థైరాయిడ్ క్యాన్సర్ అంటే తెలుసా?

  ఎం టి సి మోడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్  చాలా అరుదుగా వచ్చే క్యాన్సర్. థైరాయిడ్ క్యాన్సర్  గ్రంధిలో వచ్చే క్యాన్సర్. ధాయ్ రాయిడ్ క్యాన్సర్ సమ స్య వివిదరూపాలలో వచ్చి క్యాన్సర్ గా మారు తుంది. ఇది వివిధ రకాల కణాల ద్వారా ఫరా ఫాలిక్యులర్ సి సెల్ ద్వారా పుడుతుంది. థైరాయిడ్ క్యాన్సర్ చాలా చిన్న గ్రంధి. మన మెడకు ముందు భాగం లో ఉంటుంది. శరీరానికి అవసరమైన హార్మోన్లనుథైరాయిడ్ క్యాన్సర్ ఉత్పత్తి చేస్తుంది.ధై రాయిడ్ లో ఒకరకమైన కణాల ఉత్పత్తి ఎప్పుడైతే ప్రారంభమౌతాయో క్యాన్సర్ మొదలవుతుంది. అమెరికన్ క్యాన్సర్ సొసైటి థైరాయిడ్ క్యాన్సర్ సెల్స్ పై ఆధార పడి క్యాన్సర్ వృద్ధి చెందుతుంది. మొ డ్యులరీ ధై రాయిడ్ క్యాన్సర్ చాలా అరుదైన క్యాన్సర్. ప్రతి 1౦౦౦ మందిలో 3 నుండి 4% ధైరాయిడ్ క్యాన్సర్లు వస్తున్నాయి. మోడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు చికిత్స వంటి అంశాలు చూద్దాం...థైరాయిడ్ గ్రంధి గురించి... మన మెడ పై సీతాకోక చిలుక ఆకారం లో థైరాయిడ్  గ్రంధి ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్బ్లను ఉత్పత్తి చేసి శరీరానికి మెటాబా లిజం ను పెంచు తుంది.థైరాయిడ్ గ్లాండ్స్ లో రెండు రకాలు ఉంటాయి. సెల్స్ ఫాలిక్యులర్ సి సెల్స్ పరా ఫాలిక్యులర్ సెల్స్ ఉంటాయి. ఫాలిక్యులర్ సెల్స్ థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. పరా ఫాలిక్యులర్ సెల్స్ కాల్సిటోనిన్ హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ ద్వారా శరీరంలో కాల్షియం ను నియంత్రిస్తుంది. ఎం టి సి ఇతర క్యాన్సర్ల కన్నా వేరుగా ఉంటుంది.  ఎం టి సి ఫరా ఫాలిక్యులర్ సెల్స్ ద్వారా వృద్ది అవుతుంది. ఎం టి సి ని కొందరు మోడ్యులరీ థైరాయిడ్ కార్సినామా అనికూడా అంటారు. ఎం టి సి ఎన్నిరకాలు... ఎం టి సి ని రెండు రకాలుగా గుర్తించారు. స్పోరాడిక్ , ఫెమిలాల్ గా గుర్తించారు. స్పోరాడిక్ చాలా సహజమైన సమస్య వయస్సు మళ్ళిన వాళ్ళలో ముఖ్యం గా వృ దులలో థైరాయిడ్ లోబ్ లో ప్రభావం చ్గూపిస్తుంది. ఫెమిలాల్ ఎం టి సి కుటుంబం లో వస్తుంది . ఇది బాల్యం నుంచే వృద్ది చెందుతుంది. ఈ రకమైన క్యాన్సర్స్ థైరాయిడ్ లోబ్స్ లేదా ఇతర రకాల కణి తలు ఉంటె మరింత తీవ్రంగా ఉంటుంది. పరా ఫాలిక్యులర్ సి సెల్స్ ఉండే ప్రాంతం లో మోడ్యులా థైరాయిడ్ ఉండే ప్రాంతం లో వస్తుంది.ఒక్కోసారి ఎం టి సి ని గుర్తించడం కష్టం. ఇతరథైరాయిడ్ క్యాన్సర్ లను గుర్తించడం కష్టం. మోడ్యులార్ థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు... ప్రాధమిక స్థాయిలో ఎం టి సి ని గుర్తించడం కష్టం. ఎం టి సి నెమ్మదిగా పెరుగుతుంది. వ్యక్తికి ఎలాంటి లక్షణాలు కనపడవు. ప్రధానంగా థైరాయిడ్ గ్రంధి వద్ద ఒక కణిత మేడలో వస్తుంది. ఇది పూర్తిగా కణిత మాంసం ముద్దగా ఉంటుంది పెరిగిన కణిత థైరాయిడ్ లో పెరుగుతుంది. దీనివల్ల మింగడం లేదా నోటి ద్వారా శ్వాస తీసుకోవడం సమస్యగా మారుతుంది మాట్లాడడం కష్టంగా ఉంటుంది. మోడ్యులార్ థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలలో ముఖం ఎర్ర బడడం.బరువు తగ్గడం. డయేరియా లేదా నీళ్ళ విరేచనాలు వంటివి కనిపిస్తాయి . మోడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్ ఎన్ని స్టేజీలలో ఉంటుంది... ఆన్ని క్యాన్సర్ల లాగానే డాక్టర్స్ మొడ్యులారీ థైరాయిడ్ ను స్టేజిలుగా గుర్తించారు. నాలుగు స్టేజీలు ఎలా ఉంటాయో చూద్దాం . వివిధ రకాల కారణాలు అయి ఉంటాయి. ట్యూమర్ పరిమాణం సైజు లింఫ్ నోడ్స్ ను చేరిందా లేదా లేదా ఇతర అవయవాల కు దూరంగా ఉందా ,వ్యాపించిందా ? స్టేజ్ 1. ప్రాధమిక స్థాయి, ఈ దశలో ట్యూమర్ చాలా చిన్నదిగా వ్యాపించదు . ప్రతి స్టేజి లో పెరుగుతూ పోతూఉంటుంది. 4 వ స్టే జిలో క్యాన్సర్ ఏ సైజు లో అయినా ఉండవచ్చు. ప్రతి స్టేజిలో క్యాన్సర్ పెరగడం వ్యాపించడం సంభవిస్తుంది. కారణాలు... ఎం టి సి ఫలితం గా పారా ఫాలిక్యు లర్ సెల్స్ లో మార్పులు చెందుతాయి. ఏది ఏమైనా చాలా కేసులలో స్పోరాడిక్ కు గల కారాణాలు తెలియరాలేదు. 25% ఎం టి సి కేసులలో కుటుంబాలలో వస్తాయిదీని ఆధారం గా రేట్ జీన్ లో మార్పుల కారణంగా పెర్కొంటు న్నారు.రేట్ జీన్ క్రోమో జోములలో ఉంటుంది. ఇది పది రకాలుగా మారుతుంది. అని కణాలు వస్తాయని శాస్త్రజ్ఞులు జీన్ లో మార్పులు వచ్చినట్లు గుర్తించారు. దీనివల్ల స్పోరాడిక్ క్యాన్సర్స్ ఎం టి సి ఈ పరిస్థితిని రేట్ జీన్స్ స్థితి వల్ల మల్టి పుల్ ఎండో క్రైన్ నీమో ప్లాసియా టైప్ 2 లేదా మెన్ 2 , మెన్ 2 ఏ మెన్ 2 బి ఉండవచ్చని అభిప్రయా పడ్డారు. మోడ్యులార్ క్యాన్సర్ నిర్ధారణ... మోద్యులరీ  థైరాయిడ్ క్యాన్సర్ తో బాధపడే ప్రజలు మెడలో కణి తలలో వస్తారు. డాక్టర్ తమ పరీక్షలలో చాలా చాక చక్యం గా లంప్ ను గుర్తిస్తారు. ఇమేజింగ్ టెస్ట్ లలో అల్ట్రా సౌండ్,సిటి లేదా ఎం అర్ ఐ స్కాన్,ధైరాయిడ్ చేయిస్తారు. ఒక వేళ డాక్టర్  థైరాయిడ్ క్యాన్సర్ గా అనుమానిస్తే ఎస్పిరేషణ్ బయాప్సీ పరీక్ష అల్ట్రాసౌండ్, లేదా ఎం ఆర్ ఐ స్కాన్ ద్వారా 6 ఆరు ప్రాంతాలలో కణా లాలో చిన్న కణాలను నీడిల్ ను వినియోగిస్తారు. మరిన్ని పరీక్షలు చేసి నిర్ధారిస్తారు. మరిన్ని పరీక్షల వల్ల చికిత్స పద్దతులు ఎలా చేయవచ్చు. అని నిర్దారించాలంటే రక్త పరీక్ష చేస్తారు, రక్త పరీక్షలో కాల్సిటోనిన్, కాల్షియం కార్సినోమా ఎం బ్రాయినిక్ యాంటీ జీన్ ఎల్ ఏ పరీక్షలు చేసి నిర్ధారిస్తారు. చికిత్సలు... ప్రాధమిక స్థాయిలో ఎం టి సి సర్జరీ చేస్తారు. దీనిని ధైరోడేక్టమీ అంటారు.ఇందులో  థైరాయిడ్గ్లాండ్ ను పూర్తిగా తొలగిస్తారు.  థైరాయిడ్ గ్రంధి వ్యక్తికి అవసరం. లేదా ఒక వేళ  థైరాయిడ్ గ్రంధి తొలగిస్తే జీవితాంతం హార్మోన్లు మార్చుకుంటూ ఉండాలి. సర్జరీ తో పాటు ఇతర చికిత్సలు చేస్తారు. ప్రత్యేకంగా ఒకవేళ కణిత లేదా ట్యూమర్ ఇతర ప్రాంతాలకు అవయవాలకు వ్యాపిస్తే  థైరాయిడ్ బయట, మెడ బయటి భాగం లో మార్పులు వస్తే సర్జరీ అనువు కాని పక్షంలో ఇతర చికిత్సలు ఎక్స్ టర్నల్ బీం రేడియేషన్ కీమో తెరఫీ లక్ష్యం దిశగా దేరఫీ లు చేస్తారు. క్యాన్సర్ తీవ్రత స్టేజీ ల ఆధారంగా ఉత్తమమైన నిర్ధారణ చికిత్స పద్దతిని ఎంచుకుంటారు. క్యాన్సర్ విస్తరిస్తే తీవ్రమైన చికిత్సలు మల్టిపుల్ స్టేటర్జీ కీమో తెరఫీ చికిత్స ఇతర చికిత్స పద్దతులు చేయాల్సి ఉంటుంది. నివారణ... ఎసి ఎస్ ప్రకారం చాలా రకాల  థైరాయిడ్ క్యాన్సర్ లలో ఎం టి సి లో కుటుంబ చరిత్ర ఉండి ఉండవచ్చు. వారిలో వస్తున్న జీన్ మార్పులు వల్ల వ్యాధి తీవ్రత సూచిస్తుంది. ఒకవేళ వ్యక్తికి హై రిస్క్ ఉంటె డాక్టర్  థైరాయిడ్ యాక్ట మీ క్యాన్సర్ ను నిలువరించ వచ్చు. డాక్టర్ ను ఎప్పుడు సంప్రదించాలి ?... మేడపై ఏదైనా కణిత ఉన్నట్లు అనిపిస్తే వారు డాక్టర్ ను సంప్రదించాలి. ఎం టి సి శక్తి వంతమైన లక్షణాలపై అవగాహన కలిగి ఉండాలి ఇందులో గాలి పీల్చుకోవడం మింగడం కష్టం ఉన్న లక్షణాలు గమనించాలి. కుటుంబాలలో చరిత్ర ఉంటె ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి. డాక్టర్ మాత్రం జన్యుపరమైన పరీక్షలకు సూచించవచ్చు జీన్ లో మార్పులు ఉంటె ఎం టి సి వస్తుంది అన్న విష యం తెలుసుకోవాలి. విశ్లేషణ... ప్రజలలో ఎం టి సి రావడానికి రక రకాల కారణాలు ఉండచ్చు. స్టేజి నిర్ధారణ చికిత్సకు స్పందించడం పూర్తి ఆరోగ్యం గా కోలుకోవడం ముఖ్యం.ఎం టి సి అన్నది ఇతరా క్యాన్సార్ లాంటి దికాదు. దీని సత్వరం నిర్ధారణ చేయడం వల్ల చికిత్స చేస్తే ఫలితాలు ఉంటాయి. అదనంగా బయో మార్కర్స్ గుర్తించడం... కార్సిటో నిన్ సి ఇ ఏ సర్జరీ తరువాత ఎంత ఉందొ తెలుసు కుంటే ఎంతకాలం బతక గలరో అంచనా వేయవచ్చు. ఎం టి సి రావడానికి  థైరాయిడ్ క్యాన్సర్. క్యాన్సర్ నుండి బయట పడ్డ వారి సమాచారం. ముందుగా గుర్తించడం చికిత్స ఫలితాలు చూడాలి.బయో మార్కర్లను నిశితంగా పరిశీలించాలి. మొదటి సంవత్సరం కార్సి టోనిన్ చికిత్స ప్రత్యామ్నాయ మార్గాలు వల్ల మనుగడ సాగడం 2౦17 లో చేసిన పరిశోదన ప్రకారం 1౦ సంవత్సరాలు మనుగడ ఎలా బతికి బట్ట కట్టలేదు. 1)థైరాయిడ్ లో 95 % స్థానిక క్యాన్సర్ మాత్రమే . 2)75 % ఇతర అవయావాల కు విస్తరించకుండా వ్యాధి ధైరాయిడ్ గ్రందికే పరిమితం . 3)2౦ % ఇతర అవయవాలకు విస్తరించడం అదీ లివర్ఊపిరి తిత్తులకు సోకడం గమనించవచ్చు. థైరాయిడ్ లో వాపు మింగలేకపోవడం వాపు ఉంటె ధైరాయిడ్ గ్లాండ్ లో వచ్చిన మార్పుగా గమనించి సత్వరం డాక్టర్ ను సంప్రదించాలి. చికిత్స చేయించుకోవాలి.  

రోజూ మూడు పూటలా తినడం వల్ల ఆరోగ్యానికి లాభమా? నష్టమా?

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే 24 గంటల్లో మూడు సార్లు ఆహారం తీసుకోవాల్సిందేనని  చాలా అధ్యయనాల్లో స్పష్టమైంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం,  రాత్రి భోజనం ఈ మూడూ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంలో  చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిలో ఏ ఒక్కటి తప్పినా ఆరోగ్యానికి పెనుముప్పు సంభవిస్తుందని ఆరోగ్య నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. అసలీ సమస్య ఎప్పుడొస్తుందంటే.. సాధారణంంగా చాలామంది  బరువు తగ్గే ప్రయత్నంలో భాగంగా రోజులో ఏదో ఒక పూట ఆహారాన్ని స్కిప్ చేస్తుంటారు. కానీ   ఇలా చేయడం ద్వారా బరువు తగ్గుతారనడానికి ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టమైంది. దీనికి బదులుగా ఇలా ఆహారం ఎగ్గొట్టడం అనే అలవాటు చాలా సమస్యలను పెంచుతుంది. ఉదయం అల్పాహారం తీసుకోకపోతే, అది  శరీరంలో అనేక వ్యాధుల సమస్యలను పెంచుతుందని  పరిశోధనలు కూడా చెబుతున్నాయి.  ఇలా ఆహారాన్ని స్కిప్ చెయ్యడం వల్ల  గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. భోజనం మానేయడం వల్ల వచ్చే సమస్యలు ఏమిటంటే..  ఏదైనా తిన్న ప్రతిసారీ మీ పిత్తాశయం పైత్యరసాన్ని విడుదల చేస్తుంది, ఇది ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. అయితే ఆహారం తీసుకోకపోయినా పిత్త రసం అదే విధంగా ఉత్పత్తి అవుతుంది. ఆహారం తీసుకోకపోతే ఆ పిత్తరసం పనిచేయకుండా ఉండిపోతుంది. దీనికారణంగా అది  పిత్తాశయంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడం ప్రారంభిస్తుంది. ఈ పరిస్థితి పిత్తాశయంలో గట్టిపడిన కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది, ఇది పిత్తాశయంలో రాళ్లకు దారితీస్తుంది.  తరచుగా రోజులో ఒకపూట ఆహారం తీసుకోవడం మానేస్తే.. ముఖ్యంగా ఉదయం పూట, స్థూలకాయం, అధిక రక్తపోటు, లిపిడ్ ప్రొఫైల్ సమస్యలు, మధుమేహం,  మెటబాలిక్ సిండ్రోమ్ వంటి సమస్యలు మొదలవుతాయి.  గుండె జబ్బుల ప్రమాదం సాధఘారణంకంటే ఎక్కువగా ఉంటుంది.ఇది కార్డియోమెటబోలిక్ ప్రమాదాలకు మూలకారణం అవుతుంది. గుండె జబ్బులను నివారించడానికి,  ఆరోగ్యకరమైన,  పోషకమైన ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవడం అవసరం. ఇప్పటికే డయాబెటిక్ ఉన్నవారు  ఒక పూట  భోజనం స్కిప్ చేయడం మరింత  సమస్యాత్మకంగా మారుతుంది. ఇది ఆహారం తీసుకోవడం,  ఇన్సులిన్ ఉత్పత్తి మధ్య అసమతుల్యతను ప్రోత్సహిస్తుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. ఇన్సులిన్ లేదా బ్లడ్ షుగర్ తగ్గించే మందులపై ఆధారపడిన మధుమేహం ఉన్న చాలా మంది వ్యక్తులకు, రక్తంలో చక్కెర శాతం ఉన్నపళంగా తగ్గడం చాలా ప్రమాదం.                                                                                                         *నిశ్శబ్ద

మెగ్నీషియం లోపాన్ని తరిమికొట్టాలంటే వీటిని తప్పక తినాల్సిందే!

అన్ని పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారానే ఆరోగ్యం దృఢంగా ఉంటుందని వైద్యులు, పోషకాహార నిపుణుల నుండి సాధారణ ప్రజల వరకు అందరికీ తెలుసు. ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, పొటాషియం, మెగ్నీషియం వంటి సూక్ష్మపోషకాలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా ఉంటాయి.  కానీ మనం తరచుగా మన రోజువారీ ఆహారంలో వాటిలో కొన్నింటిని నిర్లక్ష్యం చేస్తాము. అలా నిర్లక్ష్యం చేసేవాటిలో మెగ్నీషియం ఒకటి. ఈ కీలకమైన ఖనిజం గురించి అందరికీ తెలిసింది, దాన్ని రోజువారీ ఆహారంలో తీసుకునేది తక్కువే..  దీని గురించి పూర్తిగా తెలుసుకుంటే. మెగ్నీషియం ఎందుకు ముఖ్యమైనదంటే.. మెగ్నీషియం మన శరీరానికి అవసరమైన ముఖ్య ఖనిజాలలో ఒకటి. ఇది మన ఎముకలలో ఉంటుంది. ఎముకలలో 60-70% భాగాన్ని మెగ్నీషియమే ఏర్పరుస్తుంది. అంతేకాదు మన రోజువారీ పనితీరులో కూడా మెగ్నీషియం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కండరాలు, నరాల పనితీరును నియంత్రించడం, రక్తంలో చక్కెర స్థాయిలు, రక్తపోటు, ప్రోటీన్, ఎముక, DNA తయారీతో సహా శరీరంలోని అనేక ప్రక్రియలకు మెగ్నీషియం ముఖ్యమైనది. సాధారణంగా, పురుషులు కనీసం 400mg, మహిళలు ప్రతిరోజూ కనీసం 310mg మెగ్నీషియం తీసుకోవాలి.  మెగ్నీషియం లోపం వస్తే.. మెగ్నీషియం చాలావరకు శరీరానికి సులువుగానే అందుతుంది. అయినప్పటికీ మెగ్నీషియం లోపం ముఖ్యంగా జీర్ణశయాంతర వ్యాధులు, టైప్-2 మధుమేహం వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారిలో సంభవిస్తుంది. మెగ్నీషియం లోపం ఏర్పడినప్పుడు  ఆకలి లేకపోవడం, వికారం, అలసట, నిద్రలేమి, కండరాల నొప్పులు వంటి లక్షణాలను కనిపిస్తాయి. మెగ్నీషియం అధికంగా ఉన్న ఆహారాలు.. డార్క్ చాక్లెట్ రుచిగా ఉండే డార్క్ లో మెగ్నీషియంతో సహా అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఐరన్, కాపర్, మాంగనీస్ కూడా ఎక్కువగా ఉంటాయి . ఇది గుండెకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఇందులో ఫ్లేవనోల్స్ ఉంటాయి. ఫ్లేవనోల్స్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది LDL (చెడు) కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది, తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. విత్తనాలు.. చియా, అవిసె, గుమ్మడికాయ గింజలు మెగ్నీషియంను అధికంగా కలిగి ఉంటాయి.  ఈ విత్తనాలలో ఐరన్, మోనోసాచురేటెడ్ ఫ్యాట్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. చేపలు.. సాల్మన్, మాకేరెల్, హాలిబట్ చేపలలో  మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.  ఈ చేపలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా చాలా మొత్తం ఉంటాయి. అరటిపండ్లు.. చవగ్గా సులభంగా లభించేవి అరటిపండ్లు. వీటిలో పొటాషియం కంటెంట్ బాగుంటుంది. పొటాషియం గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అలాగే మెగ్నీషియం అధిక మొత్తంలో ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవాలనుకుంటే అరటిపండ్లు తరచుగా తింటూ ఉండాలి. ఆకు కూరలు.. మెగ్నీషియంతో నిండిన ఆకు కూరలు ఖచ్చితంగా ఆహారంలో భాగం ఉండాలి.  ఆవపిండి, పాలకూర,  బచ్చలికూర వంటి వాటిలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. తృణధాన్యాలు వీటిలో మెగ్నీషియం మాత్రమే కాకుండా, డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది, ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుంది, తద్వారా మీ గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ఇతర వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.                                    ◆నిశ్శబ్ద.

స్టార్ ఫ్రూట్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..!

పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు ఇతర దేశాల పండ్లు, ఆహారాలు భారతదేశ ప్రజలకు చాలా నచ్చేస్తాయి. పైపెచ్చు మార్కెటింగ్ వ్యాప్తి కారణంగా విదేశీ పండ్లు కూడా పెద్ద నగరాలలో, కొన్ని నిర్ణీత ప్రాంతాలలో లభిస్తాయి. ఇలాంటి వాటిలో స్టార్ ప్రూట్ కూడా ఒకటి. స్టార్ ప్రూట్ తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటారు. అవేంటో తెలుసుకుంటే.. జీర్ణ ఆరోగ్యానికి..  ఫైబర్ కంటెంట్‌ ఎక్కువగా ఉండటం వల్ల  జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో  స్టార్ ఫ్రూట్ ప్రబావవంతంగా ఉంటుంది. ప్రేగు కదలికలను నియంత్రించడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో,  ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌ను మెయింటైన్ చేయడంలో  ఫైబర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా  ఇందులో  ఉండే సహజ ఎంజైమ్‌లు,  ప్రోటీన్లు  కొవ్వుల జీర్ణక్రియలో సహాయపడతాయి.  పోషకాలు సమర్థవంతంగా గ్రహించడంలోనూ,  జీర్ణ సంబంధ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలోనూ సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు.. స్టార్ ఫ్రూట్ విటమిన్ సి,  ఫ్లేవనాయిడ్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. ఫ్రీరాడికల్స్ అనేవి అస్థిర అణువులు, శరీరంలో కణాల  నష్టాన్ని కలిగిస్తాయి.  క్యాన్సర్స  గుండె జబ్బులతో సహా వివిధ దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి కారణం అవుతాయి.  ఆహారంలో స్టార్ ఫ్రూట్‌ను తీసుకోవడం ద్వారా ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించుకోవచ్చు. అదే విధంగా శరీర రక్షణ వ్యవస్థను బలపరచుకోవచ్చు. రోగనిరోధక శక్తి.. స్టార్ ఫ్రూట్ విటమిన్ సి, విటమిన్ ఎ,  జింక్‌తో సహా రోగనిరోధక శక్తిని పెంచే పోషకాల నిధి. రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో ఈ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి.  అంటువ్యాధులు,  అనారోగ్యాలను మరింత సమర్థవంతంగా నిరోధించడంలో సహాయపడతాయి. స్టార్ ఫ్రూట్  రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల  శరీరంలో  సహజంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  సీజనల్ సమస్యలుగా వచ్చే  జలుబు, ఫ్లూ,  ఇతర అంటు వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యం..  స్టార్ ఫ్రూట్‌లోని పొటాషియం కంటెంట్ గుండె ఆరోగ్యానికి చాలా అవసరం.  పొటాషియం ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది సోడియం స్థాయిలను నియంత్రించడం,  రక్త నాళాల గోడలను సడలించడం ద్వారా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.  ఆహారంలో స్టార్ ఫ్రూట్ వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను చేర్చడం ద్వారా హైపర్‌టెన్షన్, స్ట్రోక్,  ఇతర గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఇంకా స్టార్ ఫ్రూట్‌లో ఫైబర్,  యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం,  ధమనులలో ఫలకం ఏర్పడకుండా చేయడం కూడా వీలవుతుంది. బరువు నిర్వహణ..  బరువును నియంత్రణలో ఉంచడానికి  ప్రయత్నిస్తున్న వారికి స్టార్ ఫ్రూట్ బెస్ట్ ఆప్షన్. తక్కువ కేలరీలు,  అధిక ఫైబర్ కంటెంట్‌తో ఉండటం వల్ల స్టార్ ఫ్రూట్ కడుపు నిండిన ఫీల్ ఇవ్వడంలో సహాయపడుతుంది.   అతిగా తినడాన్ని నియంత్రించి బరువు బ్యాలెన్స్ మెయింటైన్ చేయడంలో  సహాయపడుతుంది. మరొక విషయం ఏమిటంటే ఈ పండులో ఉండే సహజ తీపి చక్కెర కలిగిన స్నాక్స్ తినాలనే  కోరిక కూడా తీరుస్తుంది. ఆహారంలో కేలరీలు తగ్గించాలని అనుకునేవారికి మంచిది.                                             *నిశ్శబ్ద.

పిల్లలు కళ్లజోడు పెడుతున్నారా? ఈ ఫుడ్స్ తింటే అవి అవసరం లేదు..!

కళ్లజోడు ఒకప్పుడు వయసైన పెద్దవాళ్లు వాడే పరికరం. అది కూడా పుస్తకాలు చదువుతున్నప్పుడో,  ఏవైనా తీక్షణంగా చూస్తూ పనులు చేస్తున్నప్పుడో మాత్రమే పెట్టుకునేవారు. కానీ ఈ డిజిటల్ యుగంలో  కంటి సమస్యలు లేనివారంటూ లేరు. చాలాశాతం మంది కళ్లజోడు లేకుండా కనిపించరు. దారుణమైన విషయం ఏమిటంటే చిన్నపిల్లలు కూడా కళ్లజోడుతో దర్శనమిస్తుంటారు.  బూతద్దాల్లాంటి కళ్లజోళ్లు పెట్టుకుని పిల్లలు కనిపిస్తుంటే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. అయితే ఈ సమస్యను ఆహారంతో అధిగమించవచ్చని పోషకాహార నిపుణులు అంటున్నారు.  పిల్లలలో కంటిచూపుకు పదును పెట్టే  ఆహారాలేంటో తెలుసుకుంటే.. క్యారెట్.. కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి క్యారెట్ తీసుకోవడం  చాలా మంచిది. ఇది విటమిన్లు,  యాంటీఆక్సిడెంట్లకు నిధిలాంటిది. అంతే కాకుండా పిల్లల మెదడు ఆరోగ్యానికి కూడా మెరుగుపరుస్తుంది. క్యారెట్లను ఏదో ఒక రూపంలో పిల్లల ఆహారంలో భాగం చేస్తుంటే కొన్నిరోజుల్లోనే కళ్ల జోడు అవసరం లేకుండా పక్కన పెట్టేస్తారు. చిలగడదుంప.. కంటి చూపును మెరుగుపరచడంలో చిలగడదుంప కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఎ,  సి లోపాన్ని భర్తీ చేస్తుంది.  కళ్ళజోడు వాడే పరిస్థితిని చాలావరకు తగ్గిస్తుంది. పచ్చని ఆకు కూరలు.. చిన్న వయస్సులోనే  పిల్లల కళ్లు బలహీనంగా మారితే ఖచ్చితంగా ఆకు కూరలు, బచ్చలికూర, పాలకూర, తోటకూర,  మెంతి ఆకులు  మొదలైన వాటిని ఆహారంలో పెట్టాలి. ఇవి చాలా పోషకాల లోపాన్ని భర్తీ చేస్తాయి. క్యాప్సికమ్.. క్యాప్సికమ్‌ను పిల్లల ఆహారంలో ఏదో ఒక రూపంలో చేర్చాలి. దీన్ని వెజిటేబుల్‌గా చేసి ఇచ్చినా లేదా సలాడ్‌లో కలుపుకుని  తీసుకున్నా ఆరోగ్యమే. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది.                                                   *నిశ్శబ్ద.  

రోజూ 4వేల అడుగులు వాకింగ్ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా?

వాకింగ్ ఆరోగ్యానికి చాలామంచిది. ఎలాంటి ఇతర వ్యాయామ పరికరాలు లేకపోయినా వాకింగ్ ను ఎక్కడైనా, ఎవరైనా చేసేయచ్చు. చాలామంది వాకింగ్ ను బరువు తగ్గడానికి శరీరం ఫిట్ గా ఉండటానికి చేస్తారు. అయితే వాకింగ్ చేయడం వల్ల కేవలం ఇవే కాదు.. మరికొన్ని లాభాలు కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా రోజూ 4వేల అడుగులు వాకింగ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. రోజుకు 4వేల అడుగులు నడవడం వల్ల మెదడుకు రక్తప్రవాహం పెరుగుతుంది. మెదడు కణాలకు పోషణ అందించేందుకు ఆక్సిజన్ సరఫరా బాగుంటుంది. ప్రతిరోజూ 4వేల అడుగులు నడవడం వల్ల అభిజ్ఞా పనితీరు మెరుగవుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అదే విధంగా ఏకాగ్రత మెరుగవుతుంది. జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్నవారు తరచుగా మతిమరుపుకు లోనవుతున్నవారు రోజూ 4వేల అడుగులు నడుస్తూ ఉంటే మెదడు పనితీరు విషయంలో చాలా మార్పులు ఉంటాయి. మెదడు వాల్యూమ్, కనెక్టీవిటీ మెరుగవుతాయి. ఇవి జ్ఞాపకశక్తిని మెరుగుపరచడమే కాకుండా అల్జీమర్స్, చిత్తవైకల్యం వంటి సమస్యల తీవ్రతను, అవిరాకుండా ఉండటంలోనూ సహాయపడుతుంది. సాధారణంగా మెదడు పనితీరు బాలేకుంటే అది మూడ్ మీద ప్రభావం చూపిస్తుంది. కానీ మెదడు పనితీరు బావుంటే మూడ్స్ కూడా సహజంగానే మెరుగ్గా ఉంటాయి. ఒత్తిడి, నిరాశ, ఆందోళ వంటి సమస్యలు తగ్గించడంలో  రోజూ 4వేల అడుగుల నడక  ప్రభావవంతంగా ఉంటుంది. శరీరం ఒక క్రమ పద్దతిలో చలనానికి లోను కావడం వల్ల శరీరానికి కూడా విశ్రాంతి బాగా తీసుకోవడం సాధ్యమవుతుంది. నిద్ర బాగా పడుతుంది. నడక మెదడులో వివిధ ప్రాంతాలను ఏకకాలంలో పనిమీద దృష్టి సారించేలా చేసే మల్టీ టాస్కింగ్ ప్రదేశం. శరీర కదలికలను  గ్రహించడం నుండి శరీరంలో జరిగే కలిగే వివిధ చర్యల వరకు ప్రతి దానికి స్పందిస్తుంది. దీనికి నాడీ కణాలు సహాయపడతాయి. రోజూ 4వేల అడుగులు నడవడం వల్ల నాడీ కణాలు బలోపేతం అవుతాయి.  వీటికి మెదడుతో ఉన్న కనెక్షన్లు మరింత బలపడతాయి. రోజూ 4వేల అడుగులు నడవడం వల్ల శరీరంలో డోపమైన్, సెరోటోనిన్ వంటి న్యూరోకెమికల్స్ ఉత్పత్తిని సులభతరం చేసే హార్మోన్లు మెరుగ్గా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును, ఆలోచనను, సృజనాత్మకంగా ఆలోచించే నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుంది.                                *నిశ్శబ్ద.  

గర్భిణీ స్త్రీలు ఈ ఫుడ్స్ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.!

గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవించే వరకు ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా శీతాకాలంలో గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. దీంతో రకరకాల వ్యాధులు ఎటాక్ చేసే ప్రమాదం ఉంటుంది. గర్బిణీలు ఇమ్యూనిటీ పెంచుకునేందుకు ఈ ఫుడ్స్ తప్పనిసరిగా తినాలని వైద్యులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం. బ్రోకలీ: బ్రోకోలీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రధానంగా ఈ కూరగాయలో విటమిన్ సి, విటమిన్ కె,  పొటాషియం పుష్కలంగా ఉన్నందున, బ్రోకోలీని మీ ఆహారంలో మితంగా చేర్చుకోవడం మంచిది. తృణధాన్యాలు: గర్భిణీల ఆరోగ్యానికి తృణధాన్యాలు చాలా అవసరం. దీనికి ప్రధాన కారణం ఈ పప్పులలో ఫైబర్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. గర్భధారణ సమయంలో మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో వీటి పాత్ర చాలా పెద్దది. నానబెట్టిన డ్రైఫ్రూట్స్: నానబెట్టిన ఎండు గింజల్లో అనేక రకాల పోషకాలు, వివిధ రకాల విటమిన్లు శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఆమ్ల ఫలాలు: నారింజ, మాంగోస్టీన్, కివీస్, స్ట్రాబెర్రీ,  ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.  కాబట్టి అవి గర్భిణీల రోగనిరోధక శక్తిని పెంచడానికి పని చేస్తాయి. అరటిపండు: గర్భిణీలు వైద్యుల సలహాతో  అరటిపండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది. దీనికి ప్రధాన కారణం ఈ పండులో ఉండే పొటాషియం కంటెంట్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. గుమ్మడికాయ గింజలు: గుమ్మడి గింజల్లో ప్రొటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, పొటాషియం, జింక్, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి గర్భిణీలు ఈ విత్తనాలను మితంగా తీసుకోవడం మంచిది. గ్రీన్ టీ: యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే గ్రీన్ టీని గర్భిణీలు రోజుకు ఒకసారి తాగడం మంచిది.  

ఆలివ్స్ ఎప్పుడైనా తిన్నారా? వీటిని తింటే కలిగే లాభాలు ఇవే..!

సలాడ్లు, సీసనింగ్ లో చాలావరకు  ఆలివ్ నూనెను ఉపయోగిస్తారు. దీన్ని లిక్విడ్ గోల్డ్ అని పిలుస్తారు. ఆలివ్ అంత గొప్పదని అర్థం. కేవలం ఆలివ్ నూనె మాత్రమే కాదు.. ఆలివ్స్ తినడం వల్ల బోలెడు ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి. పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల ఆలివ్స్  ఆరోగ్యానికి ఉత్తమమైనవిగా పరిగణించబడతాయి. అయితే  ఆలివ్స్ తింటే కలిగే లాభాలేంటో ఒక్కసారి చూడాల్సిందే.. గుండె ఆరోగ్యం.. ఆలివ్ లో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, ముఖ్యంగా ఒలేయిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఇవి గుండెకు మేలు చేసే ఆరోగ్యకరమైన కొవ్వులు. ఈ కారణంగా ఆలివ్ తీసుకుంటే గుండె  ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. అంతేకాదు ఇవి మంచి కొవ్వులను పెంచడం ద్వారా చెడు కొవ్వులను తగ్గించడంలో సహాయపడతాయి. ఆలివ్ లో ఉండే ఫాలీఫెనాల్స్  శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలు కలిగి ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు.. ఆలివ్స్ లో యాంటీఆక్సిడెంట్ల కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో  విటమిన్ ఇ, హైడ్రాక్సీటైరోసోల్,  ఒలీరోపిన్‌లతో సహా బోలెడు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో కీలకపాత్ర పోషిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలోనూ, ప్రీరాడికల్స్ తో పోరాడటంలోనూ ఈ యాంటీ ఆక్సిడెంట్లు పనిచేస్తాయి. శరీరంలో కణాల ఆరోగ్యాన్ని ఇవి పర్యవేక్షిస్తాయి. పేగు ఆరోగ్యం.. ఆలివ్ లో ఉండే పోషక విలువలు పేగు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. వీటిలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్దకాన్ని నివారించడంలో కూడా సహాయపడతాయి. ఆలివ్ లు ప్రోబయోటిక్ లను కలిగి ఉంటాయి. ఇవి పేగు ఆరోగ్యాన్ని కాపాడే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తాయి. చర్మానికి మంచిది.. ఆలివ్ లు చర్మ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఉండే విటమిన్-ఇ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మంమీద దాడి చేసే ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా రక్షణను  ఇస్తాయి. చర్మాన్ని రిపేర్ చేసి కాంతివంతంగా మారుస్తాయి. చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. బరువు.. బరువు తగ్గడంలో ఆలివ్స్ సహాయపడతాయి. ఆలివ్ లలో ఉండే మోనోఅన్శాచ్యురేటెడ్ కొవ్వులు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ను ఇస్తాయి. అదే విధంగా ఆలివ్స్ లో ఉండే ఫైబర్ కూడా ఆకలిని నియంత్రిస్తుంది.  బరువు తగ్గడానికి ప్రయత్నించే వారు ఆలివ్స్ ను ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.                                      *నిశ్శబ్ద.

ఈ ఐదు పండ్ల రసాలు షుగర్ ఉన్నవారికి పంచదార కంటే డేంజర్..!

డయాబెటిస్‌ను నియంత్రించడానికి చక్కెరను పూర్తిగా తగ్గించాలి. పండ్లలో సహజ చక్కెర కూడా ఉంటుంది, ఇది మధుమేహం రావడానికి చాలా కారణం అవుతుంది. కొన్ని పండ్లలో ఇవి చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి తక్కువ సమయంలో  బ్లడ్ షుగర్ ను రాకెట్‌ వేగంలో పెంచగలవు. నిజానికి డయాబెటిక్ డైట్‌లో సమతుల పరిమాణంలో పండ్లు తినడం ఆరోగ్యకం. కానీ పండ్ల రసంలో ఫైబర్,  ఇతర విటమిన్ల పరిమాణం తగ్గిపోతుంది  ఎక్కువగా చక్కెర మిగిలి ఉంటుంది. అందువల్ల వీటిని తాగడం వల్ల బ్లడ్ షుగర్ పెరుగుతుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండ్ల రసాన్ని అస్సలు తాగకూడదు. అవేంటో తెలుసుకుంటే.. ఆపిల్ పండు రసం యాపిల్ ఒక సూపర్ హెల్తీ ఫ్రూట్ అయితే దాని రసం చక్కెరలో కూడా అంతే ప్రమాదకరం. ఈ పండులో సహజ చక్కెర స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మధుమేహాన్ని మరింత తీవ్రతరం చేసే పిండి పదార్థాలను కూడా అందిస్తుంది. అందుకే యాపిల్ రసాన్ని తీసుకోవడం ప్రమాదం. మామిడికాయ రసం మామిడి పండ్లలో రారాజు అయితే రక్తంలో చక్కెర శాతం పెంచడంలో మామిడిపండ్ల రసం శత్రువులా పనిచేస్తుంది. దీన్ని తాగిన తర్వాత మధుమేహ రోగులు అధిక దాహం, నోరు పొడిబారడం, రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. నారింజ రసం నారింజ అధిక విటమిన్ సి కలిగిన పండు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీన్ని తింటే  అనారోగ్య సమస్యల నుండి సులువుగా బయటపడతారు. కానీ డయాబెటిక్ పేషెంట్లు ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. పైనాపిల్ రసం  ఒక కప్పు  పైనాపిల్ ముక్కలను తీసుకుంటే అందులోని పిండి పదార్థాలు దాదాపు 16 గ్రాములుగా ఉంటాయి. ఇవి రక్తంలో వేగంగా కరిగి గ్లూకోజ్ స్థాయిని పెంచుతాయి. ఇది హైపర్గ్లైసీమియాకు దారి తీస్తుంది, రోగిని వెంటనే ఆసుపత్రికి తరలించాల్సి వస్తుంది. పుచ్చకాయ రసం పుచ్చకాయ తినడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉండి ఎనర్జీని మెయింటెయిన్ చేస్తుంది. కానీ మధుమేహం,  ప్రీ-డయాబెటిస్‌లో దీనిని తీసుకోవడం రిస్క్ తో కూడుకున్నది  భవిష్యత్తులో కిడ్నీ దెబ్బతినవచ్చు.                                          *నిశ్శబ్ద.

సైనస్ సమస్యను దారుణంగా పెంచే నాలుగు కామన్ మిస్టేక్స్ ఇవే..!

సైనస్ ఇన్ఫెక్షన్లు  ఫ్లూ,  జలుబు వంటి అంతర్లీన అనారోగ్యాల ద్వారా తరచుగా వస్తుంటాయి. ఇవి సాధారణంగా ఒక వారం లేదా అంతకుముందే తగ్గిపోయినప్పటికీ కొంతమందికి  సైనస్ సమస్యలు చాలారోజుల పాటూ ఉంటాయి.  ఇలా ఉంటే  దీర్ఘకాలిక సైనసైటిస్ ఉందని అర్థం. ఇలాంటి పరిస్థితి ఉంటే మాత్రం సైనస్ నిపుణుడిని తక్షణమే సంప్రదించడం అత్యవసరం. సైనస్ సమస్య ఉన్నవారిలో ఈ సమస్యను మరింత దారుణంగా మార్చే సాధారణ మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుని వాటికి తగిన చర్యలు తీసుకోవడం వల్ల సైనస్ సమస్య ప్రభావాన్నిచాలా వరకు తగ్గించవచ్చు. సైనస్ ఇన్ఫెక్షన్లను తీవ్రతరం చేసే సాధారణ తప్పులు.. హ్యూమిడిఫైయర్ ఉపయోగించకపోవడం.. గాలి పొడిగా మారినప్పుడు చలి కాలంలో సైనస్ ఇన్ఫెక్షన్లు ఎక్కువ అవుతాయి. శీతాకాలపు చలి,  పొడి పరిస్థితులు చర్మాన్ని ప్రభావితం చేయడమే కాకుండా నాసికా రంధ్రాలు పొడిబారడానికి దారితీస్తుంది.  దీనిని పరిష్కరించడానికి గాలికి తేమను జోడించడం అవసరం. దీనికోసం  హ్యూమిడిఫైయర్ లేదా ఆవిరి పట్టడం వంటివి  చేయాలి.  ఇది  సైనస్‌లు ఎక్కువ పొడిగా,  చికాకుగా మారకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. నాసల్ స్ప్రే ఎక్కువ వినియోగించడం.. చాలామంది మూసుకుపోయిన ముక్కులనుండి ఉపశమనం పొందడానికి నాసల్ స్ప్రేలు ఉపయోగిస్తారు. ఇవి సైనస్ ఇన్ఫెక్షన్ ఒత్తిడి నుండి తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తాయి. ఎక్కువరోజులు అవగాహన లేకుండా తక్షణమే రిలీఫ్ లభిస్తోంది కదా అని వాటిని ఎక్కువ ఉపయోగిస్తే..  ప్రతికూల ప్రభావాలు తప్పవు. ఈ స్ప్రేలలోని ప్రధాన రసాయనం సైనస్ ఇన్ఫెక్షన్‌లను మరింత తీవ్రతరం చేయడానికి దోహదం చేస్తుంది.  సైనస్ ఇన్ఫెక్షన్ ఒక వారం దాటితే దాన్ని తగ్గించుకోవడానికి  ENT నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. నిద్ర లేకపోవడం.. పుష్కలమైన నిద్ర మొత్తం శరీర ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ముఖ్యంగా సైనస్ ఇన్ఫెక్షన్‌తో ఇబ్బంది పడుతున్నప్పుడు కనీసం ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకోవడం వల్ల  రోగనిరోధక వ్యవస్థ ఇన్‌ఫెక్షన్‌కి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో సపోర్ట్  ఇస్తుంది. అంతేకాకుండా పగటిపూట విశ్రాంతి తీసుకోవడం,  శక్తిని ఆదా చేయడం సైనస్ ఇన్ఫెక్షన్ల నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. హైడ్రేటెడ్ గా ఉండకపోవడం.. సైనస్ ఇన్ఫెక్షన్‌తో ఇబ్బంది పడేటప్పుడు  బాగా హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం.  నీటిని ఎక్కువగా  తీసుకోవడం వల్ల శ్లేష్మం ఉత్పత్తికి తోడ్పడుతుంది. శ్లేష్మం సన్నగా, సులభంగా బయటకు వెళ్లేలా చేయడంలో సహాయపడుతుంది. సైనస్ ఇన్ఫెక్షన్ సమయంలో సరైన ఆర్ద్రీకరణ రద్దీని తగ్గించడానికి,  మెరుగైన శ్వాసను సులభతరం చేయడానికి దోహదం చేస్తుంది.                                       *నిశ్శబ్ద.

ప్రోటీన్ పౌడర్లు కాదు.. ఈ డ్రింక్ 15రోజులు తాగితే చాలు.. శరీరం ఉక్కులా మారుతుంది!

ఎప్పుడూ అలసటగా,  బలహీనంగా ఉంటుందా? బద్దకంగానూ,  మోకాళ్లలో నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? వీటిని అధిగమించడానికి  జిమ్ కు వెళ్తున్నా, మార్కెట్‌లో లభించే ఖరీదైన ప్రొటీన్ పౌడర్‌లు తీసుకుంటున్నా అంత ఫిట్ గా అనిపించడం లేదా?   ఈ సమస్యలను గనుక ఎదుర్కొంటున్నట్లయితే, ప్రోటీన్ తీసుకునే విధానాన్ని మార్చుకోవాలి. నిత్యం బలహీనంగా ఉంటే శరీరంలో ప్రాణం ఉండదని, మోకాళ్లలో నొప్పులు వస్తుంటే మంచి ప్రోటీన్ అవసరం అని అర్థం. ఇంట్లోనే ఆరోగ్యకరమైన ప్రొటీన్‌ను ఎలా తయారు చేసుకోవచ్చో,  దాని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుంటే.. ప్రోటీన్ పౌడర్ కు కావలసిన వస్తువులు.. 60 గ్రాముల వేయించిన శనగలు 2 ఖర్జూరాలు. 1 అపటిపండు 1 గ్లాసు పాలు  బెల్లం రుచికి సరిపడా తయారువిధానం.. ముందుగా వేయించిన శనగలను మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇలా తయారుచేసిన పొడిని సత్తు అని అంటారు. ఇది బీహార్ లో ఫేమస్.  ఇందులో   ప్రోటీన్, కాల్షియం,  ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఈ  పొడిలో అరటిపండు, ఖర్జూరం, బెల్లం, పాలు వేసి కలపాలి.  అంతే ఎంతో పోషకరమైన ప్రోటీన్ డ్రింక్ సిద్దమైనట్టే. ప్రయోజనాలు.. ఈ మిశ్రమాన్ని కేవలం 15 రోజుల పాటు తీసుకోవడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు.  బలహీనతతో బాధపడుతున్నవారు దీనిని తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రొటీన్లే కాకుండా శరీర సామర్థ్యం పెరగడానికి  అవసరమైన అన్ని పోషకాలు దీంట్లో లభిస్తాయి. ఈ శక్తివంతమైన ప్రోటీన్ డ్రింక్ లో  కాల్షియం వల్ల  కేవలం 15 రోజుల్లోనే  శరీరంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. జిమ్ కు వెళ్లే అలవాటున్నా,వర్కౌట్లు చేస్తున్నా ఈ డ్రింక్  కు తీసుకుంటూ ఉంటే శరీరం దృడంగా మారుతుంది. ఎముకలు, కండరాలలో బలం పుంజుకుంటుంది. శరీరం ఉక్కులా మారుతుంది.                                                 *నిశ్శబ్ద.  

కడుపులో వికారం నుండి..కండరాల తిమ్మిరి వరకు.. ఇవన్నీ మెగ్నీషియం లోపమేనట..!

మెగ్నీషియం ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది  శారీరంలో వివిధ పనులు చేయడంలో  కీలకమైనది.  చాలావరకు ఇది  గుర్తించబడదు. ఆరోగ్యం బాగుండాలంటే  మెగ్నీషియం లోపం లక్షణాలు  గుర్తించడం చాలా అవసరం. కడుపులో వికారం,  కండరాల తిమ్మిరి నుండి చాలా లక్షణాలు మెగ్నీషియం లోపాన్ని సూచిస్తాయి. అసలు మెగ్నీషియం లోపం గురించి, ఈ లోపముంటే కనిపించే ఇతర లక్షణాల గురించి తెలుసుకుంటే.. కండరాల తిమ్మిరి.. మెగ్నీషియం  కండరాల పనితీరుకు,  కండరాల  సంకోచ వ్యాకోచాలలకు  కీలకమైనది. దీని లోపం వల్ల కనిపించే మొదటి లక్షణం కండరాల తిమ్మిరి. బయటకు వ్యక్తం చెయ్యలేనంత  కండరాల బిగుతు, కండరాలు  మెలితిప్పినట్లు అనిపించడం వంటి సమస్యలు వస్తుంటే మెగ్నీషియం పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. అలసట, బలహీనత.. మెగ్నీషియం శరీరంలో  శక్తి ఉత్పత్తిలో సహాయపడుతుంది.  ఇది  లేకపోవడం వల్ల  అలసట,  బలహీనతకు ఏర్పడతాయి.  తరచుగా నీరసంగా అనిపించడం లేదా రోజువారీ పనులు చేయడం ఇబ్బందిగా  అనిపిస్తే మెగ్నీషియం లోపం ఉందని అర్థం.  హృదయ స్పందన క్రమబద్దంగా లేకపోవడం.. మెగ్నీషియం స్థిరమైన హృదయ స్పందనకు దోహదం చేస్తుంది. దీని లోపం అరిథ్మియా లేదా  హృదయ స్పందనలు అస్తవ్యస్తంగా మారడానికి  దారితీస్తుంది. గుండెదడ లేదా గుండె కొట్టుకోవడంలో అసమానతలు గమనించినట్లయితే ముందుగా ఆరోగ్య  నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. వికారం,  ఆకలి లేకపోవడం.. వికారం,  ఆకలి లేకపోవడం వంటి జీర్ణ సమస్యలు మెగ్నీషియం లోపంతో ముడిపడి ఉండవచ్చు. ఈ ఖనిజం జీర్ణవ్యవస్థ  సరైన పనితీరులో పాల్గొంటుంది.  ఇది లేకపోవడం వల్ల సాధారణ జీర్ణ ప్రక్రియలకు అంతరాయం కలిగిస్తుంది. ఎప్పుడూ  జీర్ణాశయం అసౌకర్యం ఎదురవుతుంటే మెగ్నీషియం లోపం ఉందని అర్థం.  కాల్షియం స్థాయిలు.. మెగ్నీషియం,  కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని,  నరాల పనితీరును సక్రమంగా ఉంచడానికి కలిసి పనిచేస్తాయి. ఇవి లోపిస్తే కండరాల తిమ్మిరి సంకోచ వ్యాకోచాలలో ఇబ్బంది సహా అనేక సమస్యలకు దారితీస్తుంది.                                               *నిశ్శబ్ద.

బోర్లా పడుకునే అలవాటు మీకూ ఉందా? అయితే మీరు ఇది చదవాల్సిందే..!

కంటినిండా నిద్రపోతే చాలు.. అదే ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అని అందరూ అనుకుంటారు. కానీ కేవలం నిద్రపోవడమే కాదు.. ఎలా నిద్రపోతున్నాం అనేది కూడా ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. నిద్రపోయే భంగిమ మనిషి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని అంటారు. సాధారణంగా ఎడమవైపుకు తిరిగి నిద్రపోవడం ఆరోగ్యం అంటారు. ఇలా కాకుండా కుడివైపుకు తిరిగి పడుకోవడం అస్సలు మంచిది కాదని అంటారు. ఇవి రెండూ కాకుండా కొందరికి బోర్లా .. పొట్టను నేలకు ఆన్చి పడుకోవడం అలవాటుగా ఉంటుంది. అయితే ఇలా పొట్టను  కిందుగా ఉంచి నిద్రపోవడం వల్ల భవిష్యత్తులో చాలా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు. అసలు బోర్లా.. పొట్టను కిందకు పెట్టి పడుకోవడం వల్ల కలిగే సమస్యలేంటి? తెలుసుకుంటే..  మానసిక ఆరోగ్యానికి ప్రశాంతమైన నిద్ర చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరి నిద్ర విధానం భిన్నంగా ఉంటుంది. కొంతమంది తమ వీపును నిటారుగా ఉంచి నిద్రించడానికి ఇష్టపడతారు. మరికొందరు ఒక వైపు తిరిగి  నిద్రించడానికి ఇష్టపడతారు. కానీ మరికొందరు పొట్టను కిందకు వేసుకుని నిద్రపోతారు.  ఇలా పడుకోవడం సౌకర్యంగానూ, మంచి నిద్రను ఇచ్చినప్పటికీ భవిష్యత్తులో ఇది  హానికరం. శరీర నొప్పి.. కడుపు కిందకు వేసుకుని  నిద్రపోవడం వల్ల శరీర నొప్పుల సమస్య పెరుగుతుంది. ఇది మొదట్లో సౌకర్యంగా అనిపించినా, భవిష్యత్తులో సమస్యలు రావచ్చు. ఇలా నిద్రపోవడం వల్ల  వెన్నెముకపై ఎక్కువ ఒత్తిడి ఏర్పడుతుంది, దీని కారణంగా  వెన్నునొప్పికి గురవుతారు. ఇది కాకుండా మెడ నొప్పిని కూడా కలిగిస్తుంది. వెన్నెముకకు మంచిది కాదు.. బోర్లా పడుకోవడం  వల్ల వెన్నెముక మీద ఒత్తిడి పెరుగుతుంది.  దీని కారణంగా భవిష్యత్తులో వెన్నెముకకు సంబంధించిన పెద్ద సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ భంగిమలో పడుకోవడం మానుకోవాలి. రొమ్ము నొప్పి.. మహిళల్లో రొమ్ము నొప్పికి తరచుగా బోర్లా  నిద్రపోవడమే కారణం. ఈ భంగిమలో రొమ్ములపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది.   రోజూ ఈ పద్ధతిలో నిద్రపోవడం వల్ల రొమ్ము నొప్పి ఫిర్యాదులు వస్తాయి.  జీర్ణక్రియ తగ్గుతుంది.. బోర్లా  నిద్రపోవడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాదు. ఈ స్థితిలో  జీర్ణక్రియ ప్రక్రియ సరిగ్గా పనిచేయదు. దీని కారణంగా కడుపు నొప్పి  సమస్యలు వస్తాయి. చర్మానికి హానికరం.. బోర్లా  పడుకున్నప్పుడు  ముఖం  దిండుపై ఉంటుంది. దీని కారణంగా దిండులో ఉండే  దుమ్ము, ధూళి,  బ్యాక్టీరియా ముఖానికి తగలడం వల్ల ముఖ చర్మానికి  హాని కలిగుతుంది.  ఇది మొటిమలు , చర్మ సంబంధ సమస్యలకు  కారణమవుతుంది. ఇది మాత్రమే కాకుండా ఇలా నిద్రపోవడం వల్ల  చర్మానికి తగినంత ఆక్సిజన్ అందదు. దాని వల్ల చర్మం మీద తొందరగా ముడతలు వస్తాయి. నిద్రించడానికి మంచి భంగిమ ఏది? నిద్రపోతున్నప్పుడు  మెడ,  వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోండి. మంచి నిద్ర కోసం మెత్తగా తేలికపాటి దిండ్లను ఉపయోగించాలి.   మరీ ముఖ్యంగా  ఎడమ వైపున నిద్రించడం వల్ల శరీరంలో  రక్త ప్రసరణతో ఆరోగ్యకరంగా ఉంటుంది.                                                            *నిశ్శబ్ద.

అధిక కొలెస్ట్రాల్ సమస్యతో  ఇబ్బంది పడుతున్నారా? ఇవి తింటే కంట్రోల్ చేయచ్చు..!

చలికాలంలో గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. సరైన ఆహారం,  శారీరక శ్రమ లేకపోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది.  ఇది ధమనుల పనితీరును దెబ్బతీస్తుంది.  అందువల్ల కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  అయితే అన్ని రకాల కొలెస్ట్రాల్ హానికరం కాదు. సాధారణంగా  కొలెస్ట్రాల్ గుండెకు కూడా మేలు చేస్తుంది, దీనిని  మంచి కొలెస్ట్రాల్ అని పిలుస్తారు . అసలు కొలెస్ట్రాల్ అంటే ఏమిటి?  ఆహారం ద్వారా చెడు కొలెస్ట్రాల్ స్థాయిని ఎలా తగ్గించవచ్చు? తెలుసుకుంటే.. కొలెస్ట్రాల్ ఎందుకు ముఖ్యం? శరీరంలో కణ త్వచం, కణాల బయటి పొరను తయారు చేయడానికి కొలెస్ట్రాల్ అవసరం. ఇది కణంలోనికి,  బయటికి వెళ్లే వాటిని నియంత్రిస్తుంది. అంతే కాకుండా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాలేయం పిత్త రసాన్ని ఉత్పత్తి చేస్తుంది.  ఇది జీర్ణక్రియకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈస్ట్రోజెన్,  టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్లు శరరంలో తయారు కావడానికి కూడా కొలెస్ట్రాల్ అవసరం. ఈ కారణాల వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ చాలా అవసరమవుతుంది. కానీ  శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే మాత్రం అది హానికరంగా పేర్కొంటారు. చెడు కొలెస్ట్రాల్  ఎలా తగ్గించాలి? చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగడానికి అతి పెద్ద కారణం ఆహారం. అనారోగ్యకర ఆహారం తీసుకోవడం వల్ల ప్రమాదకరమైన గుండె సంబంధిత వ్యాధులు సులువుగా వస్తాయి. చెడు కొలెస్ట్రాల్  తగ్గించడానికి ఆహారంలో కొన్ని  మార్పులు చేయడం అవసరం. ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు దీనికి ప్రత్యేకంగా సహాయపడతాయి. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడే ఫైబర్ రిచ్ ఫుడ్ ఐటమ్స్ గురించి  తెలుసుకుంటే.. గింజలు లేదా నట్స్.. బాదం , వాల్‌నట్స్ వంటి నట్స్ గుండెకు చాలా మేలు చేస్తాయి. అసంతృప్త కొవ్వులతో పాటు, కరిగే ఫైబర్ కూడా వీటిలో ఉంటుంది, ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే వీటిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి  మితంగా మాత్రమే తినాలి. వోట్మీల్.. వోట్మీల్‌లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్ల దీన్ని  ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అవకాడో,, కరిగే ఫైబర్‌తో పాటు, అవకాడోలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చాలా సహాయపడతాయి. బెర్రీస్.. బెర్రీస్‌లో ఫైబర్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ముఖ్యమైనవి. ఆపిల్.. యాపిల్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అందువల్ల దీన్ని ఖచ్చితంగా  ఆహారంలో తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.                                      *నిశ్శబ్ద.  

ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగడం మంచిదేనా? అలా చేస్తే  జరుగుతుందో తెలుసా?

ఆహారం ఔషదం అని అంటారు. మనం తీసుకునే ఆహారమే శరీరానికి మూలాధారం. అదే శక్తిని ఇస్తుంది. సాధారణంగా ఆహారం తినేటప్పుడు, తిన్న వెంటనే నీరు తాగడం అనేది చాలామంది అలవాటు. కొందరు ఆహారం తిన్నంత వరకు అస్సలు నీరు తాగరు. కానీ ఆహారం తిన్న తరువాత మాత్రం కనీసం అరలీటరు నీళ్లు వేగంగా తాగేస్తుంటారు.  కానీ ఆహారం తిన్న వెంటనే నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా అనే చర్చ ఇప్పుడు దుమారం లేపుతోంది. దీని గురించి ఆరోగ్య నిపుణులు స్పందించారు. ఆహారం తిన్న వెంటనే నీరు తాగడం ఎంత వరకు కరెక్ట్? అలా నీరు తాగితే జరిగేదేంటి? అనే విషయాల గురించి కూడా స్పష్టత ఇచ్చారు. ఆహారం తినేటప్పుడు నీరు తాగడం అవసరమేనా? ఆహారం తినేటప్పుడు నీరు తాగడం చాలా మంది అలవాటు. ఆహారం తినేటప్పుడే కాదు తిన్న తరువాత కూడా నీరు తాగడం అస్సలు అవసరమే లేదన్నది ఆహార నిపుణులు, వైద్యుల మాట. ఎందుకంటే ఆహారం తినేటప్పుడు దాన్ని బాగా నమిలి తింటే నోట్లో ఊరే లాలాజలంతో కలిసి ఆహారం తగినంత ద్రవంగా మారుతుంది. ఇది నేరుగా జీర్ణాశయానికి వెళ్లి అక్కడ జీర్ణ ఎంజైమ్ లతో కలిసి సులువుగా జీర్ణమవుతుంది. అందుకే ఆహారం తినేటప్పుడు అస్సలు నీరు తాగాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆహారం కారంగా ఉన్నా, ఎక్కువ ఘనపదార్థాలు అయినా దానికి తగినట్టు చాలా కొద్ది మొత్తంలో ఒక అరగ్లాసు లోపు నీరు తాగడం మంచిది. అంతకు మించి నీరు తాగాల్సిన అవసరమే లేదని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఆహారం తిన్నవెంటనే నీరు తాగితే  ఏం జరుగుతుంది?   ఆహారం తిన్న వెంటనే నీరు తాగడం అనేది సరైన పని కాదని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. కొందరు ఆహారం తిన్న వెంటనే సుమారు పావు లీటర్ నుండి అరలీటర్ నీరు  తాగేస్తుంటారు. దీనివల్ల చాలా పెద్ద ఇబ్బందే ఎదువుతుంది.     ఆహారం తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణ ఎంజైమ్ లు పలుచబడిపోతాయి. ఇలా జీర్ణ ఎంజైమ్ లు పలుచబడిపోవడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాదు. జీర్ణక్రియ చాలా నెమ్మదిస్తుంది. ఇది జీర్ణ సంబంధ వ్యాధులు రావడానికి కారణం అవుతుంది.  ముఖ్యంగా అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ సమస్యలు వస్తాయి. మరొక షాకింగ్ విషయం  ఏమిటంటే.. ఆహారం తిన్న వెంటనే ఎక్కువగా నీరు తాగేవారు చాలా తొందరగా ఊబకాయం సమస్యకు గురవుతున్నారు.  అలాగే ఆహారంలో తీసుకున్న పోషకాలు ఏవీ శరీరానికి అంత సులువుగా అందవు.  దీనివల్ల సరైన ఆహారం తీసుకున్నా సరే పోషకాహార లోపానికి గురవుతారు. ఆహారం తిన్న తరువాత ఎన్ని నిమిషాలకు నీరు తాగాలి? ఆహారం జీర్ణం కావడానికి ఎంత సమయం పడుతుంది? ఏదైనా ఆహారం తిన్న తరువాత జీర్ణం కావడానికి 3గంటల సమయం పడుతుంది. అయితే జీర్ణాశయంలోని చిన్న ప్రేగులలో ఈ ఆహారం సుమారు 7గంటల వరకు ఉంటుంది. ఇలా జీర్ణమైన ఆహారం పెద్ద ప్రేగు గుండా ప్రయాణించడానికి 15 గంటల నుండి 28 గంటల వరకు ఉంటుంది.  24 గంటలు గడిచినా మలవిసర్జన జరగకపోతే శరీరంలో చాలా అసౌకర్యంగా అనించడానికి కారణం ఇదే.. ఇకపోతే ఆహారం తిన్న వెంటనే నీరు తాగే అలవాటు ఉంటే దాన్ని మానుకోవడం చాలామంచిది. వీలైనంతవరకు ఆహారం కారం, ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకుంటే నీరు తాగాల్సిన అవసరం అంతగా ఉండదు. అలాగే ఉడికించిన కూరగాయలు బాగా తీసుకుంటే వాటిలో ఉండే నీటి శాతం ఆహారాన్ని జీర్ణం చెయ్యడానికి సహకరిస్తుంది. అదేవిధంగా రసం,  మజ్జిగ వంటివి కూడా జీర్ణాశయంలో ద్రవాల సమతుల్యతను  చేకూరుస్తాయి.  ఆహారం తిన్న తరువాత కనీసం 40నిమిషాల సేపు నీరు తాగకుండా ఉండటం మంచిది. ఆహారం తిన్న తరువాత నీరు తాగాలని అనిపిస్తే  కేవలం ఒకటి రెండు గుక్కల నీరు మాత్రమే తాగవచ్చు. అది కూడా గోరువెచ్చగా ఉండే నీరు తాగడం మంచిది. అదే విధంగా తిన్న వెంటనే నీరు తాగాలని అనిపిస్తే లాలాజలాన్ని బాగా ఉత్పత్తి చేసే కారం, ఉసిరి ముక్క వంటివి తినవచ్చు. తేలికపాటి నడక కూడా మంచిదే.                                         *నిశ్శబ్ద.

ఖాళీ కడుపుతో మునగ ఆకుల నీటిని తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే..!

ములక్కాడల గురించి అందరికీ తెలిసిందే.. అయితే మునగ ఆకుల గురించి, వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిసిన వారు చాలా తక్కువ.  నిజానికి మునగ ఆకు గ్రామాలలో విరివిగా దొరికినా వాడేవారు తక్కువ. కానీ  మునగ ఆకులను నీళ్లలో ఉడికించి ఖాళీ కడుపుతో ఉదయాన్నే తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.  మునగచెట్టును సాధారణంగానే మిరాకిల్ ట్రీ అని అంటారు.  విటమిన్లు, ఖనిజాలు  యాంటీఆక్సిడెంట్లు మునగాకులో పుష్కలంగా ఉంటాయి.   రోగనిరోధక శక్తి.. ఖాళీ కడుపుతో మునగ ఆకుల  నీరు త్రాగడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం అవుతుంది.  మునగ  ఆకులలో విటమిన్ సి  పుష్కలంగా ఉంటుంది. ఇది  రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచుతుంది. విటమిన్ సి ఇన్ఫెక్షన్లు,  వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడే తెల్ల రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. జలుబు, దగ్గు , ఫ్లూ వంటి సాధారణ అనారోగ్యాలను నివారించడంలో మునగాకు  నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం సహాయపడుతుంది. బరువు తగ్గడం.. ఖాళీ కడుపుతో మునగ ఆకుల నీటిని తాగడం వల్ల జీవక్రియను పెంచడం,  ఆకలిని తగ్గించడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.ఇది మిమ్మల్ని ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది, అనారోగ్యకరమైన ఆహారాలను తినాలనే కోరికను తగ్గిస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.. మునగ ఆకుల నీరు  మలబద్ధకం, ఉబ్బరం,  గ్యాస్ వంటి  జీర్ణ సమస్యలను తగ్గించడంలో  సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో మొరింగ నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థను చురుగ్గా ఉంటుంది. మలబద్ధకాన్ని తగ్గించడానికి,  ప్రేగు కదలికలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. శరీరాన్ని డిటాక్సి చేస్తుంది.. ఖాళీ కడుపుతో మునగ ఆకుల  నీటిని తాగడం వల్ల శరీరాన్ని శుద్ది చేసి హానికరమైన టాక్సిన్‌లను బయటకు పంపుతుంది. మునగ ఆకులలో డిటాక్సిఫైయింగ్ లక్షణాలు కలిగిన సమ్మేళనాలు ఉంటాయి. తద్వారా ఇది సాధ్యమవుతుంది.  ఎనర్జీ..  రోజు ఉదయాన్నే  ఒక గ్లాసు మునగ ఆకుల  నీటిని తాగుతూ ఉంటే  రోజంతా  అవసరమైన శక్తిని  పొందవచ్చు. మునగ ఆకులలో   ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది  కణాలు,  కణజాలాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడానికి అవసరం. ఐరన్  లోపం ఉంటే  అలసట,  నీరసానికి  దారితీస్తుంది,  రోజువారీ పనులను చేయడం కష్టతరం చేస్తుంది. మునగ ఆకుల  నీటిని ఎలా తయారుచేసుకోవాలి అంటే.. 1 కప్పు నీరు 1 టీస్పూన్ ఎండిన మునగ ఆకులు లేదా పొడి  ఒక సాస్పాన్లో ఒక కప్పు నీటిని మరిగించండి.  వేడినీటిలో ఒక టీస్పూన్ ఎండిన మునగ  ఆకులు లేదా  అరస్పూన్ పొడిని కలపండి.     ఇది 5-7 నిమిషాలు ఉడకనివ్వండి.   తరువాత ఈ మిశ్రమాన్ని వడకట్టండి.  మునగ ఆకుల  నీటిని వేడిగా తాగవచ్చు లేదా కాస్త  చల్లగా అయ్యాక కూడా తీసుకోవచ్చు. రుచిని మెరుగుపరచడానికి నిమ్మకాయ లేదా  తేనెను కూడా జోడించవచ్చు.                                      *నిశ్శబ్ద.

30ఏళ్ల తరువాత ప్రతి ఒక్కరూ తప్పక తినాల్సిన ఆహారాలు ఇవే..!

శరీరం ఆరోగ్యంగా ఉండటంలో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే ఆహారం విషయంలో చాలా శ్రద్ద అవసరం. అయితే వయసు పెరిగే కొద్దీ శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి.  యవ్వనంలోకి అడుగు పెట్టిన తరువాత ఇక 30ఏళ్లు దాటగానే శరీరంలో శక్తి స్థాయిలు క్రమంగా తగ్గిపోతూ వస్తాయి. మరీ ముఖ్యంగా అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, థైరాయిడ్, మధుమేహం వంటి సమస్యలు 30ఏళ్ల తరువాత  శరీరంలో మెల్లిగా డవలప్ అవుతాయి. ఇవేవీ రాకూడదు అంటే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. మరీ ముఖ్యంగా పెళ్లి, పిల్లలు, ఉద్యోగ బాధ్యతలు,  శారరీక మార్పులు కూడా దీనికి దోహదం చేస్తాయి. అందుకే 30ఏళ్ల తరువాత ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహారాల గురించి తెలుసుకుని వాటిని తీసుకోవడం ఎంతో ముఖ్యం. కాల్షియం.. శరీరం,  ఎముకల పటిష్టతకు కాల్షియం అత్యంత ముఖ్యమైన పోషకం. 30ఏళ్ల తరువాత  కాల్షియం అధికంగా ఉండే వాటిని తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది ఎముకల బలహీనతకు కారణమయ్యే బోలు ఎముకల వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది. ఇందుకోసం పాల ఉత్పత్తులు, ఆకు కూరలు,  బలవర్ధకమైన ఆహారాలు ఆహారంలో చేర్చుకోవాలి. విటమిన్-డి.. శరీరం,  ఎముకల పటిష్టతకు కాల్షియం ఎంత అవసరమో, అదే విధంగా విటమిన్ డి కూడా అవసరం. ఇది  కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది.  విటమిన్-డి కోసం లేత ఎండలో గడపచ్చు, కొవ్వు చేపలు, బలవర్థకమైన పాల ఉత్పత్తులు, పుట్టగొడుగులు  మొదలైనవి తినవచ్చు. మెగ్నీషియం.. మెగ్నీషియం గురించి చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. కండరాల పనితీరుకు, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి,  ఎముకలను దృఢంగా ఉంచడానికి చాలా ముఖ్యమైనది. దీని కోసం  గింజలు, తృణధాన్యాలు,  ఆకు కూరలు తినవచ్చు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్.. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి,  మెదడు పనితీరును ప్రోత్సహించడానికి అవసరమైన పోషకాలు. అంతే కాకుండా శరీరంలో వాపులను తగ్గించి మెదడు శక్తిని పెంచేలా పనిచేస్తుంది. దీని కోసం అవిసె గింజలు, సాల్మన్ చేపలు,  వాల్‌నట్స్ వంటి వాటిని తీసుకోవడం పెంచవచ్చు. విటమిన్-బి12 నాడీ వ్యవస్థను మెరుగుపరచడానికి,  ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి ఈ పోషకం అవసరం. ఇది కండరాలు,  ఎముకలకు బలాన్ని అందించడానికి పనిచేస్తుంది. దీని కోసం  మాంసం, చేపలు, గుడ్లు,  బలవర్థకమైన ఆహారాలు తినవచ్చు. పొటాషియం.. 30ఏళ్ల తరువాత  రక్తపోటు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.  రక్తపోటును నియంత్రించడం ద్వారా  గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం అరటిపండు, బత్తాయి, బచ్చలికూర, బీన్స్ వంటి వాటిని తీసుకోవాలి. ఫైబర్, ప్రోటీన్.. సరైన జీర్ణక్రియను నిర్వహించడానికి,  ఉదర సంబంధ సమస్యలను నివారించడానికి,  రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి ఫైబర్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది కాకుండా బరువును నియంత్రించడంలో కూడా ఇది సహాయపడుతుంది. దీని కోసం ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు,  బీన్స్ మొదలైనవాటిని చేర్చుకోవచ్చు. అదేవిధంగా, శరీర అభివృద్ధికి ప్రోటీన్ చాలా అవసరం.                                             *నిశ్శబ్ద.  

అసలు నరాల సమస్యలు ఎందుకు వస్తాయ్..  రాకూడదంటే ఏం చేయాలి?

ప్రస్తుతకాలంలో చాలామందిలో న్యూరోపతి సమస్య కనిపిస్తోంది. శరీరంలోని నరాలు బలహీనంగా మారడం, శరీరంలో పట్టు తగ్గడం, కాళ్లూ చేతులు మొదలైన ప్రాంతాలలో చీమలు పాకినట్టు అనుభూతి కలగడం, చేతులు వనకడం ఇలా చాలా లక్షణాలు న్యూరోపతి సమస్యలో కనిపిస్తాయి. ఈ న్యూరోపతి సమస్యను మొదట్లోనే గుర్తించి దాన్ని పరిష్కరించడం ఎంతో అవసరం. లేకపోతే ఇది మొత్తం శరీరం మీద చాలా దారుణమైన ప్రభావం చూపిస్తుంది. అయితే అసలు ఈ న్యూరోపతి సమస్య ఎందుకు వస్తుంది? ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? న్యూరోపతి ఎందుకు వస్తుంది? శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉత్పత్తి అయితే అది న్యూరోపతి సమస్యకు దారితీస్తుంది. జంక్ ఫుడ్,  నూడిల్స్, బర్గర్లు, పిజ్జా, బేకింగ్ ఆహారాలు, చక్కెర అధకంగా ఉన్న ఆహారాలు తింటుంటే న్యూరోపతి సమస్య వచ్చే  అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆహారం తిన్న ప్రతిసారి లేదా అనారోగ్యం చేసినప్పుడు, శరీరంలో నొప్పులు, వాపులు వంటివి సంభవించినప్పుడు శరీరంలో ఫ్రీరాడికల్స్  తయారవుతాయి. ఇవి శరీరానికి హాని కలిగిస్తాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఆహారం తిన్న తరువాత శరీరంలో రెండు రకాల అణువులు ఏర్పడతాయి. వాటిలో ఒకటి  ఫ్రీరాడికల్స్ కాగా.. రెండవది యాంటీ ఆక్సిడెంట్లు. కానీ ఆహారం తిన్న తరువాత ఫ్రీరాడికల్స్ ఎక్కువగా ఏర్పడినా,  అవి యాంటీఆక్సిడెంట్లను కూడా డామినేట్ చేసినా ఫ్రీరాడికల్స్ ప్రభావం శరీరం మీద ఎక్కువ ఉంటుంది.  సాధారంగా వచ్చే దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సమస్యలు ఈ ఫ్రీ రాడికల్స్ వల్లే వస్తాయి. ఆహారం విషయంలో మార్పులు చేసుకోకపోతే ఇది క్రమంగా న్యూరోపతి సమస్యకు దారితీస్తుంది. న్యూరోపతి సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే.. న్యూరోపతీ సమస్య రాకుండా ఉండాలంటే  ప్రతి రోజూ కనీసం 1 గంట శారరీక శ్రమ అవసరం. ఇందులో చురుకైన నడక, యోగా, వ్యాయామం, ఇతర పనులు కూడా ఉండవచ్చు. వీటి వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్ల కంటే శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువ ఉండటం వల్ల నరాల సమస్య వస్తుంది కాబట్టి దీన్ని అరికట్టడానికి  యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, ఆకుపచ్చ ఆకుకూరలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఇతర ఆహారాలు తీసుకోవాలి.  సాధారణంగా న్యూరోపతి సమస్య ఉందని అనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వీలైంత తొందరగా న్యూరోపతీ వైద్యుడిని కలవడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.                                               *నిశ్శబ్ద.  

పాషన్ ఫ్రూట్ గురించి విన్నారా? దీంతో కలిగే లాభాలేంటంటే..!

పండ్లలో చాలా రకాలు ఉన్నాయి. అయితే తెలుగు ప్రజలకు కాస్త పరిచయం తక్కువ ఉన్న పండ్లలో పాషన్ ఫ్రూట్ కూడా ఒకటి. ఈ పాషన్ ఫ్రూట్ లోపల గుజ్జు, గింజలతో కూడి ఉంటుంది. దీని తొక్క మాత్రం గట్టిగా  చూడటానికి ఏ మారేడు కాయో అనిపించేలా ఉంటుంది. ఊదా రంగులోనూ, పసుపు రంగులోనూ పాషన్ ఫ్రూట్ లు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. దీని గుజ్జుతో వివిధ రకాల పానీయాలు తయారుచేస్తారు. రోగనిరోధక శక్తికి పాషన్ ప్రూట్ పెట్టింది పేరు. ఈ పండులో అవసరమైన విటమిన్లు,  ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.  ముఖ్యంగా ఇందులో ఉండే  విటమిన్ సి  రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  ఆరోగ్యకరమైన చర్మానికి సహాకరిస్తుంది. పాషన్ ఫ్రూట్ లో పెద్ద మొత్తంలో విటమిన్ ఎ, కాల్షియం, పొటాషియం,  మెగ్నీషియం కూడా ఉంటాయి.  ఫైబర్,  యాంటీఆక్సిడెంట్లు కూడా  సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్య ప్రయోజనాలు.. దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తుంది.. విటమిన్ సి,  పాలీఫెనాల్స్‌తో సహా పాషన్ ఫ్రూట్‌లోని అధిక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి  ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడటానికి,  దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్.. పాషన్ ఫ్రూట్ లో  తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ ఉంటాయి.  ఇవి  రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచవు,  మధుమేహం ఉన్నవారికి  మంచివి. పాషన్ ఫ్రూట్‌లో ఆస్కార్బిక్ యాసిడ్  ఉంటుంది.  రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచడంలో ఆస్కార్బిక్ ఆమ్లం సహాయపడుతుంది. బరువు నిర్వహణ.. ఈ పండులో ఉండే  పీచు పదార్ధం  ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. తద్వారా పదే పదే తినడాన్ని నియంత్రిస్తుంది. ఇందులో ఉండే  ఫైబర్ మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.   ప్రేగు కదలికలను  చురుగ్గా ఉంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. విటమిన్ సి,  శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, ఇన్ఫెక్షన్‌తో పోరాడడంలో,  రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ప్యాషన్ ఫ్రూట్ పీల్స్ వల్ల రోగనిరోధక వ్యవస్థ ప్రభావవంతంగా  ఉంటుంది.  గుండె ఆరోగ్యం..  ప్యాషన్ ఫ్రూట్‌లోని పొటాషియం కంటెంట్ రక్తపోటును  నియంత్రించడంలో సహాయపడుతుంది.  ఇందులోని ఫైబర్,  యాంటీఆక్సిడెంట్లు ధమనులలో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడతాయి.  గట్ మైక్రోబయోమ్.. ఒక చిన్న పాషన్ ఫ్రూట్ లో ఉండే   ఫైబర్ ప్రీబయోటిక్‌గా పనిచేస్తుంది.  ఇది  మైక్రోబయోమ్‌ను మంచి బ్యాక్టీరియాతో ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.                                  *నిశ్శబ్ద.