ఢిల్లీలో బీజేపీకి అవకాశం ఇవ్వాలి: షీలా దీక్షిత్
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్ సంచలన కామెంట్లు చేశారు. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి అవకాశం ఇవ్వాలని అన్నారు. ఈ కామెంట్లు బీజేపీకి హర్షాన్ని కలిగిస్తే, కాంగ్రెస్ పార్టీకి మాత్రం షాక్ ఇచ్చాయి. 15 ఏళ్లపాటు ఢిల్లీలో ప్రభుత్వానికి నేతృత్వం వహించిన ఆమెకు ప్రభుత్వం ఏర్పాటుపై రాజ్యాంగ నిబంధనలన్నీ తెలుసునని, అందుకే ఆమె ఆ తరహా వ్యాఖ్యలు చేశారని బీజేపీ నాయకులు అంటున్నారు. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు కోసం బీజేపీ ఎమ్మెల్యేల వేటలో పడిందంటూ ఆమ్ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ తీవ్రంగా ఆరోపిస్తున్న నేపథ్యంలో షీలా దీక్షిత్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఎన్నికలు కావాలని కాంగ్రెస్గానీ, ఆప్గానీ కోరుకోవడంలేదని షీలా దీక్షిత్ అన్నారు.