ఏపీ రాజధానికి లక్ష కోట్లివ్వండి...
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 14వ ఆర్థిక సంఘంతో జరిగిన సమావేశంలో కోరారు. తిరుపతిలో జరిగిన 14వ ఆర్థిక సంఘం సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుని వెళ్ళడానికి తమ దగ్గర స్పష్టమైన ప్రణాళికలు వున్నాయని వాటికి కేంద్రం సహకారం ఎంతో అవసరమని అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎన్నో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందని, వాటి పరిష్కారానికి కేంద్రం సహకరిస్తుందన్న నమ్మకం వుందని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవాలని చంద్రబాబు ఆర్థిక సంఘాన్ని కోరారు. రాజధాని నిర్మాణానికి 1,00, 213 కోట్లు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.