహారంలో కొన్ని అవసరమైన మార్పులు చేసుకోవాలి. వేసవి ఇంకా ముదరకముందే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల వేసవిలో  చురుగ్గా ఉండగలరు. నీరు తాగేశాతం పెంచాలి.. వేసవిలో శరీరం ఎక్కువగా చెమట పడుతుంది. దీనివల్ల శరీరంలో నీరు ,  ఎలక్ట్రోలైట్ల లోపం ఏర్పడుతుంది. ఇది నిర్జలీకరణం, తక్కువ రక్తపోటు, అలసట, తలనొప్పి,  వడదెబ్బకు కారణమవుతుంది. రోజంతా కనీసం 3-4 లీటర్ల నీరు త్రాగాలి. కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మామిడి పన్నా, మజ్జిగ వంటి సహజ పానీయాలు త్రాగాలి. ఎక్కువ కెఫిన్, సోడా ఉన్న పానీయాలను మానుకోవాలి. ఎందుకంటే ఇవి శరీరాన్ని మరింత డీహైడ్రేట్ చేస్తాయి. ఖాళీ కడుపుతో ఎక్కువ చల్లటి నీరు త్రాగకూడదు.  ఎందుకంటే ఇది గొంతు నొప్పికి కారణమవుతుంది. ఆహారం.. వేసవిలో ఎక్కువ కారంగా,  నూనెతో కూడిన ఆహారాన్ని జీర్ణం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. దీనివల్ల అసిడిటీ, ఉబ్బరం, కడుపు నొప్పి, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రాత్రిపూట కారంగా,  వేయించిన ఆహార పదార్థాలను తగ్గించాలి. గంజి, కిచిడి, పెరుగు-బియ్యం, పండ్లు,  కూరగాయలు వంటి తేలికైన,  సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు ఎంచుకోండి. మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, మొలకలు,  సలాడ్ల పరిమాణాన్ని పెంచండి. మీ ఆహారంలో పెరుగును చేర్చుకోండి, ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది,  శరీరాన్ని చల్లబరుస్తుంది. సీజన్.. వేసవిలో లభించే పండ్లు,  కూరగాయలలో సహజంగానే ఎక్కువ నీరు ఉంటుంది. ఇది శరీరానికి హైడ్రేషన్,  అవసరమైన పోషణను అందిస్తుంది. వీటిలో విటమిన్లు, ఖనిజాలు,  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తాయి . పుచ్చకాయ, సీతాఫలం, బొప్పాయి, నారింజ, మామిడి, పైనాపిల్ వంటి పండ్లను తినండి, ఇవి శరీరానికి తేమను, శక్తిని పెంచుతాయి. దోసకాయ, టమోటా, పొట్లకాయ, సొరకాయ, బీరకాయ,  పాలకూర వంటి కూరగాయలు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. ప్రతిరోజూ  ఆహారంలో పెరుగు,  మజ్జిగను చేర్చుకోండి. పానీయాలు.. వేసవిలో ప్రజలు ఎక్కువగా శీతల పానీయాలు, టీ, కాఫీ,  ఆల్కహాల్ తీసుకుంటారు. అయితే ఇది శరీరంలో డీహైడ్రేషన్, గ్యాస్,  ఆమ్లతను పెంచుతుంది. శీతల పానీయాలకు బదులుగా, ఇంట్లో తయారుచేసిన రోజ్ సిరప్, మామిడి పన్నా, నిమ్మరసం, సత్తు త్రాగండి. టీ,  కాఫీ మొత్తాన్ని తగ్గించి గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ తీసుకోండి . ఆల్కహాల్,  అధిక కెఫిన్ తీసుకోవడం మానుకోవాలి.  ఎందుకంటే అవి నీటి నిలుపుదలని పెంచుతాయి. ఆహారాల ఎంపిక.. వేసవిలో భారీ ఆహారం తినడం వల్ల శరీరం నీరసంగా అనిపిస్తుంది. కాబట్టి తేలికైన కానీ పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ముఖ్యం. పప్పు, పెసర పప్పు, పనీర్, టోఫు, మొలకలు వంటి ఆరోగ్యకరమైన ప్రోటీన్ వనరులను తీసుకోండి.  చియా గింజలు,  సబ్జా,   బాదం వంటి గింజలు,  విత్తనాలను చేర్చుకోండి. తృణధాన్యాలు, మల్టీగ్రెయిన్ బ్రెడ్,  బ్రౌన్ రైస్ తినాలి. ఇవి ఎక్కువ ఫైబర్,  పోషణను అందిస్తాయి. పెరుగు, మజ్జిగ వంటి ప్రోబయోటిక్ ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి శరీరాన్ని చల్లబరుస్తుంది.                                *రూపశ్రీ.

Health benefits of Walking After Eating

తిన్న తరువాత 5 నిమిషాలు నడిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

  నేటి బిజీ జీవితంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా భోజనానికి ముందు ఆ తరువాత చాలా మంది వివిధ రకాల అలవాట్లు పెట్టుకుంటారు.  వాటికి అనుగుణంగా అలవాట్లు పాటిస్తారు. అయితే భోజనం చేసిన తర్వాత కేవలం 5 నిమిషాల నడక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు,  ఫిట్‌నెస్ నిపుణులు అంటున్నారు. ఈ చిన్న అలవాటు  ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందో తెలుసుకుంటే.. జీర్ణవ్యవస్థ.. తిన్న తర్వాత నడవడం వల్ల జీర్ణవ్యవస్థ ఉత్తేజితమవుతుంది. మనం నడిచినప్పుడు శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఇది ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.  గ్యాస్, ఆమ్లతత్వం,  అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది. అలాగే ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, తద్వారా మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది. చక్కెర స్థాయిలు.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు భోజనం తర్వాత నడవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తిన్న తర్వాత చక్కెర స్థాయి పెరుగుతుంది. కానీ 5-10 నిమిషాలు నడవడం ద్వారా శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగుపడుతుంది.  రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. ఈ అలవాటు టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. బరువు.. బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు తిన్న తర్వాత నడవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది . ఇది శరీరంలోని కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. జీవక్రియను పెంచుతుంది . భోజనం తర్వాత క్రమం తప్పకుండా నడవడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు తగ్గి బరువు నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యం.. భోజనం చేసిన తర్వాత నడవడం కూడా గుండెకు చాలా మేలు చేస్తుంది.  ఇది రక్తపోటును నియంత్రిస్తుంది, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.  గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. మానసిక స్థితి.. భోజనం చేసిన తర్వాత నడవడం వల్ల శారీరక ఆరోగ్యానికే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. ఇది ఒత్తిడి,  ఆందోళనను తగ్గిస్తుంది.  మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. నడక వల్ల శరీరంలో ఎండార్ఫిన్ హార్మోన్ల స్థాయి పెరుగుతుంది. ఇది సంతోషంగా ఉండే  భావనను ఇస్తుంది.  శక్తి స్థాయిలు.. తిన్న తర్వాత తరచుగా సోమరితనంగా,  నీరసంగా అనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో 5 నిమిషాల నడక శరీరంలో శక్తి స్థాయిని పెంచుతుంది.  దీనివల్ల తిరిగి  రిలాక్స్ గా, ఫ్రెష్  గా అనిపిస్తుంది. ఇది శరీరాన్ని చురుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. నిద్ర నాణ్యత.. రాత్రి భోజనం తర్వాత నడవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది శరీరానికి  విశ్రాంతినిస్తుంది.  నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. మంచి నిద్ర వల్ల శరీరం ఆరోగ్యంగా,  తాజాగా ఉంటుంది.                                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

weight loss tips

తక్కువ సమయంలో బరువు తగ్గాలని అనుకునేవారికి బెస్ట్ టిప్స్ ఇదిగో..!

  మనం ఏమి చేసినా అది మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. మన ఆహారపు అలవాట్ల నుండి మన జీవనశైలి వరకు..  ఉదయం నిద్రలేచిన తర్వాత మనం చేసే ప్రతి పనీ మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. మనం మంచి అలవాట్లను అలవర్చుకుంటే, శరీరం,  మనస్సు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా ఉదయం పూట  పాటించే అలవాట్లు బరువు మీద చాలా ప్రభావం చూపిస్తాయి. కొంతమంది బరువు తగ్గడానికి ట్రై చేస్తుంటారు.  బరువు తగ్గాలనుకుంటే ఉదయం నిద్రలేచిన తర్వాత కొన్ని అలవాట్లను అలవర్చుకోవడం వల్ల అనుకున్నది సాధించగలుగుతారు.  అలవాట్లలో చిన్న మార్పులే మంచి  ఫలితాలు ఇస్తాయి.  త్వరగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. బరువు తగ్గడానికి సులభంగా అలవాటు చేసుకోగల  అలవాట్లు ఏంటంటే.. ఉదయం నిద్రలేచని తర్వాత గోరువెచ్చని నీరు త్రాగాలి. ఇది  మరింత ప్రభావవంతంగా పని చేయడానికి, నిమ్మరసం జోడించవచ్చు. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి, ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. కాబట్టి, ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవచ్చు. క్రమం తప్పకుండా వేగంగా వాకింగ్ చేయాలి. నడక ద్వారా బరువును  తగ్గించుకోవచ్చు. అయితే క్రమశిక్షణ చాలా అవసరం. ఏదో చెస్తున్నాం అంటే చేస్తున్నాం అన్నట్టు కాకుండా జాగ్రత్త పడాలి.  నడకను మరింత ప్రభావవంతంగా చేయడానికి, నడక వేగాన్ని గంటకు 6 కిలోమీటర్లుగా ఉండేలా చూసుకోవాలి. ఉదయం అల్పాహారం ప్రభావవంతంగా,  సులభంగా జీర్ణమయ్యేలా ఉండాలి. అల్పాహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. అల్పాహారం కోసం ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. చక్కెర వీలైనంత వరకు మానేయడం మంచిది. బరువు పెరగడానికి అతిపెద్ద కారణమైన జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ఉదయం ఎండలో కొంత సమయం గడపాలి.  లేదా 10-15 నిమిషాలు బయట కూర్చోవాలి.. ఉదయం సూర్యకిరణాల నుండి లభించే విటమిన్ డి ఎముకలకు చాలా బలంగా ఉంచుతుంది. రోజంతా కనీసం నాలుగు లీటర్ల నీరు త్రాగాలి. శరీరం హైడ్రేటెడ్‌గా ఉండటానికి నిరంతరం నీరు త్రాగుతూ ఉండాలి. ఉదయాన్నే నిద్రలేవాలి.  ఇది చెప్పడం సులభం, చేయడం కష్టంగా అనిపిస్తుంది. కానీ ఒకసారి ఉదయాన్నే నిద్రలేవడం అలవాటు చేసుకుంటే ఇక వెనక్కి తిరిగి చూడరు. ఉదయాన్నే నిద్రలేవడం వల్ల  తగినంత సమయం లభిస్తుంది.  ఈ సమయంలో శ్రద్దగా అన్ని పనులు చేయవచ్చు. ఇది మీ రోజంతా తాజాగా,  సంతోషంగా గడిచిపోయేలా చేస్తుంది. ఈ సమయంలో జాగింగ్ లేదా రన్నింగ్  కోసం సమయం కేటాయించవచ్చు. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. హాయిగా నిద్రపోవాలి.  7 నుండి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకవాలి. ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలి. నిద్రను పూర్తిగా జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత, ఎందుకంటే సమయానికి నిద్రపోకపోవడం వల్ల ఉదయం త్వరగా లేవలేము. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం , తక్కువ నిద్రపోవడం అస్సలు  నిద్రపోకపోవడం వల్ల మానసిక ఒత్తిడి కూడా వస్తుంది. ఇది కూడా బరువు పెరగడానికి దారితీస్తుంది.                                    *రూపశ్రీ.

How to get rid of bloating

ఉబ్బరం సమస్య నుండి తక్షణమే రిలీఫ్ ఇచ్చే చిట్కాలు ఇవీ..!

    ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, ఎక్కువగా వేయించిన ఆహారాన్ని తినడం, రాత్రి ఆలస్యంగా తినడం,  నీటిశాతం ఉన్న ఆహారం తినకపోవడం  వంటి అనేక కారణాల వల్ల ఉబ్బరం లేదా గుండెల్లో మంట వస్తుంది. కడుపులో గ్యాస్ నిండినప్పుడు, అసౌకర్యం, కడుపు నొప్పి,  భారంగా అనిపించడం మొదలవుతుంది.  ఈ సమస్యలు ఉంటే ఆహారం తినాలన్నా,  తిన్న తరువాత ఆహారం జీర్ణం కావాలన్నా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి.  ఈ సమస్యల నుండి చిటికెలో ఉపశమనం లభించాలంటే కింది అద్బుతమైన చిట్కాలు తెలుసుకుని పాటించాలి. సోంపు.. కడుపు ఉబ్బరం నుండి ఉపశమనం పొందడంలో సోంపు తీసుకోవడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కడుపులోని వాయువును బయటకు పంపడంలో సహాయపడతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా దుర్వాసనను కూడా తొలగిస్తుంది. ఎలా ఉపయోగించాలి? ఆహారం తిన్న తర్వాత ఒక చెంచా సోంపు నమలవచ్చు.  సోంపు టీ తయారు చేసి త్రాగవచ్చు. (ఒక కప్పు వేడి నీటిలో ఒక టీస్పూన్ సోంపు వేసి, 5 నిమిషాలు మరిగించి, వడకట్టి త్రాగాలి) రాత్రిపూట సోంపును నీటిలో నానబెట్టి, ఉదయం ఈ నీటిని త్రాగాలి. అల్లం.. అల్లం యాంటీ బాక్టీరియల్,  యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది కడుపు చికాకు,  వాపును తగ్గిస్తుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది.  కడుపు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది . ఎలా ఉపయోగించాలి? ఒక చిన్న అల్లం ముక్కను నమలవచ్చు. అల్లం టీ తయారు చేసుకుని తాగవచ్చు. వేడి నీటిలో అల్లం వేసి మరిగించి, తేనె వేసి త్రాగవచ్చు. నిమ్మరసం,  అల్లం రసం కలిపి తాగడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది. పెరుగు.. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్  జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో,  కడుపు వాయువును తగ్గించడంలో సహాయపడతాయి. ఇది పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.  కడుపులో ఏర్పడే హానికరమైన బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. ఎలా ఉపయోగించాలి? రోజూ ఒక గిన్నెడు తాజా పెరుగు తినాలి. పెరుగులో కొద్దిగా రాతి ఉప్పు,  పుదీనా కలిపి తినడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది. మజ్జిగ  తాగడం కూడా ఉబ్బరం తగ్గడానికి సహాయపడుతుంది. మజ్జిగలో అందులో వేయించిన జీలకర్ర కలిపి త్రాగాలి. సెలెరీ.. సెలెరీలో థైమోల్ అనే మూలకం ఉంటుంది, ఇది గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది.  కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఇది అజీర్ణం,  ఆమ్లత్వానికి కూడా సహాయపడుతుంది. ఎలా ఉపయోగించాలి? గోరువెచ్చని నీటితో అర టీస్పూన్ సెలెరీ తీసుకోండి. సెలెరీని వేయించి, దానికి నల్ల ఉప్పు వేసి తినడం వల్ల కూడా తక్షణ ఉపశమనం లభిస్తుంది. సెలెరీ,  తేనె కలిపి తినడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. పుదీనా.. పుదీనాలో ఉండే మెంథాల్ కడుపు నొప్పి,  ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఇది కడుపును చల్లబరుస్తుంది.  జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎలా ఉపయోగించాలి? పుదీనా ఆకులను నమలవచ్చు. పుదీనా టీ తయారు చేసి త్రాగవచ్చు. (పుదీనా ఆకులను వేడి నీటిలో వేసి, కొంత సమయం తర్వాత వడకట్టి త్రాగాలి) పుదీనా రసం తీసి తేనెతో కలిపి తీసుకోవడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది.  ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. నీరు ఎక్కువగా త్రాగాలి.  నీరు ఎక్కువగా త్రాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. తేలికపాటి ఆహారాలు తిసుకోవాలి. వేయించిన,  కారంగా ఉండే ఆహారాలను నివారించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వాకింగ్,  యోగా గ్యాస్ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. భోజనం చేసిన వెంటనే పడుకోకూడదు. భోజనం చేసిన తర్వాత కొంతసేపు నడవాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.                           *రూపశ్రీ.

Brown Rice vs White Rice Differences

వైట్ రైస్.. బ్లౌన్ రైస్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదంటే..!

  ప్రపంచంలో అత్యధికంగా వినియోగించబడే ఆహార పదార్థాలలో బియ్యం ఒకటి. భారతీయులు ఎక్కువగా బియ్యమే ఆహారంగా తీసుకుంటారు. ముఖ్యంగా చాలా ఇళ్లలో తెల్ల బియ్యంతో వండిన అన్నమే ప్రధాన ఆహారం.  అన్నం కడుపు నిండుగా ఉంచుతుంది.  తృప్తిని ఇస్తుంది.  భారతీయులు అన్నానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అంటే.. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని.. అన్నాన్ని ప్రసాదించే దేవత అన్నపూర్ణేశ్వరి అని అంటారు. అయితే ఈ మధ్య కాలంలో బ్రౌన్ రైస్ చాలా వైరల్ అవుతోంది. , తెల్ల బియ్యం,  బ్రౌన్ రైస్  రెండింటిలోో ఏది ఎక్కువ ప్రయోజనకరం అనే ప్రశ్న చాలామందిలో ఏర్పడింది.   ఈ రెండింటిలో ఏది మంచిదో.. ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుందో తెలుసుకుంటే.. ఫైబర్, బరువు నియంత్రణ.. బ్రౌన్ రైస్.. ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది,  బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఫైబర్ ఎందుకు ముఖ్యం అంటే.. ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది, ఇది అతిగా తినడాన్ని తగ్గిస్తుంది.  తెల్ల బియ్యం.. ఇందులో ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి.  దీని కారణంగా ఇది త్వరగా జీర్ణమవుతుంది,  తిన్న తరువాత బ్రౌన్ రైస్ తో పోలిస్తే చాలా తొందరగా ఆకలిగా అనిపించవచ్చు. తెల్ల బియ్యం అతిగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. బ్లడ్ షుగర్ , డయాబెటిస్ కోసం  బ్రౌన్ రైస్ .. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) (~50-55) కలిగి ఉంటుంది. దీని వలన రక్తంలో చక్కెర నెమ్మదిగా పెరుగుతుంది. ఇది డయాబెటిక్ రోగులకు మెరుగైన ఎంపిక. తెల్ల బియ్యం.. ఇది అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ (~70-80) కలిగి ఉంటుంది, దీని వలన రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. డయాబెటిక్ రోగులకు ఇది మంచి ఎంపిక కాదు. డయాబెటిస్ ఉన్నవారు దీన్ని తక్కువ తినడం మంచిది. జీర్ణం.. తెల్ల బియ్యం .. ఇది సులభంగా జీర్ణమవుతుంది, కడుపుకు తేలికగా ఉంటుంది. విరేచనాలు, వాంతులు లేదా కడుపు నొప్పి ఉన్నప్పుడు తెల్ల బియ్యం తినడం ప్రయోజనకరంగా ఉంటుంది.  బ్రౌన్ రైస్.. ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది దీని కారణంగా ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీన్ని చాలా మితంగా తీసుకోవాలి. జీర్ణశక్తి తక్కువ ఉన్నా,  బ్రౌన్ రైస్ ను అధిక మొత్తంలో తిన్నా   గ్యాస్ లేదా ఉబ్బరం సమస్యలు ఉండవచ్చు. గుండె ఆరోగ్యం.. కొలెస్ట్రాల్.. బ్రౌన్ రైస్.. ఇందులో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు,  ఫైబర్ ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించడంలో,  గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. తెల్ల బియ్యం.. ఇందులో పోషకాలు,  ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి తక్కువ మేలు జరుగుతుంది.  ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలనుకుంటే, బ్రౌన్ రైస్ మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ  జీర్ణ సమస్యలు ఉంటే బ్రౌన్ రైస్ అంత మంచిది కాదు.  తెల్ల బియ్యం కూడా మంచి ఎంపిక. అయితే తెల్ల బియ్యాన్ని పరిమితంగా తీసుకోవాలి.                                     *రూపశ్రీ.  

Bilva Patram benefits

శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రి.. ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు!

  పరమేశ్వరుడిని లయకారుడు అంటారు.  శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు అంటారు.  శివారాధనకు సోమవారం చాలా ప్రత్యేకమైన రోజు. ఇక ప్రతి నెలా వచ్చే మాస శివరాత్రి రోజు శివుడిని ఎంతో గొప్పగా ఆరాధిస్తారు.  ఇది మాత్రమే కాకుండా ఏడాదికి ఒకసారి వచ్చే మహా శివరాత్రిని మరింత వేభోగంగా జరుపుకుంటారు.  శివపూజలు, శివాభిషేకాలలో ఖచ్చితంగా బిల్వ పత్రి ఉంటుంది.  బిల్వపత్రి అనేది మారేడు ఆకులు.  మారేడు దళాలు అని కూడా అంటారు.  వీటితో పూజ చేస్తే శివుడు చాలా ప్రసన్నం అవుతాడు. శివపూజను సంపూర్ణం చేసే మారేడు దళాలు కేవలం పూజకే కాక.. ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. ఈ మారేడు దళాల వల్ల,  మారేడు ఫలాల వల్ల  కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే. మారేడు దళమే కాదు.. మారేడు చెట్టుకు కాయలు కూడా కాస్తాయి. ఈ కాయలను చాలా మంది పట్టించుకోరు. కానీ ఈ కాయలలో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మారేడు కాయలు వినాయకుడికి ఎంతో ఇష్టమైన వెలగపండును పోలి ఉంటుంది.  వీటి పై భాగం గట్టిగా పెంకులాగా ఉంటుంది.  పండు  లోపల గుజ్జు ఉంటుంది.  ఈ పండులో ఫైబర్,  యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి.  ఇవి జీర్ణవ్యవస్థను బలంగా ఉంచుతాయి. మారేడు పండులో యాంటీ బ్యాక్టీరియల్,  యాంటీ వైరల్  గుణాలు ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి.  రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మారేడు పండును తీసుకుంటే మంచిది. మారేడు పండు తింటే వేడి నుండి బయటపడవచ్చు.  ముఖ్యంగా వేసవికాలంలో ఎదురయ్యే ఎండ వేడి,  హీట్ స్ట్రోక్ వంటి వాటికి మారేడు పండు చక్కని మెడిసిన్ అని చెప్పవచ్చు. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.                                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

The importance of potassium

అసలు పొటాషియం శరీరానికి ఎందుకు అంత ముఖ్యం తెలుసా?

  శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అనేక రకాల విటమిన్లు,  మినరల్స్,  ఖనిజాలు అవసరం అవుతాయి. అలాంటి వాటిలో పొటాషియం కూడా ఒకటి. ఇది శరీరంలో చాలా రకాల పనులు జరగడానికి అవసరం. కానీ చాలామందికి పొటాషియం గురించి అవగాహన లేదు.  అసలు పొటాషియం శరీరానికి ఎందుకు అవసరం. ఇది శరీరంలో నిర్వహించే పనులు ఏంటి? ఏ ఆహారాలు తీసుకుంటే పొటాషియం శరీరానికి పుష్కలంగా లభిస్తుంది.  వివరంగా తెలుసుకుంటే.. పొటాషియం శరీరానికి అవసరమైన ఖనిజాలలో ప్రముఖమైనది.  ఇది గుండె, కండరాలు, నాడీ వ్యవస్థ,  మూత్ర పిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ముఖ్యం. శరీరానికి తగినంత పొటాషియం అందుతూ ఉంటేనే పై అవయవాలు ఆరోగ్యంగా తమ విధులు అవి సమర్థవంతంగా నిర్వహిస్తాయి. కానీ పొటాషియం లోపిస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. పొటాషియం లోపం వల్ల బలహీనత, కండరాల తిమ్మిరి,  రక్తపోటు.. వంటి సమస్యలు వస్తాయి.  ఈ సమస్యలు రాకూడదు అంటే సమతుల ఆహారంలో పొటాషియం సమృద్దిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకుంటేనే శరీరం శక్తివంతంగా ఉంటుంది. పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.  తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె సంబంధ సమస్యలు ఉన్నవారు,  కుటుంబంలో ఎవరికైనా గుండె సంబంధ సమస్యలు ఉంటే ఆ కుటుంబ సభ్యులు గుండె ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. శరీరానికి పొటాషియం ఎందుకు ముఖ్యం అంటే.. ఇది శరీరంలో కాల్షియం తగిన మోతాదులో ఉండేలా చేస్తుంది.  ఎముకల బలానికి పొటాషియం తీసుకోవడం కూడా చాలా అవసరం. అంతేకాదు.. పొటాషియం శరీరానికి సరిపడినంత తీసుకోవడం వల్ల మెదడుకు రక్తప్రసరణ మెరుగు పడుతుంది. తద్వారా స్ట్రోక్ ప్రమాదం కూడా తగ్గుతుంది.  అంటే.. మెదడు సంబంధ సమస్యలు రావద్దని అనుకుంటే పొటాషియం  గల ఆహారాన్ని బాగా తీసుకోవాలి. పొటాషియం బాగా తీసుకోవాలి అని అనిపించినా పొటాషియం ఎందులో ఎక్కువ ఉంటుంది అనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వారు పొటాషియం రిచ్ ఫుడ్స్ గురించి తెలుసుకోవాలి.  బంగాళదుంపలు,  పాలకూర,  అవకాడో, నారింజ వంటి ఆహారాలు తీసుకోవడం వల్ల పొటాషియం బాగా లభిస్తుంది.                                             *రూపశ్రీ.  

Chapati Health BenefitsHealth Benefits & Uses Of Baasi Roti -

చపాతీలు ఇలా చేసుకుని తింటే పదింతలు పోషకాలు లభిస్తాయి..!

  చపాతీలు చాలామందికి ఇష్టమైన ఆహారం. ఉదయం టిఫిన్ లోకి అయినా, మధ్యాహ్నం లంచ్ లోకి అయినా, రాత్రి డిన్నర్ లోకి అయినా సులువుగా ఇమిడిపోయే ఆహారం ఇది.  పైగా స్వచ్చమైన గోధుమ పిండితో చపాతీలు చేసుకుని తింటే బోలెడంత ఆరోగ్యం కూడా.  ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మెయింటైన్ చేసేవారు,  బరువు తగ్గాలని అనుకునేవారు, బరువు నియంత్రణలో ఉంచుకునేవారు చపాతీలు తీసుకుంటూ ఉంటారు. అయితే చపాతీలు తినడం వల్ల మాములు కంటే పదింతలు పోషకాలు లభించాలన్నా,  ఆరోగ్యానికి మేలు జరగాలన్నా ఈ కింది విధంగా చేసుకుని తినాలి. సాధారణంగా చపాతీలు చేయడానికి గోధుమ పిండిలో కాసింత ఉప్పు, నూనె వేసి నీటితో కలిపి పిండి సిద్దం చేసుకుంటారు. కానీ పోషకాలు  ఎక్కువ లభించాలన్నా, ఆరోగ్యానికి మరింత మేలు జరగాలన్నా చపాతీ పిండిలో ఆరోగ్యకరమైన ఇతర పదార్థాలు మిక్స్ చేయాలి. మెంతి ఆకు లేదా మెంతి గింజల పొడి ఆరోగ్యానికి చాలా మంచిది.  ఇవి రక్తంలో షుగర్ లెవల్స్ ను నియంత్రిస్తాయి.  కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతాయి. గుండెకు మేలు చేస్తాయి.  మెంతి ఆకును లేదా మెంతి గింజల పొడిని గోధుమ పిండిలో వేసి కలిపి ఆ పిండితో చపాతీలు చేసుకుని తినాలి.  ఇది చాలా ఆరోగ్యం చేకూరుస్తుంది. మునగ ఆకులు కూడా మెంతి ఆకుల మాదిరిగానే ఉపయోగించవచ్చు.  ఒకవేళ తాజా ఆకులు లభ్యం కాకుంటే మునగ ఆకుల పొడిని కూడా గోధుమ పిండిలో కలిపి పిండి సిద్దం చేసుకోవచ్చు.  మునగ ఆకులు లేదా పొడి కలిపి చేసిన గోధుమ పిండి చపాతీలు రక్తంలో చక్కెర స్థాయిలు  నియంత్రణలో ఉంచుతాయి.  అంతేకాదు బరువు తగ్గడంలోనూ, కొలెస్ట్రాల్ తగ్గించడంలోనూ సహాయపడతాయి. శరీరానికి ఆరోగ్యం చేకూర్చే గింజలలో అవిసె గింజలు ప్రధానమైనవి.  అవిసె గింజలను పొడిగా చేసి గోధుమ పిండిలో కలిపి చపాతీ పిండి సిద్దం చేసుకోవాలి.  దీంతో చపాతీలు చేసి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.  అవిసె గింజలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఫైబర్ కూడా పుష్కంలగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుతాయి.                                                     *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

Best Protein Foods

బెస్ట్ ప్రోటీన్ ఫుడ్స్ ఇవే!

శరీరానికి అవసరమైన మూడు స్థూల పోషకాలలో ప్రోటీన్ ఒకటి,  కణజాలాల పెరుగుదల మరియు నిర్వహణ కోసం మనకు అవసరమైన విధంగా సరిగ్గా పనిచేయడానికి మన శరీరానికి పెద్ద పరిమాణంలో ప్రోటీన్ అవసరమవుతుంది.  ప్రొటీన్లు వ్యాధులతో పోరాడటానికి అవసరమైన రోగనిరోధక శక్తిని అందిస్తాయి, ఇవి లేకపోతే మన శరీరం నిరంతరం అరిగిపోతుంది.   ప్రోటీన్ల యొక్క ప్రయోజనాల జాబితా అంతులేనిది, ఈ మాక్రోన్యూట్రియెంట్‌ను మన ఆహారంలో చేర్చుకోవాలి. అయితే ఈ ప్రోటీన్ పర్ఫెక్ట్  గా తీసుకోవడానికి పర్ఫెక్ట్ సమయం ఏదంటే  అల్పాహార సమయమే..  తద్వారా మన శరీరం రోజంతా శక్తివంతంగా ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ లో బెస్ట్ ప్రోటీన్ అందిందే కొన్ని ఆహార పదార్థాలు ఇవే.. నట్స్ - నట్స్ రుచికరమైన, అధిక ప్రోటీన్ కలిగిన అల్పాహారం అని చెప్పవచ్చు.  మొక్కల ఆధారిత ప్రోటీన్ యొక్క మంచి మోతాదును అందిస్తాయి. అంతే కాదు ఇవి బెస్ట్ రికమెండషన్ కూడా.  తినడానికి కూడా సులభమైనవి.  ప్రొటీన్లు ఎక్కువగా ఉండే గింజల్లో బాదం, వాల్‌నట్, పిస్తా, జీడిపప్పు, పైన్ నట్స్, వేరుశెనగ ఉన్నాయి.  నట్స్ తీసుకోవడం వల్ల మీకు అవసరమైన ప్రొటీన్‌ను పొందడంలో మీకు సహాయపడుతుంది, ఇది ఆరోగ్యకరమైన చర్మం, కండరాలు మరియు ఎముకలకు తోడ్పడుతుంది. ప్రోటీన్ ఎక్కువసేపు నిండుగా అనుభూతి చెందేలా చేస్తుంది. పచ్చి బఠానీలు - ప్రోటీన్ మరియు ఫైబర్ శరీరానికి అవసరమైన రెండు పోషకాలు, ఇవి బఠానీలలో పుష్కలంగా ఉంటాయి.  బఠానీలు ఆకలిని నియంత్రించగలుగుతాయి, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.  ఒక కప్పు బఠానీ తీసుకుంటే అందులో విటమిన్ సిలో సగానికి పైగా ఉంటుందని నిపుణులు తెలిపారు. రోజువారీ అల్పాహారంలో బఠానీలను చేర్చడం వల్ల శరీరానికి తగిన ప్రోటీన్లను అందించవచ్చు.  క్వినోవా - క్వినోవా ఉత్తమ అల్పాహారంగా చెప్పవచ్చు. ఎందుకంటే క్వినోవాను కంప్లీట్ ప్రోటీన్‌గా సూచిస్తారు.  శరీరం స్వయంగా ఉత్పత్తి చేయలేని తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలలో ప్రతి ఒక్కటి క్వినోవా కలిగి ఉండటం దీనికి కారణం.  ఇది చాలా ప్రోటీన్ మరియు ఫైబర్ కలిగి ఉంటుంది, అలాగే ఇది సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్ కాబట్టి ఇది మరింత నెమ్మదిగా జీర్ణమవుతుంది. సోయా మిల్క్ - సోయా మిల్క్‌లో ప్రొటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది.  సోయా పాలు ఆరోగ్యకరమైన, మొక్కల ఆధారిత ప్రోటీన్. ఇది బలమైన కండరాలు అవయవాలను నిర్వహించగలదు.  మీ శరీరం స్వంతంగా ఉత్పత్తి చేయలేని "మంచి" కొవ్వులు అయిన ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సోయా పాలలో పుష్కలంగా ఉన్నాయి.   ఓట్స్ - ఓట్స్ తక్కువ-ధర, పోషకాలు ఎక్కువగా ఉండే ప్రోటీన్‌ల మూలం.   ఓట్స్ లో 11-15% అధిక ప్రోటీన్ కలిగి ఉంటాయి.  పీనట్ బటర్, చియా గింజలు, అవిసె గింజలు, ఒక స్కూప్ ప్రోటీన్ పౌడర్ వంటి మొక్కల ఆధారిత ప్రోటీన్ లను ఓట్స్ కు జోడించవచ్చు.  సమర్థవంతమైన ప్రోటీన్ ఫుడ్ కు వోట్స్ సరైన మార్గం.  చియా విత్తనాలు - చియా గింజలు ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కలిగిన అధిక-నాణ్యత గల ప్రోటీన్. అలాగే అవసరమైన ఖనిజాలు యాంటీఆక్సిడెంట్‌లలో సమృద్ధిగా ఉంటాయి.  ఈ విత్తనాలను  సలాడ్లతో తీసుకోవచ్చు. లేదంటే  పెరుగుతోనూ తీసుకోవచ్చు. చాలా రకాల పుడ్డింగ్‌ లలో వీటిని వాడతారు.   ఇలా సాధారణ వ్యక్తులు కూడా తమ అల్పాహారంలో జోడించుకోగల ప్రోటీన్ ను తీసుకుని ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు.                                    ◆నిశ్శబ్ద. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

headaches reasons

తరచుగా తలనొప్పి వస్తుందా? ఇవే కారణాలు కావచ్చు..!

  తలనొప్పి అనేది ఒక సాధారణ సమస్య. ఇది ఏ వయసు వారినైనా ప్రభావితం చేస్తుంది. ఇది కొన్నిసార్లు తేలికగా ఉండి కొద్దిసేపు ఉంటుంది. కానీ కొంతమంది ఈ సమస్య పదే పదే రావడం,  వచ్చిన తలనొప్పి కూడా  తీవ్రంగా ఉండటం జరుగుతుంది.   తరచుగా ఇలాంటి తలనొప్పితో బాధపడుతుంటే అది శరీరంలో కొన్ని  ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తరచుగా వచ్చే తలనొప్పి వెనుక ఉండే 7 సమస్యలు ఉండే అవకాశం ఉంది.  అవి ఏమిటో తెలుసుకుంటే.. ఒత్తిడి,  ఆందోళన.. ఆధునిక జీవనశైలిలో ఎదురవుతున్న అతిపెద్ద సమస్యలలో ఒత్తిడి,  ఆందోళన ఒకటి. ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలోని కండరాలు, ముఖ్యంగా మెడ,  తలలో ఉద్రిక్తంగా మారుతాయి. ఇది టెన్షన్ తలనొప్పికి కారణమవుతుంది.  ఇది తరచుగా చాలా కాలం పాటు ఉంటుంది. టెన్షన్ తలనొప్పి సాధారణంగా తల  రెండు వైపులా నిస్తేజమైన ఒత్తిడి లేదా నొప్పిలా అనిపిస్తుంది. నిద్ర లేకపోవడం.. మంచి నిద్ర శరీరానికి చాలా ముఖ్యం. నిద్ర లేకపోవడం లేదా సక్రమంగా నిద్రపోకపోవడం వల్ల తలనొప్పి రావచ్చు. తగినంత నిద్ర రానప్పుడు, శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది మైగ్రేన్ లేదా టెన్షన్ తలనొప్పి ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల ప్రతిరోజూ 7-8 గంటలు గాఢంగా నిద్రపోవడం ముఖ్యం . నిర్జలీకరణం (నీరు లేకపోవడం).. శరీరంలో నీరు లేకపోవడం కూడా తలనొప్పికి ఒక ముఖ్యమైన కారణం. డీహైడ్రేషన్ వల్ల మెదడుకు రక్త ప్రవాహం తగ్గుతుంది. దీనివల్ల తలనొప్పి వస్తుంది. సరైన మొత్తంలో నీరు త్రాగకపోతే ఈ సమస్య మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల రోజంతా కనీసం 8-10 గ్లాసుల నీరు త్రాగాలి. కంటి సమస్యలు.. కంటి చూపు మందగించడం, కంటి ఒత్తిడి, లేదా కంప్యూటర్ స్క్రీన్ ముందు ఎక్కువ గంటలు పనిచేయడం వంటి కంటి సమస్యలు కూడా తలనొప్పికి కారణమవుతాయి. కంటి కండరాలపై అధిక ఒత్తిడి తలనొప్పికి కారణమవుతుంది. అందువల్ల క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం,  స్క్రీన్ సమయాన్ని తగ్గించడం చాలా ముఖ్యం . మైగ్రేషన్.. మైగ్రేన్ అనేది తీవ్రమైన తలనొప్పి. ఇది తరచుగా తీవ్రమైన నొప్పి, వికారం, తలతిరగటం, కాంతి లేదా శబ్దాలను భరించలేకపోవడం వంటి లక్షణాలతో  కూడి ఉంటుంది. మైగ్రేన్లు తలలో ఒక వైపున తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి.  చాలా గంటల నుండి చాలా రోజుల వరకు ఉంటాయి.  ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, కొన్ని ఆహారాలు,  వాతావరణంలో మార్పులు మొదలైనవి  మైగ్రేన్ ట్రిగ్గర్‌లలో ముఖ్యమైనవి. అధిక రక్తపోటు.. అధిక రక్తపోటు కూడా తలనొప్పికి ఒక ముఖ్యమైన కారణం కావచ్చు. రక్తపోటు పెరిగినప్పుడు, తలలో రక్త పీడనం పెరుగుతుంది. ఇది తలనొప్పికి కారణమవుతుంది. ఈ నొప్పి సాధారణంగా తల వెనుక భాగంలో వస్తుంది.  ఉదయం మరింత తీవ్రంగా ఉండవచ్చు. అధిక రక్తపోటును నియంత్రించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం,  ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. మెదడు కణితి.. తరచుగా తలనొప్పి రావడం కూడా బ్రెయిన్ ట్యూమర్ కి సంకేతం కావచ్చు. మెదడు కణితి  అత్యంత సాధారణ లక్షణాలలో తలనొప్పి ఒకటి. అందువల్ల తరచుగా తలనొప్పి సమస్య ఉంటే వైద్యుడిని సంప్రదించి తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం.                                    *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

Brain Tumor problems

బ్రెయిన్ ట్యూమర్ వల్ల కలిగే సమస్యలు ఎలా ఉంటాయి

బ్రెయిన్ ట్యూమర్ అనేది ఒక తీవ్రమైన సమస్య. ఈ సమస్య  కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది మరణిస్తున్నారు. మెదడులో లేదా దాని చుట్టూ ఉన్న కణాలు అసాధారణంగా  పెరగడాన్ని బ్రెయిన్ ట్యూమర్ అంటారు. కొన్నిసార్లు ఇది క్యాన్సర్ కావచ్చు లేదా క్యాన్సర్ కాకుండా కూడా ఉండవచ్చు. కణితి పరిమాణం పెరిగేకొద్దీ, మెదడు కణజాలంపై ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఇది అనేక రకాల సమస్యలను కలిగిస్తుంది. ఒక నివేదిక ప్రకారం మెదడు కణితుల్లో మూడింట ఒక వంతు మాత్రమే క్యాన్సర్‌గా మారుతాయి. కానీ అవి క్యాన్సర్ అయినా కాకపోయినా, మెదడు కణితులు మెదడు పనితీరును,  ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తాయి. కణితులు పెద్దగా పెరిగినప్పుడు, అవి సమీపంలోని నరాలు, రక్త నాళాలు,  కణజాలాలను ప్రభావితం చేస్తాయి. అందుకే సకాలంలో రోగ నిర్ధారణ,  చికిత్స చాలా అవసరం. మెదడు కణితిని సకాలంలో గుర్తించడానికి దాని లక్షణాలపై  శ్రద్ధ చూపడం ముఖ్యం. కణితిని ముందుగా గుర్తించడం వలన చికిత్స సాధ్యమవుతుంది.  వ్యాధి తీవ్రమయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మెదడు కణితి సమస్య కొన్ని జన్యువులు దెబ్బతిన్నప్పుడు లేదా సరిగా పనిచేయనప్పుడు మెదడు కణితి సంభవిస్తుందని పరిశోధకులు విశ్వసిస్తున్నారు.  వయసు పెరిగే కొద్దీ లేదా అధిక రసాయనాలకు గురైనప్పుడు మెదడు కణితి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వారందరికీ ప్రారంభంలోనే దాని లక్షణాలు కనిపించడం  జరగదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే కొన్ని సంకేతాలకు తీవ్ర శ్రద్ధ ఉండాలి. తరచుగా కణితి కారణంగా తీవ్రమైన తలనొప్పి,  తలతిరగడం దాని ప్రధాన లక్షణాలుగా పరిగణించబడతాయి. ఇది కాకుండా కొంతమంది కణితి విషయంలో కొన్ని వింత లక్షణాల  గురించి కూడా ఫిర్యాదు చేస్తుంటారు. వింత లక్షణాలు.. ఆలివ్, పాలకూర, టమోటాలు తినాలని  ఎప్పుడూ ఇష్టం లేకపోయినా బ్రెయిన్ ట్యూమర్ ఉంటే  తరచుగా వాటిని తినాలని  వింతైన బలమైన కోరికలు కొందరిలో కలుగుతాయట. తీవ్రమైన తలనొప్పి,  తలతిరుగుడు వంటి సమస్యలు ఉండటం. వీటి కోసం వైద్యులు ఇచ్చిన మందులు పనిచేయకపోవడం. లక్షణాలు.. కొంతమందికి బ్రెయిన్ ట్యూమర్ ఉన్నప్పుడు ఎటువంటి లక్షణాలు కనిపించవని, ముఖ్యంగా అది చాలా చిన్నగా ఉంటే ఎలాంటి లక్షణాలు ఉండవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే దాని పరిమాణం పెరిగేకొద్దీ  అనేక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. దీని ప్రధాన లక్షణం తలనొప్పి, ఇది ఉదయం మరింత తీవ్రంగా ఉంటుంది. దీనితో పాటు, కణితి కారణంగా, మూర్ఛలు, ఆలోచించడంలో, మాట్లాడటంలో లేదా భాషను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది, వ్యక్తిత్వ మార్పులు, శరీరంలోని ఒక భాగంలో బలహీనత లేదా పక్షవాతం, తరచుగా వికారం లేదా వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది.                                        *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

difference between f and migraine

తలనొప్పికి, మైగ్రేన్ కు మధ్య తేడాలు తెలుసా?

  తలనొప్పి చాలామందికి సహజంగా వచ్చే సమస్య. తలనొప్పి వల్ల ఏ పని మీద ఏకాగ్రత కుదరదు. ఏ పని సక్రమంగా చేయడానికి వీలు కాదు. అయితే ఇలా సహజంగా వచ్చే సమస్య కొద్దిసేపటి తరువాత లేదా కాస్త విశ్రాంతి తీసుకున్న తరువాత తగ్గిపోతుంది. కానీ కొందరికి పదే పదే తలనొప్పి వస్తూ ఉంటుంది. దీని వల్ల అసలు అది తలనొప్పా లేదా మైగ్రేనా అని చాలామంది గందరగోళ పడుతుంటారు. వైద్యుడిని సంప్రదించకపోయినా.. వైద్యులు చెప్పకపోయినా తమకు మైగ్రేన్ ఉందని చెబుతూ ఉంటారు. అసలు తలనొప్పికి, మైగ్రేన్ కు మధ్య తేడా ఏంటి?  పదే పదే వేధించే తలనొప్పిని మైగ్రేన్ అని చెప్పవచ్చా? దీని గురించి వైద్యులు చెబుతున్న నిజాలు ఏంటంటే.. తలనొప్పి ఒక సాధారణ సమస్య, దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. ఈ నొప్పిని కొన్ని సాధారణ గృహ నివారణలు మరియు మందుల సహాయంతో సులభంగా నయం చేయవచ్చు, కానీ అన్ని తలనొప్పులు ఒకేలా ఉండవు. తలనొప్పితో పాటు కళ్ళలో నొప్పి, అలసట, వాంతులు,  వికారం వంటి సమస్యలు ఉంటే, సాధారణ తలనొప్పి కాకుండా అది మైగ్రేన్‌ అయ్యే అవకాశం ఉంది. మైగ్రేన్ సమస్య  చాలా అసౌకర్యానికి గురి చేస్తుంది, దీనిని సైకోసోమాటిక్ డిజార్డర్ అని కూడా అంటారు. తలనొప్పి సమస్య: తలనొప్పులు వివిధ రకాలుగా ఉంటాయి. అత్యంత సాధారణమైనది టెన్షన్ తలనొప్పి. పెద్దలలో దాదాపు 1-3% మంది దీర్ఘకాలిక  తలనొప్పిని టెన్షన్ వల్ల అనుభవిస్తారు. తలనొప్పికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిని ప్రతి ఒక్కరూ బాగా గమనించాలి. మద్యం సేవించడం, నిద్ర విధానాలలో మార్పులు లేదా నిద్ర లేకపోవడం, శరీర భంగిమ సరిగా లేకపోవడం, వ్యాయామం వంటి శారీరక శ్రమ లేకపోవడం లేదా సమయానికి భోజనం చేయకపోవడం వల్ల  తలనొప్పి రావచ్చు. మైగ్రేన్.. ఆరోగ్య నిపుణులు మైగ్రేన్ కూడా ఒక రకమైన మానసిక రుగ్మత అని అంటున్నారు. అంటే ఇది  మానసిక ఆరోగ్యంలోని ఏదో సమస్య వల్ల సంభవించే అవకాశం ఉంది. కాబట్టి తరచుగా మైగ్రేన్‌తో బాధపడుతుంటే, దాని గురించి తీవ్రంగా శ్రద్ధ వహించి చికిత్స పొందడం అవసరం. మైగ్రేన్‌తో బాధపడేవారు ఇతరుల కంటే ఒత్తిడి,  నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు మైగ్రేన్ నిరాశ లేదా ఆందోళన కారణంగా కూడా వస్తుంది. మైగ్రేన్,  సాధారణ తలనొప్పి మధ్య తేడా ఏమిటి? సాధారణ తలనొప్పి మొత్తం తలలో తేలికపాటి లేదా తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. అయితే మైగ్రేన్ నొప్పి తలలో ఒక వైపున చాలా తీవ్రంగా ఉంటుంది. కొంతమందికి తలకు రెండు వైపులా నొప్పి కూడా ఉండవచ్చు.  సాధారణ తలనొప్పి కొన్ని నిమిషాల నుండి కొన్ని గంటల వరకు ఉంటుంది. అయితే మైగ్రేన్ 4-72 గంటల వరకు ఉంటుంది. సాధారణ తలనొప్పికి  నొప్పి తప్ప వేరే లక్షణాలు ఉండవు. కానీ మైగ్రేన్ వికారం, వాంతులు, కాంతికి భరించలేకపోవడం,  శబ్దానికి సున్నితంగా మారడం,  దృష్టి సమస్యలను కలిగిస్తుంది. అధిక ఒత్తిడి, అలసట, ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల తలనొప్పి వస్తుంది. అయితే టెన్షన్, హార్మోన్ల మార్పులు, వాతావరణం, ఆహారం, నిద్ర లేకపోవడం, ప్రకాశవంతమైన వెలుతురు వంటి కొన్ని పరిస్థితులు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తాయి. మైగ్రేన్,  తలనొప్పిని నివారించడానికి మార్గాలు.. మైగ్రేన్,  తలనొప్పిని నివారించడానికి  జీవనశైలిని మెరుగుపరుచుకోవాలి. మెగ్నీషియం,  విటమిన్ బి12 అధికంగా ఉండే ఆహారాలు (గింజలు, ఆకుకూరలు మరియు గుడ్లు వంటివి) మైగ్రేన్‌లను నివారించడంలో సహాయపడతాయి. అధిక కెఫిన్, ఆల్కహాల్,  ప్రాసెస్ చేసిన ఆహారాలను నివారించాలి. ఎందుకంటే ఇవి మైగ్రేన్‌లను ప్రేరేపిస్తాయి. రోజూ 7-9 గంటలు బాగా నిద్రపోవాలి. నిద్రపోవడానికి,  మేల్కొనడానికి ఒక నిర్దిష్ట సమయాన్ని నిర్దేశించుకోండి. యోగా, ధ్యానం,  తేలికపాటి వ్యాయామం (నడక, సైక్లింగ్ వంటివి) ఒత్తిడిని తగ్గించడం ద్వారా మైగ్రేన్ ట్రిగ్గర్‌లను నివారించవచ్చు. మైగ్రేన్ తరచుగా వస్తుంటే లేదా చాలా తీవ్రంగా ఉంటే, వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.                                            *రూపశ్రీ.

కారం బాగా తినే అలవాటు ఉన్నవారికి షాకింగ్ న్యూస్.. అసలు నిజాలు తెలుసా?

  ఇటీవల స్పైసీ ఫుడ్ ట్రెండ్ అవుతోంది. దీనికి తగినట్టే  హాట్ సాస్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది.  ఇక ఇంట్లో వండే వంటల్లో కూడా  కారం ఎక్కువ కావాలని డిమాండ్ చేసేవారు చాలా మంది ఉన్నారు.  మిరపకాయలు తినే పోటీల నుండి రెస్టారెంట్ మెనూలలోని వస్తువుల వరకు కారంగా ఉండే ఆహారం ప్రతిచోటా ఉంటుంది. చాలా మందికి స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఆహారంలో మిరపకాయలు వేసి రుచిని పెంచుతారు. కారం బాగా తిన్న శరీరం ఇది..  బాగా గట్టిగా ఉంటుంది అనే డైలాగ్ కూడా వింటుంటాం.  అయితే  స్పైసీ ఫుడ్ తినడం వల్ల లాభాల సంగతి ఏంటో కానీ నష్టాలు మాత్రం ఉంటాయని అంటున్నారు ఆహార నిపుణులు.  ఇంతకీ దీనివల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుంటే.. కారంగా ఉండే ఆహారం తింటే ఏమవుతుంది? ఆహారానికి కారం ఇవ్వడంలో చాలా రకాల పదార్థాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వాటిలో మిరియాలు కూడా ఒకటి. మిరియాలలో  క్యాప్సైసిన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది.  కారంగా ఉండే ఆహారాలు తిన్నప్పుడు ఈ క్యాప్సైసిన్ అనే సమ్మేళనం శరీరంలో  వేడిని ఉత్పత్తి చేస్తుంది.  ఈ క్యాప్సైసిన్ నోటిలో, నాలుక ఉపరితలంపై,  జీర్ణవ్యవస్థ.. ఇలా  అంతటా  ఉండే నొప్పి గ్రాహకాలకు  అంటుకుంటుంది. కారం ఎక్కువ తింటే నష్టాలు.. గ్యాస్ట్రిక్ సమస్యలు.. ఎక్కువ కాలం పాటు కారంగా ఉండే ఆహారాన్ని ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల గుండెల్లో మంట లేదా ఇతర గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. గ్యాస్ట్రిటిస్ లేదా అల్సర్లను మరింత దారుణ స్థితికి తీసుకెళ్లే శక్తి కారానికి ఉంటుంది. ఇప్పటికే గ్యాస్టిటిస్, అల్సర్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టైతే కారానికి దూరంగా ఉండటం మంచిది. అతిసారం..  చాలా కారంగా ఉండే ఆహారాన్ని తిన్నప్పుడు మొదట్లో  నోరు మండుతున్నట్లు అనిపిస్తుంది తరువాత నార్మల్ అయిపోతుంది. కానీ ఈ ఆహారం జీర్ణశయాంతర ప్రేగులోకి వెళ్లినప్పుడు, అది జీర్ణక్రియ రేటును పెంచుతుంది. ఇది విరేచనాలకు కారణమవుతుంది, అలాగే బాధాకరమైన ప్రేగు కదలికలకు కారణమవుతుంది. తలనొప్పి.. కారం ఎక్కువగా తిన్న తర్వాత థండర్‌క్లాప్ తలనొప్పి రావచ్చు. ఇది బాధాకరమైన,  అకస్మాత్తుగా వచ్చే తలనొప్పి రకం. చాలామంది కారం ఎక్కువగా తిన్నప్పుడు తలనొప్పి అని కంప్లైంట్ చేస్తే ఎగతాళి చేయడం లేదా నవ్వడం చేస్తారు. కానీ నిజంగానే కొందరికి తలనొప్పి వస్తుంది. లాభాలు కూడా.. స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల నష్టాలు ఉన్నా కారాన్ని ఒక పరిమిత మోతాదులో తినడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పరిమిత పరిమాణంలో కారం తినేవారికి కారం చాలా తక్కువ తినే వ్యక్తులతో పోలిస్తే ఆయుష్షు ఎక్కువ ఉంటుందట. అలాగని మరీ కారం ఎక్కువ తినకూడదు. కారం తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందట.   కారం లో ఉండే క్యాప్సైసిన్ ఆకలిని తగ్గిస్తుంది.  జీవక్రియను పెంచుతుంది.  ఇది ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. పరిమిత మొత్తంలో తీసుకునే క్యాప్సైసిన్ కడుపులో ఆమ్ల ఉత్పత్తిని నిరోధిస్తుందని, ఇది అల్సర్లను నివారించడంలో సహాయపడుతుందని చాలా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.                            *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

మీకు ఉదయాన్నే ఈ అలవాట్లు ఉన్నాయా? వెంటనే మానేయడం మంచిది..

  శరీరాన్ని ఆరోగ్యంగా,  దృఢంగా ఉంచుకోవడానికి, సరైన ఆహారం, సరైన  జీవనశైలిని నిర్వహించడం చాలా ముఖ్యం.  రోజంతా ఏమి చేస్తారు, ఏమి తింటారు,  రోజును ఎలా గడుపుతారు అనేవి ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా  రోజును ఎలా ప్రారంభిస్తారనేది  ఆరోగ్యానికి డైరెక్ట్ గా లింక్ కలిగి ఉంటుంది.అందుకే ఆరోగ్య నిపుణులు రోజూ ఉదయాన్నే ప్రజలు ఫాలో అయ్యే కొన్ని చెడ్డ అలవాట్ల గురించి చెప్పుకొచ్చారు.  ఈ అలవాట్లు వెంటనే మానేయడం వల్ల ఆరోగ్యం విషయంలో చాలా మంచి మార్పులు వస్తాయని కూడా పేర్కొన్నారు.  ఇంతకీ ఉదయాన్నే మానుకోవాల్సిన అలవాట్లు ఏంటో తెలుసుకుంటే. అల్పాహారం తరువాత..  ఉదయం నిద్రలేచి, అల్పాహారం తీసుకుని, మళ్ళీ నిద్రపోయేవారు ఉంటారు.  ఇది జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది.  ఇలాంటి ఆహారపు అలవాటు ఉన్నవారు  అనేక కడుపు సంబంధిత సమస్యలతో బాధపడతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తరచుగా  ఉదయం నిద్రలేవగానే మొబైల్ లేదా టీవీ చూడటం చాలామందికి అలవాటైపోయింది. ఈ అలవాటు చిన్నదిగా అనిపిస్తుంది.  కానీ ఇది  వయస్సుకు ముందే వ్యక్తులను వృద్ధులను చేస్తోంది. మొబైల్ ఫోన్‌ను అధికంగా వాడటం వల్ల కళ్ళు,  మెదడుపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. ఇది నిద్ర నాణ్యతను కూడా ప్రభావితం చేస్తుంది. కాఫీ, టీ.. చాలా మంది టీ లేదా కాఫీ తాగడం ద్వారా తమ రోజును ప్రారంభిస్తారు. ఇలా చేయడం వల్ల శరీరంలో కెఫిన్ పరిమాణం పెరుగుతుంది. ఇది గుండె,  రక్తపోటుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ అలవాటు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం   జీర్ణ ఆరోగ్యానికి మంచిది కాదు, ఈ అలవాటు వల్ల గ్యాస్, మలబద్ధకం,  అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. వైద్యులేమంటారంటే.. ఆరోగ్యంగా ఉండటానికి  దినచర్యను మెరుగుపరచుకోవాలి. ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చూసే అలవాటు ప్రమాదకరం. దానికి బదులుగా వార్తాపత్రికలు లేదా పుస్తకాలు చదవాలి. ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. ఇది  మెదడుకు శక్తినిస్తుంది.  దీని వల్ల  రోజు ఆరోగ్యంగా  ప్రారంభమవుతుంది. చాలా మంది ఉదయం నిద్రలేచిన తర్వాత స్నానం చేయకుండా ముఖం, చేతులు కడుక్కున్న తర్వాత పనికి వెళతారు. ఈ అలవాటును క్రమం తప్పకుండా అలవాటు చేసుకోవడం వల్ల చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.  అనేక అంటు వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంది.  దినచర్య,  రోజువారీ అలవాట్లను మెరుగుపరుచుకుంటే ఆరోగ్యంగా ఉండటం సులభం అవుతుంది.                                               *రూపశ్రీ.

5 రకాల విటమిన్లు.. వాటి ప్రధాన పాత్ర తెలుసుకోవాల్సిందే..!

  శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పోషకమైన ఆహారం తినడం చాలా ముఖ్యమైనదని భావిస్తారు. అందరూ ఆహారాన్ని తీసుకునే విషయంలో మంచి అలవాట్లు  మెరుగుపరుచుకుంటే అనేక రకాల వ్యాధులను నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆహారంలో శాకాహారం, మాంసాహారం రెండూ ఉంటాయి. ఇవి రెండూ కూడా ఆరోగ్యం చేకూరుస్తాయి. కానీ చాలామంది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నా సరే.. ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది.   అయితే శరీరానికి అందాల్సిన విటమిన్లు అందకపోవడం వల్ల శరీరంలో సమస్యలు ఏర్పడతాయి.  ముఖ్యంగా 5 రకాల విటమిన్లను తీసుకుంటూ ఉంటే చాలా రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.  ఇంతకీ ఆ 5 రకాల విటమిన్లు ఏమిటో.. వాటి ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుంటే.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, ఆహారంలో విటమిన్లు అధికంగా ఉండే ఆహారాలు ఉండేలా చూసుకోండి. మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజూ వివిధ రకాల విటమిన్లను సమతుల్య పరిమాణంలో తీసుకోవడం అవసరమని పోషకాహార నిపుణులు అంటున్నారు. వాటి లోపం వల్ల వివిధ శారీరక సమస్యలు తలెత్తుతాయి. సహజ వనరుల నుండి విటమిన్లు పొందడం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని శాస్త్రీయ పరిశోధనలు చూపిస్తున్నాయి.  రోజూ ఏ విటమిన్లు తీసుకోవాలి,  దీని కోసం ఆహారంలో చేర్చాల్సిన ఆహారాలు ఏమిటో తెలుసుకుంటే.. విటమిన్-ఎ.. విటమిన్-ఎ మన శరీరానికి అనేక విధాలుగా ముఖ్యమైనది. ఇది కంటి చూపును స్పష్టంగా ఉంచడంలో సహాయపడటమే కాకుండా, రేచీకటి వంటి అరుదైన సమస్యలను కూడా నివారిస్తుంది. చర్మం, జుట్టు,  రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి విటమిన్-ఎ చాలా ముఖ్యమైనది. విటమిన్ A  దృష్టి సమస్యలను,  రోగనిరోధక శక్తి తగ్గడానికి కారణమవుతుంది. విటమిన్-ఎ అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల  ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఒక అధ్యయనం కనుగొంది. క్యారెట్లు, చిలగడదుంపలు, ఆకుకూరలు, గుడ్లు, చేపలు,  పాలలో విటమిన్-ఎ పుష్కలంగా ఉంటుంది. విటమిన్-బి.. విటమిన్ ఎ లాగే విటమిన్ బి కూడా  ఆరోగ్యానికి చాలా అవసరం. ఈ విటమిన్ శక్తి ఉత్పత్తికి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి,  ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది. విటమిన్ బి చర్మం, గోర్లు, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. విటమిన్ బి12 లోపం నాడీ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. గర్భిణీ స్త్రీలకు ఫోలిక్ ఆమ్లం (B9) చాలా అవసరం ఎందుకంటే ఇది పిండంలో న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారిస్తుంది. తృణధాన్యాలు, ఆకుకూరలు, గుడ్లు, పాలు, మాంసం, పప్పుధాన్యాలు ఈ విటమిన్  మంచి వనరులు. విటమిన్-సి.. విటమిన్ సి,  డి రెండూ శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. విటమిన్ సి తీసుకోవడం వల్ల చర్మం, ఎముకలు,  దంతాలకు ప్రయోజనం చేకూర్చే కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఆహారం ద్వారా తగినంత మొత్తంలో విటమిన్ సి తీసుకోవడం వల్ల గుండె జబ్బులు,  అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చు. నారింజ, నిమ్మ, ఉసిరి, స్ట్రాబెర్రీ, క్యాప్సికమ్, బ్రోకలీ మొదలైన వాటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్-డి.. విటమిన్ డి కూడా రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్‌గా పరిగణించబడుతుంది. ఈ విటమిన్ కాల్షియం శోషణను పెంచడం ద్వారా ఎముకలు,  దంతాలను బలపరుస్తుంది.  విటమిన్ డి లోపం ఎముకల బలహీనత, నిరాశ,  రోగనిరోధక శక్తి తగ్గడానికి దారితీస్తుంది. సూర్యకాంతి, చేపలు, గుడ్లు, పుట్టగొడుగులు, పాలు నుండి విటమిన్ డి పొందవచ్చు. విటమిన్-ఇ.. విటమిన్ ఇ ఒక ప్రభావవంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా చర్మం మరియు జుట్టుకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. దీని యాంటీఆక్సిడెంట్ లక్షణాల కారణంగా, ఈ విటమిన్ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇది గుండె,  రక్త ప్రసరణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, ఆహారం ద్వారా విటమిన్ E తీసుకోవడం వల్ల చర్మంపై ముడతలు తగ్గుతాయి.  అల్జీమర్స్ వ్యాధిని నివారించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. బాదం, పొద్దుతిరుగుడు విత్తనాలు, పాలకూర, అవకాడో, వేరుశెనగలు విటమిన్ ఇ  మూలాలు.                                       *రూపశ్రీ.     గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  

భోజనం తరువాత టీ తాగే అలవాటు ఉందా? ఈ నిజాలు తెలుసుకోండి..!

  ఇంట్లో అయినా, బయటకు వెళ్లినప్పుడు అయినా టిఫిన్, భోజనం చేశాక టీ లేదా కాఫీ తీసుకోవడం చాలా మంది అలవాటు. ఇలా భోజనం తరువాత కాఫీ, టీ లు తీసుకోవడం అనేది ఎంత వరకు ఆరోగ్యానికి మంచిది అనే సందేహం చాలా మందికి వచ్చినా దాని రుచి అడ్డు కట్ట వేస్తుంది. అయితే భోజనం తరువాత టీ తాగే అలవాటు ఉన్నవారికి షాకింగ్ న్యూస్ చెబుతున్నారు ఆహార నిపుణులు, వైద్యులు.  భోజనం తరువాత కాపీ, టీ లు తాగితే ఏం జరుగుతుందో తెలుసుకుంటే.. ఈ కాలంలో చాలా మంది కడుపుకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటిలో గ్యాస్, ఉబ్బరం,   మలబద్దకం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి.  అయితే ఆహారం తీసుకోవడంలో కానీ, తప్పడు ఆహారపు అలవాట్లు ఉన్నా కానీ ఇలాంటి సమస్యలు వస్తాయట.   భోజనం చేసిన తరువాత కాఫీ, టీ తాగితే.. భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల కడుపులో గ్యాస్ సమస్యలు వస్తాయి. టీలో కెఫిన్,  టానిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను గణనీయంగా తగ్గిస్తాయి. భోజనం తరువాత కాఫీ, టీ తాగితే కడుపు నొప్పి,  కడుపులో గ్యాస్ సులభంగా వస్తాయి.  ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది,  ఆ తరువాత ఏమీ తినాలని కూడా అనిపించదు. శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. శరీరమంతా అలసట కమ్మినట్టు అనిపిస్తుంది. టీలో ఉండే టానిన్ శరీరంలో ఐరన్ ను శరీరం గ్రహించకుండా చేస్తుంది.  దీని కారణంగా శరీరంలో ఐరన్ లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆహారం తిన్న వెంటనే టీ తాగే వారి దంతాలు చాలా దెబ్బతింటాయి. టీలో ఆమ్లం ఉంటుందని, ఇది దంతక్షయానికి కారణమవుతుందని చెబుతారు. దీని కారణంగా పంటి నొప్పి, దుర్వాసన వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆహారం తిన్న వెంటనే టీ తాగడం వల్ల నిద్ర లేకపోవడమనే సమస్య ఎదురవుతుంది. రాత్రి భోజనం తర్వాత టీ తాగితే నిద్ర పట్టదు. చాలా మంది టీ తాగిన తర్వాత రాత్రి నిద్రపోలేకపోతున్నామని తరచుగా ఫిర్యాదు చేస్తారు. అటువంటి పరిస్థితిలో వెంటనే టీని వదులుకోవడం మంచిది.                                          *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...