నోటిపూత ఇబ్బంది పెడుతుందా? ఈ హోం రెమెడీస్ తో చెక్ పెట్టండి..!!

నోటిలో చిన్న పుండు ఉంటే నొప్పి మాత్రమే కాదు. తినడం, తాగడం కష్టంగా ఉంటుంది. తీవ్రమైన నొప్పిని ఎదుర్కొవల్సి వస్తుంది. నాలుక కూడా పదేపదే పొక్కుతుంది.  మీరు కూడా ఇటువంటి అల్సర్ల వల్ల ఇబ్బంది పడుతుంటే..వాటిని త్వరగా వదిలించుకోవాలనుకుంటే, మీరు ఈ ఇంటి నివారణలను అనుసరించవచ్చు. ఈ 5 రెమెడీస్ పాటిస్తే ఒక్క రాత్రిలో నోటిపూత మాయమవుతుంది. వీటి నుంచి ఉపశమనం పొందేందుకు గృహవైద్యాలను తెలుసుకుందాం... కొబ్బరి నూనె: నోటి లోపల నాలుక, చిగుళ్ళు, పెదవులు లేదా బుగ్గల లోపలి భాగంలో బొబ్బలు ఏర్పడతాయి. నొప్పి కారణంగా తినడం, త్రాగడం కష్టంగా మారినట్లయితే, కొబ్బరి నూనె వాటి నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీని కోసం, కొబ్బరి నూనెను కొద్దిగా వేడి చేయండి. ఇప్పుడు ఈ నూనెను కాటన్ లేదా వేలి సహాయంతో పొక్కులపై రాయండి. ఉదయం లేవగానే పొక్కుల నుంచి చాలా వరకు ఉపశమనం కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల పొక్కులు త్వరగా మాయమవుతాయి. లిక్కోరైస్: ఆయుర్వేదంలోని అత్యుత్తమ, ప్రభావవంతమైన మందులలో లిక్కోరైస్ ఒకటి. నోటిపూతలకు కూడా ఇది చాలా మేలు చేస్తుంది. దీని కోసం, లైకోరైస్‌లో తేనె కలిపి పేస్ట్‌ను సిద్ధం చేయండి. దీని తరువాత, వేలు సహాయంతో పూతల మీద రాయండి. పగలు, రాత్రి పూట పూయడం వల్ల నోటిపూత నుండి ఉపశమనం లభిస్తుంది.   పటిక, గ్లిజరిన్: పటిక, గ్లిజరిన్  నోటి అల్సర్లకు కూడా దివ్యౌషధం. దీని కోసం 3 టీస్పూన్ల పటిక పొడిని తీసుకోండి. ఇందులో 3 చుక్కల గ్లిజరిన్ వేయాలి. ఇప్పుడు దాని పేస్ట్‌ను సిద్ధం చేసి, కాటన్ సహాయంతో అల్సర్‌లపై అప్లై చేయండి. ఇలా చేయగానే నోటి నుంచి లాలాజలం రావడం ప్రారంభమవుతుంది. కొంత సమయం తరువాత, ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల నోటిపూత నయమవుతుంది. అలోవెరా ఆమ్లా:  ఆమ్లా,కలబంద రెండూ ఔషధ గుణాలతో నిండి ఉన్నాయి. వీటిలో ఉండే పోషకాలు ఆరోగ్యంతో పాటు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. కలబంద, ఉసిరికాయలను పేస్ట్‌గా చేసి అల్సర్‌లపై రాస్తే ఉపశమనం లభిస్తుంది. రాత్రిపూట నోటిపూతపై దాని పేస్ట్‌ను పూసిన తర్వాత ఏమీ తినవద్దు. ఉదయం నిద్రలేచిన వెంటనే కడిగేయండి. దీంతో పొక్కులు నయమవుతాయి. ఒక చిన్న లవంగం నోటి అల్సర్లను తొలగించడంలో కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దీని కోసం, వేడి పాన్లో 5 లవంగాలను వేయించాలి. ఇప్పుడు ఈ లవంగాలను కాటన్ క్లాత్‌లో కట్టి సున్నితంగా అల్సర్‌లపై అప్లై చేయండి. దీని తర్వాత లవంగం నూనెను అల్సర్ల మీద రాసి రాత్రి నిద్రించాలి. ఆ తర్వాత ఏమీ తినకూడదు. మీరు ఉదయం నిద్ర లేవగానే పొక్కులు మాయమైనట్లు కనిపిస్తాయి.   

ఈ ఆహారాలు పొరపాటున కూడా పచ్చిగా తినకూడదట.. ఇంతకీ ఇవేంటంటే..

ఆహారమే ఆరోగ్యం అన్నారు పెద్దలు. కానీ ఆహారం విషం కూడా అవుతుంది కొన్నిసార్లు.  దీన్నే ఫుడ్ పాయిజనింగ్ అంటూ ఉంటాం. తిన్న ఆహారం శరీరానికి మంచి చేయకపోగా చెడు చేసే అవకాశం ఎక్కువగా ఉంటే మాత్రం అది చాలా ప్రమాదం.  అలాంటి ఆహారాలను పచ్చిగా తీసుకోకపోవడం మంచిది. విచిత్రం ఏమిటంటే రోజువారీ తీసుకునే ఆహారంలో చాలా మంచిది అనే కారణంతో చాలామంది తీసుకునే ఆహారాలే చెడు చేస్తాయని తేలింది. అలాంటి ఆహారాలు ఏమిటో తెలుసుకుంటే జాగ్రత్త పడవచ్చు. పాలు.. పాలు చాలా గొప్ప పోషక పదార్థం. చిన్నపిల్లల నుండి వృద్దుల వరకు ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ పాలు తీసుకోవాలని, తద్వారా శరీరానికి తగిన కాల్షియం అందుతుందని చెబుతారు.  అయితే పాలను కాచకుండా పచ్చివి తాగడం చాలా ప్రమాదం.  పాలలో ప్రమాకరమైన జెర్మ్స్ ఉండే అవకాశం ఉంది. ఇది చాలా అనారోగ్యానికి గురిచేస్తుంది.  అందుకే పాలను ఎల్లప్పుడూ బాగా మరిగించిన తరువాతే తాగాలి. మొలకలు.. మొలకలు చాలా గొప్ప ఆహారం. ఇందులో ఉన్నన్ని పోషకాలు మాంసాహారంలో కూడా లభించని అంటారు. కానీ మొలకలను సరైన విధంగా మొలకెత్తించడం, జాగ్రత్త చేయడం చేయకపోతే అవి మంచి కంటే చెడు ఎక్కువ చేస్తాయి. మొలకల్లో ఇ-కోలి, సాల్మోనెల్లా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఫుడ్ పాయిజన్, అతిసారం వంటి సమస్యలకు కారణం అవుతుంది. గుడ్లు..   పచ్చి గుడ్లను అప్పటికప్పుడు పగలకొట్టి గుటాగుటా తాగడం కొందరికి అలవాటు. అయితే గుడ్లను తినడానికి ముందు ఉడికించాలి.  పచ్చిగుడ్లలో కూడా ప్రమాదకరమైన బ్యాక్టిరీయా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అన్నం.. అన్నాన్ని మళ్లీ ఉడికించడం ఏంటనే డౌట్ చాలా మందికి వస్తుంది. కానీ ఇక్కడ విషయం అది కాదు. సరిగ్గా ఉడికీ ఉడకని అన్నాన్ని తీసుకుంటే అది ఫుడ్ పాయిజనింగ్ కు కారణమవుతుంది.  సరిగ్గా ఉడకని అన్నంలో బాసిల్లన్ అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా అభివృద్ది చెందుతుంది. ఇది శరీరంలో చాలా వేగంగా టాక్సిన్లను ఉత్పత్తి చేస్తుంది. గుల్లలు.. సముద్రపు ఆహారాలైన గుల్లలు చాలా మంది తింటారు.  అయితే వీటిని పచ్చిగా తినడం వల్ల హానికరమైన వైరస్ల బారిన పడే అవకాశం ఉంది.  అందుకే వీటిని పూర్తీగా ఉడికించిన తరువాత మాత్రమే తీసుకోవాలి. చేపలు.. చేపలు, పీతలు వంటి సముద్రపు ఆహారాలు కూడా పచ్చిగా తినడం ఎంతమాత్రం మంచిది కాదు. వీటిని సరిగ్గా ఉడికించకుండా తింటే ప్రమాదకమైన ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి. కాబట్టి వీటిని బాగా ఉడికించిన తరువాత మాత్రమే తీసుకోవాలి. మాంసం.. ప్రస్తుతం చాలామంది మాంసాహారులుగా రూపాంతరం చెందారు. సరిగా ఉడకని మాంసం తినడం వల్ల సాల్మోనెల్లా, ఇ కోలి, క్యాంపిలోబాక్టర్ వంటి సూక్ష్మక్రిములు  శరీరంలో చేరతాయి. ఇవి తీవ్ర అనారోగ్యానికి కారణం అవుతాయి.                                                                *నిశ్శబ్ద

కరోనా కంటే నిఫా వైరస్ డేంజరా? అసలు ఈ వైరస్ ఎలా వస్తుందంటే..

అంటువ్యాధులు ఎప్పుడూ ప్రాణ నష్టాన్ని అధికంగా కలిగిస్తాయి. ప్రస్తుతం భారతదేశంలో కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ విజృంభిస్తోంది.  విషాదకర విషయం ఏమిటంటే కరోనాతో పోలిస్తే నిఫా వైరస్ తీవ్రమైన ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది.  ప్రమాదాలను కూడా అదే స్థాయిలో పెంచుతుంది. ఇది కేవలం కేరళ రాష్ట్రంలోనే విజృంబిస్తున్నా పలు నగరాలలో ఈ వైరస్ వ్యాప్తి గురించి హెచ్చరికలు జారీ చేశారు. ఇది అంటువ్యాధి కావడంతో    దేశం మొత్తం మీద ఈ వైరస్ కారణంగా ప్రజలు ప్రభావితం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.  ఈ వైరస్ లక్షణాలు, నివారణ చర్యల గురించి తెలుసుకుని జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. నిఫా వైరస్ లక్షణాలు.. నిఫా వైరస్ విషయంలో దేశం మొత్తం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ వైరస్ సోకిన వారిలో  ఫ్లూ లక్షణాలు ఉంటాయి. ఇది ముఖ్యంగా ఊపిరితిత్తులు, మెదడుపై దాడి చేస్తుంది. దగ్గు, గొంతునొప్పి, శ్వాస చాలా వేగంగా తీసుకోవడం, జ్వరం ఉంటాయి.  వికారం, వాంతులు వంటి జీర్ణాశయ సమస్యలు కూడా  ఉంటాయి. ఈ వ్యాధి తీవ్రరూపం దాలిస్తే అది మెదడువాపు వ్యాధికి దారి తీయవచ్చు. ఈ సందర్భంలో కోమా లేదా మరణం సంభవించే అవకాశం ఉంటుంది. నిఫా వైరస్ ద్వారా ప్రమాదం పిల్లల నుండి వృద్దుల వరకు ఎవరికైనా పొంచి ఉంది. వ్యాధి సోకినవారి నుండి లేదా జంతువుల నుండి ఈ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.  రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారిలో నిఫా వైరస్ చాలా ప్రభావం చూపిస్తుంది. సాధారణ  వ్యక్తుల కంటే రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి ప్రాణాపాయం పొంచి ఉంది.  వీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సంరక్షణా చర్యలు.. నిఫా వైరస్ విషయంలో అందరినీ ఆందోళన పరుస్తున్న విషయం ఏమిటంటే ఈ ఇన్ఫెక్షన్ ను నివారించడానికి  ఎలాంటి టీకా అందుబాటులో లేదు. వైరస్ సోకిన తరువాత వ్యక్తులకు చికిత్స చేయడానికి నిర్థిష్ట ఔషదం కూడా లేదు. అందుకే నిపుణులు ప్రజలను సురక్షితంగా ఉండాల్సిందిగా సూచిస్తున్నారు. నివారణ చర్యలను పాటించడం, చేతుల పరిశుభ్రత, వీధులలో విహరించే జంతువులకు దూరంగా ఉండటం,  బయటి ఆహారాలను అవాయిడ్ చేయడం. ఆరోగ్యకరమైన, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకోవడం వంటివి పాటించాలి.  ఇక ఈ వైరస్ ఉన్న ప్రాంతాలలో నివసించే వారు మరింత జాగ్రత్త తీసుకోవాలి.                                                  *నిశ్శబ్ద.

బాదం పప్పు తింటే గుండెకు ఎంతో మేలట!

ఆధునిక జీవనశైలి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం సమస్య పెరుగుతోంది. ఇదిలావుండగా, బాదం వినియోగం బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా కార్డియో మెటబాలిక్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ అధ్యయనం ఒబేసిటీ జర్నల్‌లో ప్రచురించబడింది. ప్రపంచవ్యాప్తంగా 1.9 బిలియన్ల మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధ్యయనం ఏం చెబుతోంది? ఆస్ట్రేలియాలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు. ప్రతిరోజూ బాదం తింటే బరువు తగ్గుతారని సౌత్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం నుండి ఇటీవలి పరిశోధన పేర్కొంది. వెయిట్ కంట్రోల్,  కార్డియోమెటబాలిక్ హెల్త్ రెండింటిలోనూ నట్స్ ఎలా ప్రభావవంతంగా ఉంటాయో ఈ అధ్యయనంలో తేలిందని సౌత్ ఆస్ట్రేలియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకురాలు డాక్టర్ షరయా కార్టర్ తెలిపారు. బాదంపప్పులో అధిక మొత్తంలో ప్రొటీన్లు, ఫైబర్ ఉంటాయి. వాటిలో విటమిన్లు, ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. బాదంపప్పులో అధిక మొత్తంలో కొవ్వు ఉన్నందున, ప్రజలు వాటిని బరువు పెరుగుతారని భావిస్తారు. అయితే ఇందులో ఉండే కొవ్వు ఆరోగ్యకరం కాదు. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. మంటను తగ్గించడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. పరిశోధనా సమయంలో బాదం పప్పుతో  తక్కువ కొవ్వు ఆహారాలను పోల్చి చూసినప్పుడు, ఈ రెండూ శరీర బరువును దాదాపు 9.3 శాతం తగ్గించడంలో సహాయపడ్డాయని పరిశోధనా బృందం తెలిపింది. అయితే బాదంపప్పు గుండెకు మేలు చేస్తుందని తేలింది. బాదం యొక్క ఇతర ప్రయోజనాలు- -పొడి చర్మాన్ని మృదువుగా చేయడంలో బాదం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. -ప్రొటీన్లు అధికంగా ఉండే బాదం మెదడు కణాలను రిపేర్ చేయడంలో సహాయపడుతుంది. -బాదంలో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉంటుంది, ఇది మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. -రోజూ బాదంపప్పు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. -బాదం మీ కళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో మంచి మొత్తంలో విటమిన్ ఇ ఉంటుంది.

రోజూ కామన్ గా తీసుకునే ఈ 6 ఆహారాలతో ఎంత డేంజరో తెలుసా..

ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ఆరోగ్యకరమైన,  అందమైన చర్మం కావాలని కోరుకుంటాడు.  చర్మాన్ని యవ్వనంగా ఉంచుకోవడానికి తినే,  త్రాగే  ఆహారాలు, పానీయాలపై  శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.  రోజూ తినే కొన్ని ఆహారాలు చర్మాన్ని ఆరోగ్యంగా,  అందంగా మార్చడంలో సహాయపడతాయి.  వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేసే కొన్ని ఆహారాలు  ముఖంపై అకాల ముడతలు,  గీతలను కలిగిస్తాయి. చర్మ సంబంధిత సమస్యలను సృష్టిస్తాయి.  అందరూ ఆరోగ్యకరం అనుకుంటూ తీసుకునే ఎన్నో ఆహారాలు, పానీయాలు నిజానికి ఆరోగ్యం చేకూర్చకపోగా నష్టం కలిగించడంలో ముఖ్యంగా చిన్నవయసులోనే వృద్దులుగా కనిపించేలా చేస్తున్నాయి.   ఈ ఆహారాలు  గ్లైకేషన్‌ను పెంచి  కొల్లాజెన్‌ ను దెబ్బతీస్తున్నాయి. ఇది చర్మం సాగే గుణాన్ని తగ్గిస్తుంది.  ఇంతకూ ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. శుద్ధి చేసిన విత్తనాల నూనె.. సోయాబీన్, మొక్కజొన్న,  పొద్దుతిరుగుడు వంటి అనేక విత్తన నూనెలలో మంచి మొత్తంలో ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.  కానీ శుద్ది చేసిన నూనెలలో ఒమేగా-3 ఉండదు. పెద్ద ఎత్తున శుద్ది చేయడం వల్ల  ఒమేగా -6 కొవ్వు  ఏర్పడుతుంది. ఇది  అధికంగా  వినియోగించడం వల్ల  శరీరంలో వాపు,  మంట,  చర్మంలో ఎరుపు, చికాకు,  మొటిమలు,  సోరియాసిస్ వంటి సమస్యలను కలిగిస్తుంది. శుద్ధి చేసిన చక్కెర,  కార్బోహైడ్రేట్లు.. శుద్ధి చేసిన చక్కెర,  వైట్ బ్రెడ్ , స్వీట్లు వంటి అధిక గ్లైసెమిక్ ఆహారాలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు, ఇవి  హార్మోన్లు,  నాడీ వ్యవస్థకు అంతరాయం కలిగిస్తాయి. గ్లూటెన్.. గ్లూటెన్ అసహనం ప్రధానంగా జీర్ణక్రియ,  స్వయం ప్రతిరక్షక సమస్యలతో ముడిపడి ఉంటుంది. ఇది కొందరిలో  చర్మ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. ఉదరకుహర వ్యాధి, చర్మశోథ హెర్పెటిఫార్మిస్, దురద, పొక్కులు,  దద్దుర్లు మొదలైనవి గ్లూటెన్ అధికంగా తీసుకోవడం వల్ల ఎదురయ్యే సమస్యలు. పాల ఉత్పత్తులు.. కొన్ని పాల ఉత్పత్తులు అలెర్జీలు కలిగి ఉంటాయి. ఇవి  ఆహార సున్నితత్వాన్ని ప్రేరేపిస్తాయి. ఈ కారణంగా  చర్మ సమస్యలను కలిగిస్తాయి. పాలలో కేసైన్,  లాక్టోస్ అసహనం కారణంగా ఇది జరుగుతుంది. సోయా.. సోయాలో ఫైటోఈస్ట్రోజెన్ అనే సమ్మేళనాలు ఉన్నాయి, ఇవి శరీరంలో ఈస్ట్రోజెన్ ప్రభావాలను అనుకరిస్తాయి. సోయా వినియోగం హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.  హైపర్పిగ్మెంటేషన్ వంటి సమస్యలను పెంచుతుంది. మంచి ప్రోటీన్ అని సోయాను అధికంగా తినే వారు, ఇతర హార్మోన్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు సోయాకు దూరంగా ఉండాలి. మొక్కజొన్న.. మొక్కజొన్నను అనేక రకాలుగా తింటారు. మొక్కజొన్న నేరుగా తింటే మంచిదే కానీ దీన్ని అనేక ఆహార పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇలా చేస్తున్నప్పుడు అది పెద్ద స్థాయిలో ప్రాసెస్ చేయబడుతుంది.  కార్న్ ఫ్లేక్స్, కార్న్ బాల్స్, కార్మ్ ప్లోర్ వంటి వాటిలోనూ ఇంకా ఇతర ఆహారాలలో దీన్ని వినియోగిస్తారు. ఇలాంటి ఆహారాల ద్వారా దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక చర్మ సమస్యలు వస్తాయి.                                    *నిశ్శబ్ద.

ఈ పండ్లు కొలెస్ట్రాల్‎ను తగ్గిస్తాయి..!!

  కొన్ని పండ్లు ఏడాది పొడవునా మార్కెట్‌లో లభిస్తాయి, మరికొన్ని కొన్ని సీజన్లలో మాత్రమే లభిస్తాయి. అయితే పండ్లు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.  పండ్లు మన కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో పని చేస్తాయి. పండ్లలో అలాంటి ఔషధ గుణాలున్నాయి. సహజంగా తినడానికి తియ్యగా ఉండే పండ్లలో ఇలాంటి లక్షణాలు కనిపించడం నిజంగా ఆశ్చర్యకరం. ఈ పండ్లు తరచుగా తిన్నట్లయితే ఊబకాయం,  కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. యాపిల్: రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదంటారు.  ఎందుకంటే యాపిల్ మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మన శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.దీనికి కారణం యాపిల్ పండులో కరిగే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటమే. ఇది మీ శరీరం నుండి LDL లేదా చెడు కొవ్వును తొలగిస్తుంది. అవోకాడో బటర్‌నట్ స్క్వాష్: బటర్ ఫ్రూట్ దీనికి మరో పేరు. ఇంతకుముందు ఇది చాలా అరుదుగా లభ్యమైయ్యేది. కానీ ఈ రోజుల్లో ఇది మార్కెట్‌లో సమృద్ధిగా దొరుకుతోంది. అవకాడో తినడం వల్ల మన చెడు కొవ్వు స్థాయిలను కూడా నియంత్రించవచ్చు. మీ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో బటర్ ఫ్రూట్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అరటిపండు: ఫైబర్ అధికంగా ఉండటం వల్ల అరటిపండులో పొటాషియం కూడా ఉంటుంది. సోడియం తీసుకోవడం తగ్గించడంలో రక్తపోటును నిర్వహించడంలో అరటిపండ్లు చాలా మంచివి. కరిగే ఫైబర్ కంటెంట్ కారణంగా ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. ద్రాక్ష పండు: మీ శరీరంలో కొవ్వు మొత్తం ఎక్కడ దాగి ఉంటే, ద్రాక్షపండు రసం రక్త ప్రసరణ ద్వారా కాలేయానికి తీసుకువెళుతుంది. అక్కడ ఇది ప్రాసెస్ చేయబడుతుంది. శరీరం నుండి చెడు కొవ్వును తొలగించడానికి వీలు కల్పిస్తుంది. బ్లాక్బెర్రీ, స్ట్రాబెర్రీ: బెర్రీస్ అద్భుతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి మన శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో,  గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. బెర్రీల రసాన్ని తాగడం ద్వారా, మీరు వీటి యొక్క పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు. పైనాపిల్: శరీరంలో రక్త ప్రసరణ సజావుగా సాగేందుకు పైనాపిల్ సహాయపడుతుంది. చెడు కొవ్వు పదార్థాలను నియంత్రించే గుణం ఇందులో ఉంది. తద్వారా గుండె ఆరోగ్యానికి మరిన్ని ప్రయోజనాలను అందిస్తుంది. కొలెస్ట్రాల్ నుండి బయటపడటానికి సీజన్లో పైనాపిల్ పండ్ల రసాన్ని త్రాగండి  

పసుపు నీళ్లు ...ఆరోగ్యానికి ఎంతో మేలు..!!

వంటగదిలో ఉంచిన మసాలా దినుసులు ఆహారం రుచిని మెరుగుపరచడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. వంటగదిలో ఉండే పసుపు కూడా ఔషధ గుణాలతో నిండి ఉంది. ఇందులో ఖనిజాలు, విటమిన్ ఎ, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పసుపును ఉపయోగించడం అనేక వ్యాధులలో ప్రయోజనకరంగా ఉంటుంది. పసుపు నీరు  ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పసుపు నీరు త్రాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. పసుపు నీళ్లు దాని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. పసుపునీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు: పసుపు నీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థకు మేలు చేస్తాయి. పసుపులోని ఈ లక్షణాలు దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తాయి. ప్రతిరోజూ ఉదయం పసుపు నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పసుపు చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది . పసుపును చర్మంపై అప్లై చేయడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. చర్మ సమస్యలను దూరం చేయడంలో పసుపు నీరు కూడా మేలు చేస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పసుపు నీటిని తాగడం వల్ల చర్మంపై వాపు,  చికాకు సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు: రోజూ పసుపు నీరు తాగడం వల్ల చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు. షుగర్ రోగులకు పసుపు నీరు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.అంతేకాదు టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం నుండి రక్షిస్తుంది. కొలెస్ట్రాల్ నియంత్రణ: కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో పసుపు నీరు కూడా మేలు చేస్తుంది. దీని కోసం, గోరువెచ్చని నీటిలో రెండు చిటికెల పసుపు, కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేసి కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గడానికి: రెండు కప్పుల నీటిలో ఒక ముద్ద పసుపు వేసి, నీరు సగానికి తగ్గే వరకు ఉడికించాలి. కొంచెం నీరు మిగిలి ఉన్నప్పుడు, దానిని ఫిల్టర్ చేయండి. ఆ తర్వాత అందులో కాస్త తేనె మిక్స్ చేసి తాగితే బరువు తగ్గుతారు.

యాంటీబయాటిక్స్ ఎక్కువగా తీసుకునేవారు ఈ విషయాలు తెలుసుకోవాలి.!!

మనలో చాలామంది యాంటీబయాటిక్స్ తీసుకుంటుంటారు. కొన్ని రకాల జబ్బులకు యాంటీబయాటిక్స్ తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. యాంటీబయాటిక్ మందులు తీసుకునే వారు ఆహారం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం  జీర్ణక్రియకు మరియు పేగు ఆరోగ్యానికి మంచిది.  బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నిర్మూలించడానికి వైద్యులు తరచుగా యాంటీబయాటిక్స్ను సూచిస్తారు. మీరు యాంటీబయాటిక్ మందులు తీసుకుంటే మీరు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. యాంటీబయాటిక్స్ తీసుకునేటప్పుడు వీటిని గుర్తుంచుకోండి: యాంటీబయాటిక్స్ అనేది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగించే మందులు. ఇది బ్యాక్టీరియాను చంపడానికి లేదా వాటి పెరుగుదలను ఆపడానికి పనిచేస్తుంది. ఇది దగ్గు, గొంతు నొప్పి,  UTI వంటి కొన్ని ప్రాణాంతక అంటువ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది. అయితే ఈ మందులు వేసుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి. ఆయుర్వేద వైద్యుల అభిప్రాయం ప్రకారం: ఆయుర్వేద వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని ఇన్ఫెక్షన్లు వచ్చినా వాటి నుంచి బయటపడేందుకు యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. కానీ అది మీ పేగు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందువల్ల, మీ జీర్ణక్రియ,  ప్రేగుల ఆరోగ్యానికి తోడ్పడే ఈ మందులతో పాటు అటువంటి ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం. తేలికపాటి ఆహారాన్ని తినండి: అనారోగ్య సమయంలో మీ కడుపులో మంట వస్తుంది.  కాబట్టి బాగా ఉడికించిన ఆహారం తినడం వల్ల జీర్ణం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. యాంటీబయాటిక్స్ తీసుకునేటప్పుడు మీరు సాదా ఖిచ్డీని చిటికెడు పొడి అల్లం పొడితో తినవచ్చు. మజ్జిగ తాగండి: భోజనం చేసిన తర్వాత మజ్జిగ తాగడం వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. ఇది మీ ప్రేగు ఆరోగ్యానికి అవసరమైన లక్షణాలను కలిగి ఉంటుంది. మజ్జిగలో 1 చిటికెడు ఉప్పు, అర చెంచా జీలకర్ర పొడి, చిటికెడు గరంమసాలా కలపండి. దీని కారణంగా, యాంటీబయాటిక్స్ కడుపుపై ఎటువంటి చెడు ప్రభావాన్ని చూపదు. మీకు ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే తినండి: యాంటీబయాటిక్స్ మీ ఆకలిని తగ్గిస్తుంది. కాబట్టి, మీకు ఆకలిగా అనిపించే వరకు తినవద్దు. ఆకలి పెరగాలంటే గోరువెచ్చని నీరు తాగి నెమ్మదిగా నడవాలి. ఇది మీ ఆకలిని పెంచడానికి సహాయపడుతుంది. సూప్ తాగండి: ద్రవాలు త్వరగా జీర్ణమవుతాయి. మృదువుగా ఉంటాయి. శరీరం వాటిని సులభంగా గ్రహిస్తుంది. మీరు వెజిటబుల్ సూప్, అన్నం గంజి, మూంగ్ పప్పు తినవచ్చు.. ఇది సులభంగా జీర్ణమవుతుంది. డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్, రూట్ వెజిటేబుల్స్ తినవద్దు: భూగర్భంలో పండే కూరగాయలు జీర్ణం కావడం కష్టం. అవి జీర్ణం అయినప్పుడు ఆమ్లాన్ని ఉత్పత్తి చేయవచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్ జీర్ణం కావడం కష్టం. గ్యాస్ట్రిక్‌కు కారణం అయ్యే ఛాన్స్ ఉంటుంది.

పాలతోపాటు ఈ పదార్థాలు తినకూడదని తెలుసా...

పాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులోని పోషకాలు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.  పోషకమైన పాలు మన కండరాలకు, ఎముకలకు, మెదడుకు మేలు చేస్తాయి. ఇది అన్ని వయసుల వారికి మంచిది. పరిమిత పరిమాణంలో దీనిని తాగడం వల్ల వృద్ధిని వేగవంతం చేయవచ్చు. పాలు, పెరుగు, మజ్జిగ, పెరుగు,  దేశీ నెయ్యితో తయారు చేసినందున అవి కూడా సమానంగా ఆరోగ్యంగా ఉంటాయి. పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు: హార్వర్డ్ ప్రకారం, ప్రతిరోజూ పాలు తాగడం ద్వారా, మీరు ప్రోటీన్, కాల్షియం, విటమిన్ B12, విటమిన్ B2, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ A, విటమిన్ D ను పొందవచ్చు. ఇది మీ ఎముకలు, కండరాలను బలపరుస్తుంది. కాబట్టి పాలను పిల్లలకు సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. పాలు తాగిన తర్వాత పుల్లటి పండ్లు తినడం: ప్రజలు అల్పాహారం కోసం పాలతో అనేక పండ్లను తింటారు. కానీ ముఖ్యంగా పుల్లని పండ్లను నిమ్మ, నారింజ వంటి వాటిని ఎప్పుడూ పాలతో తినకూడదు. దీని వల్ల కడుపులో ఆమ్లం పెరిగి జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. ఇది గ్యాస్, కడుపు నొప్పి, ఉబ్బరం, గుండెల్లో మంటకు కారణమవుతుంది. పాలతో పుల్లని పండ్లను తీసుకోవడం వల్ల కడుపులో అదే ప్రక్రియ జరుగుతుంది. పాలతో అరటిపండు తినడం: పాలతో అరటిపండు తినడం చాలా ప్రసిద్ధి. ఇది శరీరానికి ప్రాణం పోసేలా పనిచేస్తుంది. కానీ ఆయుర్వేదం ఈ కలయికను అందరికీ ఆరోగ్యకరమైనదిగా పరిగణించదు. ఇది శరీరంలో కఫాన్ని పెంచుతుంది కాబట్టి, ఇది ఎగువ శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది. దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే శ్లేష్మం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అధిక ఫైబర్ ఆహారాలు: మీరు పాలతో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అధిక ఫైబర్ తీసుకోవడం దానితో కాల్షియంను బంధిస్తుంది. దీని కారణంగా శరీరం దానిని ఉపయోగించుకోలేకపోతుంది. అది పూర్తిగా విసర్జించబడుతుంది. ఇది శరీరంలో తీవ్రమైన కాల్షియం లోపానికి కారణమవుతుంది. టొమాటో: టొమాటో ఆహారం రుచిని పెంచడమే కాకుండా రోగనిరోధక శక్తితో పాటు జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. టొమాటోలు లేదా వాటితో చేసిన పాస్తా, పిజ్జా వంటి ఆహారాలను పాలతో కలిపి తినకూడదు. ఈ ఆహారం ఆమ్లంగా ఉంటుంది, ఇది కడుపు నొప్పికి కారణమవుతుంది. కొన్ని రకాల మందులు: ప్రతి ఔషధం తీసుకోవడానికి సరైన మార్గం ఉంది. కొన్ని మందులు పాలతోనూ, మరికొన్ని నీళ్లతోనూ తీసుకుంటారు. కాబట్టి కొన్ని మందులను పాలతో కలిపి తీసుకోకూడదు. ఈ కారణంగా, మందులు ప్రభావవంతంగా లేవు. వ్యాధి అలాగే ఉంటుంది. అధిక ప్రోటీన్ ఆహారాలు: ఫైబర్ మాదిరిగా, చాలా ప్రోటీన్ పాలతో తీసుకోకూడదు. ఇటువంటి ఆహారాలు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. పాలు జీర్ణం కావడం ఆలస్యం అవుతుంది. దీనివల్ల కడుపులో భారం, విరేచనాలు, కడుపునొప్పి, కొంతమందికి చాలా ఇబ్బంది కలుగుతుంది.  

అధిక యూరిక్ యాసిడ్‎తో కీళ్ల నొప్పులే కాదు..ఈ వ్యాధులు తప్పవు..!!

ఈ రోజుల్లో అధిక యూరిక్ యాసిడ్ సమస్య సర్వసాధారణంగా మారింది. దీనికి అతి పెద్ద కారణం చెడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, తక్కువ నీరు త్రాగడం, ఎక్కువ కేలరీలు తీసుకోవడం. నిజానికి, యూరిక్ యాసిడ్ శరీరంలో మురికి వలె పేరుకుపోతుంది.  ఇది అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగితే, ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులతో సహా అనేక ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి, చాలా సార్లు యూరిక్ యాసిడ్ శరీరం నుండి మూత్రం ద్వారా బయటకు వస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో, అది విడుదల కానప్పుడు, అదనపు యూరిక్ యాసిడ్ శరీరంలో పెరగడం ప్రారంభమవుతుంది. యూరిక్ యాసిడ్ పెంచడంలో ప్యూరిన్ అనే ప్రోటీన్ పెద్ద పాత్ర పోషిస్తుంది. దీని వల్ల వచ్చే 5 తీవ్రమైన వ్యాధుల గురించి తెలుసుకుందాం.. ఆర్థరైటిస్ కీళ్ల నొప్పి: యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఆర్థరైటిస్ లేదా కీళ్ల నొప్పులు. అధిక యూరిక్ యాసిడ్ ఉన్న రోగుల శరీరంలో, ఈ యాసిడ్ చేతులు, కాళ్ళ కీళ్ళలో చిన్న స్ఫటికాల రూపంలో పేరుకుపోవడం ప్రారంభిస్తుంది. దీని కారణంగా, ఆర్థరైటిస్‌తో బాధపడే ప్రమాదం ప్రజలలో పెరుగుతుంది. ఇది కీళ్లలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది, ఈ నొప్పి కొన్నిసార్లు భరించలేనిదిగా మారుతుంది. అందువల్ల, మీరు యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతుంటే, ఖచ్చితంగా వైద్యుల సలహా తీసుకొని మీ ఆహారం, జీవనశైలిని మెరుగుపరచండి. అధిక రక్త పోటు: అధిక BP లేదా రక్తపోటు అనేది పెద్దవారిలో గుండె జబ్బు యొక్క అత్యంత సాధారణ రూపం. పెరుగుతున్న వయస్సుతో, ఈ వ్యాధి గుండె వైఫల్యం, మూత్రపిండాల వ్యాధి, స్ట్రోక్‌కు కూడా కారణమవుతుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ యొక్క మ్యాగజైన్‌లో ప్రచురించబడిన ఒక వార్త ప్రకారం, వారి రక్తంలో యూరిక్ యాసిడ్ అధిక మొత్తంలో ఉన్న వ్యక్తులకు అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొంది. కాబట్టి అలాంటి వారు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మధుమేహం: ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, శరీరంలో రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి సక్రమంగా లేనప్పుడు, ఈ ఇన్సులిన్ కారణంగా కూడా దాని సమతుల్యత దెబ్బతింటుంది. అటువంటి పరిస్థితిలో, యూరిక్ యాసిడ్ రోగులలో మధుమేహం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. గుండె వ్యాధి:  రక్తంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరగడం వల్ల, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అధిక యూరిక్ యాసిడ్ ఉన్న రోగులు కూడా గుండెపోటుకు గురవుతారు, అందువల్ల యూరిక్ యాసిడ్ సమస్యను తేలికగా తీసుకోకూడదు. కిడ్నీల్లో రాళ్లు: యూరిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల, మూత్రపిండాలు సాఫీగా ఫిల్టర్ చేయలేవు.  దాని స్ఫటికాలు యూరిన్ ట్యూబ్‌లో నిక్షిప్తమవుతాయి. దీని వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య వస్తుంది. వీటన్నింటితో పాటు, యూరిక్ యాసిడ్ రోగులు చేతులు, కాళ్ళలో మంట, వేళ్లలో భరించలేని నొప్పి, దృఢత్వం, మూత్రవిసర్జనలో ఇబ్బంది, మూత్ర నాళంలో మంట వంటి వాటితో కూడా బాధపడతారు.  

పురుషుల్లో థైరాయిడ్ సమస్యను ఎలా గుర్తించాలి? దాని ప్రభావం ఎలా ఉంటుంది..

సాధారణంగా థైరాయిడ్ సమస్యతో మహిళలు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే అయితే పురుషులకు కూడా ఈ సమస్య ఉంటుందని మీకు తెలుసా? పురుషులలో థైరాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. హైపర్ థైరాయిడిజం అనేది మీ థైరాయిడ్ గ్రంథి మీ శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. దీనిని "హైపర్ థైరాయిడిజం" అని కూడా అంటారు. సకాలంలో చికిత్స చేయకపోతే, ఇది మీ గుండె, కండరాలు, స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేస్తుంది. ఈ హైపర్ థైరాయిడిజం సాధారణంగా నియంత్రణలో ఉంచుకోవడానికి మందులు అవసరం. కాబట్టి పురుషులలో థైరాయిడ్‌కు ఎలాంటి చికిత్సలు అందించవచ్చో చూద్దాం. పురుషులలో హైపర్ థైరాయిడిజం యొక్క కారణాలు:  గ్రేవ్స్ వ్యాధి పురుషులలో హైపర్ థైరాయిడిజంకు కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  గ్రేవ్స్ వ్యాధి  ఆరోగ్యకరమైన థైరాయిడ్ గ్రంధిపై  దాడి చేయడం వల్ల వస్తుంది. దీని వల్ల థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఎక్కువమొత్తంలో అయోడిన్, దుష్ప్రభావాలను కలిగించే మందులను తీసుకోకుండా ఉండాలని సలహా ఇస్తారు. కాబట్టి పురుషులలో థైరాయిడ్ లక్షణాలను ఎలా గుర్తించవచ్చు? -బరువు తగ్గడం లేదా పెరగడం. -క్రమరహిత హృదయ స్పందన -భయం -చిరాకు -అలసట -వేళ్లు, చేతులు వణకడం -చెమటలు -కండరాల బలహీనత -జుట్టు ఊడుట పురుషులు, మహిళలు సాధారణంగా ఈ హైపర్ థైరాయిడిజానికి సంబంధించి  ఒకే విధమైన లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ, పురుషులను మాత్రమే ప్రభావితం చేసే కొన్ని ప్రధాన సమస్యలు ఉన్నాయి. అవి, -అంగస్తంభన లోపం -తక్కువ స్పెర్మ్ కౌంట్ -అకాల బట్టతల -లైంగిక ఆరోగ్యంపై ప్రభావం ఈ థైరాయిడ్ హార్మోన్లు పురుషుల వృషణాలలోని కొన్ని కణాల పనితీరును ప్రభావితం చేస్తాయి. హైపర్ థైరాయిడిజం స్పెర్మ్ కణాలను ప్రభావితం చేస్తుంది. ఇది స్పెర్మ్ సాంద్రత, చలనశీలతను తగ్గించడమే కాకుండా, స్పెర్మ్ యొక్క అసలు ఆకారం లేదా రూపాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అంగస్తంభన పనితీరును ప్రభావితం చేయవచ్చు.వంధ్యత్వానికి కారణం కావచ్చు.తక్కువ స్పెర్మ్ కౌంట్ దారితీస్తుంది. థైరాయిడ్‌కు మందులు, శస్త్రచికిత్స ద్వారా చికిత్స చేయవచ్చు. స్త్రీలు లేదా పురుషులు సంవత్సరానికి ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. అదనంగా, ఆరోగ్యకరమైన ఆహారం, రోజువారీ వ్యాయామం శరీరానికి చాలా ముఖ్యమైనవి.

మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఈ ఆకులు ఆహారంలో భాగం చేసుకుంటే సరి..

ఈ రోజుల్లో, ప్రజల జీవన విధానం వేగంగా మారుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న పనిభారం,బిజీ షెడ్యుల్ ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యంపై  ప్రభావం చూపిస్తోంది. ఈ కారణంగా  చుట్టూ ఉన్న చాలా మంది మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. ఈ రోజుల్లో చాలా మంది ఒత్తిడి, డిప్రెషన్‌కు గురవుతున్నారు. ఇలాంటి  పరిస్థితిలో ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోవడం చాలా ముఖ్యం.  అలవాట్లు  జీవనశైలితో పాటు,  ఆహారం కూడా మన ఆరోగ్యంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఆహారంలో సరైన మార్పులు చేయడం ద్వారా శారీరకంగానే కాకుండా  మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు.  కొన్ని సహజ మూలికలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. అశ్వగంధ అశ్వగంధలో చాలా  అద్భుత లక్షణాలు ఉంటాయి. ఇది అనేక సమస్యలకు  దివ్యౌషధంగా పనిచేస్తుంది.  దీనిని సాధారణంగా ఇండియన్ జిన్సెంగ్ అంటారు. అనేక ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి ఉపశమనాన్ని అందించడమే కాకుండా, మెదడు పనితీరును పెంచడంలో కూడా ఇది సహాయపడుతుంది, ఇది  మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా డిప్రెషన్ ను తగ్గిస్తుంది. మానసిక ఒత్తిడికి లోనయ్యేవారు అశ్వగంధ చూర్ణం లేదా అశ్వగంధ టాబ్లెట్స్ తీసుకోవచ్చు. బ్రహ్మి లేదా సరస్వతి..  బ్రహ్మి  మానసిక ఆరోగ్యానికి  చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మానసిక ఆరోగ్య సమస్యలు లేదా అనారోగ్యాలకు చికిత్స చేయడంతోపాటు దైనందిన జీవితంలోని ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి శక్తివంతమైన మూలిక.  బ్రాహ్మీ టీ తీసుకోవచ్చు. పసుపు.. అనేక ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న పసుపు , ఎన్నో ఏళ్ళ నుండి అనేక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడంలో ఉపయోగిస్తున్నారు.  జలుబు, దగ్గు లేదా ఏదైనా గాయం ఇలా ఏదైనా సరే  పసుపు అన్నింటికీ దివ్యౌషధం. వీటన్నింటితో పాటు ఇది  మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సహజ నివారణ. పసుపు పాలు తీసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. తిప్పతీగ.. దీనినే గుడుచి అని కూడా అంటారు. తిప్పతీగ చాలా కాలంగా అనేక సమస్యలకు ఆయుర్వేదంలో ఉపయోగించబడుతున్నప్పటికీ, కరోనా కాలం నుండి  ప్రజాదరణ మరింత పెరిగింది. రోగనిరోధక శక్తిని పెంచే ఈ మూలిక డిప్రెషన్ చికిత్సలో చాలా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది ఒత్తిడిని తగ్గించడంలో,  జ్ఞాపకశక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. తులసి.. హిందూ మతంలో తులసికి చాలా ప్రాముఖ్యత ఉంది. మతపరమైన ప్రాముఖ్యతతో పాటు తులసి  ఆరోగ్య ప్రయోజనాల వల్ల  కూడా ప్రసిద్ధి చెందింది. మానసిక ఆరోగ్యం విషయానికి వస్తే, ఇది చాలా ప్రభావవంతమైన మూలికలలో ఒకటి. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.                                                           *నిశ్శబ్ద.  

ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. రెండు నిమిషాలలో కడుపు ఉబ్బరం అంతా తగ్గిపోతుంది..

 తరచుగా అపానవాయువు, బరువు పెరగడం, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, ఉబ్బరం వంటి కడుపు సమస్యలు చాలామంది ఎదుర్కొంటున్నారు. వీటిని అధిగమించానికి చాలామంది జీర్ణశక్తిని పెంచే టాబ్లెట్స్, సిరప్ వంటి వాటిపై ఆధారపడుతుంటారు. కానీ ఇవన్నీ సహజమైన జీర్ణవ్యవస్థను దెబ్బతీసేవే. వీటి వాడకం వల్ల సహజంగా ఆహారం జీర్ణం కాదు.కానీ ఆయుర్వేదం ఈ సమస్యలకు అన్నింటికి మంచి పరిష్కారాలు సూచించింది. అది కూడా ఇంటిపట్టున తక్కువ ఖర్చుతో ఈ సమస్యలు అధిగమించవచ్చు. కడుపు సమస్యలను అన్ని పరిష్కరించడంలో  సొంపు లేదా సోపు చక్కగా సహాయపడుతుంది. అసలు సోపులో ఉన్న ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి? సోపును ఎవరు ఏ విధంగా తీసుకుంటే ఏ సమస్యలు పరిష్కారం అవుతాయి పూర్తీగా తెలుసుకుంటే.. సోపు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. సోపు తినడం వల్ల బలం చేకూరుతుంది.  రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది పిత్త దోషం సాధారణంగా  వేడి ఎక్కువ కావడం వల్ల కలుగుతుంది.  అధికవేడి  వల్ల కలిగే రక్తస్రావ రుగ్మతలలో కూడా సోపు ఔషదంగా  ఉపయోగపడుతుంది జీర్ణ శక్తిని పెంచుతుంది.  గుండెకు మంచి టానిక్ లాగా పనిచేస్తుంది.  బహిష్టు సమయంలో నొప్పి నుండి ఉపశమనం కలిగించడంలో ఉపయోగకరంగా ఉంటుంది. సోపు నీరు శరీరంలోని ధాతువులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది, ఇది పాలిచ్చే స్త్రీలలో తల్లి పాలను పెంచుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది సోపులోని సాత్విక లక్షణాలు మనస్సును రిఫ్రెష్ చేస్తుంది. తద్వారా  మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది కళ్ళకు రిఫ్రెష్‌గా కూడా సహాయపడుతుంది. శ్వాసకోశ,  ఊపిరితిత్తులలో పేరుకుపోయిన పెరిగిన కఫాన్ని కూడా తగ్గిస్తుంది.  సోపును ఎవరు ఎలా ఉపయోగించాలంటే.. జీర్ణ సమస్యలకు - అసిడిటీ,  పిత్త సమస్యలకు, అర టీస్పూన్ పంచదారతో 1 టీస్పూన్ సోపు విత్తనాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని నమిలి తినాలి. బరువు తగ్గడం, దగ్గు, జలుబు, నెలసరి తిమ్మిర్లు, వికారం, కడుపులో నులిపురుగులు వంటి సమస్యల కోసం సోపుతో హెర్బల్ టీని తయారు చేసుకుని తాగాలి.  సోపు టీ  కోసం..  1 టీస్పూన్ సోపును 1 గ్లాసు నీటిలో 3-5 నిమిషాలు ఉడకబెట్టి, ఫిల్టర్ చేసి, సిప్ బై సిప్ త్రాగాలి. మెరుగైన జీర్ణక్రియ కోసం భోజనానికి ఒక గంట ముందు లేదా తర్వాత సోపు టీని త్రాగాలి. 1 గ్లాసు నీటిలో ఒక చెంచా జీలకర్ర, కొత్తిమీర,  సోపు వేసి 5 నిమిషాలు ఉడికించి వడపోసి, సిప్ బై సిప్ త్రాగాలి. ఇలా చేస్తే కేవలం రెండే రెండు నిమిషాలలో కడుపు శుభ్రమవుతుంది.                                                           *నిశ్శబ్ద

బాదం పప్పు తింటే ఎన్ని లాభాలో అనుకున్నాం కానీ ఈ నిజాలు తెలిస్తే..

బాదం పప్పు తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ  బాదంపప్పును రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటె  గుండె ఆరోగ్యంగా ఉంటుంది, మధుమేహం నియంత్రణలో ఉంటుంది, మెదడును చురుగ్గా మార్చుతుంది.  బరువు తగ్గడానికి, బీపీని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.  క్యాన్సర్ రాకుండా చేయడంలోనూ, జుట్టు పెరుగుదలలోనూ చర్మాన్ని యవ్వనంగా మార్చడంలో సహాయపడుతుంది. అయినప్పటికీ, బాదం  హానికరం. బాదం పప్పు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయి. దీనివల్ల  ఎలాంటి నష్టాలు ఉంటాయో తెలుసుకుంటే.. తరచుగా కడుపులో మంట లేదా యాసిడ్స్ ఉత్పత్తి అవ్వడం  గురించి ఫిర్యాదు చేసేవారు,  బాదం తీసుకోవడం తగ్గించాలి, ఇది  సమస్యను మరింత కడుపులో యాసిడ్ సమస్యను మరింత పెంచుతుంది. బాదంపప్పులో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. బాదం పప్పులను ప్రతిరోజూ తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. అందుకే మూత్రపిండాల సమస్య ఉన్నవారు, మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు బాదం పప్పుకు దూరంగా ఉండాలి. బాదంపప్పులో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బాదం పప్పును ఎక్కువగా తీసుకోవడం లేదా నానబెట్టకుండా   తీసుకోవడం వల్ల కడుపులో భారం అంటే ఉబ్బరం, విరేచనాలు,  పొత్తికడుపు నొప్పి వంటివి కూడా కలుగుతాయి. బాదంపప్పులను ఎక్కువగా తీసుకోవడం వల్ల, ముఖ్యంగా పచ్చి బాదంపప్పులు తీసుకోవడం వల్ల నోటి అలర్జీలు, గొంతు నొప్పి,  పెదవుల వాపు వంటివి ఏర్పడతాయి. అందుకే బాదం పప్పు లిమిట్ గా తీసుకోవాలి. బాదంపప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ  అధిక  పైబర్   శరీరానికి ఇతర ఆహారాల  వల్ల లభించే ఐరన్, జింక్  కాల్షియం వంటి పోషకాలను గ్రహించడంలో ఇబ్బంది కలిగిస్తుంది. ఐరన్ తక్కువైతే శరీరంలో రక్తహీనత ఏర్పడుతుంది. ఇది చాలా రకాల అనారోగ్యాలకు మూలమవుతుంది.                                                           *నిశ్శబ్ద.  

పచ్చి పాలు తాగితే ప్రమాదమా?

పచ్చిపాలు తాగితే చాలా లాభాలు సురక్షితం అనికొందరు.  కాదు కాదు పచ్చిపాలు ఆరోగ్యానికి హానికరం అని ఇంకొందరు అంటున్నారు మరి అందులో నిజం ఏది? అనితేలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే. ఇక వివరాల లోకి వెళ్తే మనం ప్రతిరోజూ పాలు ఎదో రూపం లో వాడుతూ ఉంటాము.మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేందుకు పాలు లాభదాయకంగా ఉంటుంది. అని అందరూ అంగీకరిస్తారు.మరి మీరు తేల్చుకోవాల్సిన అంశం ఏమిటి అంటే పచ్చిపాలు లాభదాయకమని లేదాపేస్టూ రైజ్డ పాలు లాభమా అన్నది ప్రశ్న. మీరు రోజూ పాలు తాగుతారా ?అయితే ఇది చదవడం అత్యవసరం.పాలు మనం ప్రతిరోజూ ఎదోరూపం లో వాడతాము.అసలు పాలు లేకుండా రోజు గడవడం కష్టం.అంటే పాలు లేకుండా ఉండడం కొంచం కష్టం.మీ ఇమ్యునిటీ నిపెంచడం దగ్గరనుంచి ఎముకలు,పళ్ళు బలంగా ఉండేందుకు మెటాబాలిజం పెంచేందుకు పాలు దోహదం  చేస్తాయని అనడంలో సందేహం లేదు. అయితే మీరు పాలను సరైన పద్దతిలో తాగాకుంటే పాలలో ఉండే సంపూర్ణ పోషకాలు లేకుండా మీ శరీరానికి ఉపయోగ పడదు. పచ్చిపాలు తాగ వచ్చా? ఇందులో ఆశ్చర్య పోవాల్సింది ఏమిలేదు మనశరీరానికి పచ్చిపాల లో ఉన్న పోషక తాత్వాలను అందిస్తుంది.ఎందుకంటే గడ్డితిని ఆవులు లేదా గేదెల నుండే పాలు తీస్తారు.ఈ విధంగా పాలు ఎంజయిం ఆరోగ్యం ప్రోటీన్లతో సంపూర్ణంగా ఉంటుంది.ఆయితే కొన్నిరకాల కీటకాలు ,జీవాణువులను చంపాలంటే పాలను ఒకక్రమ పద్దతిలో సాగుతాయి.ఈ కారణంగా ఎలర్జీ తో పాటు గుండె సంబందిత రోగాలు రావచ్చు. పాల వల్ల లాభాలు... కొన్ని ఏళ్లుగా పాలు తాగడం వల్ల కలిగే లాభాలు చెపుతూనే ఉన్నాము.నష్టాలు గురించి తక్కువే చెప్పుకుంటాము పాలలో కాల్షియం,పోస్ఫరస్,విటమిన్ బి,పొటాషియం,విటమిన్ డి,వంటి పోషక తత్వాలు సంపూర్ణంగా ఉంటాయి.దీనితోపాటు ప్రోటీన్ అధికసంఖ్యలో లభిస్తుంది.మన ఎముకలను పటిష్టంగా ఉంచేందుకు పాలు దోహదం చేస్తాయి.కణాలు టిష్యులు రీజేనేవేషన్,లేదా మెదడు చురుకుగా పనిచేసేందుకు ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరిస్తుంది.మరి మీరు సరైన పద్దతిలో పాలు తీసుకుంటున్నారా.? పాలు తాగాలంటే సరైన పద్ధతి ఏమిటి? పాలను వినియోగించాలంటే మిల్క్ షేక్,స్మూదీ,టీ,మిటాయి, ఎక్కడైనా ఏరూపంలో ఐనా వాడతారు.ప్రతివ్యక్తి పాలను వాడే సరైన పద్ధతి వేరు వేరుగా ఉంటుంది. కాని చాలామందికి పచ్చి పాలు  తాగడం ఇష్ట పడతారు.ఇది ఏ మాత్రం కలుషితం లేనిదని పవిత్ర మైనవిగా భావిస్తారు. పచ్చిపాలను తాగడం మంచిదేనా? సురక్షితమా? కొన్ని ఏళ్ళుగా ఒక పరంపరగా పచ్చిపాలను తాగడం ఆరోగ్యానికి మంచిదని ధర్మంగా భావిస్తారు.వీటిలో ఏ రకమైన పదార్ధాలు తీయకుండా నేరుగా తాగడం కాలాను గుణంగా ఆలోచనలు పెరిగి మార్పులు వచ్చాయి. ఇప్పుడు పచ్చిపాలు తాగడం సురక్షితం కాదని నిర్ధారించారు. పచ్చి పాలు తాగితే ఏమౌతుంది? పచ్చి పాలు తాగడం వల్ల హానికలగ వచ్చు ఎందుకంటే ఇందులో బ్యాక్టీరియా లిస్టేరియా,ఈ కోలి,కాక్సిఎలా ,సాల్మనేల్ల,కేండి లో బెక్టర్,యార్సినియా,ఆరోగ్యం పంచెంద్రియాల పై సమస్యలు సృష్టించ వచ్చు. ఒక వేళ ఆయా ఆవులు గేదేలలో శరీరం లో ఏమైనా వైరస్ సంక్రమించి ఉంటె సమస్యలు వస్తాయి. గర్భవతులు పాలిచ్చే తల్లుల ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది.

లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ తో ఇన్ని ప్రయోజనాలు ఉంటాయని మీకు తెలుసా...

  ఎసెన్షియల్ ఆయిల్స్ గత కొంతకాలంగా బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రతి ఒక్కరూ ఈ  నూనెల  సువాసనను ఇష్టపడతారు.  ఇది కేవలం సువాసనే కాదు ఎన్నో సమస్యల్లో ఉపశమనం కూడా ఇస్తుంది. ఇది కాకుండా,  ఈ నూనెలను ఏదైనా ఇతర నూనెతో మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయవచ్చు, డిఫ్యూజర్‌లో ఉపయోగించవచ్చు లేదా వాసన చూడవచ్చు. ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ లో   లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ కూడా ఒకటి. దీని అద్భుతమైన ప్రయోజనాల గురించి  తెలుసుకుంటే.. ఫంగల్ ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది.. చర్మం నుండి బ్యాక్టీరియాను చంపడమే కాకుండా, లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ లో  యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి. గోళ్ళలో ఫంగస్ లేదా చుండ్రు ఉన్నట్లయితే  టీ ట్రీ ఆయిల్‌కు బదులుగా లెమన్ ఆయిల్‌ని కూడా ఉపయోగించుకోవచ్చు.  దీన్ని చర్మంపై అప్లై చేయడమే కాకుండా, ఎయిర్ డిఫ్యూజర్‌గా కూడా ఉపయోగించవచ్చు. దీని సువాసన గదిలో ఉండే ఫంగస్ మరియు బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు.. లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ లో  యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి  ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే బ్యాక్టీరియా నుండి రక్షిస్తాయి. నిమ్మకాయతో తయారు చేయబడిన ఎసెన్షియల్ ఆయిల్  స్టెఫిలోకాకస్ ఆరియస్,  ఇ.కోలి వంటి బ్యాక్టీరియా నుండి రక్షించడంలో ప్రభావవంతంగా ఉంటుందని 2019లో చేసిన పరిశోధనలో కనుగొనబడింది. ఈ ఎసెన్షియల్ ఆయిల్ ను  ఏదైనా ఇతర క్యారియర్ ఆయిల్ తో  కలిపిన తర్వాత మాత్రమే ఉపయోగించాలి.  అప్లై చేసే ముందు ప్యాచ్  టెస్ట్ చేయాలి.  ఈ జాగ్రత్త వల్ల  అలెర్జీలను నివారించవచ్చు. గాయాలను త్వరగా నయం చేస్తుంది.. లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ లో  ఉండే యాంటీమైక్రోబయల్ లక్షణాలు  గాయాలను త్వరగా నయం చేయడంలో సహాయపడతాయి. లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ తో గాయాన్ని శుభ్రం చేయవచ్చు. అయితే ఇతర క్యారియర్ ఆయిల్ తో కలిపే వాడాలి. ఇది బ్యాక్టీరియాను తొలగిస్తుంది.  గాయాలను త్వరగా నయం చేస్తుంది. చలికాలానికి ది బెస్ట్.. చలికాలంలో తలనొప్పి, జలుబు కారణంగా తలంతా బరువుగా ఉన్నా, గొంతులో నొప్పి,  వాపు వంటి సమస్య ఉన్నా లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ చక్కగా  ఉపయోగపడుతుంది. ఈ నూనెను  డిఫ్యూజర్‌లో ఉపయోగించడం వల్ల దాని సువాసన శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఓ రకంగా అరోమా థెరపీ అనుకోవచ్చు.  ఇది  గొంతులో వాపు,  నొప్పిని తొలగిస్తుంది. అదే సమయంలో, ఇందులో ఉండే విటమిన్-సి జలుబ,  ఫ్లూ నుండి ఉపశమనం ఇస్తుంది. వికారం వదిలించుకోవడానికి.. వికారం  బాధపెడుతుంటే, నిమ్మ నూనె  సహాయం చేస్తుంది. గర్భిణీ స్త్రీలలో కూడా కలిగే వేవిళ్ళు, ఇతర సందర్భాలలో సాదారణ ప్రజలకు ఎదురయ్యే వికారానికి   ఈ నూనె చక్కగా సహాయపడుతుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది.. నిమ్మ నూనె సువాసన  మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఈ సువాసన ఆందోళన,  టెన్షన్‌ని దూరం చేస్తుంది.  దీనివల్ల  రిలాక్స్‌గా ఉండచ్చు.   సాధారణంగా లావెండర్ లేదా రోజ్ ఎసెన్షియల్ ఆయిల్‌ను ఆందోళన, డిప్రెషన్  లక్షణాలను తగ్గించడానికి ఉపయోగిస్తారు, అయితే నిమ్మ నూనె ఈ రెండు నూనెల కంటే మెరుగైనది. చర్మానికి మేలు చేస్తుంది.. చర్మంపై మొటిమలు,  చీము తగ్గించడానికి లెమన్ ఎసెన్షియల్ ఆయిల్  ఉపయోగించవచ్చు.  ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. ఇది సహజంగానే  రక్తస్రావ నివారిణిగా పనిచేస్తుంది.  చర్మం మీది మృత కణాలను శుభ్రపరచడం, మూసుకుపోయిన  రంధ్రాలను తెరవడం ద్వారా పనిచేస్తుంది. నిమ్మకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతం చేసి  ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి. అయితే నిమ్మకాయ చర్మాన్ని సున్నితంగా మార్చుతుంది కాబట్టి ఎండలోకి వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్‌ని అప్లై చేయాలి.                                                               *నిశ్శబ్ద.

విటమిన్ బి12 లోపం..ఈ వ్యాధులకు కారణం..!!

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అత్యంత అవసరమైన విటమిన్లలో  విటమిన్ బి-12 కూడా ఒకటి . విటమిన్ B12 శరీరంలో సహజంగా ఉత్పత్తి అవ్వదు. ఇది ఆహారం, పానీయాల నుండి మాత్రమే లభిస్తుంది. ఈ విటమిన్ ఎర్ర రక్త కణాలు, DNA ఏర్పడటానికి అవసరం. మెదడు, నరాల కణాల అభివృద్ధిలో విటమిన్ B-12 చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంటే మన శారీరక, మానసిక ఆరోగ్యానికి ఈ విటమిన్ చాలా అవసరం. వృద్ధాప్యంలో దాని లోపం కారణంగా, డిమెన్షియా సమస్య ఉండవచ్చు. పెద్దలు మాత్రమే కాకుండా పిల్లలు కూడా దాని లోపానికి గురవుతారు. అల్జీమర్స్ వ్యాధి, చిత్తవైకల్యం మెదడుకు సంబంధించిన సమస్యలు. 60 సంవత్సరాల వయస్సులో, ఈ రెండు వ్యాధుల ప్రమాదం పురుషుల నుండి స్త్రీలకు పెరుగుతుంది. ఈ వ్యాధిలో ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం ప్రభావితమవుతుంది. కొన్ని విటమిన్ల లోపం వల్ల కూడా డిమెన్షియా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందులో ఒకటి విటమిన్ బి-12. విటమిన్ బి12 లోపం వల్ల డిమెన్షియా వచ్చే ప్రమాదం: డిమెన్షియా అనేది ఒక వ్యాధి, దీనిలో వయస్సు పెరుగుతున్న కొద్దీ మరచిపోయే సమస్యలను కలిగి ఉంటారు. దీనికి ప్రధాన కారణం శరీరంలో విటమిన్ బి12 లోపం. ఇది మన మనస్సును నేరుగా ప్రభావితం చేస్తుంది. డిమెన్షియాలో, ఒక వ్యక్తి ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం ఎక్కువగా ప్రభావితమవుతుంది. విటమిన్ B-12 వల్ల కలిగే ఇతర సమస్యలు: కీళ్లు,ఎముకల నొప్పి: శరీరంలో విటమిన్ బి-12 లోపం వల్ల ఎముకలు, కీళ్ల నొప్పుల సమస్య కూడా రావచ్చు. దీని కారణంగా, నడుము, వెన్నులో నిరంతర నొప్పి ఉండవచ్చు. గర్భంలో సమస్య: విటమిన్ B-12 లోపం యొక్క ప్రభావం గర్భిణీ స్త్రీలలో కూడా కనిపిస్తుంది. ఈ కారణంగా, పిల్లల అభివృద్ధి సమయంలో, గర్భధారణ సమయంలో సమస్యలు పెరుగుతాయి. దాని లోపం కారణంగా, గర్భం ధరించడంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. చర్మ వ్యాధి: శరీరంలో విటమిన్ బి12 లేకపోవడం వల్ల చర్మానికి సంబంధించిన సమస్యలు కూడా వేధిస్తాయి. దాని లోపం వల్ల జుట్టు కూడా చాలా వేగంగా రాలిపోతుంది. రక్తహీనత: శరీరంలో విటమిన్ బి-12 లోపం వల్ల రక్తహీనత వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. విటమిన్ బి-12 లోపం వల్ల ఎర్ర రక్త కణాలు సరిగా ఉత్పత్తి కావు. అటువంటి పరిస్థితిలో, హిమోగ్లోబిన్ తగ్గడం ప్రారంభమవుతుంది. రక్తహీనత పూర్తి అవకాశాలు ఉన్నాయి. విటమిన్ B-12 లోపానికి చికిత్స చేసే ఆహారాలు: విటమిన్ B12 లోపాన్ని అధిగమించడానికి, మీ ఆహారంలో పాలు, చీజ్, ఇతర పాల ఉత్పత్తుల మొత్తాన్ని పెంచండి. మీరు మాంసాహారులైతే, ముఖ్యంగా మీ ఆహారంలో గుడ్లు, మాంసాన్ని చేర్చుకోండి. మీరు డాక్టర్ సలహాపై ఈ విటమిన్ యొక్క సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు.

అధిరిపోయే ఆరోగ్యానికి రెయిన్ బో డైట్..

  శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఆరోగ్యకరమైన,  పోషకమైన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా ముఖ్యం. పౌష్టికాహారం  తీసుకుంటేనే  మనకు అవసరమైన అన్ని పోషకాలు లభిస్తాయి. అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమలేకపోవడం  అనే రెండు చెడు అలవాట్లే ప్రస్తుతం చాలా వ్యాధులకు ప్రధాన కారణమని డైటీషియన్లు చెబుతున్నారు.ఆహారంలో పోషక విలువలపై మాత్రమే శ్రద్ధ వహిస్తే, మధుమేహం,  గుండె వంటి ప్రాణాలను బలికొనే వ్యాధుల   ప్రమాదాన్ని 40 శాతం తగ్గించవచ్చు. అయితే చాలామందికి పోషకాహారం తినడమే కాదు, దాన్ని సమకూర్చుకోవడం, పోషకాహరంలో ఏ ఆహారం ఉండాలి?  ఎలాంటి ఆహారం ఉండాలి అనే అవగాహన ఉండదు.  ఆరోగ్యకరమైన పోషకాహారానికి,  మంచి ఆరోగ్యానికి  మధ్య ఉన్న సంబంధాల గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుండి 7 వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలను జరుపుకుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మొత్తం శరీరం ఆరోగ్యంగా,  ఫిట్‌గా ఉండాలంటే రెయిన్‌బో డైట్‌ను అనుసరించడం చాలా ముఖ్యం. అసలు రెయిన్ బో డైట్ అంటే ఏంటి? ఇందులో ఏయే ఆహారాలు, కూరగాయలు, పండ్లు ఉండాలి?   ఈ విషయాల గురించి పూర్తీగా తెలుసుకుంటే.. రెయిన్‌బో డైట్ సమర్థవంతమైన ఆరోగ్యానికి రెయిన్ బో డైట్ చాలా ముఖ్యమైనది. ఇది పూర్తీ శరీర సామర్థ్యానికి సహాయపడుతుంది.  రెయిన్‌బో డైట్ అంటే వివిధ రంగుల పండ్లు  కూరగాయలను ఆహారంలో చేర్చడం. రంగురంగుల పండ్లు,  కూరగాయలలో  విటమిన్లు, ఖనిజాలు,  యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి, ఇవి శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనాన్ని చేకూరుస్తాయి.  రెయిన్‌బో డైట్‌లో ముఖ్యమైనవి ఏవంటే.. ఎరుపు రంగు పండ్లు,  కూరగాయలు.. ఎరుపు రంగు పండ్లు,  టమోటాలు, స్ట్రాబెర్రీలు  లాంటి  ఇతర కూరగాయలు విటమిన్లు, పోషకాలను సమృద్ధిగా కలిగి  ఉంటాయి. చాలా పండ్లలో విటమిన్ ఎ, పొటాషియం,  యాంటీఆక్సిడెంట్లు  ఉంటాయి, ఇవి శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. రోజువారీ ఆహారంలో ఎరుపు రంగు పండ్లు, కూరగాయలను చేర్చుకోవాలి. ఆరెంజ్ పండ్లు,  కూరగాయలు.. ఎరుపు రంగు పండ్లతో పాటు నారింజ రంగు పండ్లు  కూరగాయలను కూడా ఆహారంలో చేర్చుకోవాలి. ఎరుపు,  నారింజ కూరగాయలలో అధిక మొత్తంలో విటమిన్ ఎ ఉంటుంది, ఇది నోటిలోని లాలాజల గ్రంథులు,  శ్లేష్మ కణజాలాల ఆరోగ్యానికి అవసరం. ఈ విటమిన్ లోపం వల్ల దంతాలు బలహీనపడతాయి. విటమిన్ ఎ  కళ్ళ ఆరోగ్యానికి చాలా అవసరం.  నారింజ రంగు పండ్లు, కూరగాయల ద్వారా విటమిన్ ఎ శరీరానికి సమర్థవంతంగా అందుతుంది. తెలుపు రంగులో ఉండే  పండ్లు, కూరగాయలు.. తెల్లటి పండ్లు,  కూరగాయలు   శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంతో పాటు అధిక రక్తపోటు సమస్య నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.  వాటిని తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో  చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచే ప్రభావాన్ని కూడా కలిగి ఉంటుంది. తెల్లటి పండ్లు,  కూరగాయలలో లభించే పోషకాలు పెద్దప్రేగు, ప్రోస్టేట్ మరియు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. క్యాలీ ఫ్లవర్, అరటిపండు, సీతాఫలం, పచ్చి టమోటా, ముల్లంగి వంటివి ఇందులో భాగంగా తీసుకోవచ్చు. ఆకు కూరలు, ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు.. ఆకుకూరల్లో  ఫోలేట్‌లో సమృద్ధిగా ఉంటుంది. ఇది న్యూరోట్రాన్స్‌మిటర్ ఉత్పత్తికి,  మానసిక స్థితి స్థిరత్వానికి బాగా పనిచేస్తుంది. అలాగే ఆకుపచ్చ రంగులో ఉండే బ్రోకలి, క్యాప్సికమ్, కాకర వంటి కూరగాయలు, ఆకుపచ్చ రంగులో ఉండే పండ్లలో ఫోలెట్ పొందవచ్చు. పర్పుల్ కలర్ ఆహారాలు.. ద్రాక్ష, బ్లాక్‌బెర్రీలు, రేగు వంటి ఊదారంగు పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ,  న్యూరోప్రొటెక్టివ్ ప్రభావాలను కలిగి ఉన్న ఆంథోసైనిన్‌లు ఉంటాయి. తృణధాన్యాలు.. క్వినోవా, బ్రౌన్ రైస్,  హోల్ వీట్ వంటి రంగురంగుల తృణధాన్యాలను ఎంచుకోవాలి. ఈ ధాన్యాలు స్థిరమైన శక్తిని అందిస్తాయి,  మెరుగైన మానసిక స్థితిని,  అభిజ్ఞా పనితీరును మెరుగు పరుస్తాయి. గింజలు,  విత్తనాలు.. బాదం, వాల్‌నట్‌లు, చియా గింజలు,  అవిసె గింజలు వంటి వివిధ రకాల  గింజలను అల్పాహారంలో భాగం  చేయాలి.  వీటిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్  మెదడు ఆరోగ్యానికి తోడ్పడే అవసరమైన పోషకాలను అందిస్తాయి. కొవ్వులు.. చేపలు, చికెన్, చిక్కుళ్ళు,  టోఫు వంటి  ప్రోటీన్ మూలాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ ఆహారాలు న్యూరోట్రాన్స్మిటర్ ఉత్పత్తికి అవసరమైన అమైనో ఆమ్లాలను అందిస్తాయి. మూలికలు, సుగంధ ద్రవ్యాలు.. పసుపు, అల్లం,  రోజ్మేరీ వంటి మూలికలు, సుగంధాలను తీసుకోవాలి. అవి యాంటీ ఇన్ఫ్లమేటరీ,  కాగ్నిటివ్-పెంచే లక్షణాలను కలిగి ఉండే సమ్మేళనాలను కలిగి ఉంటాయి.                                                        *నిశ్శబ్ద.  

ఈ పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగకూడదని మీకు తెలుసా?

చాలామంది ఆహారం తిన్న వెంటనే లేదంటే భోజనం చేయగానే నీళ్లు తాగుతుంటారు. ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలా చేస్తే జీర్ణసమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు. అలాగే కొన్ని పండ్లను తిన్న వెంటనే మంచినీళ్లు తాగడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు వస్తాయంటున్నారు. అవేం పండ్లు? అవి తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం. ఆమ్ల ఫలాలు: నారింజ, ఉసిరి, ద్రాక్ష వంటి పుల్లని పండ్లను తిన్న తర్వాత  నీరు త్రాగకూడదు. ఇలా చేయడం వల్ల శరీరంలోని pH స్థాయికి భంగం కలుగుతుంది. ఇది జీర్ణవ్యవస్థకు ఆటంకం కలిగిస్తుంది. పియర్స్: ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఫోలిక్ యాసిడ్, పొటాషియం, పియర్స్ జీర్ణక్రియకు సహాయపడతాయి. పియర్స్ తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. పుచ్చకాయ: శరీరంలో నీటి కొరతను అధిగమించడానికి పుచ్చకాయ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తిన్న తర్వాత నీళ్లు తాగితే జీర్ణవ్యవస్థ చెడిపోతుంది. లూజ్ మోషన్ అయ్యో అవకాశం ఉంటుంది. అరటిపండు: అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకం, కడుపు సమస్యల నుండి ఉపశమనం పొందుతుంది. కానీ అరటిపండు తిన్న తర్వాత నీళ్లు తాగితే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. దానిమ్మ: శరీరంలో రక్తాన్ని పెంచడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి దానిమ్మ ఉపయోగపడుతుంది. దానిమ్మ తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల వికారం, అసిడిటీ, వాంతులు అవుతాయి.