శ్రీకృష్ణుడి కుమారులు, కుమార్తెలు.. ఆశ్చర్యపోయే నిజాలు..!

 

శ్రీకృష్ణుడి కుమారులు, కుమార్తెలు.. ఆశ్చర్యపోయే నిజాలు..!


శ్రీ కృష్ణుడిని స్మరించుకోగానే..  వెన్నను దొంగిలించిన చిన్న కన్నయ్యగా.. రేపల్లెలో నివసించిన గోపాలుడిగా, కురుక్షేత్రంలో మహాభారత యుద్ధంలో అర్జునుడి  రథసారథిగా, భగవద్గీత జ్ఞానాన్ని అందించిన జ్ఞానిగా,  రాధా దేవికి ప్రియమైన కృష్ణుడిగా గుర్తుకు వస్తాడు.  అయితే కృష్ణుడు యోధుడు, తత్వవేత్త,  రాజనీతిజ్ఞుడు మాత్రమే కాదు.. ఆయన కూడా సగటు వ్యక్తిలో ఉండే  తండ్రి భావనను అనుభవించాడు,  అనుభూతి చెందాడు.

పౌరాణిక గ్రంథాల ప్రకారం కృష్ణుడికి 16,108 మంది భార్యలు,  1,80,000 మంది కుమారులు ఉన్నారు. హిందూ మత గ్రంథాలు ప్రధానంగా కృష్ణుడి 99 మంది కుమారుల గురించి ప్రస్తావిస్తాయి. కృష్ణుడి కుమార్తెలు, కుమారుల గురించి తెలుసుకుంటే..

ప్రద్యుమ్నుడు..

రుక్మిణికి జన్మించిన కృష్ణుడి పెద్ద కొడుకు పేరు ప్రద్యుమ్నుడు. ప్రద్యుమ్నుడిని  కామదేవుడి పాక్షిక అవతారంగా కూడా పరిగణిస్తారు. ఒక యోధుడిగా,  యదు వంశంలో ప్రముఖ వ్యక్తిగా ప్రద్యుమ్నుడిని  పరిగణిస్తారు. ద్వారకను శత్రు దాడుల నుండి రక్షించడంలో ప్రద్యుమ్నుడి  పాత్ర కీలకమైనది.  

సాంబుడు..

కృష్ణుడి రెండవ కుమారుడు సాంబుడు. జాంబవతికి జన్మించాడు. సాంబుడు  అహంకారానికి ప్రసిద్ధి చెందాడు. సాంబుడు ఋషులను  ఎగతాళి చేయడం వల్ల యాదవుల పతనానికి దారితీసే శాపం వచ్చింది. సాంబుడి  జీవితం చాలా విషయాలు నేర్పుతుంది.  సాక్షాత్తూ విశ్వవ్యాప్తి అయిన ఆ పరమాత్ముడి  పిల్లలు కూడా విధి నుండి,  వారి కర్మ  పరిణామాల నుండి తప్పించుకోలేరని చెబుతుంది.

చారుదేశన..

రుక్మిణి మరో కుమారుడు చారు దేశన.  యుద్ధంలో శ్రీకృష్ణుని సన్నిహిత సహచరులలో ఒకరిగా ఉండేవాడు. నలుగురు దేశన యువరాజులను మహాభారతంలో యాదవ సైన్యాలలో భాగంగా ప్రస్తావించారు. వారు ధైర్యం,  నిర్భయతకు ప్రసిద్ధి చెందారు. సాంబుడి  మాదిరిగా కాకుండా తమ వంశం యొక్క క్రమశిక్షణ,  యుద్ధ స్ఫూర్తిని కొనసాగించడంలో కూడా ప్రసిద్ధి చెందారు.

భానుడు..

కృష్ణుడికి,  రుక్మిణికి కలిగిన  మరొక కుమారుడు భానుడు.  అతను తన పేరు వలె ప్రకాశవంతంగా,  ధైర్యంగా ఉండేవారని పురాణాలు చెబుతున్నాయి. అతను తన తల్లి వంశ గౌరవాన్ని నిలబెట్టాడని శాస్త్రాలలో ప్రస్తావించబడింది. భాను గురించి పరిమిత సమాచారం అందుబాటులో ఉన్నప్పటికీ విష్ణు పురాణంలో కృష్ణుడి అత్యంత ప్రసిద్ధ కుమారులలో ఒకరిగా భాను పరిగణించబడ్డాడు.

గద..

రుక్మిణి కుమారులలో  గద కూడా ఒకరు. అతని పేరు శక్తి గద ఆయుధాన్ని సూచిస్తుంది. గద ద్వారక రక్షకుడిగా పేరొందాడు. గద  శౌర్య ప్రభావం అతని శ్రీకృష్ణుడి వంశంలో స్పష్టంగా కనిపిస్తుంది.  కృష్ణుడి కుమారులతో పాటు, అతని మనవళ్ళు కూడా చాలా శక్తివంతులు,  ధైర్యవంతులు. కృష్ణుడి నిష్క్రమణ తర్వాత యాదవ వంశం తమలో తాము యుద్దాలు చేసుకున్నారు. కానీ వ్రాచుడు బయటపడ్డాడు.  తరువాత పాండవులు అతనిని మధుర పాలకుడిగా చేశారు. అతని తండ్రి అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడి కొడుకే అనిరుద్ధుడు.  అనిరుద్దుడు  కృష్ణుడి మనవడు. ద్వారక విధ్వంసం తరువాత, వ్రాచుడి  వారసులు కృష్ణుడి వంశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించారు.

శ్రీకృష్ణుడి కుమారులు, కుమార్తెలలో రుక్మిణికి శ్రీకృష్ణుడికి 10 మంది కుమాలు, ఒక కుమార్తె కలిగారట.  అలాగే శ్రీకృష్ణుడికి జాంబవతికి 10 మంది కుమారులు కలిగారని పురాణాలలో ఉంది. శ్రీకృష్ణుడికి సత్యభామకు 10 మంది కుమారులు కలిగారట. పురాణ గ్రంథాలు సాధారణంగా శ్రీ కృష్ణుడి కుమారులపై దృష్టి సారిస్తాయి. దీని వల్ల కుమార్తెల గురించి సరైన సమాచారం ఎక్కడా లేదు. శ్రీకృష్ణుడి కుమార్తెలు ఆర్యావర్త రాజకుటుంబాలలో వివాహం చేసుకున్నారని. కుమార్తెల వివాహాలు రాజకీయ దృక్కోణం నుండి చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడ్డాయి. ఎందుకంటే రాజ  కుటుంబాలలో జరిగే వివాహాలు  పొత్తులను బలోపేతం చేశాయని,  యదు రాజవంశం ప్రభావాన్ని పెంచాయని గ్రంథాలు చెబుతాయి. దురదృష్టవశాత్తు, వారి పేర్లు ఏవీ భద్రపరచబడలేదు. అయితే శ్రీకృష్ణుడికి 99మంది పిల్లలు ఉన్నారని చెప్పినా.. ఈ సంఖ్య ఖచ్చితం అని చెప్పలేం,  అలాగని తోసిపుచ్చలేం అని పురాణ పండితులు చెబుతారు.

                    *రూపశ్రీ.