రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పాపాలు… ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి!  

భారతదేశంలో రాజకీయంగా ఓ విచిత్రమైన స్థితి వుంటుంది. అదేంటంటే… ఇప్పుడున్న సమస్యల్ని దేన్ని బాగా తవ్వి చూసినా… మూలంలో కాంగ్రెస్ హస్తం వుంటుంది! దేశాన్ని అత్యధిక కాలం దిల్లీలో, రాష్ట్రాల్లో ఏలిన అతి పురాతన పార్టీ అదే! కాబట్టి అన్ని అద్భుతాల వెనుక కాంగ్రెస్ వున్నా వుండకున్నా అన్ని అద్వాన్నాల వెనుక మాత్రం హస్తం… హస్తం వుండే తీరుతుంది! ఇప్పుడు తెలుగు రాష్ట్రాల విభజన చర్చ కూడా పదేపదే చేయి గుర్తు వైపే వేలెత్తి చూపుతోంది!     ఒకవైపు మోదీ, మరోవైపు చంద్రబాబు మోహరించి ఇప్పుడు ప్రత్యేక హోదా రణ రంగం చేస్తున్నారు. ఏపీలో అయితే కాంగ్రెస్ కు వున్నది సున్నా ఎమ్మెల్యేలు కాబట్టి పెద్దగా చర్చే లేదు. కేంద్ర స్థాయిలో ప్రధాన ప్రతిపక్షం కాబట్టి అడపాదడపా ఏపీ ప్రత్యేక హోదా అంటూ మాట్లాడుతుంటారు. రాహుల్, మన్మోహన్ సహా అందరూ హోదా ఇవ్వాల్సిందేనంటారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా కూడా హస్తం నేతలు లోక్ సభ, రాజ్యసభల్లో ఆంద్రా డిమాండ్లకు అండగానే నిలిచారు. ఇదంతా చూసి కాంగ్రెస్ పార్టీలో నిజాయితీ వుందని భ్రమిస్తే మనల్ని ఎవరూ కాపాడలేరు. ఎందుకు ఇలా అనాల్సి వస్తుందంటే… అసలు ఇప్పుడున్న అన్ని చిక్కుముళ్లకి కారణమే కాంగ్రెస్ కాబట్టి! ప్రత్యేక హోదాకు ఆనాటి ప్రధాని మన్మోహన్ ఒప్పుకుని కూడా బిల్లులో అధికారికంగా పెట్టలేదు. అదే ఇప్పుడు మోదీ సర్కార్ కి వరంగా మారింది. అదికారికంగా ఇవ్వని హామీ తీర్చకున్నా ఏమీ అనటానికి వీల్లేని పరిస్థితి. దీన్ని కాంగ్రెస్ తప్పు కాక మరెవరిది అనగలం?     తమ పదేళ్ల ప్రభుత్వ కాలంలో చిట్ట చివరి సమావేశాల రోజున సభలో తలుపులు వేసి రాష్ట్ర విభజన చేసిన సోనియా సేన… కావాల్సినన్ని చారిత్రక తప్పులు చేసింది. బిల్లులో హోదా గురించి ఎలాంటి హామీ ఇవ్వని యూపీఏ సర్కార్ మరో దారుణం కూడా చేసింది. ఏపీలోని 175 ఎమ్మెల్యే స్థానాల్ని 225కి పెంచాలని విభజన చట్టంలో పెట్టారు. కానీ, అది సాధ్యమేనా? 2026 వరకూ నియోజక వర్గాల పెంపు ఎట్టి పరిస్థితుల్లోనూ వీలు కాదు. రాజ్యాంగం అందుకు ఒప్పుకోదు. ఈ మాట చెబుతోన్నది ఎవరో తెలుసా? కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కొనసాగిన యూపీఏ ప్రభుత్వ మంత్రి చిదంబరం! తాజాగా జరిగిన స్థాయి సంఘం సమావేశంలో ఆయనని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇదే విషయమై నిలదీశారు కూడా! చిదంబరం చక్కగా మౌనం దాల్చారు తప్పు జవాబు ఇవ్వలేదు!     రాజ్యాంగం ఒప్పుకోదని తెలిసీ, 2026 వరకూ ఎమ్మెల్యే సీట్ల పెంపు కుదరదనీ తెలిసి… కాంగ్రెస్ ఆ హామీని బిల్లులో పెట్టింది. ఇప్పుడు అదే పార్టీకి చెందిన చిదంబరం నిర్మోహమాటంగా వీలు కాదని చెబుతున్నారు. ఇలాంటి పనులే హస్తం పార్టీ ఎప్పుడూ చేస్తూ వస్తుంటుంది! పైగా అటు హోదా రాకపోవటానికి, ఇటు నియోజక వర్గాల పెంపు జరగకపోవటానికి కారణమైన పార్టీనే మళ్లీ మేము ఆంధ్రాను ఆదుకుంటామని ప్రకటనలు చేస్తోంది. యూపీఏ సర్కార్ వస్తే ఏపీ స్పెషల్ స్టేటస్ ఖాయమని కాంగ్రెస్ నేతలు చెబుతన్నారు! వీళ్లని ఏపీ ఓటర్లు నమ్ముతారా? రాష్ట్రంలోని ఏ పార్టీ హస్తంతో చేయి కలపటానికి సిద్ధంగా లేకపోవటమే పరిస్థితికి అద్దం పడుతుంది! ఇష్టానుసారం విభజన చేసి, లోపభూయిష్టంగా హామీలు ఇచ్చి కాంగ్రెస్ ఆంధ్రాలో కొట్టుకుపోయింది. ఇప్పుడు ఆకులు పట్టుకుందామన్నా లాభం లేని స్థితిలో వుంది. మరోవైపు ఏపీలో ఎదిగే అవకాశం వున్నా బీజేపీ మొండి వైఖరితో స్వయంకృతాపరధం చేస్తోంది. మొత్తానికి సమీప భవిష్యత్ లో రెండు జాతీయ పార్టీలు ఆంధ్రాలో సున్నాలకే పరిమితం కాక తప్పకపోవచ్చు!

కోమటిరెడ్డి మీద కోపం కోర్టుతో కొట్లాటగా మారుతోందా?

కోర్టులకి , ప్రభుత్వాలకి మధ్య గొడవ ఎప్పుడూ వుండేదే! చాలా అంశాల్లో కోర్టుల ఆదేశాల్ని ప్రభుత్వాలు ఎలా అమలు చేయకుండా వుండాలా అని దార్లు వెతుకుతుంటాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వాలకి, హైకోర్టులకి మధ్య గొడవే కాదు సుప్రీమ్ కోర్టుకు , కేంద్రానికి కూడా అప్పుడప్పుడూ అభిప్రాయ భేదాలు వస్తూనే వుంటాయి. కానీ, మన రాజ్యాంగం ప్రకారం కోర్టు ఆదేశిస్తే ఎవరైనా శిరసావహించాల్సిందే. అందుకు ప్రభుత్వాలు, ప్రభుత్వ పెద్దలు కూడా అతీతం కారు. నిజానికి వారు బాధ్యతగా కోర్టు తీర్పుల్ని పాటించకపోతే సామాన్య జనానికి కూడా న్యాయస్థానాలపై గౌరవం తగ్గిపోయే ప్రమాదం వుంది. అందుకే బాధ్యత గల ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు ఎప్పుడూ పాల్పడదు!     కోర్టులకి, గవర్నెమంట్ కు గొడవ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే… హైద్రాబాద్ హైకోర్టు తెలంగాణ సర్కార్ పై సీరియస్ అయింది. ఏకంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కూడా సమన్లు జారీ చేస్తామని హెచ్చరించింది. నిజానికి అసెంబ్లీకి సంబంధించినంత వరకూ స్పీకర్ దే అంతిమ నిర్ణయం. ఆయన ఆదేశాల్ని ప్రశ్నించటానికి వీల్లేదు. కానీ, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ లపై తెలంగాణ స్పీకర్ తీసుకున్న చర్యలు వివాదాస్పదం అయ్యాయి. వేటు పడ్డ ఎమ్మెల్యేలు వేరే గత్యంతరం లేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన సస్పెన్షన్ వేటు ఎత్తి వేసింది. వారికి గన్ మెన్లను కూడా తిరిగి కేటాయించాలని కేసీఆర్ సర్కార్ ని ఆదేశించింది. కానీ, ఇంతవరకూ ఇద్దరు ఎమ్మెల్యేల్ని స్పీకర్ అసెంబ్లీలోకి రానివ్వలేదు. గన్ మెన్లను ప్రభుత్వం కేటాయించలేదు. ఇదే న్యాయమూర్తుల ఆగ్రహానికి కారణమైంది.     బహిష్కృత ఎమ్మెల్యేల్ని తిరిగి సభలోకి అనుమతించాలనీ, వారికి భద్రత కల్పించాలనీ, జీతభత్యాలు ఇవ్వాలని ఆదేశిస్తోన్న హైకోర్ట్ ఒక దశలో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ని సూటిగా ప్రశ్నించిందట. మీరు ప్రభుత్వం తరుఫున వాదిస్తున్నారా? లేక ఒక పార్టీ తరుఫునా? అంటూ ఏజీపై న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నిజంగా తెలంగాణ సర్కార్ పునరాలోచించుకోవాల్సిన అంశమే! ఎందుకంటే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో అధికార పక్షం గొడవగా మొదలైన బహిష్కరణ వ్యవహారం కోర్టుకి, ప్రభుత్వానికి మధ్య విభేదంగా మారుతోంది. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా చూస్తే అంత మంచిది కాదు. కాకపోతే, ఇప్పుడు కోర్టు చెప్పినట్లు కోమటిరెడ్డి, సంపత్ లను తిరిగి అసెంబ్లీలోకి ఆహ్వానిస్తే అది టీఆర్ఎస్ కు ఓటమిగా ప్రచారం అవుతుంది. బహుశా ఇదే తెలంగాణ సీఎం మదిలో మెదులుతున్న ఆలోచన కావచ్చు. కానీ, కొన్నిసార్లు కేసీఆర్ గులాబీ బాస్ గా కాకుండా ప్రభుత్వ అధినేతగా నిర్ణయం తీసుకుంటేనే హుందాగా వుంటుంది. స్పీకర్ తో బహిష్కరణ వేటు ఎత్తి వేయిస్తే మరింత డ్యామేజ్ జరగకుండా వుంటుంది. కోమటిరెడ్డి, సంపత్ సభలోకి వచ్చాక వార్ని తమ ఎమ్మెల్యేలతో కలిసి ఎదుర్కోవటం టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరీ అసాద్యం ఏం కాదు. ఆ కోణంలో ఆలోచించకుండా పట్టుదలకి పోయి కోర్టు ధిక్కరణ అంచున నిలవటం జనం ముందు అంత మంచి సంకేతమేం కాదు.     కోమటిరెడ్డి, సంపత్ లకు కోర్టులో దక్కిన తీర్పు, వారి కోసం న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు ఖచ్చితంగా టీకాంగ్ కు ఉత్సాహాన్నిచ్చేవే. జనంలోనూ, సభలోనూ టీఆర్ఎస్ ను ఈ వివాదంతో కొంత వరకూ ఇరుకున పెట్టవచ్చని వారు ఆలోచిస్తుండవచ్చు. కాకపోతే, ఈ గొడవ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు రాల్చేటంత సంచలనాత్మకమైందైతే కాదు!

బలిపీఠంగా మారుతోన్న ప్రత్యేక హోదా నినాదం!

    తెలుగు నేల ఏ క్షణాన రాష్ట్రాలుగా ఏర్పడిందోగానీ… ఇక్కడ ఎప్పుడూ బలిదానాలే! నిజాం నిరంకుశ పాలనలో వేల మంది ప్రాణాలు కోల్పాయరు. ఆ తరువాత భారతదేశంలో విలీనం అయిన హైద్రాబాద్ సంస్థానం ఆంధ్రాతో కలిసింది. తెలంగాణతో కలవటానికి ముందే ఆంద్ర రాష్ట్రం పొట్టి శ్రీరాములు బలిదానంతో ఏర్పడింది. ఇక ఆంధ్రా, తెలంగాణలు ఎలాగో కలిసి సమైక్యాంద్ర ఏర్పడితే… అది అనేక కారణాల వల్ల ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కారణమైంది. 1969లో తెలంగాణ ఉద్యమకారులు చనిపోయారు. వెంటనే… కొన్నేళ్లకే ప్రత్యేకాంధ్ర ఉద్యమంతో మరి కొంత మంది అసువులు బాయాల్సి వచ్చింది. ఇక 2014 విభజనతో ముగిసిన ఉదమ్యం సంగతైతే చెప్పక్కర్లేదు! తెలంగాణలో అనేక ప్రాణాలు గాల్లో కలిశాయి. ఆంద్రలోనూ కొందరు బలవన్మరణం పాలయ్యారని వార్తలొచ్చాయి. మొత్తానికి ఏపీ, తెలంగాణ వేరు వేరు అయిపోయాక ఈ బలిదానాల గుండెకోత వుండదని అంతా భావించారు! కానీ, ఇప్పుడు మరోమారు ప్రత్యేక హోదా బలిపీఠంపై తెలుగు ప్రాణాలు పణంగా పెట్టబడుతున్నాయి! ఇది నిజంగా విషాదం…     చంద్రబాబు నాయుడు స్వంత జిల్లా చిత్తూరులోని మదనపల్లెలో సుధాకర్ అనే 26 ఏళ్ల యువకుడు ఉరితాడుకు వేలాడి ప్రాణాలు తీసుకున్నాడు. కారణం…. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వటం లేదని! ఇంకా బోలెడంత జీవితం మిగిలి వున్న ఆ యువకుడు , చేసేది చేనేత పని! తల్లిదండ్రులు పారిశుద్ధ్య కార్మికులు! వింటుంటేనే ఎవరికైనా దుఃఖం పొంగుకొస్తుంది. తెలంగాణ ఉద్యమ ఉధృతిలోనూ ఇదే స్థితిని చూసింది తెలుగు జాతి. దిల్లీ పాలకుల నిర్లక్ష్యానికి మనమెప్పుడూ మూల్యం చెల్లిస్తూనే వున్నాం. నెహ్రు నుంచీ మోదీ దాకా ఇదే పద్ధతి. నెహ్రూ సకాలంలో స్పందించకే పొట్టి శ్రీరాములు ఆత్మబలిదానం చేయాల్సి వచ్చింది. ఇప్పటికే అదే దుస్థితి కొనసాగుతోంది. అయితే, ప్రత్యేక హోదా విషయంలో మోదీ సర్కార్ చాలా స్పష్టంగా వీలుకాదని చెబుతోంది. ఆంధ్రా అధికార, ప్రతిపక్ష నాయకులు ఎవరికి తోచిన రీతిలో వారు పోరాడుతున్నారు. ఏ కొంత రాజకీయ పరిజ్ఞానం వున్న వారికైనా ప్రత్యేక హోదా రాదని స్పష్టంగానే అవగాహన వుంటుంది. కనీసం జేసే దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు మోదీ ప్రధానిగా వున్నంత కాలం హోదా డిమాండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ సాద్యం కాదు. ఇదంతా సుధాకర్ లాంటి అమాయకులకి చేరవేయటంలో రాజకీయ పార్టీలు, మీడియా, సోషల్ మీడియా విఫలం అవుతున్నాయి.     బ్రిటీష్ వాళ్లతో స్వతంత్ర పోరాటం చేసినప్పుడు కూడా మనం కోరింది అంతా తేలిగ్గా లభించలేదు. కానీ, అప్పుడు ఇప్పటిలా ఆత్మహత్యలు జరగలేదు. కారణం ఉద్యమం నడిపే నేతలు జనానికి భరోసా కల్పించేవారు. ఏనాటికైనా బతికి సాధించగలమని నమ్మకం కలిగించే వారు. ఇప్పుడు ఎవరికి నచ్చినట్టు వాళ్లు మాట్లాడుతూ, ఎవరి వ్యాఖ్యానాలు, విశ్లేషణలు వారు చేస్తూ రాష్ట్రం కోసం తపించే నిజాయితీపరుల్ని ఒత్తిడికి గురిచేస్తున్నారు. మదనపల్లెలో ఆత్మహత్య చేసుకున్న సుధాకర్ హోదా ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవాడట. ఇలా చురుగ్గా పాల్గొంటూ తెలంగాణ కోసం ప్రాణాలు కోల్పోయిన వారు కూడా అనేకం. ఇప్పుడు సుధాకర్ అలాగే చేశారు. ఈయనకంటే ముందే తిరుపతికి చెందిన మునుకోటి అనే వ్యక్తి హోదా కోసం ప్రాణాలు తీసుకున్నారు. ఇలాంటి వాట్ని రాజకీయ నేతలు సీరియస్ గానే తీసుకోవాలి. తమ పార్టీ కార్యకర్తల చేత చైతన్యం తీసుకొచ్చే విధంగా ప్రచారం చేయించాలి. మీడియాని, సోషల్ మీడియాని పెద్ద పెద్ద నాయకులు సమర్థంగా వాడుకుని ఆత్మహత్యలు వద్దని చెప్పాలి. లేదంటే, వందల మందిని బలితీసుకున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలాగే ప్రత్యేక హోదా కూడా అయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం జనాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ హోదా కోసమో, మరింక దేనికోసమో చేసుకునే ఆత్మహత్యల్ని హైలైట్ చేయకుండా వుండాలి. వాటి మీద చర్చ పెట్టి ముందు ముందు వేరే వారు చేసుకోకుండా చూడాలిగానీ…. టీఆర్పీల కోసం డెడ్ బాడీ వద్దకిపోయి సెన్సేషనలిజానికి తెగబడవద్దు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్… కేంద్రం జనం ఎందు కోసం ఆత్మహత్యల దాకా వెళుతున్నారో అర్థం చేసుకోవాలి!

సైకిల్... హస్తం... కమలం… ఇక ఫ్యాన్?

అన్న ఎన్టీఆర్ అంటే అందరికీ గుర్తుకు వచ్చే పార్టీ టీడీపీనే! ఆయన స్థాపించిన ఆ పార్టీ, దాని పచ్చ జెండా, సైకిల్ గుర్తు చరిత్ర సృష్టించాయి. అయితే, తరువాతి కాలంలో నందమూరి వారసులు కాకుండా నారా చంద్రబాబు నాయుడు టీడీపీకి పెద్ద దిక్కయ్యారు. ఇప్పుడు కూడా పార్టీని చంద్రబాబే ముందుండి నడుపుతున్నారు. బాలకృష్ణ ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నా పెద్దగా పార్టీ వ్యవహారాల్లో కలుగజేసుకోరు. హరికృష్ణ, ఆయన తనయులు కూడా ఈ మధ్య టీడీపీకి దగ్గరగా ఏం మసులుకోవటం లేదు. మొత్తానికి ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు అందరూ రాజకీయంగా పెద్దగా యాక్టివ్ గా లేకుండా అయిపోయారు. కేవలం నందమూరి పురంధేశ్వరి మాత్రం ఇందుకు మినహాయింపు!     మొదట తండ్రి పెట్టిన టీడీపీలో ప్రస్థానం ప్రారంభించిన పురంధేశ్వరి క్రమంగా చంద్రబాబుతో రాజకీయ విభేదాల కారణంగా కాంగ్రెస్ దిశగా కదిలారు. అసలు ఎన్టీఆర్ మనసావాచాకర్మణా వ్యతిరేకించిన హస్తం పార్టీలో ఆమె చేరటమే పెద్ద సంచలనం! అయినా ఆమె సోనియా సైన్యంలో చేరిపోయారు. కేంద్ర మంత్రి పదవి కూడా అలంకరించారు. కానీ, రాష్ట్ర విభజన నేపథ్యంలో పురంధేశ్వరి పార్టీ ఫిరాయించారు. ఈసారి కాంగ్రెస్ కు బద్ధ వ్యతిరేకి అయిన బీజేపీ పార్టీలో చేరారు. టీడీపీ నుంచీ కాంగ్రెస్ లో చేరటం ఎంత విడ్డూరమో అంతే విచిత్రం కాంగ్రెస్ నుంచీ బీజేపీలోకి రావటం కూడా! కాకపోతే, కమలంలో చిన్నమ్మ ఆశించినంత వర్కవుట్ కాలేదు. బీజేపీ, టీడీపీ పొత్తు వున్నప్పుడు కూడా చంద్రబాబు సర్కార్ లో ఆమె భాగం కాలేకపోయారు. ఎంపీగానూ, ఎమ్మెల్యేగానూ గెలవని ఆమె ఏ  కేంద్ర, రాష్టర ప్రభుత్వ పదవి లేకుండానే కాలక్షేపం చేయల్సి  వచ్చింది. ఇప్పుడిక మరోసారి ఎన్నికల సీజన్ వస్తుండటంతో పురంధేశ్వరి కదలికలపై ప్రచారాలు మొదలయ్యాయి…     ఇప్పటికైతే బీజేపీలోనే వున్న పురంధశ్వరి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారని టాక్ వినిపిస్తోంది! అయితే, అది కమలం గుర్తుపై కాదట. ఫ్యాన్ గుర్తు మీదనట. వైసీపీలోకి జంప్ చేసి ఆమె విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారని అంటున్నారు. జగన్ కూడా ఓకే చేశారని చెబుతున్నారు. ఇది ఎంత వరకూ నిజమో ఇప్పుడే చెప్పలేం. కానీ, పురంధేశ్వరి ఇలాంటి నిర్ణయం తీసుకోటానికి బలమైన కారణమే వుంది. ఆమె తన  కొడుకు పొలిటికల్ ఎంట్రీకి ఈ పని చేయక తప్పటం లేదట.     పురంధేశ్వరి తనయుడు పరుచూరు నియోజకవర్గం నుంచీ పోటీ చేయాలని భావిస్తున్నాడట. గతంలో అక్కడ్నుంచీ దగ్గుబాటి వేంకటేశ్వరరావు పోటీ చేసి గెలిచారు. అయితే, ఇప్పుడు తమ అబ్బాయిని పరుచూరు నుంచి పోటికి దింపాలంటే బలమైన పార్టీ కావాలి. బీజేపీలో వున్న పురంధేశ్వరి అదే పార్టీ నుంచీ కొడుకు దించేంత రిస్క్ చేయలేరు. ప్రత్యేక హోదా విషయంలో పూర్తిగా విలనైన కాషాయ పార్టీ ఎంత మాత్రం సూటబుల్ కాదు. ఆ పార్టీ టికెట్ పై పురంధేశ్వరి రాజకీయ వారసుడు బరిలోకి దిగితే అసలుకే మోసం వస్తుంది. అలా కాదని టీడీపీ నుంచి పోటీ చేసే చాన్స్ కూడా లేదు. చంద్రబాబుతో పురంధేశ్వరి దంపతుల విభేదాలే కారణం. ఇక మిగిలింది జగన్ పార్టీనే! అందుకే, పురంధేశ్వరి తాను బీజేపీ వదిలి వైసీపీలోకి మారి, కొడుకుని కూడా ఫ్యాన్ గుర్తుపై పోటీ చేయించాలని భావిస్తున్నారట! విజయవాడ ఎంపీగా పురంధేశ్వరి , పరచూరు ఎమ్మెల్యేగా ఆమె తనయుడు పోటీ చేసి గెలుస్తారో లేదో తరువాతి సంగతి… కానీ, ఏపీలోని ప్రధాన పార్టీలైన టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, వైసీపీలు అన్నిట్లో పని చేసిన ఘనత మాత్రం నందమూరి పురంధేశ్వరికే దక్కుతుంది. అలాగే, ఈ మద్య కన్నా లక్ష్మీనారాయణను చివరి నిమిషంలో వెనక్కి లాగేసిన బీజేపీ పెద్దలు చిన్నమ్మ పార్టీ మార్పుపై ఎలా స్పందిస్తారో కూడా చూడాలి!

అభివృద్ధి హైవే వదిలి హిందూత్వ బైపాస్‌కి రూటు మార్చిన బీజేపీ!   

దేశంలో హిందూత్వ పార్టీ అనగానే మనకు గుర్తుకు వచ్చేది బీజేపీనే! శివసేన లాంటి పార్టీలు అక్కడా ఇక్కడా వున్నా ప్రధానమైన హిందూత్వ ఎజెండాతో నడిచే కాషాయ పార్టీ కమలదళమే! అయితే, ఆరెస్సెస్ అండతో ముందుకు పోయే బీజేపీ రెండు రకాల మాటలతో రాజకీయం చేస్తూ వుంటుంది. ఒకవైపు అభివృద్ధి, సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటూనే మరో వైపు అవసరమైనప్పుడల్లా రామ మందిరం, హిందూత్వా అంటుంది! ఎప్పుడు ఏది వర్కవుట్ అవుతుందో బీజేపీ పెద్దలకు బాగా తెలుసు. అలాగే ఎప్పుడు ఎవరు మాట్లాడాలో కూడా వారికి బాగా తెలుసు! అభివృద్ధి , అవినీతి నిర్మూలన, నల్లధనం, నిరుద్యోగం లాంటి మాటలు మాట్లాడే వారు గోవధ నిషేధం, ముస్లిమ్ లలో జనాభ పెరుగుదల, అయోధ్య రామ మందిరం… ఇలాంటి అంశాల జోలికి వెళ్లరు. తాజాగా కాషాయ నేతల వరుస కామెంట్లు చూస్తే మనకు రానున్న ఎన్నికల ఎజెండా ఏంటో తెలిసిపోతుంది!     2014లో కాంగ్రెస్ పదేళ్ల పాలనలోని అవినీతి, స్కామ్ లు మోదీకి బాగా కలిసొచ్చాయి. అందుకే, ఎక్కువగా హిందూత్వ ఎజెండా నెత్తికెత్తుకోలేదు. కాంగ్రెస్ హఠావ్ నినాదంతో అబ్ కీ బార్ మోదీ సర్కార్ అంటూ హోరెత్తించారు. కానీ, నాలుగేళ్ల తరువాత సీన్ మొత్తం రివర్సైంది. మోదీ వచ్చాక చేపట్టిన నోట్ల రద్దు, జీఎస్టీ వంటి ప్రయోగాలు పేద, మధ్యతరగతి వారికి అసతంతృప్తి కలిగిస్తున్నాయి. అలాగే, ఉత్తరాదిలో బీజేపీ పట్టు అంతకంతకూ సడలుతోంది. పోయిన సారి ఎంపీల సీట్ల విషయంలో రాష్ట్రాలకు రాష్ట్రాలు క్లీన్ స్వీప్ చేసిన చోట ఇప్పుడు ఉప ఎన్నికల్లో వరుస ఓటములు భయపెడుతున్నాయి. అందుకే, ఉత్తరాది హిందూ ఓటర్లని కదిలించే పనిలో పడింది కాషాయ దళం. అందుకు తగ్గట్టే అతివాదులుగా ముద్రపడ్డ బీజేపీ నేతలు నోటికి పని చెబుతున్నారు. కొన్ని రోజుల వ్యవధిలో వారి కామెంట్లు చూస్తే భవిష్యత్ వ్యూహం ఏంటో అర్థమైపోతుంది!     ఉత్తర్ ప్రదేశ్ నుంచీ పార్లెమంట్ కు ఎంపికైన ఎంపీ హరి ఓం పాండే. ఈయన తాజా కామెంట్ ఏంటంటే… దేశ స్వాతంత్ర్యం తరువాత ముస్లిమ్ జనాభ క్రమంగా పెరుగుతూ వస్తోంది. అందువల్లే ఉగ్రవాదం, అత్యాచారాలు పెరుగుతున్నాయి. మనం తక్షణం పార్లమెంట్లో జనాభ పెరుగుదల నియత్రణ కోసం బిల్లు తీసుకురాకపోతే మరోసారి పాకిస్తాన్ లాగా భూభాగం కోల్పోవాల్సి వస్తుంది! ఇదీ ఆయన చేసిన హాఠాత్తు వ్యాఖ్య!   ఉత్తర్ ప్రదేశ్ కే చెందిన మరో బీజేపీ నేత సురేంద్ర సింగ్. ఆయన కూడా ముస్లిమ్ లలో జనాభా పెరుగుదల ఎక్కువగా వుందని అన్నారు. అందుకు విరుగుడుగా హిందువులు కూడా అయిదుగురు పిల్లల్ని కనమని పిలుపునిచ్చారు. ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, మరొకరు ఎవరైనా ఫర్వాలేదని ఆయన అన్నారు! బీజేపీ ఉత్తరాది నాయకులు మైనార్టీ వర్గాల్ని టార్గెట్ చేస్తే దక్షిణాది నేతలు మేధావుల్ని, అభ్యుదయవాదుల్ని విమర్శిస్తున్నారు. కర్ణాటకలో ఈ మద్యే ఎన్నికల్లో గెలిచిన ఓ ఎమ్మెల్యే మేధావుల్ని, అభ్యుదయవాదుల్ని ఏకంగా కాల్చిపారేయాలని అభిప్రాయపడ్డాడు. తానే దేశ హోంమంత్రి అయితే పోలీసులకి కాల్చిపారేయమని ఆదేశాలు ఇస్తానన్నాడు బసన గౌడ! కర్ణాటకలో ఈ మధ్యే గౌరీ లంకేష్ లాంటి రచయిత్రి మీద దాడి జరగటం మనందరికీ తెలిసిందే!     ముస్లిమ్ లకు వ్యతిరేకంగా, మేధావులు, అభ్యుదయవాదులకి వ్యతిరేకంగా ఇలా మాట్లాడే వారు బీజేపీలో ఎప్పుడూ వుంటారు. కానీ, వీరంతా ఇప్పుడు హఠాత్తుగా వ్యాఖ్యలు చేయటం యాదృచ్ఛికం కాకపోవచ్చు. గోరక్షకుల దాడుల్ని, ఎక్కడ మైనార్టీలకు, దళితులకి ఏ కాస్త ఇబ్బంది కలిగినా ఆ సంఘటనల్ని కాంగ్రెస్ హైలైట్ చేస్తోంది. ఇతర సెక్యులర్ పార్టీలు కూడా మోదీ సర్కార్ ని వీలైనంత ఇబ్బంది పెడుతూ వస్తున్నాయి. ఇటువంటి సెక్యులర్ రాజకీయాలకు విరుగుడుగా బీజేపీ హిందూత్వ ఎజెండాను మరోసారి నెత్తికెత్తుకుంది. పరిస్థితి చూస్తుంటే ముందు ముందు ఎన్నికల హోరులో కాషాయ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు ఇంకా పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి. 2019 పార్లెమంట్ ఎన్నికల నాటికి ఈ మాటలు పరాకాష్టకు చేర్చి మోదీని మరోసారి పీఠం ఎక్కించటం ఈ మొత్తం వ్యూహం లక్ష్యంగా భావించాలి! అయితే, అది ఎంత వరకూ వర్కవుట్ అవుతుంది? ఓటర్లు ఎంత వరకూ ఎమోషనల్ అవుతారు? వేచి చూడాలి! అంత వరకూ మాత్రం రాహుల్ లాంటి సెక్యులర్ నేతలు, ఓవైసీ లాంటి మైనార్టీ నేతలు బీజేపీ నేతలు చేసే వ్యాఖ్యలకి చెలరేగిపోయి స్పందించటం నిత్య కృత్యమే అవుతుంది!

మాంత్రికుడి ప్రాణం చిలకలో… పవన్‌కు గండం ఫ్యాన్స్ ఆవేశంలో!

పవన్ భయపడ్డంతా జరిగింది! ఆయన నోరు తెరిచి రచ్చ చేయొద్దని వేడుకున్నా… ఆయన సోకాల్డ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నానా యాగీ చేశారు! ఇది కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కే పదే పదే ఎదురయ్యే సమస్య! ఏం చేయాలో అర్ఝం కాని వ్యవహారం! ఇప్పుడు ఫుల్ టైం పొలిటీషన్ అయిన జనసేన అధినేత ఫ్యాన్స్ అని చెప్పుకునే వారు చేసే వెటకారాలకు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అయినా వారిలో మాత్రం ఆవేశం, ఆలోచన రావటం లేదు… జగన్ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి, పెళ్లాల గురించి మాట్లాడాడు. అది తప్పే. కానీ, వెంటనే పవన్ తన అభిమానులకి స్పష్టంగా చెప్పాడు. ఎక్కడా వైఎస్ కుటుంబ సభ్యుల్ని, వారింటిలోని ఆడపడుచుల్ని వివాదంలోకి లాగవద్దని. జనసేనాని ఇంతలా పరిణతి చూపించి పిలుపునిచ్చినా పవనిస్టులు మాత్రం తమ కథ తాము నడిపారు! వైఎస్ జగన్ కుటుంబంలోని ఆడవార్ని కాకుండా ఎవరో కొత్తమ్మాయిని గొడవలోకి లాగారు. ఆమె పేరు అలేఖ్యా ఏంజిల్. ఆమెతో జగన్ వున్న సెల్ఫీ ఫోటోను వైరల్ చేసి శునకానందం పొందారు! ఇదే వద్దని చెప్పారు పవన్. అయినా తమ బుద్ధి పోనిచ్చుకోలేదు ఉన్మాద అభిమానులు…     పాపం… పవన్ పదే పదే ఇలాంటి ఆవేశపూరిత ఫ్యాన్స్ వల్ల తంటాలు పడాల్సి వస్తోంది. కత్తి మహేష్ విషయంలో గబ్బర్ సింగ్ అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దాన్ని ఒక విధంగా కత్తి చాలా తెలివిగా వాడుకుని గందరగోళం కూడా సృష్టించారు. ఆ పైన వర్మదీ, శ్రీరెడ్డిది కూడా ఇదే ఫార్మాట్! వాళ్లు పవన్ ని ఏదో అనటం, పవన్ వాళ్లనీ ఏమీ అనకున్నా ఫ్యాన్స్ రెచ్చిపోవటం, చివరకు తలనొప్పి అంతా పవర్ స్టార్ భరించాల్సి రావటం జరుగుతోంది. వపన్ అబిమానులు దుందుడుకు చర్యల వల్ల ఆయన రెండు, మూడు న్యూస్ ఛానల్స్ మ్యానేజ్మెంట్లతో కూడా గొడవపడాల్సిన స్థితి దాపురించింది. ఇక ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ వ్యవహారం కూడా ఇప్పుడు మాట్లాడుకోవాల్సిందే! కందకు లేని దురద అన్న సామెత గుర్తొచ్చేలా పవన్ ఫ్యాన్స్ వదినమ్మని రెండో పెళ్లి చేసుకోవద్దని కలకలం రేపారు. పవన్, రేణు పరస్పర అవగాహనతో విడిపోయినా వీరే తెగ ఫీలయ్యారు!     వపన్ కళ్యాణ్ అభిమానులు ఇంత కాలం సోషల్ మీడియాలో చేసిన హంగామా వేరు. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో వుంటూ … జనసేనాని ఓట్ల కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో… వీరి ఆగడాలు తీసుకొచ్చే ఫలితాలు వేరు! పవన్ కి ఈ విషయం తెలియదని భావించలేం. కానీ, ఆయన తన అభిమానులని చెప్పుకునే వార్ని ఎలా కంట్రోల్ చేస్తారు? జగన్ వ్యక్తిగత విమర్శల్ని పట్టించుకోవద్దని చెప్పినా కూడా జరగాల్సింది జరిగిపోయింది. అనవసరంగా ఎవరో అలేఖ్యా అనే అమ్మాయి పవన్ అభిమానుల ఆవేశానికి మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఆమె ఓ క్రిస్టియన్ గీతాల సీడీ ఆవిష్కరణ కోసం లోటస్ పాండ్ కు వచ్చింది. అదీ తన కుటుంబ సభ్యులతో కలిసి. ఆ సమయంలో ఓ సెల్ఫీ తీసుకుంది. ఇంత చిన్న విషయాన్ని తమ ఇష్టానుసారం రాతలతో సోషల్ మీడీయాలో వైరల్ చేసి ఆనందించారు పవన్ అభిమానులు. దానికి అలేఖ్యా బాధపడి పోస్టు పెట్టింది. తనని బజారుకు లాగొద్దని వేడుకుంది. ట్విస్ట్ ఏంటంటే… తానూ పవన్ అభిమానినేనని చెప్పింది పాపం!     ఇప్పుడు జగన్, అలేఖ్యాల ఫోటో విషయంలో జరిగిన రచ్చకి పవన్ కారణం కాదు. అలాగే, కత్తి మహేష్, వర్మ, శ్రీరెడ్డి, రేణు దేశాయ్‌ల వ్యవహారాల్లో కూడా! కానీ, జనం ఓట్లు వేయటానికి పోలింగ్ బూత్ కి బయలుదేరేటప్పుడు ఇదంతా ఆలోచించరు. జరిగిన రచ్చని మాత్రమే జ్ఞాపకం పెట్టుకుని ఈవీఎం మెషిన్ పై మీట నొక్కుతారు. కాబట్టి పవన్ సాద్యమైనంత తొందరగా తన అభిమానులు అని చెప్పుకునే వార్ని నియంత్రించటానికి తగిన మార్గం వెతుక్కోవాలి. ఎందుకంటే ఇప్పుడాయన బాక్సాఫీస్ పవర్ స్టార్ కాదు… బ్యాలెట్ బాక్సుల బ్యాటిల్లో నిలిచిన జనసేనాని! 

చేతులు కాల్చుకున్న హస్తం... ఆకులు పట్టుకుంటోంది!

ఇప్పుడు ఏపీలో అత్యంత దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది ఎవరు అంటే… కాంగ్రెస్ అనే సమాధానమే వస్తుంది! 2014కు ముందు తెలుగు నేలపైన హస్తం అతి కీలకమైన పార్టీ! ఇప్పుడు కేవలం తెలంగాణకే పరిమితం. అదీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందో క్లారిటీ లేదు. టీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ శక్తిని తట్టుకుని కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ పీఠం ఎక్కటం అంత తేలిక కాదు. ఇక ఆంద్రా కాంగ్రెస్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. అలా వుంది పరస్థితి.     గత ఎన్నికల్లో సున్నా సీట్లు సాధించిన కాంగ్రెస్ సీపీఎం, సీపీఐ లాంటి పార్టీలతో కూడా సమానంగా నిలవలేకపోయింది. అందుకు ఇష్టానుసారం చేసిన రాష్ట్ర విభజన ప్రధాన కారణంగా కాగా జగన్ పెట్టిన వేరు కుంపటి చేతి పార్టీ చేయికాలేలా చేసింది! ఇప్పుడు ఎన్ని ఆకులు పట్టుకున్నా పరిస్థితిలో మార్పు కనిపించేలా లేదు. గత నాలుగేళ్ల కాలంలో కూడా ఆంద్రా కాంగ్రెస్ రోడ్డెక్కి నిరసనలు, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేయలేకపోయింది. ఎన్నికలు దగ్గరకొస్తున్న తరుణంలో పార్లమెంట్ నడుస్తోంటే రెడీ మేడ్ రాజకీయం మాత్రం చేస్తోంది!     కేంద్రంలో వున్న బీజేపీ, రాష్ట్రంలో వున్న టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని రాహుల్ టీమ్ భావించింది. ఇంత వరకూ బాగానే వున్నా… ప్రస్తుతం ఆంధ్రా జనం ప్రధానమైన కోరిక ప్రత్యేక హోదా! దానిపై తగినంతగా స్పందించలేదు రాహుల్ గాంధీ. తన సుదీర్ఘ ప్రసంగంలో అనేక అంశాల గురించి మాట్లాడిన కాంగ్రెస్ అధ్యక్షుడు చివర్లో వెళ్లి మోదీని వాటేసుకుని కలకలం రేపాడు. ఆ గిమ్మక్కు తప్ప రాహుల్ ఏపీ హోదా గురించి మాట్లాడిన ఏ ఒక్క మాటా హైలైట్ కాలేదు. ఇదే కాంగ్రెస్ పట్ల ఆంధ్రా ఓటర్లకు ఏ మాత్రం నమ్మకం కలగకపోవటానికి కారణం! ఇప్పుడు ఏపి వున్న పరిస్థితికి అసలు కారణం హస్తం పార్టీనే! 2009లో రాజేసిన రాష్ట్ర విభజన వివాదం సాగదీసీ సాగదీసీ 2014లో పార్లెమంట్ తలుపులు మూసి ముగించారు! ఆ దురుసు ప్రవర్తనే ఏపీ ఓటర్లలో కసి పెంచింది. సున్నా సీట్లు వచ్చేలా చేసింది. విభజన అనివార్యమైనప్పుడు యూపీఏ పాలనలోనే ఏపీకి తగిన వరాలు ఇచ్చి , కేటాయింపులు చేయాల్సింది. అవేమీ చేయకుండా కాంగ్రెస్ అడ్డంగా నరికి అవతల పారేసింది. ఆ ఫలితం కారణంగా తెలంగాణలోనూ అధికారానికి ఆమడ దూరంలో ఆగిపోయింది. రెంటికీ చెడ్డ రేవడైంది.     2014 ఎన్నికల ఫలితాలతో కూడా ఏమీ నేర్చుకోని కాంగ్రెస్ నాలుగేళ్లు నిద్రపోయింది. ఇప్పుడు టీడీపీ చంద్రబాబు నేతృత్వంలో ఉధృత పోరు చేస్తోంటే కాస్త క్రెడిట్ కొట్టేసే పనిలో పడింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ నేత కేవీపీ ప్రైవేట్ బిల్లు అంటూ ప్రకటన చేశారు. అలా ప్రవైట్ బిల్ పెట్టటం ద్వారా లాభం ఏంటి? అవిశ్వాస తీర్మానంలో టైంలో రాహుల్ చేత గట్టిగా ఆంధ్రాకు మద్దతు పలికించకుండా ఇప్పుడు ఎన్ని డ్రామాలు ఆడినా లాభం ఏంటి? చివరగా, కేవీపీ లాంటి అందరూ కాంగ్రెస్ నేతలు చెప్పేది ఏంటి? 2019లో యూపీఏ వస్తే ప్రత్యేక హోదాకు కృషి చేస్తాం! దీన్ని నమ్మాల్సిన అగత్యం ఆంధ్రులకు ఏముంది? 2014కు ముందు సోనియా చేతిలో న్యాయం చేసే అవకాశం వుంటేనే చేయని వారు ముందు ముందు ఎలా చేస్తారు? అసలు యూపీఏ వచ్చే అవకాశాలు ఎంత మాత్రం వున్నాయని?     మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని తిరిగి చేర్చుకుని , ప్రత్యేక హోదా కోసం మేమూ కృషి చేస్తున్నామని సంకేతాలిచ్చే ప్రయత్నాలు చేస్తోన్న కాంగ్రెస్ కు ఈసారి కూడా ఏపీ ఓటర్ల దయా, దాక్షిణ్యాలు కష్టమే! సున్నా రాకుండా కాస్త ఎమ్మెల్యేల సంఖ్య పెరిగితే అదే అద్భుతం! ఎందుకంటే, పోయిన సారి టీడీపీ, వైసీపీ, బీజేపీ మాత్రమే వుంటే… ఈసారి జనసేన కూడా వచ్చి చేరింది. ఇన్ని పార్టీల్ని కాదని జనం హస్తాన్ని తెచ్చి తమ తల మీద ఎందుకు పెట్టుకుంటారు?

ఇక బ్యాటింగ్ ఇమ్రాన్ ఖాన్‌ది! భారత్ బౌలింగ్ ఎలా చేయాలి?

ఇవాళ్ల అంతర్జాతీయ మీడియా దృష్టంతా పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలపైనే వుంది. అనుకున్న విధంగానే ఇమ్రాన్ ఖాన్ గెలుపు దిశగా సాగిపోయాడు. ఒకప్పుడు పాకిస్తాన్ కు క్రికెట్ వాల్డ్ కప్ సాధించిన ఈ కెప్టెన్ ఇప్పుడు దేశానికే కెప్టెన్ అవ్వనున్నాడు. ఇంత వరకూ ఓకే. కానీ, ఇవాళ్లే మరో ముఖ్యమైన విశేషం కూడా వుంది. అదే భారత్ లో జరిగే కార్గిల్ విజయ్ దివస్! ఇండియాలో కార్గిల్ విజయ్ దివస్ సంబరాలు జరుగుతున్నాయి అంటే పాకిస్తాన్ లో చాలా మంది రగిలిపోతుంటారు. వారిలో ఇమ్రాన్ ఖాన్ కూడా ఒకరు! ఆర్మీకి అత్యంత ప్రియుడైన ఈ టెర్రరిస్ట్ సపోర్టర్ కాశ్మీర్ తమదేనని అడ్డంగా వాదించే టైపే! నిజానికి అందుకే ఆయనంటే పాక్ మిలటరీకి బోలెడు ఇష్టం. నవాజ్ షరీఫ్ లా కాస్తో కూస్తో కూడా రాజకీయ చాతుర్యం వున్నా వాడు కాదు ఇమ్రాన్. పూర్తిగా మిలటరీ బాస్ లు చెప్పే మాటలకు జీ హుజూర్ అనే రకం! మరిక ముందు ముందు మన దేశం ఎలా వుండాలో ప్రత్యేకించి చెప్పాలా? అలెర్ట్ గానే వుండాలి!     భారత్, పాక్ వేరు వేరు దేశాలైనా గవర్నమెంట్ మార్పు జరిగితే ఖచ్చితంగా ఒకరి మీద ఒకరి ప్రభావం వుంటుంది. అందుకే, పాకిస్తాన్ పాలకులు ఏదో మూలన కాంగ్రెస్ పాలన దిల్లీలో వుండాలని కోరుకుంటారు. అలాగే, ఇండియాలో నేరుగా ఆర్మీ పాలన కంటే పాకిస్తాన్ లో పౌర ప్రభుత్వం పాలన వుండాలని మనం కోరుకుంటాం. మరీ ముఖ్యంగా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా నవాజ్ షరీఫ్ లాంటి నేతే పాకిస్తాన్ పీఎంగా వుండాలని ఆశించింది. కానీ, అలా జరిగే సూచనలు ఎంత మాత్రం లేవు. సరిగ్గా జరిగినా, జరగకపోయినా ఎన్నికల్లో మాత్రం ఇమ్రాన్ ఖాన్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. ప్రధాని అతనే అయ్యే అవకాశాలున్నాయి. ఇక ఇమ్రాన్ ప్రధాని అంటే పాలన నేరుగా ఆర్మీనే చేస్తోందని భావించాలంటూ విశ్లేషణలు ఇప్పటికే వెలువడ్డాయి.     పాక్ లో ప్రభుత్వ మార్పు సరే… ఇండియాలో 2014లో మోదీ వచ్చినప్పటి నుంచీ పక్క దేశానికి అసహనంగానే వుంది. ఎందుకంటే, యూపీఏ సర్కార్ హయాంలో కాశ్మీర్ లోనే కాదు భారతదేశం లోపల కూడా పాక్ అరాచకాలు హాయిగా సాగాయి. మోదీ ఇతర పథకాలు, నిర్ణయాలు ఎలా వున్నా రక్షణ విషయంలో ఆయన తీసుకున్న జాగ్రత్త అద్భుతమే! ఏకంగా ముంబై మహానగరంలో ఊచకోత కోసిన పాక్ ఇప్పుడు ఒక్క బాంబు పేల్చలేకపోతోంది ఇండియాలో. కేవలం కాశ్మీర్ లో రాళ్ల దాడి వ్యూహంతో కాలం గడుపుతోంది. దానికి కూడా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. మన భద్రతదళాలు ఎన్ కౌంటర్లు చేస్తూ పెద్ద ఎత్తున ఉగ్రవాదుల్ని హతం చేస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో కాలుపెట్టి ప్రతీకారం కూడా తీర్చుకున్నారు మన జవాన్లు. ఇలాంటి పరిస్థితి వల్లే పాక్ కు భారత్ లో ధృఢమైన ప్రభుత్వం వుండటం నచ్చదు. అదీ హిందూత్వ ఎజెండాతో సాగే బీజేపీ సర్కార్ అంటే పాక్ కు మరింత కలవరం.     2014 నుంచీ పాకిస్తాన్ కు మోదీ సర్కార్ మీద మంటగా వున్నా నవాజ్ షరీఫ్ లాంటి రాజకీయ నేత దేశాన్ని నడపటం వల్ల యుద్ద వాతావరణం తప్పుతూ వచ్చింది. ఇమ్రాన్ ఖాన్ అలాంటి పొలిటీషన్ అనుకోటానికి లేదు. తన మాజీ రెండో భార్య నుంచి అనేక ప్లేబాయ్ ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఇమ్రాన్ అవసరాల కోసం పూర్తిగా పాక్ ఆర్మీకి అమ్ముడుపోయాడు. నవాజ్ షరీఫ్ ఆర్మీతో కాస్త దూరం పాటించటమే అతడి అరెస్ట్, ప్రస్తుత జైలు జీవితానికి కారణమన్నది బహిరంగ రహస్యమే. కాబట్టి ఇమ్రాన్ ఆ తప్పు చేయకుండా మిలటరీ అధినేతల చెప్పుచేతల్లో తోకాడిస్తాడు.అంటే, భారత్ ఇమ్రాన్ రూపంలో పాక్ మిలటరీ కుట్రల్ని ఎదుర్కోటానికి సిద్ధంగా వుండాలన్నమాట. ఇంకా సూటిగా మాట్లాడుకుంటే, తాడో పేడో తేల్చుకోవాల్సిన అంతిమ యుద్ధానికి కూడా ఇండియా తెగించే వుండాలి. తప్పదనుకుంటే పాక్ ను మోదీ మూడు ముక్కలు చేసైనా సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కోవాలి. ఇమ్రాన్ ఖానే సంయుక్త పాకిస్తాన్ కు చివరి ప్రధాని అయ్యేలా చూడాలి. అదే భారత్ మనః శాంతికి శాశ్వత పరిష్కారం!

జగన్ చంద్రబాబుని తట్టుకోలేడా? ఉండవల్లి లాజిక్ ఏంటి?

ఉండవల్లి అరూణ్ కుమార్… తెలుగు రాజకీయాల్లో అందరికీ తెలిసిన పేరు! అయితే, మాస్ పొలిటీషన్ గా కన్నా మేధావిగానే అరూణ్ కుమార్ ఫేమస్! ఆయన మాట్లాడితే అందరు రాజకీయ నేతల్లాగా తలా తోక లేని ఆరోపణలు చేయరు. తలకి, తోకకి ముడిపెట్టే లాజిక్ తో కొడుతుంటారు! అదే ఆయన మాటలకి వాల్యూ తీసుకొస్తుంటుంది. మీడియా చెవులు పెద్దవి చేసుకుని వినేలా చేస్తుంటుంది.     వైఎస్ హయాంలొ ఓ వెలుగు వెలిగిన ఉండవల్లి తరువాత క్రమంగా ప్రభ తగ్గించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన ఏ పార్టీలోనూ లేరన్నట్టుగా వుంది పరిస్థితి. ఓ సారి పవన్ పక్కన కనిపిస్తారు. ఓ సారి చంద్రబాబును కలుసుకుంటారు. స్వయంగా కూడా నేను ఏ పార్టీకి మద్దతుగా లేనని చెబుతూనే అప్పుడప్పుడూ ఆసక్తికర కామెంట్లు చేస్తుంటారు. ఉండవల్లి తాజా మాటలు రాజకీయ వర్గాల్లో అలాగే ఇంట్రస్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి. వైఎస్ కు ఎంతో ఆత్మీయుడైనప్పటికి ఉండవల్లి ఏనాడూ జగన్ కు దగ్గర కాలేదు.  ఎప్పుడూ వీరాభిమానం చాటలేదు. ఇక ఇప్పుడైతే పూర్తిగా జగన్ కు వ్యతిరేకంగా విశ్లేషణ చేస్తున్నారు. జగన్ కోసం జనం విపరీతంగా రోడ్ల మీదకు వస్తుండటం నిజమే అయినా అదంతా ఓ సినిమా హీరో కోసం రావటం లాంటిదేనని అన్నారు. ఎన్నికల సమయంలో వారంతా జగన్ కే ఓటు వేస్తారని గ్యారెంటీ లేదన్నారు. గత ఎన్నికల్లోనూ జగనే గెలుస్తాడని చాలా మంది భావించారని గుర్తు చేశారు. అయితే, చంద్రబాబు రాజకీయ వ్యూహాలు, ఎన్నికల ముందు ఆయన చేయగలిగే పోల్ మ్యానేజ్మెంట్ జగన్ తట్టుకోలేడని అన్నారు!     ఉండవల్లి వ్యాఖ్యలు చంద్రబాబుకు అనుకూలంగా, జగన్ కు వ్యతిరేకంగా వున్నాయి కాబట్టి ఆయన టీడీపీలో చేరతారని మనం ఇప్పుడే భావించలేం. ఎందుకంటే, ఉండవల్లి రాజకీయ ఉద్దేశ్యాలు ఏవీ లేకుండా కూడా విశ్లేషణలు చేస్తుంటారు. ఆయన రాష్ట్ర విభజన విషయంలో కూడా మిగతా ఆంధ్రా నాయకులందరి కంటే భిన్నంగా స్పందిస్తూ వచ్చారు. అలాగే, ఇప్పుడు చంద్రబాబు, జగన్ ల సత్తాని ఆయన నిష్పక్షపాతంగానే అంచనా వేశారని మనం భావించవచ్చు. చంద్రబాబు అనుభవం, జనం నాడిని పట్టగలిగే చాకచక్యం ఎన్నికల చాణక్యం … ఇవన్నీ అందరికీ తెలిసినవే. మరో వైపు జగన్ పార్లమెంట్లో, అసెంబ్లీలో తన ఎంపీల్ని, ఎమ్మెల్యేల్ని ఉపసంహరించుకుని చేస్తున్న రాజకీయం, సుదీర్ఘ పాదయాత్ర, పవన్ పై వ్యక్తిగత విమర్శలు… ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూనే వున్నాం. కాబట్టి ఏ మాత్రం తేడా వచ్చినా చంద్రబాబు అయిదేళ్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఛేదించుకుని మళ్లీ అధికారంలోకి రావటం ఆశ్చర్యకరమేం కాదు. కానీ, జగన్ తనకున్న అనుభవ లేమీ, దూకుడు స్వభావంతో ఏపీ నెక్ట్స్ సీఎం అవుతారా? డౌటేనంటున్నారు ఉండవల్లి! ఉండవల్లి వ్యాఖ్యలు నిజమవుతాయా లేదా? జగన్ నవ్యాంధ్రా రెండో సీఎం అవుతారా? లేక చంద్రబాబే నవ్యాంధ్రకి రెండోసారి సీఎం అవుతారా? వేచి చూడాలి! ప్రస్తుతానికైతే సస్పెన్సే!

మోదీకి సాయం! ఏపీకి నష్టం! టీఆర్ఎస్ వ్యూహం!

ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కడ చూసినా ప్రత్యేక హోదా టాపిక్ గా నడుస్తోంది. అందరూ బీజేపీనే టార్గెట్ చేసుకుంటున్నారు. అయితే, ఏపీకి సాటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో హోదా విషయం పెద్దగా చర్చలో లేదు. జనం దాన్నసలు ఆలోచించటం లేదు. ఎందుకంటే, విభజన సమయంలో హైద్రాబాద్ తెలంగాణకు దక్కింది. అందుకే, స్పెషల్ స్టేటస్ లాంటివేవీ హామీ ఇవ్వలేదు. ఇక ప్రత్యేక హోదా ఇస్తామని రాజ్యసభలో చెప్పిన ఏపీకైనా వచ్చిందా అంటే అదీ లేదు. అది రాకపోవటం వల్లే ఇంత గొడవ జరుగుతోంది. అయితే, ఈ మొత్తం కోలాహలంలో టీఆర్ఎస్ పార్టీ పాత్ర ఆందోళనకరంగా, అనుమానాస్పదంగా వుంటోంది…     నిన్న మొన్నటి వరకూ ఎక్కడ అడిగినా టీఆర్ఎస్ వారు ఆంద్రాకు ప్రత్యేక హోదా ఇస్తే మాకు అభ్యంతరం లేదని చెప్పేవారు. విభజన హామీలు నెరవేర్చాల్సిందేనని అనేవారు. కానీ, అవిశ్వాస తీర్మానం వచ్చాక గులాబీ నేతల స్వరాల్లో మార్పు వచ్చేసింది. ఓటింగ్ సమయంలో గైర్హాజర్ అవ్వటం ద్వారా మోదీకి సాయం చేసిన కేసీఆర్ శిబిరం అక్కడితో ఆగకుండా పదే పదే ఏపీకి హోదా రాకుండా వుండేలా కామెంట్లు చేస్తోంది. ఆంద్రాకు స్పెషల్ స్టేటస్ ఇస్తే హైద్రాబాద్ కు వాణిజ్య, వ్యాపార పరంగా నష్టం అంటూ మోకాలు అడ్డుతోంది టీఆర్ఎస్. హోదా ఇస్తే రెండు తెలుగు రాష్ట్రాలకూ ఇవ్వాలని మెలిక పెడుతోంది. ఈ వాదన ద్వారా పరోక్షంగా మోదీకి అత్యంత అవసరమైన సహకారం అందిస్తోంది గులాబీ పార్టీ!       అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా కూడా నిరసనలు తెలిపారు టీఆర్ఎస్ ఎంపీలు. అంతే కాక పోలవరానికి కీలకమైన ముంపు మండలాల్ని తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. అది సాధ్యం కాదని తెలిసినా కేంద్ర ప్రభుత్వానికి సాయపడేలా ఆ మాట మాట్లాడారు. ఒకవైపు ప్రత్యేక హోదా, మరోవైపు పోలవరం రెండిటికీ కారు పార్టీ అడ్డుగా నిలుస్తోంది. దీని వల్ల టీఆర్ఎస్ కు వచ్చే లాభం ఏం లేకున్నా కేంద్రంలోని దిల్లీ పెద్దల్ని ప్రసన్నం చేసుకోవచ్చు. అదే ఎజెండాగా కనిపిస్తోంది. దానికి తగ్గట్టే కేసీఆర్ చంద్రబాబు కంటే బాగా పని చేసుకుపోతున్నారని మోదీ అనటం … కమలం, గులాబీల మధ్య ఒప్పందాన్ని బహిరంగంగానే స్పష్ఠపరుస్తోంది.       ఈ మద్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి పదే పదే మాట్లాడుతున్న టీఆర్ఎస్ నేతలు గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలపై కూడా స్పందించారు. ఆయనకు ఆంద్రా మీదే ప్రేమ తప్ప తెలంగాణ మీద లేదని అన్నారు. ఏపీకి హోదా ఇవ్వమని ఆజాద్ డిమాండ్ చేశారు. పార్లెమంట్లో కాంగ్రెస్ సీనియర్ నేత చేసిన డిమాండ్ ని టీఆర్ఎస్ తప్పుపట్టింది. ఆయన తెలంగాణ గురించి పట్టించుకోకుండా ఏపీ మీద ప్రేమ ఒలకబోస్తున్నారని గులాబీ నేత కర్నె ప్రభావకర్ అన్నారు. దీని ద్వారా తెలంగాణ కాంగ్రెస్ కార్నర్ చేయాలని ఆయన ప్రయత్నం. ఏపీకి కాంగ్రెస్ సాయం చేస్తోందని చెప్పటం ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ ను విలన్ గా నిలపాలని టీఆర్ఎస్ వ్యూహం!     తెలంగాణలో కాంగ్రెస్ తమ ప్రతిపక్షం కాబట్టి టీఆర్ఎస్ దాడి చేయటం అర్థం చేసుకోవచ్చు. కానీ, ఏపీకి ఎలాంటి జాలీ లేకుండా ప్రత్యేక హోదా ఇవ్వనంటోన్న బీజేపికి లోపాయకారిగా సాయపడటం… కుట్రే అవుతుంది. లేదా వచ్చే ఎన్నికల తరువాత మోదీ సర్కార్ ఏర్పడితే టీఆర్ఎస్ అందులో మంత్రి పదవులు ఆశిస్తూ వుండాలి. ఏది ఏమైనా , ఎలాంటి రాజకీయ లబ్ధి వున్నా సాటి తెలుగు రాష్ట్రం నష్టపోయేలా వ్యూహాలు పన్నటం, కేంద్రానికి సాయం చేస్తూ ఏపీని ఎదగకుండా అడ్డుకోవటం… అస్సలు సమర్థనీయం కాదు. కేసీఆర్ దీనిపై పునరాలోచించుకోవాలి. లేదంటే తెలంగాణలోని, ముఖ్యంగా, హైద్రాబాద్ లోని ఆంధ్రుల ఓట్లపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు… 

ఇక మీదైనా నోటిపై అదుపు పాటిస్తారో లేదో… విజయ‘సారీ’రెడ్డి!

రాజకీయం వేరు, రచ్చ వేరు. అలాగే, వ్యాపారం , లెక్కలూ వేరు. పార్లమెంట్, చట్ట సభల్లో చర్చలు కూడా వేరు! ఈ సత్యం వృత్తి రిత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన విజయసాయి రెడ్డికి ఇవాళ్లే బోధపడి వుంటుంది! ఆయన రాజ్యసభలో అందరి ముందూ బేషరతుగా చైర్మన్ వెంకయ్య నాయుడికి సారీ చెప్పారు. అలా చెప్పే పరిస్థితి నిన్న ఆయన తన స్వంత మాటలు, చేష్టలు కారణంగానే తెచ్చుకున్నారు. బహుశా ఇప్పటికైనా విజయసాయికి పెద్దల సభ అంటే తమ పార్టీ కార్యాలయం కాదని అవగాహనకు వచ్చి వుంటుంది!     విజయసాయి రెడ్డి కొన్నాళ్ల కిందటి దాకా జగన్ వ్యాపారపు లెక్కలు చూసుకునే సీఏ మాత్రమే. అయితే కామర్స్ తెలిసిన ఈయన అంతకంటే ఎక్కువ ప్రతిభ ప్రదర్శించారు. అందుకే, అనేక కేసుల్లో జగన్ ఏ వన్ అయితే ఈయన ఏ టూ అయ్యారు! అలా వైసీపీ అధినేతకి ఇతోధికంగా సహకరించిన విజయసాయి రాను రాను పార్టీలో కీలకమైపోయారు. మరీ ముఖ్యంగా, రాజ్యసభలో వైసీపీ ఎంపీగా కాలుపెట్టాక రెడ్డిగారి దూకుడు మరింత పెరిగింది. దిల్లీలో జగన్ కంటే ఎక్కువ ఈయనే పాప్యులర్ అయిపోయారు. ప్రధాని మోదీని ఓ సీఎం అయిన చంద్రబాబు కలవటం కష్టమైనా విజయసాయి మాత్రం అమాంతం కలిసేస్తుంటారు. అంతలా చక్రం తిప్పుతున్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ కమలదళానికి కావాల్సినంత సేవలందించారు. ఇదంతా రహస్యం కూడా కాదు. బహిరంగమే!     పార్టీలో జగన్ తరువాత అత్యంత కీలకమైన స్థానంలోకి వచ్చిన విజయసాయి రాజ్యసభ అంటే అదేదో ప్రెస్ మీట్ అనుకున్నారో ఏమో కానీ ఏకంగా చైర్మన్నే టార్గెట్ చేసుకున్నారు! మన తెలుగు వారే అయిన మోస్ట్ సీనియర్ పొలిటీషన్ వెంకయ్య నాయుడు చైర్ లో వుండగా నిన్న విజయసాయి రెడ్డి అలిగారు. వాకౌట్ చేశారు. తనకు సరిగ్గా మాట్లాడే టైం ఇవ్వలేదని నిరసన తెలిపారు. ఇంత వరకూ ఓకే! కానీ, ఉప రాష్ట్రపతి అయిన వెంకయ్య తన పట్ల పక్షపాత ధోరణి అవలంబిస్తుననారని ఆనేశారు! దీని ఎఫెక్ట్ ఎలా వుంటుందో బహుశా నిన్న ఆయనకు అంచనా లేకపోవచ్చు!     విజయసాయి నోటి దురుసు తెలుగు వారికి కొత్తేం కాదు. ఆయన ప్రతీ రెండు రోజులకి ఒకసారి చంద్రబాబును నోటికి వచ్చినట్లు తిడుతుంటారు. అయితే, అదంతా ప్రెస్ వారి మైకుల ముందు. కానీ, అలాంటి ప్రవర్తనే సభలో ప్రదర్శిస్తే ఎలా? అదీ జాతీయ స్థాయి పెద్దల సభ అయిన రాజ్యసభలో … నేరుగా చైర్మన్ ను ఉద్దేశించి అనాలోచితంగా మాట్లాడటం ఏంటి? తాను చేసిన తప్పు అర్థమైన వెంటనే విజయసాయి నిన్ననే వెంకయ్య వద్దకి వ్యక్తిగతంగా వెళ్లి సారీ చెప్పారట. అయితే, ఇవాళ్ల ఉదయం రాజ్యసభలో మళ్లీ ఆయనకు మాట్లాడే అవకాశం వచ్చింది. చైర్మన్ పై విమర్శల గురించి వివరణ ఇచ్చుకునే అవకాశం వచ్చింది. కానీ, మరోమారు తాను ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది అంటూ … రాగం తీసే సరికి వెంకయ్య నాయుడు విజయసాయి మాటల్ని మధ్యలోనే కట్ చేసి ఇతరులకి మాట్లాడే అవకాశం ఇచ్చేశారు. దీంతో వ్యవహారంలోని సీరియస్ నెస్ అర్థం చేసుకున్న మన సీఏగారు వివరణలు ఇవ్వటం మానేసి… బేషరతుగా సభకు సారీ చెప్పారు! విజయసాయి రెడ్డి రాజ్యసభలో సారీ చెప్పటం పెద్ద అవమానమో, నష్టమో కాదు. కానీ, ఆయన ఇప్పటి నుంచైనా నోటి మీద అదుపు ప్రదర్శిస్తే ఎంతో మంచిది. తెలుగు జాతి గర్వించేలా ఎదిగిన వెంకయ్యనే దేశం మొత్తం ముందు పక్షపాతి అనటం … ఏ విధంగానూ వివేకం కలిగిన పని కాదు. ఇలాంటివి జనంలో విజయసాయిని, ఆయన పార్టీని చులకన చేస్తాయి తప్ప మరే లాభమూ వుండదు! 

చంద్రబాబులోని ఆ లక్షణం… పవన్‌కు ఎంతో అవసరం! 

ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో… ఆ మాటకొస్తే దేశ రాజకీయాల్లోనూ చంద్రబాబు సీనియర్ మోస్ట్! ఆయనకంటే ఎక్కువ రాజకీయ జీవితం గడిపిన వారు చాలా తక్కువ. అయితే, ఆయన సుదీర్ఘ రాజకీయాల్లో అందరూ బాగా గుర్తించేది చంద్రబాబులోని అభివృద్ధి చేయగల సత్తా, కష్టపడి పని చేసే తత్వం, దూరదృష్టి… ఇలాంటివన్నీ! కానీ, ఏపీ సీఎంలో మరో గొప్ప లక్షణం వుంది. అది చాలా వరకూ పెద్దగా చర్చకు రాదు. అదేంటంటే… చంద్రబాబు ఏనాడూ తన ప్రత్యర్థుల్ని వ్యక్తిగతంగా దూషించరు! ఒక్కసారి మనం వెనక్కి వెళ్లి చూస్తే చంద్రబాబు పర్సనల్ గా ఒక వ్యక్తిని టార్గెట్ చేసిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి కనిపించదు! ఇది నిజంగా ఈనాటి రాజకీయ నాయకులు ఆయన నుంచీ తప్పక నేర్చుకోవాల్సింది. మరీ ముఖ్యంగా, చంద్రబాబును ఢీకొంటున్న ఆంధ్రా యువనేతలు జగన్, పవన్!     రాజకీయాల్లో విమర్శలు తప్పవు. అంత వరకూ ఓకే. కానీ, విమర్శలకు , వ్యక్తిగత దూషణలకు చాలా తేడా వుంటుంది. ఇక్కడే చంద్రబాబు లాంటి పరిణతి చెందిన నేతలు తమ విజ్ఞత చూపిస్తారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన జగన్ చంద్రబాబుపై ఎలాంటి విమర్శలు చేస్తుంటారో మనకు తెలిసిందే. ఆయన పార్టీలోని రోజా లాంటి నేతల పదజాలం స్థాయి కూడా మనకు తెలిసిందే. అయితే, జగన్ తాజా టార్గెట్ పవన్ కళ్యాణ్ అయ్యారు! పవన్ ఈ మద్యే జగన్ను విమర్శించారు. ఏమని? ఆయనలాగా తనకూ కొందరు ఎమ్మెల్యేలు వుండి వుంటే తాను అసెంబ్లీ వదిలి వెళ్లే వాడ్ని కానని అన్నారు. జనం ఓట్లు వేసి పంపినందుకు సభలోనే ప్రభుత్వాన్ని నిలదీసేవాడ్ననని పవన్ అన్నారు! దీనిపై జగన్ ఎలా స్పందించాలి? తాను ఎందుకు సభను వదిలి పాదయాత్ర చేస్తున్నాడో చెప్పుకోవాలి. అంతే తప్ప పవన్ పై వ్యక్తిగత దూషణలు అవసరమా? కానీ, మెచ్యూరిటీ లేని జగన్ అదే చేశారు!     పవన్ కళ్యాణ్ కార్లు మార్చినంత తేలిగ్గా పెళ్లాల్ని మారుస్తారనీ, ఆయనకు నలుగురు భార్యలని జగన్ దెప్పిపొడిచారు! ఇదెక్కడి సంస్కారం? పవన్ కళ్యాణ్ ఎక్కువ పెళ్లిల్లు చేసుకోవటం, వారికి చట్టబద్ధంగా విడాకులు ఇవ్వటం అంతా, అందరికీ తెలిసిందే! ఎలాంటి రహస్యమూ లేని ఆయన వ్యక్తిగత జీవితాన్ని, పైగా ఆయన భార్యల్ని కూడా రాజకీయ రచ్చలోకి లాగటం జగన్ కు సరైందేనా? అస్సలు కాదు!     ఇక… ఒకవైపు పవన్ పై జగన్ వ్యక్తిగత విమర్శలు చేస్తూ చెలరేగిపోతుంటే… జనసేనాని కూడా ఏం తక్కువ తినలేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఆయన తాజాగా ఇంట్లో తుపాకులు పేల్చి బయట తిరుగుతున్న వారి సంగతేంటి అంటూ పరోక్ష విమర్శలు చేశారు. ఇవి టీడీపీ నేత, టాలీవుడ్ హీరో బాలకృష్ణను ఉద్దేశించినవే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పవన్ బాలకృష్ణ పేరైతే ఎత్తలేదుగాని ఆయన మొత్తం మీద ఎవర్నో వ్యక్తిగతంగా టార్గెటైతే చేశారు. ఆయన అలా చేయటానికి కారణం… జనసేన కార్యకర్తలు వాహనాలకు సైలెన్సర్లు లేకుండా ఓ ర్యాలీ తీశారట. దాంట్లో పవన్ కూడా పాల్గొన్నారు. విపరీతంగా శబ్దం చేస్తూ సైలెన్సర్లు లేని బండ్లు రోడ్డు మీద తిరిగాయి. దీనిపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేశారు.     రూల్స్ కు విరుద్ధంగా రోడ్డు మీద వెహికల్స్ నడపవచ్చా? అభిమానులు అలా చేసినా పవన్ వారించకుండా వుండవచ్చా? ఇవన్నీ పక్కన పెట్టి పవన్ ఎదురుదాడి చేస్తూ బాలకృష్ణపై పరోక్ష విమర్శలు సంధించారు. అసలు ఆయనకు , వివాదానికి ఏమైనా సంబంధం వుందా? ఇక్కడే పవన్ చంద్రబాబు లాంటి నేతల నుంచీ చాలా నేర్చుకోవాలి. ఒక పార్టీ అధినేతగా ఆయన స్థాయిని తగ్గించుకునే చౌకబారు వ్యక్తిగత విమర్శలు ఎప్పటికైనా చేటే చేస్తాయి. జనసేన అధినేతకే కాదు… ఇదే సూత్రం వైసీపీ నాయకుడికి కూడా వర్తిస్తుంది! తాత్కాలిక లాభం కోసం వ్యక్తిగత దూషణలు ఎంత మాత్రం సంస్కారం అనిపించుకోవు! 

వచ్చాడు వచ్చాడు ఒక లీడరు! దక్కన్ రాష్ట్రం 'కాసే' దమ్మున్నోడు!

కేటీఆర్… 2014కి ముందు కేసీఆర్ తనయుడు మాత్రమే! మరిప్పుడు? ఇప్పుడు కూడా ఆయన కేసీఆర్ వారసుడే … కానీ… జూలై 24 ఆయన 42వ పుట్టిన రోజు సందర్భంగా జరుగుతోన్న హంగామా చూస్తోంటే తాజా పరిస్థితి అర్థం అవుతుంది! ఆదివారం నుంచీ జ్వరం, బహుశా వయస్సు మీద పడుతున్నందుకేమో… అంటూ కేటీఆర్ ట్విట్టర్ లో సరదాగా పోస్టు చేశారు! అనారోగ్యం వల్ల తెలంగాణ ఐటీ మంత్రి బయట ఎక్కడా కనిపించకున్నా సోషల్ మీడియాలో మాత్రం ఆయన బర్త్ డే హోరు జోరుగానే వుంది. పొలిటీషన్స్, సినిమా వారు, ఇతరులు అన్న తేడా లేకుండా వరస పెట్టి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. అసలు ఎవరెవరు ఈ 42 ఏళ్ల యంగ్ అండ్ డైనమిక్ కి హ్యాపీ బర్త్ డే చెప్పారో ఓ సారి చూస్తే క్రేజ్ ఏంటో అర్థమవుతుంది…     ఐటీ మినిస్టర్ కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో బావ హరీష్ రావు కూడా వున్నారు. అలాగే మంత్రి జూపల్లి కృష్ణారావు, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ రాములు నాయక్, దర్శకుడు ఎన్. శంకర్, కేథరిన్ హడ్డా, ఇజ్రాయెల్ అంబాసిడర్ డేనియల్ కార్‌మాన్, నటుడు మహేశ్ బాబు, బ్రహ్మజీ, ప్రియదర్శితో పాటు ఇంకా చాలా మందే వున్నారు. ఏపీ ఐటీ శాఖా మంత్రి లోకేష్ కూడా తన సహచర రాజకీయ వారసుడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు!     ఒకవైపు తనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుంటే మరో వైపు కేటీఆర్ కేకులు కోసి, కటౌట్లు కట్టి డబ్బులు వృథా చేయకండి అంటూ పిలుపునిచ్చారు. మొక్కలు నాటమని చెప్పారు. ఆయన పిలుపునందుకుని టీఆర్ఎస్ శ్రేణులు భారీగానే మొక్కలు నాటుతూ, పళ్లు పంచిపెడుతూ సేవ కార్యక్రమాలు చేశాయి. ఓ కేటీఆర్ అభిమాని అయితే 42 ఏళ్ల తమ నేత మీద అభిమానంతో 42 మొక్కలు నాటారట! ఇదంతా పక్కన పెడితే కేటీఆర్ బర్త్ డే అసలు హై లైట్ ‘వీడియో సాంగ్’! స్వయంగా హైద్రాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ఈ వీడియో సాంగ్ ని ప్రజెంట్ చేయటం మరింత విశేషం! తెలంగాణ భవన్ లో కేటీఆర్ పై రూపొందించిన పాటని టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు విడుదల చేశారు!     ఒక రాజకీయ నేత బర్త్ డే అన్నాక ఇలాంటి హంగామా సహజమే. కాకపోతే, ఎన్నికల ముందు సంవత్సరంలో కేసీఆర్ వారసుడు కేటీఆర్ పై ఈ శుభాకాంక్షల జల్లు కాస్త ప్రత్యేకమని కూడా ఒప్పుకోవాల్సిందే. కేసీఆర్ తరువాత సీఎం పీఠంపై ఆయన కూర్చుంటారా? ఇప్పుడైతే ఆ చర్చ లేదు కానీ… రేపు ఎప్పుడైనా తెలంగాణ సీఎం అవ్వాలి అంటే ఆ అవకాశాలు టీఆర్ఎస్ లో కేటీఆర్ కే ఎక్కువగా వున్నాయి. హరీష్ వర్గం కూడా ఒకటి వుండవచ్చు. అయినా కేటీఆర్ పట్టు పార్టీపై రోజు రోజుకి పెరుగుతుండటం ఎవరూ కాదనలేని సత్యం! అందుకు ఆయన బర్త్ డే హంగామా మరో ఉదాహరణ! అంతే కాదు… ఆయన పై రూపొందించిన పాటలో కూడా తొలి లైనే… ‘’ వచ్చాడు వచ్చాడు ఒక లీడరు! దక్కన్ రాష్ట్రం కాసే దమ్మున్నోడు!’’ అంటూ సాగుతుంది! ఈ రాష్ట్రాన్ని కాయటం అంటే ఏంటి అంతరార్థం? ఇప్పుడే రకరకాల విశ్లేషణలు అవసరం లేనప్పటికీ… కేటీఆర్ … కేసీఆర్ తరువాత అంతటి వాడవుతున్నారు పార్టీలో అన్నది మాత్రం విస్పష్టం!

నెల్లూరులో జగన్ చెలగాటం! ‘వారి’ టికెట్ ఆశలకి ప్రాణ సంకటం!

పిల్లికి చెలగాటం… ఎలుకకి ప్రాణ సంకటం… ఈ సామెత పాతదే! కానీ, దాని ప్రభావం మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగానే వుంటుంది. ఇంతకీ ఇప్పుడు ఎలుకలుగా మారింది ఎవరు అటారా? అది తెలియాలంటే అసలు చెలగాటం ఆడుతున్న పిల్లెవరో తెలుసుకోవాలి కదా!     వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్ నెల్లూరులో చెలగాటం మొదలు పెట్టారు. ఒకప్పుడు కాంగ్రెస్ లో వుండి తరువాత టీడీపీలోకి వచ్చి… తాజాగా జగన్ శిబిరం చేరిన ఆనం రామనారాయణ రెడ్డి కలకలానికి కారణమయ్యారు. నెల్లూరులో ఆనం ఫ్యామిలి పట్టు అందరికీ తెలిసిందే. అదే జగన్ చేత మాజీ మంత్రి రామనారాయణ రెడ్డికి స్వాగతం పలికించింది. కానీ, ఆనంకి అందిన ఆహ్వానం ఇప్పుడు నెల్లూరులొని అసలు వైసీపీ నాయకులకి దిమ్మ తిరిగిపోయేలా చేస్తోంది. ఎన్నికలు అంతకంతకూ దగ్గరపడుతోన్న వేళ తమకు ఈ ఆనం గండమేంటని వారు వాపోతున్నారు!     ఆనం రామనారాయణ రెడ్డి లాంటి పెద్ద నేతలు పార్టీ మారితే దాని ఎఫెక్ట్ ఎక్కువగానే వుంటుంది. కాంగ్రెస్ హయాంలో ఆర్దిక మంత్రిగా చేసిన ఆయన ఒక దేశలో సమైక్యాంధ్రకు సీఎం కూడా అవుతారని అన్నారు. అంత రేంజ్ కలిగిన ఆయన రాష్ట్ర విభజనతో హస్తం పార్టీలాగే కుదేలయ్యారు. నాలుగేళ్లుగా మాజీ ఎమ్మెల్యే, మంత్రి అనిపించుకుంటూ కొనసాగుతున్నారు. ఈ మధ్యే ఆనం సోదరుడు వివేకానంద రెడ్డి మరణించటం కూడా వారి కుటుంబంలో విషాదం నింపింది. ఇటువంటి తరుణంలో ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి పట్టు నిలబెట్టుకోవాలని ఆనం రామనారాయణ ప్రయత్నిస్తున్నారు. కారణాలు ఏవైనా టీడీపీని వదిలి వైసీపీకి చేరువైన ఆయన బలమున్న ఆత్మకూరు నియోజక వర్గం అడిగినప్పటికీ కుదరదని తేల్చేశారట జగన్. సిట్టింగ్ ఎమ్మెల్యేలు , ఎంపీ వున్న స్థానాల్లో ఆనంకు అవకాశం లేదని తేలిపోయిందట. ఆత్మకూరు కాకుండా వెంకటగిరి తీసుకొమ్మని జగన్ అన్నట్టు పొలిటికల్ టాక్! ఆత్మకూరులో ఆనం అంటే మేకపాటి కుటుంబం తాము ఏకంగా వైసీపీ వదిలి పెడతామని హెచ్చరించిందని కూడా అంటున్నారు. మేకపాటి ఫ్యామిలిని వదులుకునే పిచ్చి ప్రయత్నాలేవీ జగన్ చేయరు కాబట్టి ఆనం రామనారాయణ రెడ్డి అంతగా పట్టులేని వెంకటగిరికే పరిమితం కావాలి.     జగన్ చెప్పినట్టు వెంకటగిరి నుంచి పోటీ చేసినా ఆనం ఎఫెక్ట్ మరో ఇద్దరు వైసీపీ నాయకుల మీద పడనుందట. నాలుగేళ్లుగా తమకు టికెట్ గ్యారెంటీ అంటూ వారిద్దరూ వైఎస్ఆర్సీపీ ఫ్యాను రెక్కలు పట్టుకుని జోరుగా తింపుతూ వచ్చారు. వెంకటగిరి నియోజక వర్గంలో బొమ్మిరెడ్డి  రాఘవేంద్రా రెడ్డి, కలిమిలి రాంప్రసాద్ రెడ్డి అనేక ప్రజా కార్యక్రమాల్లో స్వంత డబ్బుతో పాలుపంచుకుంటూ వచ్చారు తీరా ఇప్పుడు ఆనం చేరిక ఆటంబాంబులా వారి ఆశల్ని ఛిన్నాభిన్నం చేసేస్తోందట! ఆనం వెంకటగిరి నుంచీ పోటీ చేస్తే బొమ్మిరెడ్డి, కలిమలి ఇద్దరూ పోటీకి దూరంగా వుండాల్సిన స్థితి వస్తుంది. నాలుగేళ్లుగా వారు చూసిన సహనానికి, పార్టీ విధేయతకి ఇలాంటి ఫలితం దక్కటం నిజంగా విషాదమే! ఇప్పటికైతే ఆనం ఏ స్థానం నుంచీ పోటీ చేస్తారని జగన్ చెప్పలేదు. ఆనం కూడా ఏమీ మాట్లాడలేదు. కానీ, ఆనం నెల్లూరులో ఎక్కడ నుంచీ పోటీ చేసినా ఆయనకంటే ముందు నుంచీ వున్న వైసీపీ నేతలు ఎవరికో ఒకరి ప్రాణ సంకటమే! చూడాలి మరి జగన్ ఈ చెలగాటాన్ని ఎలా ఆడతారో! 

జగన్ బందులకి మోదీ ‘చింతకాయలు’రాల్చరు!

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఎందుకు రావటం లేదు? మోదీ ఇవ్వటం లేదు! ఇదే సమాధానం అనుకుంటే అంతకన్నా పెద్ద తప్పుడు ఆలోచన వుండదు. అసలు ఏ కేంద్ర ప్రభుత్వమైనా ఓ రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వం లేకపోతే సవితి తల్లి ప్రేమే చూపిస్తుంది. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరమేం లేదు. ఇప్పుడు ప్రత్యేక హోదాకి మేం రెడీ అంటూ కబుర్లు చెబుతున్న కాంగ్రెస్ కూడా రేపు దిల్లీలో అధికారంలోకి వస్తే ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చేస్తుందా? బీజేపీలాగే కబుర్లు చెప్పే ఛాన్స్ లు ఎక్కువ! ఎందుకంటే, ఏపీలోనూ వారి ప్రభుత్వం వుండాలి. ఆ సూచనలు కనిపించటం లేదు. ఇక్కడ టీడీపీనో లేదో వైసీపీనో అధికారంలో వుంటాయి. ప్రాంతీయ పార్టీలు పీఠంపై వుండీ జాతీయ పార్టీలది కేంద్రంలో అధికారమైతే ఇక చెప్పేదేముంది? ఇదీ అసలు సమస్య. అయితే…     రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీకి జనం జైకొట్టినంత మాత్రాన దిల్లీలోని జాతీయ పార్టీలు ఇష్టానుసారం వివక్ష చూపించుకుంటూ పోతే మనం చూస్తూ ఊరుకోవాల్సిందేనా? అక్కర్లేదు! 2009 – 2014 నడుమ తెలంగాణ కావాలని పది జిల్లాల ప్రజలు రోడ్డెక్కారు. పార్టీలూ ఏకతాటిపైకి వచ్చాయి. ఏ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలన్నా ఒక రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఒక్కటవ్వాలి. అదే విజయానికి మూలం. తమిళనాడులో జల్లికట్టు విషయంలోనూ అదే నిరూపితమైంది. జనం, పార్టీలు అంతా కలిస్తే దిల్లీ కూడా ఒప్పుకోక తప్పదు. సరిగ్గా అదే జరగటం లేదు ప్రత్యేక హోదా విషయంలో!     ప్రత్యేక హోదా వద్దనే పార్టీ ఏపీలో ఏదీ లేదు. అయినా, ఎవరి రాజకీయం వారిది. జగన్ పిలుపునిచ్చిన తాజా బందే ఇందుకు కారణం. ఆ మద్య తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కూడా అనేక బందులు జరిగేవి. అయితే, చాలా వరకూ అవి సక్సెస్ కావటానికి కారణం జేఏపీ రూపంలో అన్ని పార్టీల్ని నిరసనాల్లో భాగమే చేసే వ్యవస్థ వుండేది. ఇవాళ్టి బంద్ లో అలాంటిదేం లేదు. జగన్ ఒంటెద్దుపోకడ తప్ప ప్రత్యేక హోదాపై నిజాయితీ ఎక్కడా కనిపించటం లేదు! తనకు తానే నిర్ణయం తీసుకుని మంగళవారం రాష్ట్రం బంద్ అనేశారు ప్రతిపక్ష నేత. దానికి ఎవరు మద్దతిస్తారు? ఒక్కమాటలో చెప్పాలంటే ఎవ్వరూ ఇవ్వటం లేదు. ప్రతిపక్ష నేత బందులకి అధికారపక్షం ఎలాగూ అండగా నిలువదు కదా! కనీసం ఇతర ప్రతిపక్షాలైనా వైసీపీ బంద్ కు మద్దతిస్తున్నాయా? ఎక్కడా లేదనే చెప్పాలి!     జగన్ పిలుపునిచ్చిన బంద్ కు టీడీపీ సహజంగానే సై అనలేదు. విచిత్రంగా ప్రత్యేక హోదా కావాలి అని ఎప్పట్నుంచో అంటోన్న జనసేనాని కూడా తన పని తాను చేసుకుపోతున్నాడు ఇవాళ్ల. బంద్ లో ఆయన వంతు పాత్ర ఏం లేదు. ఇది ఖచ్చితంగా జగన్ వైఫల్యమే. బంద్ విజయవంతంగా నిర్వహించాలనుకున్నప్పుడు కాస్త చొరవ చేసి పవన్ తో అయినా చర్చలు జరపాల్సింది. చంద్రబాబు దగ్గరికి వెళ్లి బంద్ కు సహకరించమని అడగలేరు కదా! వున్న మిగతా ప్రతిపక్షాల్నికూడా కలుపుకుపోకపోతే ఎలా? జనసేనతో సహా పోరాటాలకి , బందులకి నిత్యం సై అనే కమ్యూనిస్టు పార్టీల్ని కూడా జగన్ తన వెంట తెచ్చుకోలేకపోయారు. చివరకు, వైసీపీ బంద్ ప్రత్యేక హోదా కోసం కేంద్రం పై ఒత్తిడి తెచ్చే కార్యక్రమంగా కన్నా తమ పార్టీ బల ప్రదర్శనగా మారిపోయింది. వైసీపీ ఏపీ వీధుల్లో బంద్ నిర్వహిస్తుంటే టీడీపీ పార్లమెంట్లో హోదా కోసం చర్చకు పట్టుబడుతోంది. అక్కడ వైసీపీ టీడీపీకి సహకరించటం లేదు. ఇక్కడ టీడీపీ వైసీపీ వెంట వుండటం లేదు. మిగతా పార్టీల దారి దేనిది దానిదే! ఇలా అనైక్యంగా వుండటమే మోదీకి అత్యంత అనుకూలంగా మారుతోంది. హోదా కంటే ఏపీ రాజకీయ పార్టీలు తమ పొలిటికల్ ఎజెండానే ఎక్కువగా కొనసాగిస్తున్నాయి. దిల్లీ పెద్దలకు కావాల్సింది కూడా అదే! 

ముగింపులు లేని బుజ్జగింపుల్లో చంద్రబాబు!

  నవ్యాంధ్ర సీఎం చంద్రబాబుకు ప్రత్యేక హోదా అతి పెద్ద సమస్య. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబుకి సమస్యేంటి? బోలెడు! అలాగే వుంది పరిస్థితి. తాజాగా ఆయన పిలిచి మాట్లాడక అనంతపురం సీనియర్ నేత జేసీ చల్లబడ్డారు. ఆయనసలు అలకబూనటానికి కారణం ఏంటి? అదీ స్పష్టంగా తెలియదు. మీడియాలో వచ్చే రకరకాల ప్రచారాలే తప్ప దివాకర్ రెడ్డి నేరుగా తన డిమాండ్లు ఇవ్వంటూ ఎవరికీ చెప్పలేదు. అలాగే, చంద్రబాబు కూడా పబ్లిగ్గా ఏమీ మాట్లాడలేదు. కానీ, జేసీ డిమాండ్స్ లో ఎన్ని న్యాయబద్ధమైవి, ఎన్ని కాకపోయినా… కీలక సమయంలో పార్టీకి, పార్టీ అధినేతకి ఇబ్బందికరంగా మాత్రం మారాయని చెప్పక తప్పదు. మోదీని ఢీకొంటూ చంద్రబాబు దిల్లీలో మంత్రాంగం నడుపుతుంటే… టీడీపీ ఎంపీ అయ్యి వుండి జేసీ అనంతపురంలో అలక పాన్పు ఎక్కారు. పార్లమెంట్ కు పోనని పేచీ పెట్టారు. ఎలాగో సర్ది చెప్పిన టీడీపీ అధినేత ఇతర పార్టీల ఎంపీల్ని మద్దతివ్వమన్నట్టు తన స్వంత పార్టీ ఎంపీనే బుజ్జగించాల్సి వచ్చింది. ఇది ఎంత మాత్రం హర్షనీయం కాదు!     అవిశ్వాస తీర్మానం అంకం ముగిశాక జేసీ ఇవాళ్ల చంద్రబాబుని కలిశారు. ఇలాంటి సమస్యల్ని ఎదుర్కోవటంలో అపార అనుభవం వున్న చంద్రబాబు లోపల ఏం మంత్రం వేశారోగానీ దివాకర్ రెడ్డి పూర్తిగా మెత్తబడ్డారు. లోపలేం జరిగిందో తాను చెప్పను అంటూనే లోక్ సభకు వెళతానని స్పష్టం చేశారు. మోదీ పీఎంగా వున్నంత కాలం విభజన హామీలు నెరవేరవని మరోమారు అన్న ఆయన పోరాటం మాత్రం సాగుతూనే వుండాలని చెప్పుకొచ్చారు. అసలింతకీ, దివాకర్ రెడ్డి ఏం అడిగారు? చంద్రబాబు ఎలా సముదాయించారు? ఇదంతా ఇప్పటికైతే సీక్రెట్టే! బహుశా వచ్చే ఎన్నికల్లో తనకు, తన వారసుడికి టికెట్ల గురించి దివాకర్ రెడ్డి పట్టుబట్టి వుంటారు.ఇది కూడా జరుగుతున్న ప్రచారమే తప్ప అధికారికంగా ఎక్కడా ఎవరూ చెప్పటం లేదు.     దివాకర్ రెడ్డి లాగే గతంలో గంటా శ్రీనివాసరావు కూడా పార్టీకి, చంద్రబాబుకి కాస్త ఇబ్బందికర పరిస్థితి ఉత్పన్నం చేశారు. సీఎం స్వయంగా ఆయన్ని పిలిచి మాట్లాడాల్సి వచ్చింది. ఇక దఫదఫాలుగా కొనసాగిన నంద్యాల నియోజక వర్గ వర్గపోరు సంగతి చెప్పనక్కర్లేదు. చంద్రబాబు ఒకటికి రెండు సార్లు వాళ్లని పిలిచి కూర్చోబెట్టి సముదాయించాల్సి వచ్చింది. ఇలా పదే పదే పుట్టుకొస్తున్న పార్టీ అంతర్గత కలహాలు లేదా కుమ్ములాటలు, అసంతృప్తులు అధినేత సమయాన్ని వృథా చేస్తున్నాయి. రాష్ట్ర రథసారథిగా ఆయన సమయం అమూల్యమైంది. దాన్ని స్వంత పార్టీ నేతలే వృథా చేయిస్తుండటం ప్రభుత్వానికి, ప్రజలకి కూడా నష్టమే. ముందు ముందు ఎన్నికలు సమీపిస్తే ఈ అలకలు, బుజ్జగింపులు మరింత పెరుగుతాయేమోనని కింది స్థాయి కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు! దీనిపై చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి మరి…

పీఎం కుర్చీపై రాహుల్ కర్చీఫ్! మోదీ ట్రాప్‌లో పడ్డ కాంగ్రెస్ పార్టీ! 

2014లో జరిగినట్టే మళ్లీ జరుగుతోందా? ముఖ్యంగా, కాంగ్రెస్ పార్టీ బీజేపీ ట్రాప్ లో చిక్కుతోందా? పరిణామాలు చూస్తోంటే అలాగే అనిపిస్తోంది! రాహుల్ గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యాక తొలి సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. రాహుల్ నాయకత్వంలో దేశంలోని ప్రధాన ప్రతిపక్షం సమాలోచనలు జరిపింది. చివర్న రాహుల్ గాంధీయే తమ ప్రధాని అభ్యర్థి అంటూ హస్తం పార్టీ సంకేతాలిచ్చింది. నిజానికి, ఇదే కమలానికి కావాల్సింది! కాషాయ నేతల ఆశలన్నీ రాహుల్ వర్సెస్ మోదీ పోరు జరగాలనే! ఆ ట్రాప్ లో చిక్కినట్టే కనిపించింది కాంగ్రెస్ పార్టీ!     2014లో బీజేపీకి స్పష్టంగా మోదీ అనే నేత నాయకత్వం వహించారు. కాంగ్రెస్ కి సోనియా వున్నా ఆమె ప్రధాని అభ్యర్థి కాదు. మన్మోహన్ మళ్లీ పీఎం అని కాంగ్రెస్ ఎక్కడా చెప్పలేదు. పోనీ రాహుల్ పీఎం అవుతారని కూడా అనలేదు. అయినా కూడా గత పార్లమెంట్ ఎన్నికల ప్రచారం అంతా మోదీ చుట్టూ తిరిగింది. మోదీ వర్సెస్ ఇతర పార్టీలు అన్నట్టు కొనసాగి చివరకు ఓటర్లు నమో మీదే నమ్మకం చూపేలా చేసింది. అయితే, కాంగ్రెస్ ఈసారి తొందరపడి రాహుల్ ని పీఎం క్యాండిడేట్ గా ప్రకటించి మళ్లీ మోదీకి మేలు చేసినట్టు కనిపిస్తోంది!     2014లో కాంగ్రెస్ తమ ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పకున్నా జనం దృష్టి మోదీ అనే వ్యక్తి మీద నిలిచింది. పార్టీలు, పార్టీల గుర్తులు ప్రాముఖ్యత కోల్పోయాయి. ఇప్పుడు రాహుల్ మా ప్రధాని అంటూ కాంగ్రెస్ ప్రకటించే సరికి మరో మారు అమెరికన్ స్టైల్లో వ్యక్తుల మధ్య పోరాటంగా పరిణమించబోతోంది. మోదీ వర్సెస్ రాహుల్ అయితే బీజేపీకి పండగే. ఎందుకంటే, గతంలో కంటే ఇప్పుడు రాహుల్ ఇమేజ్ కాస్త బెటరైనా మోదీని ఢీకొట్టే స్థాయిలో క్రేజ్ రాలేదు. అదే విధంగా రాహుల్ నేతృత్వం దేశంలోని ఎన్ని పార్టీలకు, ఎంత మంది సీనియర్ నాయకులకు ఆమోదం? ఇదీ అనుమానమే! కాబట్టి ఏ విధంగా చూసినా కాంగ్రెస్ ఈ విషయంలో తొందరపడిందనే చెప్పుకోవాలి. రాహుల్ మా ప్రధాని అభ్యర్థి అని చెప్పటం ద్వారా హస్తం పార్టీకి వచ్చే ప్రత్యేక లాభాలేం లేవు. కానీ, అదే సమయంలో బీజేపీకీ మాత్రం మోదీ ప్రత్యర్థిగా రాహుల్ వుండటం ఎంతో అవసరం. దేశమంతా పార్లమెంట్ ఎన్నికల్ని మోదీ వర్సెస్ రాహుల్ గా భావిస్తే ఓటర్లు నరేంద్రుడి వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువుంటాయి. అదే సమయంలో మోదీ, రాహుల్ ప్రచార హోరులో మమత, మాయ, ములాయం, చంద్రబాబు, కేసీఆర్… ఇలా అందరు సీనియర్ నేతలు సైడ్ లైన్ అవుతారు. తమతమ రాష్ట్రాలకే పరిమితం అవుతారు. ఇది మోదీకి అతి పెద్ద లాభం. తెలిసో తెలియకో కాంగ్రెస్ ఈ లబ్ది చేకూర్చిపెడుతోంది మోదీకి!     తమకు రెండు వందల దాకా సీట్లు వస్తే రాహులే ప్రధాని అని చెబుతున్నప్పటికీ కాంగ్రెస్ కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించుకోవాలి. ప్రస్తుతం నలభై సీట్లు మాత్రం వున్న పార్టీ అమాంతం రెండు వందలకు చేరుకోవటం కష్టం. అదీ చాలా చోట్ల రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు లేవు. మరప్పుడు ఎంపీల్ని గెలిపించుకోవటం రాహుల్ కు తలకు మించిన భారమే. అటువంటప్పుడు మోదీని అడ్డుకోవాలని నిజంగా వుంటే… ప్రాంతీయ పార్టీలు, నాయకుల్ని కలుపుకుపోవాలి.ఎన్నికల పలితాలు పూర్తిగా వచ్చేదాకా ప్రధాని అభ్యర్థిత్వంపై మాట్లాడకుండా వుండాలి. ఒకవేళ నిజంగానే ప్రభుత్వ వ్యతిరేకత, మోదీపై అసంతృప్తి కారణంగా కాంగ్రెస్ కు రెండు వందల దాకా సీట్లొస్తే మిగతా పార్టీలన్నీ రాహుల్ నే పీఎంని చేస్తాయి. దానికి ఇప్పట్నుంచే కుర్చీపై కర్చీఫ్ వేసుకోవాల్సిన అవసరం ఏంటి? అనవసరంగా మద్దతు ఇచ్చే ప్రాంతీయ పార్టీల్లో కూడా భయాలు, అనుమానాలు రేకెత్తించటం తప్ప! కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఈ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా వుంది! 

పవన్ కళ్యాణ్ … టీడీపీ, వైసీపీల ముంగిట తీరం దాటని తుఫాన్!

పవన్ కళ్యాణ్ … నిన్న మొన్నటి దాకా పార్ట్ టైం పొలిటీషన్. ఫుల్ టైం హీరో. కానీ, ఇప్పుడు ఫుల్ టైం జనం మధ్యనే గడుపుతోన్న జనసేనాని! అయితే, ఇప్పటి వరకూ ఎవరికీ అర్థం కాని విషయం ఏంటంటే…. పవన్ స్ట్రాటజీ ఏంటి? ఆయన నేరుగా ఎన్నికల్లో పాల్గొనకున్నా 2014లో తీవ్రంగా ప్రచారం చేశారు. చంద్రబాబును, మోదీని సమర్థించారు. మరిప్పుడు? ఆ ఇద్దర్నీ వ్యతిరేకిస్తున్నారు! కొంత కాలం కాకినాడ, అనంతపురాల్లో సభలు నిర్వహించినప్పుడు మోదీని తెగ తిట్టి, బాబును సున్నితంగా విమర్శించారు. ఇప్పుడు సీన్ రివర్స్ చేసేశారు. చంద్రబాబును, లోకేష్ ను, టీడీపీని అదే పనిగా టార్గెట్ చేస్తున్నారు. అలా అని పవన్ బీజేపీ వైపున కూడా వుండటం లేదు. జగన్ను కూడా ఉపేక్షించటం లేదు. అందర్నీ విమర్శిస్తూ ఒంటరిగానే బరిలో తొడగొడుతున్నారు. దీని వల్ల ఆయనకెంత లాభం? ఇతర పార్టీలకు ఎంత నష్టం? ఎన్నికల ఫలితాలొచ్చే దాకా సస్పెన్సే!     పవన్ పోరుయాత్ర చేస్తూ ఉత్తరాంధ్ర దాటి కోస్తాంధ్రలోకి ప్రవేశించారు. అయితే, రోజురోజుకి ఆయన ఆరోపణలు, మాటలు ఆసక్తి కలిగిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలతో కాస్త సన్నిహితంగా వున్నా దాదాపుగా జనసేనాని యుద్ధం ఒంటరిగానే అని తేలిపోతోంది. పవన్ తాజాగా జగన్ని టార్గెట్ చేశారు. తనకు పది మంది ఎమ్మెల్యేలు వున్నా అసెంబ్లీ వదిలి పారిపోయేవాడ్ని కానని చెప్పారు. జగన్ మంచి అవకాశాన్ని అసెంబ్లీ సాక్షిగా పాడు చేసుకున్నారని అన్నారు. కానీ, ఇదే సమయంలో టీడీపీని, నేరుగా చంద్రబాబునే ఇరుకునే పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు జనసేన అధినేత!     చంద్రబాబు తనను గతంలో ప్రత్యక్ష పోరుకు దిగవద్దని అన్నారని చెప్పిన పవన్ అందుకు ప్రతిగా రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పారంటూ పేర్కొన్నారు. కానీ, తనకు రాజ్యసభ సీటు ఇస్తానన్న సంగతి మరుసటి రోజుకే పత్రికలకు లీకు చేయించారని పవన్ ఆరోపించారు. ఇది ఎప్పుడో 2014కి ముందు జరిగింది. దీన్ని ఇప్పుడు పవన్ బయటపెట్టటం ఏంటి? కేవలం చంద్రబాబు ఇమేజ్ ని ఎంతో కొంత డ్యామేజ్ చేయటమే దీని ఉద్దేశం అయి వుండాలి. ఇక ఇలాంటి ఆరోపణలు ఎంత వరకూ ఓట్లు రాలుస్తాయో కూడా చూడాలి!     ఒకవైపు చంద్రబాబును, మరోవైపు జగన్ను వ్యతిరేకిస్తోన్న పవన్ గత కొంత కాలంగా మోదీని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఘాటు విమర్శలు కాదు కదా… కనీస ఎత్తిపొడుపులు కూడా వుండటం. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని చెలరేగిన పవన్ సడన్ గా ఇలా ఎందుకు మెత్తబడ్డారో ఆయనకి, మోదీకే తెలియాలి. కానీ, రానున్న ఎన్నికల్లో పవన్ కీలక శక్తి మాత్రం కానున్నారని ఆయన తాజా విమర్శల ద్వారా అర్థం చేసుకోవచ్చు. అంటే, పవన్ బోలెడు మంది ఎమ్మెల్యేల్ని గెలుచుకుంటారని అర్థం కాదు! ఆయన పార్టీ నిలబెట్టే అభ్యర్థుల వల్ల చంద్రబాబుకో, జగన్ కో డ్యామేజ్ పక్కా. అది ఎవరవుతారో వాళ్లు అధికారానికి దూరమవ్వమూ ఖాయం. మొత్తానికి పవన్ తాను తినకుండా ఎవరు తినకూడదో డిసైడ్ చేయబోయే ప్రమాదకర శక్తిగా మారనున్నరన్నది గ్యారెంటీ!

పాక్ ప్రధాని కాబోతున్నాడు! మాజీ భార్య మాత్రం ముప్పతిప్పలు పెడుతోంది! 

ఏ దేశంలో అయినా ఎన్నికలు అంటే రాజకీయ పార్టీలు, నేతలు గుర్తుకు వస్తారు. అయితే, నిజంగా రాజకీయాన్ని ప్రభావితం చేసేది పొలిటీషన్స్ అయినా ఎక్కువ చర్చ, రచ్చ జరిగేది మాత్రం సినిమా, క్రికెట్, టీవీ సెలబ్రిటీల గురించే! మన దేశంలో కూడా ఎన్నికలొప్పుడొచ్చినా చూస్తూనే వుంటాం కదా! నలభై ఏళ్ల అనుభవం వున్న రాజకీయ నేతకి దక్కని కవరేజ్ నాలుగు సినిమాలు చేసిన సెలబ్రిటీలకు దక్కేస్తుంది! అంతా గ్లామర్ మహిమ!     పాకిస్తాన్ లో మరో రెండు రోజుల్లో జాతీయ ఎన్నికలున్నాయి. పాక్ నెక్స్ట్ పీఎం ఎవరో డిసైడ్ అవ్వనుంది. అయితే, ఈసారి పాకిస్తాన్ లో కూడా క్రికెట్ సెలబ్రిటీ హంగామానే నడుస్తోంది. ఒకవైపు మిలటరీ, మరోవైపు ఉగ్రవాదుల అరాచకం మధ్య పాకిస్తాన్ ప్రధాని అంటేనే డమ్మీ అనుకుంటారు ప్రపంచ జనం. అటువంటిది ఈసారి మాజీ క్రికెటర్, వరుస పెళ్లిళ్ల రొమాంటిక్ స్టార్ … ఇమ్రాన్ ఖాన్ పీఎం అయ్యే ఛాన్సెస్ వున్నాయట! చాలా సర్వేలు అదే చెబుతన్నాయి. పాక్ ఆర్మీకి కూడా మనోడే మక్కువగా వున్నాడు. అందుకే, కాస్తో కూస్తో రాజకీయ అనుభవం వున్న నవాజ్ షరీఫ్ ను , అతడి కూతుర్ని లోపలేసి మరీ ఇమ్రాన్ ఖాన్ ను అధికారపు పిచ్ పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది!     జనంలో క్రేజ్, ఆర్మీతో మంచి సంబంధాలు, అన్నీ బాగానే వున్నా… ప్లేబాయ్ గా పేరుబడ్డ ఇమ్రాన్ ఖాన్ కి అసలు సమస్య మాజీ భార్య రేహమ్ నుంచి వస్తోంది. ఆమెని రెండో భార్యగా నిఖా చేసుకున్న ఈ క్రికెటర్ కమ్ పొలిటీషన్ అలవాటు ప్రకారం వదిలేసి మొన్న ఫిబ్రవరీలో మూడో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు రెండో భార్య రేహమ్ ఆత్మకథ రాస్తున్నా అంటూ … పీఎం పదవిపై పరుగు తీస్తున్న ఇమ్రాన్ ని రన్నవుట్ చేసే పనిలో వుంది! తన పుస్తకంలో రచ్చ రచ్చైపోయే వివరాలు పేర్కొంటోంది. ఇమ్రాన్ ఖాన్ గే అని రేహమ్ చెప్పిందట బుక్కులో. అతడికి ఓ బాలీవుడ్ హీరో సంబంధం వుందని రాసింది ఆత్మకథలో. అంతే కాదు, ఇమ్రాన్ ఖాన్ కు అయిదుగురు అక్రమ సంతానం వున్నారనీ, వాళ్లు రహస్యంగా పెరుగుతున్నారని చెప్పింది. వాళ్లలో కొందరు భారతదేశంలో పెరుగుతున్నారని అనటం కలకలం రేపింది!     ఎన్నికల ముందు రోజుకో విధంగా ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య డ్యామేజింగ్ చేస్తోంటే కాబోయే పీఎం మాత్రం ఏమీ అనటం లేదు. ఎలక్షన్స్ టైంలో ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోనని లోలోన మథనపడుతున్నాడు. అయితే, చిట్ట చివరకు నోరు తెరిచిన ఇమ్రాన్ తన జీవితంలో చేసిన తప్పులన్నిట్లో అతి పెద్ద తప్పు రేహమ్ ఖాన్ ని పెళ్లాడటమేనని అన్నాడు! ఇంతకీ, రేహమ్ చెప్పిన విషయాలన్నీ నిజమా కాదా? ఇమ్రాన్ అయితే వాట్ని ఖండించటం లేదు! అంటే… నిజమనే కదా!     ఇమ్రాన్ ఖాన్ లాంటి క్యారెక్టర్ పాక్ పీఎం అయితే ఏమవుతుంది? కొత్తగా ఆ దేశానికి జరగాల్సిన నష్టమంటూ ఏం మిగలలేదని కూడా కొందరంటున్నారు. అది పక్కన పెడితే ఇమ్రాన్ పిల్లలు రహస్యంగా మన దేశంలో పెరుగుతున్నారా? వారెవరు? ఇవీ… ఇంట్రస్టింగ్ కొశన్స్. రేపు ఆయన ప్రధాని అయితే… ఏదో ఒక క్షణంలో వారెవరో కూడా బయటకు పొక్కవచ్చు! చూద్దాం! అంతవరకూ మాత్రం పాక్ ఎన్నికల హడావిడిని గమనించటం మంచి ఎంర్టైన్మెంటే! ఎందుకంటే, అక్కడ ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన కొందరు నేతలు… తమ ప్రచార పోస్టర్లపై అమితాబ్, మాధురీ దీక్షిత్ ఫోటోలు ముద్రించి క్యాంపైన్ కొనసాగిస్తున్నారట! పాక్ పై ఇండియా, బాలీవుడ్ల ప్రభావం చాలానే వుందని ఒప్పుకోక తప్పదు!