ఐటీ రంగంలో తెలంగాణ‌ రాష్ట్రంతో ఏపీ పోటీ పడగలదా?

  సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఐటీ రంగం అద్భుతమైన ప్రగతిని సాధించడానికి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రధాన కారణం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత రెండు రాష్ట్రాల దృష్టీ ఐటీ రంగంపై కేంద్రీకృతమై వుంది. ఐటీ రంగంలో తమ రాష్ట్రమే అగ్ర స్థానంలో వుండాలన్న బలమైన కోరిక రెండు రాష్ట్రాల్లోనూ వుంది.   అయితే కొంతమంది పరిశీలకులు తెలంగాణ రాష్ట్రానికి ఐటీ రంగంలో ఉజ్వల భవిష్యత్తు వుంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ని చూపిస్తున్నారు. యువకుడు, ఉత్సాహవంతుడు అయిన కల్వకుంట్ల తారక రామారావు ఐటీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దూసుకువెళ్తున్నారు. బాగా చదువుకున్న వ్యక్తి, విదేశాలలో ఉన్నత ఉద్యోగాలు చేసిన వ్యక్తి, అద్భుతమైన కమ్యునికేషన్ స్కిల్స్ వున్న వ్యక్తి అయిన కేటీఆర్ హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి చురుగ్గా వ్యహరిస్తున్నారు. కేటీఆర్‌లోని చురుకుదనం, కార్యదక్షతతోపాటు వడ్డించిన విస్తరిలా వున్న హైదరాబాద్ కూడా తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో అద్భుత ఫలితాలను సాధించడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.   తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఇప్పటికే ఐటీ రంగానికి సంబంధించిన అనేక సెమినార్లు నిర్వహించడం, విదేశీ ప్రతినిధులను కలవటం, అనేక ప్రణాళికలు రూపొందించడంలో నిమగ్నమై వున్నారు. మంత్రిగా కేటీఆర్ పనితీరును చూస్తుంటే తెలంగాణ అభివృద్ధిలో ఆయన కీలక వ్యక్తి అవుతారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఐటీ రంగం ముందుకు దూసుకుని వెళ్ళడమే తప్ప వెనక్కి తిరిగి చూసే అవసరమే లేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.   తెలంగాణకి వున్న హైదరాబాద్ నగరం, కేటీఆర్ నాయకత్వం లాంటి అడ్వాంటేజెస్‌తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌కి చెప్పుకోదగ్గ అవకాశాలు, నాయకత్వం లేవన్న వ్యాఖ్యాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఇప్పటి వరకు ఐటీ రంగానికి ఒక చిరునామా అనేదే లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పల్లె రఘునాథరెడ్డి వయసు రీత్యా పెద్దవాడు. అంత చురుకుగా వ్యవహరించే వ్యక్తి కూడా కాదు. దానికితోడు ఐటీ రంగం మీద ఆయనకి వున్న అనుభవం దాదాపుగా శూన్యం.   అంతేకాకుండా ఆయన భుజస్కందాల మీద ఐటీ మంత్రిత్వ శాఖ మాత్రమే కాకుండా ఇతర కీలక శాఖల బాధ్యతలు కూడా వున్నాయి. ఇన్ని బాధ్యతలు మోస్తున్న ఆయన ఐటీ రంగానికి ఎంతవరకు న్యాయం చేయగలరన్న అనుమానాలు వున్నాయి. చంద్రబాబు నాయుడు దృష్టి పెడితే ఐటీ రంగం ఆంధ్రప్రదేశ్ రంగం పుంజుకునే అవకాశాలు వుంటాయి. అయితే ఎన్నో సవాళ్ళతో ముందుకు వెళ్తున్న చంద్రబాబు నాయుడు ఐటీ రంగం మీద దృష్టి ఎంతవరకు కేటాయిస్తారన్నది అనుమానమే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కంటే యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడు అయిన కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణలోనే ఐటీ రంగం అభివృద్ధి సాధిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీని మీద మీ అభిప్రాయమేమిటి?

ప్రమాదాలు జరిగినప్పుడే ఆర్టీఏ హడావిడి!

  ‘హడావిడి’ అనే మాటకు అర్థం తెలుసుకోవాలంటే ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఆర్టీఏ అధికారులు చేసే పనులని చూడాలి. దేశంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతూవున్నాయంటే దానికి ప్రధాన కారణం ఆర్టీఏ వ్యవస్థలో విపరీతంగా వున్న అవినీతే. దేశంలో అత్యంత భారీగా అవినీతి జరిగే ప్రభుత్వ వ్యవస్థల్లో ఆర్టీయే మొదటి వరుసలో వుంటుంది. డ్రైవింగ్ పరీక్షలు సరిగ్గా నిర్వహించకుండానే లైసెన్సులు ఇవ్వడం, ఫిట్‌నెస్ సరిగా లేని వాహనాలకు కూడా ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేయడం ఇలాంటి ఆర్థిక బలహీనతలు ఆర్టీఏకి చాలా వున్నాయి. ఇలాంటి అవినీతి ప్రమాదాల రూపంలో తన రియాక్షన్‌ని చూపిస్తూ వుంటుంది.   ఏదైనా ప్రమాదం జరగ్గానే ఆర్టీఏ అధికారులు హడావిడి మొదలు పెడతారు. అప్పటి వరకూ లంచం కోసం ఎన్ని సంతకాలు పెట్టినవాళ్ళయినా అర్జెంటుగా స్ట్రిక్ట్ ఆఫీసర్లయిపోతారు. కనిపించిన వాహనాన్నల్లా ‘అన్‌ఫిట్’ అంటూ సీచ్ చేసేస్తుంటారు. జరిమానాలు విధించేస్తూ వుంటారు. అలాంటి సమయంలో తాము గతంలో తిన్న లంచాలన్నిటినీ మరచిపోతూ వుంటారు.   2012 సంవత్సరంలో ఖమ్మం జిల్లాలో ఒక స్కూలు బస్సు నీళ్ళలో పడిపోయి ఎనిమిది మంది చిన్నారులు మరణించారు. ఆ ప్రమాదం జరిగి ప్రాణనష్టం జరగడంతో ఆర్టీఏకి కళ్ళు అకస్మాత్తుగా తెరుచుకున్నాయి. వెంటనే కనబడిన స్కూలు బస్సునల్లా తనిఖీలు చేయడం మొదలుపెట్టారు. బస్సులో ఆలోపం.. ఈలోపం వుందని చెబుతూ వందలాది బస్సులను సీజ్ చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ బస్సులన్నీ రోడ్లమీద మామూలుగానే తిరిగాయి. ఆ బస్సులన్నీ ఎంచక్కా రోడ్డుమీద తిరగడం వెనుక ఎంత డబ్బు చేతులు మారిందో పరమాత్ముడికే ఎరుక.   అలా ఎప్పుడు ఏ భారీ రోడ్డు ప్రమాదం జరిగినా ఆ తరహా వాహనాల మీద ‘ప్రత్యేక శ్రద్ధ’ చూపించి సీజ్‌ చేస్తూ వుండటం, ఆ తర్వాత డబ్బులు చేతులు మారగానే చూసీ చూడనట్టు వదిలేయడం. ఆమధ్య పాలెం ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగినప్పుడు ఆర్టీఏ అధికారులు పనికిమాలిన హడావిడి చేసి వందలాది బస్సులను సీజ్ చేశారు. మా అంతటి నిజాయితీపరులు ఎవరూ లేరన్నట్టు బిల్డప్పు ఇచ్చారు. ఆ తర్వాత సీజ్ చేసిన బస్సులన్నీ రోడ్ల మీద తూనీగల్లా తిరుగుతున్నాయి. అధికారులెవరూ వాటిని పట్టించుకోవడం లేదు. అలా పట్టించుకోకుండా ఉండటానికి ఎంత డబ్బు పట్టుకున్నారో ఎవరికి ఎరుక?   అలాగే రీసెంట్‌గా మెదక్ జిల్లాలో ఒక స్కూలు బస్సుని రైలు ఢీకొనడంతో 18 మంది మరణించారు. వారిలో 16 మంది చిన్నారులే. ఈ దుర్ఘటన జరగగానే ఆర్టీఏ అధికారులలో ఎక్కడలేని కదలిక వచ్చింది. శుక్రవారం నాడు తెల్లవారగానే డ్యూటీలో దిగిపోయి ఒక్క హైదరాబాద్ పరిసరాల్లోనే 120 స్కూలు బస్సులను కండీషన్‌లో లేవంటూ సీజ్ చేశారు. ఈ తనిఖీలు, సీజ్‌లు ప్రమాదాలు జరగకముందు చేస్తే ప్రమాదాలనేవే జరగవనే కనీస జ్ఞానం అధికారులకు కొరవడుతోంది. ఇప్పుడు సీజ్ చేసిన 120 బస్సులు ఓ వారం పదిరోజులు గడిచిన తర్వాత, తడవాల్సిన వారి చేతులు తడిసిన తర్వాత మళ్ళీ రోడ్ల మీద తిరుగుతూనే వుంటాయి. మళ్ళీ ప్రమాదాలు మామూలుగానే జరుగుతూనే వుంటాయి. ఇంకోసారి ఆర్టీఏ అధికారుల తనిఖీలు, సీజ్ చేయడాలు షరా మామూలుగానే జరుగుతూనే వుంటాయి. ఈ ‘చక్ర’భ్రమణానికి అంతే లేదా!

ఏపీలో ఇంటర్ మార్కుల ఆధారంగా ఇంజనీరింగ్ అడ్మిషన్లు

  ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాలు ఇంజనీరింగ్, మెడికల్ ఎడ్మిషన్ల వ్యవహారంపై ఎటూ తేల్చకుండా నాన్చుతుండటంతో లక్షలాది విద్యార్ధులు వారి తల్లితండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఇటువంటి క్లిష్ట పరిస్థితులు అనేకం ఏర్పడుతాయని ఆనాడు ఆంధ్రాకు చెందిన నేతలు ఎంత మొత్తుకొన్నా వాటికి సరయిన పరిష్కారం చూపకుండా, కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ లబ్దికోసం హడావుడిగా రాష్ట్రవిభజన చేసేసి చేతులు దులుపుకొని వెళ్లిపోయింది. సరిపోయినంతమంది అధికారులు లేని కారణంగా ఇప్పకిప్పుడు ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలలో ప్రవేశాల ఏర్పాట్లు చేయలేమని చేతులేత్తేసింది. ఈ వ్యవహారం రెండు రాష్ట్రాలతో ముడిపడి ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అడుగు ముందుకు వేయలేకపోయింది. అయితే ఇదే విధంగా కాలయాపన చేస్తే విద్యార్ధులు తీవ్రంగా నష్టపోతారనే ఆలోచనతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్ మార్కుల ఆధారంగా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాలు చేపట్టేందుకు సిద్దం అవుతోంది. అందువల్ల చాలా కాలంగా ఈ విధానాన్ని సమర్ధంగా అమలుచేస్తున్న తమిళనాడు రాష్ట్రానికి అధ్యయనం కోసం ఒక బృందాన్ని తక్షణమే పంపుతున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఒకవేళ ఆ విధానం మన రాష్ట్రంలో కూడా అమలుచేయడానికి అనువుగా ఉన్నట్లయితే ఇంటర్ మార్కుల ఆధారంగా తక్షణమే ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాలు మొదలుపెడతామని మంత్రి తెలిపారు. ప్రభుత్వానికి ఈ ఆలోచన కొంత ఆలస్యంగా వచ్చినా కనీసం ఇప్పటికయినా మేల్కొంది గనుక ఇక వీలయినంత త్వరగా ఎడ్మిషన్ల ప్రక్రియ మొదలుపెడితే బాగుంటుంది. అదేవిధంగా మెడికల్ కళాశాలలో ప్రవేశాలకు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించి వెంటనే వాటినీ మొదలుపెడితే ప్రభుత్వం విద్యార్ధులకు ఎంతో మేలు చేసినదవుతుంది.

తెలంగాణా సిటిజన్ కార్డులు దేనికో

  సాధారణంగా అన్ని దేశాలు తమ పౌరులకు గుర్తింపు కార్డులు ఇస్తాయి. మనదేశంలో ఇప్పటికే చాలా మందికి ఆధార్ కార్డులు ఇవ్వబడ్డాయి. కానీ దేశంలో ఎక్కడాలేని విధంగా కేవలం తెలంగాణా రాష్ట్రంలో మాత్రమే ‘తెలంగాణా సిటిజన్ కార్డు’లను ఇచ్చేందుకు తెలంగాణా ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పధకాలలో అవినీతికి తావు లేకుండా అర్హులయిన వారికే ప్రభుత్వ పధకాల వల్ల లబ్ది కలిగేలా చేయడం ఈ కార్డుల ప్రధానోదేశ్యం అని ప్రభుత్వం చెపుతోంది. నిజంగా అవి అందుకొరకే అవి నిర్దేశించబడినట్లయితే, వాటిని తెలంగాణా సిటిజన్ కార్డులని అనడం తప్పు. కానీ ఆవిధంగా పేర్కొనడం ద్వారా రాష్ట్రంలో తెలంగాణా ప్రజల నుండి ఇతరులను అంటే బహుశః తెలంగాణాలో స్థిరపడిన ఆంద్ర ప్రజలను, వారి పిల్లలను విడదీసి ప్రత్యేకంగా గుర్తించడానికేనని అర్ధమవుతోంది.   తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం తెరాస నేతలు తెలుగు ప్రజల మద్య విద్వేషాలు రెచ్చగొట్టి వారిని దూరం చేసారు. ఇప్పుడు ఈ తెలంగాణా సిటిజన్ కార్డులు ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణేతరులందరిపై సెకండ్ క్లాస్ సిటిజన్లుగా ప్రభుత్వమే ముద్ర వేసినట్లుఅవుతుంది. దేశ సమగ్రతను కాపాడవలసిన బాధ్యత ఏ ఒక్కరిమీదో ఉండదు. దేశంలో యావత్ ప్రజలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు కృషి చేయాలి. కానీ స్వయంగా ప్రభుత్వమే ప్రజలను ఈ విధంగా విభజించాలని ప్రయత్నించడం హర్షణీయం కాదు.   రాష్ట్ర విభజన కోసం ఉద్యమాలు జరుగుతున్నపుడు తెరాస నేతలు తామేమీ దేశం నుండి విడిపోతామని కోరడం లేదు కదా? అని ప్రశ్నించేవారు. కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇప్పుడు తెలంగాణా ప్రజలకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు ఇవ్వాలనే ఆలోచనను ఏమనుకోవాలి? ప్రభుత్వ పధకాలు నిజమయిన, అర్హులయిన లబ్దిదారులకు చేర్చేందుకు గుర్తింపు కార్డులు జారీ చేయడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ ఆ పేరుతో ప్రజల మధ్య దూరం పెంచడాన్ని మాత్రం ఎవరూ హర్షించరు.   రాష్ట్రం విడిపోయినా తెలంగాణాలో స్థిరపడినవారి పట్ల ఎటువంటి వివక్ష ఉండబోదని, రాష్ట్రాలుగా విడిపోయి తెలుగు ప్రజలు అందరూ అన్నదమ్ములా కలిసి ఉందామంటూ తెరాస నేతలు చాలా మంచి మాటలే చెప్పారు. కానీ అవ్వన్నీ ఇప్పుడు పూర్తిగా మరిచిపోయినట్లుగా వ్యవహరిస్తున్నారు.

తెలంగాణ ప్రజలు భారతీయులు కాదన్న టీఆర్ఎస్ మాజీ నాయకుడు.. (వీడియో)

టీఆర్ఎస్ నాయకుల వేర్పాటువాద ధోరణి ముదిరిపోతోంది. ఇంతకాలం రాష్ట్రాన్ని విభజించే వేర్పాటువాద ఉద్యమాన్ని నడిపి విజయం సాధించిన టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు దేశాన్ని విభజించే వేర్పాటువాదాన్ని ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత హైదరాబాద్ సంస్థానాన్ని బలవంతంగా ఇండియాలో కలిపారని వ్యాఖ్యానించడం, కాశ్మీర్‌లో కొంతభాగాన్ని ఇండియా వదులుకోవాలని వ్యాఖ్యానించడం ఇందుకు ఒక నిదర్శనం. తెలంగాణను బలవంతంగా ఇండియాలో కలిపారన్న వేర్పాటువాద ధోరణి టీఆర్ఎస్ పార్టీలో బాగా పెరిగిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. భారతదేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్నే టీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్ నాయకుల వేర్పాటువాద ధోరణి ఎంత పెరిగిపోయిందంటే, టీఆర్ఎస్ నాయకులు తామసలు భారతీయులమే కాదని అంటున్నారు. భారతదేశం తెలంగాణ మీద దురాక్రమణ చేసిందని అంటున్నారు. అందుకు సాక్ష్యం.. ఆధారం మీరే చూడండి.. టీఆర్ఎస్ మాజీ నాయకుడు, టీఆర్ఎస్ స్థాపకులలో ఒకరైన ప్రకాష్ తెలంగాణ ప్రజలు భారతీయులు కాదంటూ చేసిన ఈ కామెంట్లు వినండి.. చూడండి..!!     Your browser does not support the audio element.

కల్వకుంట్ల కవితకి పాకిస్థాన్‌లో ఫుల్ పబ్లిసిటీ!

  టీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవితకు పాకిస్థాన్‌లో పూర్తి పబ్లిసిటీ వచ్చేసింది. కాశ్మీ్ర్‌ని, హైదరాబాద్‌ని భారతదేశంలో దౌర్జన్యంగా కలిపారని, కాశ్మీర్‌ని ఇండియా వదుకుంటే మంచిదని కల్వకుంట్ల చేసిన వేర్పాటువాద పూరిత వ్యాఖ్యలకు పాకిస్థాన్ మీడియా చాలా గొప్పగా ప్రచారం చేస్తోంది. కవిత ఆ వ్యాఖ్యలు చేసిన మర్నాడు పాకిస్థాన్‌లోని అన్ని వార్తాపత్రికలలో ఈ వార్త చాలా ప్రధానంగా వచ్చింది. కాశ్మీర్ ఇండియాలో భాగం కాదని పాకిస్థాన్ ఎప్పటి నుంచో చేస్తున్న వాదనకు ఇండియాలోని ఒక పార్లమెంటు సభ్యురాలే మద్దతు ఇస్తోందని పాకిస్థాన్ పత్రికలు తమ కథనాలలో రాశాయి. ఇండియాలో పార్లమెంటు సభ్యురాలే కాశ్మీర్ భారతదేశానికి చెందినది కాదు అంటోంది కాబట్టి కాశ్మీర్ పాకిస్థాన్‌దే అని పాకిస్థాన్ మీడియా భాష్యం చెప్పేసింది. కొన్ని పత్రికలు అయితే కవితని పొగడ్తలతో ముంచెత్తాయి. ఇప్పుడు పాకిస్థాన్‌లో కవితకి అభిమానులు బాగా పెరిగిపోయారు. కవిత పేరు చెబితే చాలు పాకిస్థానీలు పులకరించిపోవడం ఖాయం. కవితని చూస్తే పాకిస్థానీయులు తమ సొంత మనిషిని చూసినట్టు చూడక మానరు. భారతదేశంలో ఎంపీ స్థానంలో వుండి కూడా భారతదేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా, పాకిస్థాన్‌కి అనుకూలంగా మాట్లాడిన కవిత అంటే ఇష్టపడని పాకిస్థానీయులు ఎవరైనా వుంటారా? పాకిస్థాన్‌ నుంచి ఇంత అభిమాన్ని పొందుతున్న కవితకి అక్కడి ప్రభుత్వం పౌరసత్వాన్ని ఆఫర్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆగ్రహంతో కూడిన కామెంట్లు భారతీయులు చేస్తున్నారు.

రామ్ గోపాల్ వర్మ మస్కా పాలిష్

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చాల బాగా పనిచేస్తున్నారని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీటర్ ద్వారా సర్టిఫికేట్ జారీ చేసారు. అంతే కాదు ఆయన మహాత్మా గాంధీ, బాల్ థాక్రేల కంటే కూడా చాలా బెటర్ అని మరో సర్టిఫికేట్ జారీ చేసారు. అంతే కాదు ఆయన చంద్రబాబు కంటే కూడా చాలా బెటర్ అని, అందువల్ల కేసీఆర్ ని చూసి నేర్చుకోవాలని హితబోధ కూడా చేసారు. కానీ తను చంద్రబాబును తప్పు పట్టడం లేదని సర్దిచెప్పుకొన్నారు. పనిలోపనిగా తను హైదరాబాద్ లో పుట్టి పెరిగిన తెలంగాణవాడినని తన స్థానికతను నిర్దారిస్తూ ఒక సెల్ఫ్ అఫిడవిట్ కూడా జారీ చేసారు.   వర్మ పేర్కొన్న విషయాలలో కేసీఆర్ పనితనం ఆయనకు బాగా నచ్చిందని, చంద్రబాబు పనితీరు నచ్చలేదని అర్ధమవుతోంది. కానీ మధ్యలో గాంధీజీ ప్రస్తావన చేయడం దేనికో తెలియదు. సాధారణంగా ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా అటువంటి మహనీయునితో పోల్చి చూసుకొనే సాహసం చేయరు. కానీ తన ట్వీటర్లకి ఎంతటి మహాత్ముడు అయినా అలుసే అన్నట్లు ఉంది వర్మ వ్యవహారం.   ఇక గాంధీజీ కులమతాలకు అతీతంగా దేశాన్నిపటిష్టంగా కలిపి ఉంచేందుకు కృషి చేస్తే, బాల్ థాక్రే ప్రాంతీయవాదాన్ని ఎగద్రోసి, ముంబైలో మహారాష్ట్రేతరులు ఉండకూడదని గట్టిగా వాదించేవారు. ఇతర రాష్ట్రాలవారిని చాలా భయ బ్రాంతులకు గురిచేసారు కూడా. కేసీఆర్ ని గాంధీ కంటే మిన్న అని పొగిడిన నోటితోనే మళ్ళీ బాల్ థాక్రేతో పోల్చి చూపడం ద్వారా కేసీఆర్ ను పొగుడుతున్నట్లు కాక ఆయనకు చురకలు వేస్తున్నట్లుంది వర్మ తీరు.   తెలుగు ప్రజలు అందరూ కూడా ఇంతవరకు ఆయనను ఆంధ్రాకు చెందిన వ్యక్తిగానే భావిస్తున్నారు. కానీ అది తప్పని ఇప్పుడు వర్మ ప్రత్యేకంగా పనికట్టుకొని చాటింపు వేసుకొన్నారు. అయితే ఇంతకాలం వర్మకు గుర్తుకురాని తన ‘స్థానికత’ సరిగ్గా ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చిందో? ఆ విషయాన్ని ఈవిదంగా ఎందుకు ప్రకటించుకోవలసి వచ్చిందో ఆయనకే తెలియాలి. అయితే నాగార్జున వంటి కొందరు సినీ ప్రముఖులు పనిగట్టుకొని వెళ్లి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి పుష్పగుచ్చాలు ఇచ్చినా అవేవీ వారి భూములను కాపాడలేకపోయాయి. అందువల్ల వర్మ ట్వీటర్ ద్వారా కేసీఆర్ కి ఎంతమస్కా పాలిష్ కొట్టినా బహుశః ఎటువంటి ప్రయోజనమూ ఉండకపోవచ్చును. బహుశః అందుకేనేమో ముందు జాగ్రత్తగా తను తెలంగాణాలో పుట్టిపెరిగానని వర్మ చెప్పుకొన్నారు. కానీ ‘1956 నిబంధన’ తనకు వర్తిస్తుందో లేదో ఓసారి వెరిఫై చేసుకొన్నాక, ఎవరిని పొగిడితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందో నిశ్చయించుకోవడం మంచిది.   ఇక ఆయనకు చంద్రబాబు నాయుడు పనితీరు నచ్చకపోవడమనేది ఆయన వ్యక్తిగత అభిప్రాయం కనుక అందుకు ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కించపరిచే ఆ విదంగా మాట్లాడటమే చాలా తప్పు. ముంబైపై పాక్ ఉగ్రవాదులు చేసిన దాడి ఆధారంగా సినిమా తీసిన తరువాత తన ఆలోచనలలో, వ్యవహార శైలిలో చాలా మార్పు వచ్చిందని వర్మ ఇదివరకు చెప్పుకొన్నారు. కానీ అటువంటి మార్పులేవీ ఆయనలో రాలేదని, రాబోవని ఆయన ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

ముస్లిం ఓట్ల కోసం టీఆర్ఎస్ వేర్పాటువాద రాజకీయం!

  ముస్లిం ఓట్ల కోసం టీఆర్ఎస్ వేర్పాటువాద రాజకీయం! ఓట్ల కోసం తెలుగుజాతిని విభజించిన పార్టీగా ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తాజాగా ముస్లిం ఓట్ల కోసం వేర్పాటువాద రాజకీయాలకు పాల్పడుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత ఎన్నికలలో తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో పట్టు సాధించిన టీఆర్ఎస్ హైదరాబాద్‌లో మాత్రం తన ప్రభావాన్ని చూపలేకపోయింది. హైదరాబాద్‌లో ప్రతి అడుగులోనూ విస్తరించి వున్న సీమాంధ్రుల కారణంగా టీఆర్ఎస్ హైదరాబాద్‌లో పట్టు సాధించడం కలలో మాట. అందుకే కేసీఆర్ ముస్లింలను తనకు అనుకూలంగా మార్చుకోవడం ద్వారా హైదరాబాద్‌పై రాజకీయంగా పట్టు సాధించాలని పథకరచన చేశారు.   కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే హైదరాబాద్‌లోని సీమాంధ్రుల స్థిరాస్తులపై కన్ను వేశారు. సీమాంధ్రులకు చెందిన అనేక భవనాలను కూలగొట్టించారు. అయితే కేసీఆర్ హైదరాబాద్‌లోని ఆస్తులను ధ్వంసం చేయరాదని గ్రేటర్ హైదరాబాద్‌ మునిసిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు ఏకగ్రీవంగా తీర్మానించారు. అది కేసీఆర్ విధ్వంసకాండకు బ్రేకు వేసింది. రాబోయే ఎన్నికలలో హైదరాబాద్ కార్పొరేషన్‌ని కూడా సొంతం చేసుకున్న పక్షంలో హైదరాబాద్‌లో తన ఇష్టం వచ్చినట్టు రాజ్యం చేయవచ్చని కేసీఆర్ భావించారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర ఓటర్లు దక్కకపోయినా ముస్లిం ఓట్లు దక్కించుకుంటే తాను హైదరాబాద్‌పై పట్టు సాధించవచ్చని ఆలోచించారు.   ఈ ఏడాది డిసెంబర్‌లో రాబోతున్న హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికలలో ముస్లిం ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి టీఆర్ఎస్ ప్రయత్నాలు ప్రారంభించింది. దానికోసం భారతదేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి భంగం కలిగే వ్యాఖ్యలు చేయడానికి కూడా టీఆర్ఎస్ నాయకులు వెనుకడుగు వేయడం లేదు. మజ్లిస్‌ని కాకా పట్టడం, ముస్లింని ఉప ముఖ్యమంత్రిని చేయడం, ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఇఫ్తార్ విందుల్లో పాల్గొని హామీలు ఇవ్వడం, పాకిస్థాన్ కోడలు అయిన సానియా మిర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం... ఇవన్నీ ఓట్ల రాజకీయాలలో భాగమే! మరాఠీ తండ్రికి 1989లో జన్మించి, పాకిస్థానీని పెళ్ళి చేసుకుని, దుబాయ్‌లో స్థిరపడి సానియా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ ఎలా అవుతుందో కేసీఆర్‌కే తెలియాలి.   అయితే వీటన్నిటినీ రాజకీయ ఎత్తులు, పైఎత్తుల్లో వేసే పాచికలుగా భావించి ఊరుకోవచ్చు. అయితే ముస్లిం ఓట్లను సాధించడం కోసం దేశ సమగ్రతకే భంగం కలిగే వ్యాఖ్యలు చేయడం మాత్రం క్షమార్హం కాదు. అలాంటి దేశద్రోహపూరిత వ్యాఖ్యలు చేయడానికి కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎంపీ కవిత ఒడిగట్టారు. భారతదేశంలో అంతర్భాగమైన కాశ్మీర్‌ని భారతదేశం దురాక్రమించిందని అనడం, కాశ్మీర్‌ను వదులుకోవడానికి, అంతర్జాతీయ సరిహద్దులు మార్చుకోవడానికి భారతదేశం సిద్ధపడాలని ఆమె చెప్పడం చాలా దారుణం. కరడుగట్టిన వేర్పాటువాద తత్వానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనం.   పాకిస్థాన్‌కి అనుకూలంగా వున్న ఈ వేర్పాటువాద వ్యాఖ్యలు ముస్లింలను తమ పార్టీ వైపు తిప్పుకోవడానికి చేసినవి మాత్రమే కాదు.. దేశంలో వేర్పాటువాదాన్ని రెచ్చగొట్టడానికి కూడా చేసిన వ్యాఖ్యలుగా పరిగణించాల్సి వస్తోంది. ఓట్ల కోసం వేర్పాటువాద ప్రకోపాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్‌ని దేశభక్తిపరులైన ముస్లింలు ఎంతమాత్రం నమ్మరు. టీఆర్ఎస్ నాయకులు తాము చేసిన వ్యాఖ్యలకు తగిన మూల్యాన్ని త్వరలో చెల్లించుకోక తప్పదు!

తెలంగాణా రాష్ట్రమని ఎందుకు అనమంటున్నారు?

  ఇకపై మీడియాలో తెలంగాణా కు సంబంధించి వార్తలు ప్రచురించేటప్పుడు, ప్రసారం చేసేటప్పుడు ‘తెలంగాణా’ అనే పదానికి బదులుగా ‘తెలంగాణా రాష్ట్రం’ అని పేర్కొనవలసిందిగా తెలంగాణా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నుండి మీడియాకు లేఖలు అందినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి జూన్ 2న ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలుగా విడిపోయిన సంగతి ప్రజలందరికీ తెలుసు. అయితే దేశంలో 29వ రాష్ట్రంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రం గురించి నేటికీ దేశంలో చాలా మందికి తెలిసిఉండకపోవచ్చును. కనుక మీడియాలో కేవలం తెలంగాణా అని పేర్కొనడం వలన అటువంటివారు అదొక కొత్తగా ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రమని తెలుసుకోలేకపోవచ్చును. నేటికీ ఉత్తరాది ప్రజలలో చాలా మందికి దక్షిణ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో తెలియదంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వారిలో చాలా మంది కేవలం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మూడు ప్రధాన నగరాలను తప్ప దక్షిణాది రాష్ట్రాల పేర్లు కానీ అక్కడ ప్రజలు మాట్లాడే బాషలు గురించి కానీ అవగాహన లేదు. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నమ్మక తప్పని నిజం. అటువంటప్పుడు ఒకే బాష మాట్లాడే ఆంధ్ర, తెలంగాణాలను వారు ప్రత్యేక రాష్ట్రాలుగా గుర్తించగలరని ఆశించలేము. బహుశః ఆ కారణంగానే తెలంగాణా రాష్ట్ర ఉనికిని చాటేందుకు ‘తెలంగాణా రాష్ట్రం’ అని పెర్కొనవలసిందిగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కోరి ఉండవచ్చును. అలా కోరడంలో తప్పు పట్టేందుకు ఏమీ లేదు కూడా.

ప్రశ్నార్ధకంగా మారిన రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్ !

  పదేళ్ళు నిరాటంకంగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ తన ఓటమిని చాలా నెలల ముందే పసిగట్టింది. ఎన్నికలలో విజయం సాధిస్తే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనుకొన్న కాంగ్రెస్ అధిష్టానం, ఆయనకు పార్టీ పూర్తి బాధ్యతలు అప్పగించకపోవడమే అందుకు నిదర్శనమని చెప్పవచ్చును. కానీ ఓటమిని ముందే పసిగట్టినప్పటికీ వెంటనే దిద్దుబాటు చర్యలు చేప్పట్టకుండా తప్పు మీద తప్పులు చేసుకొంటూ ముందుకు సాగడంతో ఎన్నికలలో ఘోర పరాభవం పొందింది. ఆంద్రప్రదేశ్ లో రాష్ట్ర విభజన చేసిన తీరు కాంగ్రెస్ కొంప ముంచితే, ఉత్తరాదిన ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రత్యేక కారణం, ప్రత్యేక పరిస్థితుల వలన కాంగ్రెస్ ఘోరపరాజయం పొందింది. నాటి నుండి కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది.   సోనియా, రాహుల్ గాంధీ లకు వంగి వంగి నమస్కారాలుచేసే వీ.హనుమంత రావు వంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పుడు అధిష్టానం చేసిన పొరపాట్లు కూడా పార్టీ ఓటమికి కారణమయ్యాయని దైర్యంగా విమర్శించడం గమనిస్తే, పార్టీపై సోనియా, రాహుల్ గాంధీల పట్టు కోల్పోతున్నట్లు అర్ధమవుతుంది. అందుకే పార్టీపై అదుపుకోల్పోక ముందే జాగ్రత్తపడుతూ రాహుల్ గాంధీని పక్కకు తప్పించి మళ్ళీ సోనియాగాంధీ పార్టీని చక్కదిద్దే పనిలో పడ్డారు. ఈ విషయాన్ని వారిరువురికీ అత్యంత సన్నిహితుడుగా మెలిగే శశీధరూర్ స్వయంగా దృవీకరించారు కూడా. అయితే రాహుల్ గాంధీని పక్కనబెట్టినట్లు ఆయన అన్న మాటలపై పార్టీలో దిమారం చెలరేగడంతో, పార్టీలో రాహుల్ గాంధీ ప్రాధాన్యం ఎప్పుడూ తరగలేదని, ఆయన తన తల్లికి అండగా ఉంటారని సర్ది చెప్పుకొన్నారు.   అంటే 120 కోట్ల జనాభా ఉన్న భారతదేశాన్ని ప్రధానమంత్రిగా ఏలేందుకు సిద్దపడిపోయిన రాహుల్ గాంధీ కనీసం కాంగ్రెస్ పార్టీని కూడా నడిపించలేరని స్పష్టమవుతోంది. సోనియా గాంధీ మళ్ళీ రంగంలోకి దిగడంతో దానిని ద్రువీకరించినట్లయింది. ఆయన కనీసం పార్లమెంటులో పార్టీకి నాయకత్వం వహించడానికి కూడా వెనుకాడారు. తల్లి సోనియాగాంధీ, సీనియర్లు పార్టీని నడిపిస్తుంటే ఆయన పార్లమెంటులో హాయిగా కునుకు తీస్తూ కాలక్షేపం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో నేతలందరూ వంశపారంపర్య పాలన అనివార్యం అని భావిస్తునంత కాలం ఆయన హాయిగా అలా కునుకు తీయవచ్చును. అందువల్ల ఆ పార్టీని ఎంతగా ప్రక్షాళన చేసినప్పటికీ, దానిని నడిపించే నాయకుడు సమర్ధుడు కానప్పుడు ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదు. అంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునర్వైభవం పొందాలంటే ముందుగా ఈ తల్లీకొడుకుల చెర నుండి బయటపడి సమర్దుడయిన నాయకుడు దాని పగ్గాలు చేబట్టవలసి ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో అది సాధ్యం కాదు గనుక, పార్టీ పునర్వైభవం కూడా సాధ్యం కాకపోవచ్చును.   అన్నివిధాల సమర్ధుడు, మంచి రాజకీయ అనుభవశాలి అయిన నరేంద్ర మోడీ ఇప్పుడు దేశప్రధానిగా అధికారం చేప్పట్టి రానున్న ఐదేళ్ళలో దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే, ఆ అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ అందేలా చేయగలిగినట్లయితే, ఐదేళ్ళ తరువాత వచ్చే ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఉండకపోవచ్చును.   కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నగత పదేళ్ళ కాలంలో పూర్తి సానుకూల వాతావరణం ఉనప్పటికీ పార్టీపై పట్టు సాధించలేకపోయిన రాహుల్ గాంధీ, ఇప్పుడు పార్టీలో వ్యతిరేఖత ఎదుర్కొంటూ రానున్న ఐదేళ్ళలో పార్టీపై పట్టు సాధిస్తారని ఎవరూ భావించలేరు. కనుక ఈ దేశ వ్యాప్తంగా ఉన్న వేలాది కాంగ్రెస్ నేతలు, లక్షలాది కార్యకర్తల భవిష్యత్ ఏమవుతుందనే సంగతి పక్కన బెడితే, దేశ ప్రధాని కావాలనుకొన్న రాహుల్ గాంధీ భవిష్యత్ ఏమవుతుందనే ప్రశ్న చాలా ఆసక్తికరంగా ఉంది.

వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం: చంద్రబాబు

  వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం: చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుదవారం సాయంత్రం హైదరాబాదులో గల తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ ప్రస్తుత పరిస్థితులను, దాని అభివృద్ధికి తన ప్రభుత్వం చెప్పట్టబోయే చర్యలను వివరించే శ్వేత పత్రం విడుదల చేసారు. గత పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ మిగిలిన అన్ని రంగాలను ఏవిధంగా నిర్లక్ష్యం చేసిందో వ్యవసాయాన్ని కూడా అదేవిధంగా నిర్లక్ష్యం చేయడం వలన పంటల దిగుబడి తగ్గిపోయి రైతులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులలో కూరుకుపోయారని అని ఆయన ఆరోపించారు. వారు ఆ దుస్థితి నుండి బయటపడేందుకే తమ పార్టీ రుణమాఫీకి పూనుకొందని ఆయన తెలిపారు. ఇకపై తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దిద్దుబాటు చర్యలు చేప్పట్టి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతుందని తెలిపారు. అందుకోసం ప్రభుత్వం చెప్పట్టబోయే కొన్ని చర్యలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. భూసార పరీక్షలు నిర్వహించి భూసారం పెరిగేందుకు తగిన చర్యలు చెప్పట్టడం. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం. సాంకేతిక విధానంలో పంటలు, నీళ్ళ సంరక్షణ. వ్యవసాయంలో ఆధునిక పద్దతులపై రైతులకు శిక్షణ, అందుకు అవసరమయిన సహాయం అందించడం. ఒక్కో గ్రామాన్ని ఒక యూనిట్ గా పంటలకు భీమా కల్పించడం. కూరలు, పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సాహం కల్పించడం వంటి అనేక కొత్త విధానాలు అమలు చేయడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, రైతులకు అండగా నిలుస్తామని చంద్రబాబు తెలిపారు.

పరాకాష్టకు చేరిన టీఆర్ఎస్ వేర్పాటువాదం!

  తెలంగాణ రాష్ట్ర సమితి వేర్పాటువాద ధోరణి పరాకాష్టకు చేరుకుంది. ఇంతకాలం ఆంధ్రప్రదేశ్‌లో వేర్పాటువాదాన్ని రెచ్చగొట్టి తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంలాఏర్పడేలా చేసిన టీఆర్ఎస్ నాయకులు తమ వేర్పాటు ఉద్యమ పరమావధి అయిన అధికారాన్ని సొంతం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి అధికారాన్ని చేపట్టినప్పటికీ ఇతర ప్రాంతాలను, సాటి భారతీయులను ద్వేషించే తమ ధోరణిని టీఆర్ఎస్ నాయకులు మానుకోకుండా కొనసాగిస్తున్నారు.   ఇప్పటి వరకూ రాష్ట్ర స్థాయిలో వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తూ వచ్చిన టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు జాతీయ స్థాయి వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలే దీనికి తార్కాణంగా నిలుస్తున్నాయి. భారతదేశంలో అంతర్భాగమైన కాశ్మీర్ విషయంలో కల్వకుంట కవిత చేసిన విషపూరిత, వేర్పాటువాదాన్ని ప్రేరేపించే వ్యాఖ్యలు ప్రతి ఒక్క భారతీయుడికీ మనస్తాపాన్ని కలిగించేవే!   ఏ భారతీయుడి నోటిలోంచి రాని మాటలు కవిత మాట్లాడారు. అవి.. స్వాతంత్ర్యానికి పూర్వం ప్రత్యేక దేశాలైన కాశ్మీర్, హైదరాబాద్‌లనుభారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బలవంతంగా భారతదేశంలో కలిపారట. జమ్ము కాశ్మీర్ విషయంలో భారతదేశానికి స్పష్టత రావాలట. అవసరమైతే భారతదేశం తన అంతర్జాతీయ సరిహద్దుల్ని మార్చుకోవాలట. కాశ్మీర్‌ను భారతదేశం వదులుకోవాలన్నట్టుగా వున్న కవిత ఘోరమైన మాటలు దేశ వ్యాప్తంగా ఆందోళనని కలిగించాయి. దేశంలోని ప్రతి ఒక్కరూ కవిత వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.   బాధ్యతగల పార్లమెంట్ సభ్యురాలి హోదాలో వున్న కవిత మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? వేర్పాటువాదంతో అధికారంలోకి వచ్చామనే అహం బాగా పెరిగిపోయి మాట్లాడిన మాటలుగానే ఇవి వున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌ సంస్థానాన్ని ఆనాడు సర్దార్ పటేల్ భారతదేశంలో కలపడం వల్లనే తెలంగాణలో తరతరాల బానిసత్వం తొలగిపోయిందని, ఇప్పుడు టీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి రావడానికి కూడా అదే కారణమని కవిత మరచిపోయారా? లేక మరచిపోయినట్టు నటిస్తున్నారా?   కవిత తన దూకుడుతో కూడిన మాటలను సీమాంధ్రుల మీద ప్రయోగిస్తే ఇంతకాలం భరించారు. ఇప్పుడు అదే తరహా దురహంకార వ్యాఖ్యల్ని దేశ సమగ్రత మీద చేయడం ఎంతమాత్రం క్షమార్హం కాదు. ఎంపీ హోదాలో వుండి దేశ సమగ్రతకు భంగం కలిగించేలా వ్యాఖ్యానించిన కల్వకుంట్ల కవిత పార్లమెంటు సభ్యురాలిగా వుండటానికి ఎంతమాత్ర అర్హురాలు కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కవితను తక్షణం ఎంపీ పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.   అయినా కవిత లాంటి నాయకులకు దేశం మరో అవకాశం ఇవ్వాలి. తాను పొరపాటు వ్యాఖ్యలు చేశానని బహిరంగంగా క్షమాపణ చెబితే ఆమెని ఈ దేశ ప్రజలు క్షమిస్తారు. కవిత ఇప్పటికైనా తన తప్పును తెలుసుకుని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అయితే ఇప్పటికి కూడా కల్వకుంట కవిత లాంటి టీఆర్ఎస్ నాయకులు తమ వేర్పాటువాద ధోరణులను విడిచిపెట్టకుండా భారతదేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తే వారిని ఈ దేశం ఎప్పటికీ క్షమించదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయం సాధించిన టీఆర్ఎస్ వేర్పాటువాద ధోరణి భారతదేశం విషయంలో ఎంతమాత్రం విజయం సాధించదు! జైహింద్!!

అందరూ ఆయన వెనుక ఎందుకు నడవాలిట?

  రేపటి నుండి రుణమాఫీ అంశంపై వైకాపా తలపెట్టిన మూడురోజుల ఆందోళన కార్యక్రమాలలో వామపక్షాలను , ప్రజలను, మీడియాను తనతో కలిసిరావాలని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కోరారు. అయితే తనకు నిత్యం బాకా ఊదుతూ, నీడలా వెన్నంటి ఉంటూ, తను మాట్లాడే ప్రతీ మాటను, కార్యక్రమాన్ని గొప్ప ఘనకార్యంలా చాటి చెప్పే సాక్షి మీడియాను, ఎన్నికలలో ఓడిపోవడానికి అదే కారణమని వైకాప నేతలే స్వయంగా నిందిస్తున్నపుడు, ఇతర మీడియా ఛానళ్ళు ఆయన వెనుక ఎందుకు నడుస్తాయి? కొన్ని న్యూస్ పేపర్లు, మీడియా ఛాన్నళ్ళు తమ శత్రువులని జగన్మోహన్ రెడ్డి స్వయంగా అభివర్ణించిన తరువాత వాటిని తన రాజకీయ మైలేజీ పెంచుకోవడానికి చేస్తున్న ఈ ఆందోళనా కార్యక్రమాలకు మద్దతు ఇమ్మని జగన్ కోరడం హాస్యాస్పదం. అవి తనతో కలిసి రాకపోతే ప్రజా సమస్యలపై పోరాడేందుకు వాటికి ఆసక్తి లేదని నిందించవచ్చును. వచ్చినట్లయితే వాటి వలన తన కార్యక్రమాలకు మరింత మంచి కవరేజి దొరుకుతుందని జగన్ అత్యాశ కావచ్చును.   గతంలో జగన్ ఒట్టొట్టి సమైక్యాంధ్ర ఉద్యమాలు నడుపుతున్నపుడు కూడా తెదేపాతో సహా ప్రతిపక్షాలు, ఎన్జీవోలని కూడా తన వెంట నడవాలని హుకూం జారీ చేసారు. అలా నడవకపోతే ప్రజలను మోసం చేసినట్లేనని ఒక సిద్ధాంతం కనిపెట్టారు. కానీ ఆయన రాజకీయంగా ఎదగడానికీ, ఆయన రాజకీయ మైలేజీ పెరగడం కోసం చేస్తున్న ఆ ఉద్యమాలకి తెదేపా, మీడియా, యన్జీవోలు ఎందుకు మద్దతు ఇస్తారు? అని జగన్ ఎన్నడూ ఆలోచించినట్లు లేదు. ప్రభుత్వం రుణమాఫీలు చేస్తూ అధికారికంగా క్యాబినెట్ చేత ఆమోద ముద్ర వేసిన తరువాత కూడా రుణమాఫీ అంశం ద్వారా రాజకీయ మైలేజీ పెంచుకోవాలని ప్రయత్నిస్తున్న తన వెనుక అందరూ నడవాలని జగన్ ఆశించడం హాస్యాస్పదం. దాదాపు తెలుగు మీడియా మొత్తం ఆయనను ఎందుకు దూరంగా పెడుతోందో ఇంతవరకు గ్రహించలేకపోయారు. రాజకీయ పార్టీలేవీ ఆయనను ఎందుకు విశ్వసించడంలేదో తెలుసుకోలేకపోతున్నారు. కానీ తను వ్యతిరేఖిస్తున్నవారు, తనను వ్యతిరేఖిస్తున్నారు కూడా తన వెనుక నడిచి తనకు రాజకీయంగా ప్రయోజనం చేకూర్చాలని జగన్మోహన్ రెడ్డి ఆశించడం హాస్యాస్పదం.అయినా ఆయనకు తన రాజకీయ మైలేజీ పెంచుకోవడానికి మెరుపులాంటి ఆలోచన వస్తే, అందుకు స్వంత పార్టీని, మీడియాని ఉపయోగించుకోవచ్చును కానీ ఇతర పార్టీలను ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నాయని ఆయన ఆరోపిస్తున్న మీడియాను కూడా వాడేసుకొందామంటే ఎవరు అంగీకరిస్తారు?      

ఉస్మానియా విద్యార్థుల ఆగ్రహం, ఆందోళన ఇదే!

  ఉస్మానియా విశ్వవిద్యాలయం నిరుద్యోగ విద్యార్థుల ఆందోళనతో అట్టుడికిపోతోంది. తమకు ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ కోసం ఉద్యమం చేస్తే, ఇప్పుడు కేసీఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడం ద్వారా తమకు అన్యాయం చేశారన్న అభిప్రాయం ఉస్మానియా విద్యార్థులలో బలంగా ఏర్పడింది. మంగళవారం పోలీసుల ఆంక్షలను కూడా తప్పించుకుని ఉస్మానియా విశ్వవిద్యాలయం సమీపంలోని తార్నాక కూడలిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా విద్యార్థుల ఆగ్రహం, ఆందోళనలను, కేసీఆర్ ప్రభుత్వం మీద విద్యార్థులు చేసిన వ్యాఖ్యలను ఒక్కసారి పరిశీలిస్తే....   1. కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులపై కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తున్నారు.   2. ఉద్యమాలు కేసీఆర్‌కి కొత్తకావచ్చు గానీ, ఉస్మాయినా విద్యార్థులకు కాదు.   3. మొన్నటి వరకు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం పోరాటం చేశాం. ఇప్పుడు మా జీవితాల కోసం ఉద్యమించాం.   4. విద్యార్థిలోకం తీవ్రంగా ఉద్యమించాల్సిన పరిస్థితిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే తీసుకువచ్చారు.   5. కాంట్రాక్టు ఉద్యో్గులను పర్మినెంట్ చేసేముందు తెలంగాణలోని నిరుద్యోగుల గురించి కేసీఆర్ ప్రభుత్వం ఎంతమాత్రం ఆలోచించలేదు.   6. నిరుద్యోగ సమస్యను నిర్మూలించాల్సింది పోయి, తామేదో వాగ్దానం చేశామని కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేశారు.   7. దశాబ్దాల తరబడి ఉస్మానియా విద్యార్థులు చేసిన త్యాగాలు కేసీఆర్ ప్రభుత్వానికి గుర్తు రాలేదా?   8. ఉస్మానియాలో కేవలం ఒకరు ఇద్దరికి రాజకీయ భవిష్యత్తు కల్పించినంత మాత్రాన యావత్ విద్యార్థి లోకానికి మేలు చేసినట్టు కాదు..   9. కేసీఆర్ ఇప్పటికైనా తన నిర్ణయాన్ని పునస్సమీక్షించుకోవాలి.   10. మేకు కాంట్రాక్ట్ కార్మికులకు, ఉద్యోగులకు వ్యతిరేకం కాదు. చదువుకున్న అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాం అంతే.   11. ఏ ప్రభుత్వం రావాలని మేము ఉద్యమాలు చేశామో, ఆ ప్రభుత్వమే మాకు వ్యతిరేకంగా పనిచేస్తూ వుండటం, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఉద్యమం చేపట్టడం బాధాకరం.   12. ఈ ఉద్యమం నుంచి ఉస్మానియా విద్యార్థి లోకం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయదు.

సానియా మిర్జా బ్రాండ్ అంబాసిడరా?... హవ్వ!

  టెన్నిస్ తార సానియా మిర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంతోపాటు ఆమెకు కోటి రూపాయల నజరానాను కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం పట్ల భారీ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశం మీద తెలంగాణ సమాజం సంధిస్తున్న ప్రశ్నల్లో కొన్ని ఇలా వున్నాయి..   1. సానియా మిర్జాకి అసలు తెలుగు భాష వచ్చా? తెలుగురాని వ్యక్తి తెలంగాణ బ్రాండ్ అంబాసిడరా?   2. ఫీజు రీ ఎంబర్స్‌మెంట్‌కి 1956 నిబంధన విధించారు కదా.. మరి సానియా మిర్జా కుటుంబం 1956 ముందు నుంచే తెలంగాణలో వుందా? ఈ విషయాన్ని ప్రభుత్వం నిర్ధారించుకుందా?   3. సానియా మిర్జా తండ్రి మహారాష్ట్రలో జన్మించాడు. ఆమె భర్త పాకిస్థాన్‌కి చెందిన వాడు. సానియా మిర్జా దుబాయ్‌లో శాశ్వతంగా నివాసం ఏర్పాటు చేసుకుంది. అలాంటి సానియా మిర్జా తెలంగాణ బ్రాండ్ అంబాసిడరా?   4. సానియా మిర్జా తెలంగాణకు గర్వకారణమా? ఏరకంగా గర్వకారణం? జాతీయ పతాకానికి ఎదురుగా కాళ్ళు పెట్టుకుని కూర్చోవడం తెలంగాణకు గర్వకారణమా? ఆమె తెలంగాణ కోసం ఏం చేసిందని గర్వపడుతున్నారు? సానియా మిర్జా కనీసం తెలంగాణ ఉద్యమానికి మద్దతు అయినా పలికిందా?   5. టెన్నిస్ క్రీడ ద్వారా, టెన్నిస్ అకాడమీ స్థాపించడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించిన సానియా మిర్జాకు కోటి రూపాయలు ఇచ్చారు. మరి చదువుకుంటామని అంటున్న పేదవారికి మాత్రం ఫీజులు ఇవ్వనంటున్నారు. ఇదేం న్యాయం?   6. ఎంతోమంది బంగారు తల్లులు వున్న తెలంగాణ గడ్డమీద తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడానికి అచ్చ తెలంగాణ ఆడపడుచు ఎవరూ కేసీఆర్ ప్రభుత్వానికి దొరకలేదా?

న్యాయమూర్తుల వివాదానికి తీర్పెవరు చెపుతారు?

  సుప్రీం కోర్టు మాజీ జడ్జిగా చేసిప్రస్తుతం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా వ్యవహరిస్తున్న మార్కండేయ కట్జూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తులు సైతం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి, అవినీతికి పాల్పడుతున్న వ్యక్తులకు పదవులు కట్టబెడుతున్నారని, పైగా వారి పదవీ కాలం పొడిగించమని ప్రభుత్వానికి లేఖలు వ్రాస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసిన లహోటీకి ఇదే విషయమై కొన్ని ప్రశ్నలు సంధించి వాటికి సమాధానాలు చెప్పగలరా అని సవాలు కూడా విసిరారు. ఆ ప్రశ్నలు:   1.     నేను మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నపుడు అక్కడ అదనపు జడ్జీగా చేస్తున్న ఒక వ్యక్తిపై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నట్లు నేను మీకు లేఖ వ్రాయడం నిజమా కాదా? ఆ తరువాత నేను డిల్లీకి వచ్చి మిమ్మల్ని (లాహోటీ) కలిసినప్పుడు సదరు జడ్జీపై ఇంటలిజన్స్ బ్యూరో చేత రహస్యంగా దర్యాప్తు చేయమని కోరడం నిజమా కాదా?   2.      అప్పుడు మీరు (లాహోటీ) ఆయనపై ఇంటలిజన్స్ బ్యూరో చేత రహస్యంగా దర్యాప్తుకు ఆదేశించిన మాట నిజమా కాదా?   3.     ఇంటలిజన్స్ బ్యూరో దర్యాప్తు చేసి, సదరు జడ్జి అవినీతి పనులకు పాల్పడ్డారని దృవీకరించిన తరువాత, సుప్రీంకోర్టు కొలిజియం సభ్యుల సలహా ప్రకారం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ అదనపుజడ్జి పదవికాలం మరో రెండేళ్ళు పొడిగించవద్దని మీరు ప్రభుత్వానికి లేఖ వ్రాసిన మాట నిజమా కాదా?   4.     ఆ తరువాత మీరు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి, సుప్రీంకోర్టు కొలిజియం సభ్యుల అభ్యంతరాలను లెక్కచేయకుండా, వారికి తెలియజేయకుండా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ వ్యక్తినే మద్రాసు హైకోర్టు అదనపు జడ్జీగా మరో ఏడాది పాటు పదవిలో కొనసాగించమని మీరు (లహోటీ) ప్రభుత్వానికి లేఖ వ్రాసిన మాట నిజమా కాదా? ఈ ప్రశ్నలను గమనిస్తే న్యాయవ్యవస్థ కూడా రాజకీయ ఒత్తిళ్లకు అతీతం కాదని స్పష్టమవుతోంది. కానీ కట్జూ చేస్తున్న ఈ ఆరోపణలకు మన న్యాయవ్యవస్థ ఏమని చెపుతుందో వేచి చూడక తప్పదు. చివరికి ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళుతుందో, ఏవిధంగా ముగుస్తుందో ఎవరికీ తెలియదు.

Economic Terrorism :Conspiracy behind the Inflation

Onions used to bring tears in common man's eyes!! Now it’s the turn of tomatoes though it is not an essential vegetable like onion.Common people were not worried about jarring words like inflation, GDP or ABCD! They are interested only in getting essential commodities at reasonable price . It seems the present regime has utterly failed in controlling prices in spite of Central govt. directive for strict action against hoarders and listing onions and potatoes after the Modi govt. controlled onions, now the hoarders have started inflating tomato prices. There is no decrease in production of tomato crop. Other vegetables are freely available and reasonably priced.   In India, prices are not dependent on rains (or the lack of it). The hoarders wait for signals to simply increase prices and make extraordinary profits. When the meteorological department predicted lesser rains, the news channels and papers started playing the same tune again and again -" Now prices will rise, Now prices will rise". The hoarders have fulfilled their wishes and have indeed increased the prices.Tomatoes are selling at Rs.50-60 a kilo in Bangalore which is major hub for procuring and supply of tomatoes .We can still find many vegetable sellers dumping rotten tomatoes on roadsides because people are buying less. So, there is no shortage of tomatoes, its just that it has become a target for hoarders. This is pure and simple economic terrorism. Economic terrorists are spreading their activities everywhere- real estate, vegetables, retail, education etc. Most of these states which are into tomato and onion and other major vegetable production were UPA Governed states and therefore this could be a deliberate attempt to embarrass the Ruling party.   Check out this satire on the rise of tomato prices here...

అభివృద్ధి, తాయిలాలు అన్నీ పట్టణాలకు, ఉన్నవారికే పరిమితమా??

  ప్రజాధనానికి, ప్రభుత్వ ఆస్తులకు ప్రభుత్వాలు కేవలం ధర్మకర్తలలాగ వ్యవహరించాలి తప్ప వాటికి హక్కుదారులుగా వ్యవహరించరాదని మహాత్మ గాంధీజీ ఎన్నడో చెప్పారు. కానీ ఆయన చెప్పిన ఆ మంచి మాటలను చెవికెక్కించుకొన్న ప్రభుత్వం ఒక్కటీ లేదు. కోట్లాది ప్రజలు అర్ధాకలితో మాడుతుంటే వారి ఆకలి తీర్చే మార్గం ఆలోచించకుండా, పాలకులు తమకు నచ్చిన వ్యక్తులకు, ప్రాజెక్టులకు కోట్లు ధారపోస్తుంటారు. గ్రామాలలో, పట్టణాలలో వేలాదిమంది పసిపిల్లలు, యువకులు, వృద్ధులు, మహిళలు వైద్యం చేయించుకొనే ఆర్ధిక స్తోమతలేక అత్యంత దయనీయ పరిస్థితుల్లో చావుకోసం రోజులు లెక్కబెడుతూ ఎదురు చూస్తుంటే, మానవతా దృక్పధంతో అటువంటి వారిని ఆదుకోవలసిన ప్రభుత్వాలు, ప్రజల కష్టార్జితంతో కట్టిన పన్నులను కోటీశ్వరులయిన పారిశ్రామిక వేత్తలకు, క్రీడాకారులకు, కళాకారులకు ఉదారంగా దానం చేస్తుంటాయి.   మనకి స్వాతంత్ర్యం వచ్చి 67 సం.లు తరువాత కూడా నేటికీ అనేక గ్రామాలు ఆకలి, దరిద్రం, అనారోగ్యం, పారిశుధ్యలోపం, స్కూళ్ళు, ప్రాధమిక వైద్య సౌకర్యాలలేమి, అతివృష్టి అనావృష్టి పరిస్థితుల కారణంగా కరువు కాటకాలు వంటి అనేక సమస్యలతో విలవిలలాడుతున్నాయి. వీటన్నిటినీ అత్యవసరంగా పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు ఇతర వ్యాపకాలలో క్షణం తీరిక లేకుండా ఉన్నాయి. అందుకే నేటికీ మన గ్రామీణ భారతం ఈ దుస్థితిలో ఉండిపోయింది. ఏ ప్రభుత్వాలయినా పరిశ్రమలను, క్రీడలను, కళలు ఇత్యాదులను తప్పక ప్రోత్సహించవలసిందే. కానీ, ఈసమస్యలన్నిటినీ విస్మరించి వాటికే ప్రాధాన్యం ఇస్తూ అపాత్రాదానం చేయడం సబబు కాదు.   దేశ, రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలయినా చేప్పట్టవచ్చును. ఎంతయినా ఖర్చు చేయవచ్చును. కానీ తద్వారా దేశ ప్రజలకు పట్టెడన్నం పెట్టేందుకు కడుపు మాడ్చుకొని రేయింబవళ్ళు మారుమూల గ్రామాలలో శ్రమిస్తున్న అన్నదాతలు కూడా కడుపు నిండా అన్నం తినే పరిస్థితులు కలగాలి. పల్లెల్లో, పట్టణాలలో బ్రతుకు భారంగా జీవిస్తున్న నిరుపేదలు, అభాగ్యుల జీవన ప్రమాణాలు పెరగాలి. కానీ అలాకాక ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అనే పద్ధతి మంచిది కాదు.   కోట్లకు పడగలెత్తిన ఒక క్రీడాకారుడికో, క్రీడాకారిణికో ఒక కప్పు గెలుచుకు రావడానికి కోట్ల రూపాయలు ఆర్ధిక సహాయం చేయడం కంటే, ఆ సొమ్మును గ్రామాలలో ఈ సమస్యలను పరిష్కరించడానికీ, మట్టిలో మాణిక్యాల వంటి క్రీడాకారులను, ప్రతిభావంతులయిన విద్యార్ధులను వెలికి తీసేందుకు వినియోగిస్తే అందరూ హర్షిస్తారు. ఒక విద్యార్ధి లేదా క్రీడాకారుడు లేదా రైతు ఎవరయినా అష్టకష్టాలుపడి, అందరి కాళ్ళు పట్టుకొని పట్టుదలతో విజయం సాధించిన తరువాత ప్రభుత్వాలు వారిని సన్మానించడం, బహుమతులు ప్రకటించడం కంటే, వారు ఒంటరిపోరాటం చేస్తున్నప్పుడే వారికి అండగా నిలబడితే మనదేశంలో ఆణిముత్యాల వంటి యువత, మేధావులు, క్రీడాకారులు వేలు, లక్షల కొద్దీ తయారవుతారు. కానీ గ్రామీణ ప్రతిభను నిర్లక్ష్యం చేస్తూ, కేవలం పట్టణాలలో పలుకుబడి ఉన్న కొందరికే ఉదారంగా తాయిలాలు పంచిపెట్టడం సబబు కాదు. కేంద్రమయినా, రాష్ట్రాలయినా అభివృద్ధిని, దాని ఫలాలను మారు మూల కుగ్రామాలకు సైతం సమానంగా దక్కేలా చేసినప్పుడే ప్రజలకు పూర్తి న్యాయం చేసినట్లవుతుంది.

ఆంధ్రప్రదేశ్‌కి ఎర్రచందనం చల్లదనం!

  వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తికి ఒక దుంగ దొరికితే ఎలా వుంటుంది. ఆ వ్యక్తి ఆ దుంగని పట్టుకుని నీటిలో మునిగిపోకుండా తనను తాను కాపాడుకోవచ్చు. అలాగే ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం అనే వరదలో కొట్టుకుని పోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఇప్పుడు ఒక దుంగ దొరికింది. ఆ దుంగ సహాయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మునిగిపోకుండా తనను తాను కాపాడుకునే అవకాశం వుంది. ఆ దుంగ మరేదో కాదు.. ఎర్రచందనం దుంగ! రాయలసీమలోని పలు అటవీ ప్రాంతాలలో చాలాకాలంపాటు ఎర్రచందనం దుంగల చోరీ భారీ స్థాయిలో జరిగింది. అనేకసార్లు పోలీసులు ఎర్రచందనం దొంగలను పట్టుకుని అనేక లక్షల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో భారీ స్థాయిలో ఎర్రచందనం దుంగలు పోలీసుల స్వాధీనమయ్యాయి. ఎన్నో సంవత్సరాలుగా స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను రాయలసీమలోని కడప, చిత్తూరు జిల్లాల్లో పలు ప్రాంతాలలో నిల్వ చేస్తూ వచ్చారు. ఎంతోవిలువైన ఎర్రచందనం దుంగలు నిరుపయోగంగా ఎన్నోచోట్ల పడివున్నాయి. కొన్నిచోట్ల కొన్ని ఎర్రచందనం దుంగలు చెదలు పట్టి పాడైపోతున్నాయి కూడా. నిల్వలు పేరుకుపోతున్న ఎర్రచందనాన్ని అమ్మాలన్న అభిప్రాయాలు అధికారుల్లో వున్నప్పటికీ గతంలో రాజకీయ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేకుండా పోయాయి. అవసరం కూడా చాలా ఉపాయాలను అందిస్తుంది. ఇప్పుడు రాష్ట్రానికి ఆర్థిక వనరులు ఎంతో అవసరం. ఈ సమయంలో ఎర్రచందనం దుంగలను అమ్మాలన్న ఆలోచన ప్రభుత్వానికి రావడం సమయోచితం. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి బోలెడంత ఆదాయాన్ని తెచ్చిపెట్టే విలువైన ఎర్రచందనం నిల్వలను అమ్మడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తాజాగా రైతు రుణ మాఫీపై ఏర్పాటు చేసిన కోటయ్య కమిటీ కూడా రాష్ట్రంలో భారీగా నిల్వ వున్న ఎర్రచందనం దుంగలను అమ్మడం ద్వారా ఆర్థిక పరిపుష్టి సాధించవచ్చని ప్రభుత్వానికి సూచించింది. దాంతో ఎర్రచందనం దుంగలను వేలం ద్వారా అమ్మడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 10 రోజుల్లో వేలం జరిగే అవకాశం వుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇ-ప్రొక్యూర్‌మెంట్ అధికారులు రాష్ట్రంలోని ఎర్రచందనం నిల్వలను అంచనా వేస్తున్నారు. ఇంతకాలం రాష్ట్ర ప్రజలకు ఎర్రచందనం దొంగల పట్టివేత, దుంగలు స్వాధీనం అనే వార్తలు మాత్రమే తెలుసు.. భవిష్యత్తులో ఎర్రచందనం దుంగలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చల్లదనాన్ని కూడా ఇస్తాయని తెలుస్తుంది.