పిల్లల పాదాలను మసాజ్ చేస్తే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని తెలుసా.. పుట్టిన పిల్లల లైఫ్ స్టైల్ లో మసాజ్ అనేది కీలకంగా ఉంటుంది. బిడ్డ పుట్టినప్పటి నుంచి ప్రతిరోజూ పాదాలకు మసాజ్ చేయడం చాలా ముఖ్యం. బేబీకి మసాజ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మంచి మసాజ్ రోజంతా అలసట,  నొప్పి నుండి ఉపశమనం పొందడానికి, రాత్రి సమయంలో హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. నవజాత శిశువుల నుండి పరిగెత్తే పిల్లల వరకు..  పాదాలకు మసాజ్ చేయడం వారి శారీరక అభివృద్ధికి మాత్రమే కాకుండా వారి మానసిక,  భావోద్వేగ అభివృద్ధికి కూడా సహాయపడుతుంది. పిల్లల పాదాలను మసాజ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? పాదాలను మసాజ్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుంటే.. పిల్లల పాదాలకు మసాజ్ ఎందుకు చేయాలి? పాదాల మసాజ్ పిల్లలలో ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. చాలాసార్లు పిల్లలు స్కూల్,  చదువు లేదా సామాజిక ఒత్తిడి కారణంగా ఒత్తిడికి గురవుతారు.  ఇలాంటి పరిస్థితులలో పాదాల మసాజ్ మెదడును శాంతపరచడానికి,  విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.. పాదాల మసాజ్ పిల్లలు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. పాదాల మసాజ్ నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. ఇది ప్రశాంతంగా,  గాఢంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. ఇది పిల్లల మెరుగైన శారీరక,  మానసిక అభివృద్ధికి దారితీస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.. పాదాలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది కండరాలకు ఆక్సిజన్ అందించడానికి పనిచేస్తుంది. ఇది పిల్లల శక్తిని పెంచుతుంది. మసాజ్ చేయని పిల్లలతో పోలిస్తే మసాజ్ చేసే పిల్లలు మరింత చురుకుగా చదవగలరు,  ఆడగలరు. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.. పాదాల రిఫ్లెక్సాలజీ శిశువులు,  పిల్లలకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా అనేక వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.. పిల్లల పాదాలు ఆటలు ఆడిన తర్వాత నొప్పిగా లేదా అలసిపోయినట్లు అనిపించవచ్చు. పాదాల మసాజ్ కండరాలను సడలించడం ద్వారా నొప్పిని తగ్గిస్తుంది. పాదాలను మసాజ్ చేసేటప్పుడు, పిల్లలతో సమయం గడుపడటం వల్ల పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య   భావోద్వేగ బంధం బలపడుతుంది. జీర్ణవ్యవస్థ.. పాదాలపై కొన్ని రిఫ్లెక్స్ పాయింట్లు జీర్ణవ్యవస్థకు సంబంధించినవి ఉంటాయి. వాటిని మసాజ్ చేయడం వల్ల పిల్లలలో మలబద్ధకం, అపానవాయువు,  కడుపు నొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.. కొబ్బరి లేదా బాదం వంటి నూనెలను ఉపయోగించి పిల్లలకు మసాజ్ చేయడం మంచిది. శిశువు చర్మం సున్నితంగా ఉంటుంది. కాబట్టి మసాజ్ చేసేటప్పుడు ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదు.  బిడ్డకు ఏవైనా గాయాలు లేదా చర్మ సంబంధిత సమస్యలు ఉంటే మసాజ్ చేయడం మంచిది కాదు.                                     *రూపశ్రీ.

చలికాలమని బెంగ ఎందుకు పిల్లల రక్షణ ఇలా సులువు!! చలికాలం అంటే అందరికీ వణుకు పుడుతుంది. ఈ కాలంలో జబ్బుల సమస్యలు కూడా ఎక్కువే. కేవలం చలి మనల్ని వణికిస్తుందనే మాట అటుంచితే చలి వల్ల చర్మం దెబ్బతింటుంది, శ్వాస సంబంధ సమస్యలు ఎక్కువ అవుతాయి, దానికి అనుబంధంగా వచ్చే సమస్యలు బోలెడు. పెద్దవాళ్లే ఈ సమస్యకు కుదేలైపోతారు. అలాంటిది ఎంతో సున్నితమైన చర్మం, మరెంతో తక్కువ ఇమ్యూనిటీ కలిగిన చిన్న పిల్లల మాటేమిటి?? వారికి స్వేట్టర్లు వేసి రక్షణ ఇవ్వడం నుండి తినడానికి ఇచ్చే ఆహార పదార్థాల వరకు ప్రతి ఒక్కటీ సవాల్ విసిరేదిగా ఉంటాయి.  అయితే చలికాలంలో చిన్నపిల్లల సంరక్షణ పెద్ద సమస్య కాదు, కొన్ని జాగ్రత్తలు పాటించాలంతే అంటున్నారు పిల్లల వైద్యులు. పిల్లల కోసం పెద్దలకు కొన్ని చిట్కాలు.. పైన చెప్పుకున్నట్టు పెద్దల కంటే పిల్లల చర్మం సున్నితత్వం ఎక్కువ. కాబట్టి కాస్త చలిగాలి సోకినా చాలా తొందరగా ప్రభావం అవుతుంది. అంతేనా చర్మం పగుళ్లు వచ్చి మంట పుడుతుంది. వాటికి ఏమి చేయాలో తెలియని పసితనం పిల్లలది. చలికి దురద పెడితే బాగా గోకేస్తుంటారు. ఆ తరువాత అది కాస్తా మంట పుట్టి పెద్ద సమస్య అయ్యి కూర్చుంటుంది. అందుకే పిల్లలకు రాత్రి సమయాల్లో మాశ్చరైజర్ రాయాలి. చర్మం ఏమైనా ఎఫెక్ట్ అయి ఉంటే పిల్లలు రాత్రి సమయంలో నిద్రపోతారు కాబట్టి చర్మం కొలుకోవడానికి తగినంత సమయం ఉంటుంది. అలాగని ఉదయం రాయకూడదని కాదు. రాత్రి సమయాల్లో మాశ్చరైజర్ ప్రభావవంతంగా పని చేస్తుంది. పిల్లల కోసం ఎంచుకునే మాశ్చరైజర్ క్రీములు ఎప్పుడూ సహజత్వంతో నిండినవై ఉండాలి. ఎక్కువ ఘూఢత ఉన్నవి, కెమికల్స్ ఎక్కువ యూజ్ చేసినవి, కృత్రిమ రంగులతో నిండినవి అసలు ఎంచుకోకూడదు. ఇక పిల్లలకు తరచుగా ఎక్కువ ఎదురయ్యే సమస్య పెదవులు పగలడం, అలాగే పెదవుల మూలల్లో చీలడం. ఇది ఒక్కసారి వచ్చిందంటే తగ్గడం చాలా కష్టమవుతుంది. ఏమైనా తినడానికి పెదవులు తెరచినప్పుడు మూలలు సాగి చీలిన ప్రాంతంలో రక్తస్రావం కావడం జరుగుతుంది. దీనికి చక్కని సొల్యూషన్ పెట్రోలియం జెల్లీ. వైట్ పెట్రోలియం జెల్లీలో ఎలాంటి కెమికల్స్ ఉండవు. ఇది ఎలాంటి ఇన్ఫెక్షన్ ఇవ్వదు. కాబట్టి పెట్రోలియం జెల్లీని గంటకు ఒకమారు రాస్తూ ఉంటే ఒకరోజులోనే ఈ సమస్య తగ్గిపోతుంది. ఇక తరువాత ఈ సమస్య రాకూడదంటే డైలీ రాత్రి పడుకునే ముందు పెట్రోలియం జెల్లీ అప్లై చేయాలి. పిల్లలకు సాధారణంగానే చిరాకు తెప్పించే విషయం డైపర్. పెద్దలకు సౌకర్యంగా ఉంటుందని, పిల్లలు బట్టలను పాడు చేయకుండా ఉంటారనే కారణంతో డైపర్లు వాడుతున్నారు ఈ కాలంలో. అయితే వాటిని అపుడపుడు చెక్ చేస్తుండాలి. లేకపోతే డైపర్ల వల్ల పిల్లలకు రాషెస్ వచ్చి చర్మం దెబ్బతింటుంది. అలాగే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. చల్ల నీళ్లు, చల్లని ఆహారం, ఐస్ క్రీమ్స్, కేక్స్ లాంటి ఆహార పదార్థాలు పిల్లలకు పెట్టకూడదు. ఎక్కువ సమయం స్నానం చేయించడం,  స్నానం సమయంలో శరీరాన్ని పదే పదే రుద్దడం చేయకూడదు. అలాగే చలి కాలం కదా అని స్నానానికి మరీ వేడినీళ్లు ఉపయోగించకూడదు. స్నానం తరువాత పొడి గుడ్డతో శుభ్రంగా తుడవాలి, తరువాత మాశ్చరైజర్ రాయాలి. వేసే దుస్తులు వెచ్చదనాన్ని ఇచ్చేలా కాస్త వదులుగా ఉండాలి. చలి అనే నెపంతో బిగుతు దుస్తులు వేయకూడదు. ఉన్ని దుస్తులు వేయడం మంచిది.  పిల్లలకు చర్మ సంబంధ సమస్యలు వచ్చినప్పుడు కొబ్బరి నూనె లాంటి సహజ మార్గాలతో తగ్గకపోతే ఇతర సొంతవైద్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.                                        ◆నిశ్శబ్ద.

చలి కాలాల్లో పిల్లల చర్మ సమస్య గురించి షాకింగ్ నిజాలు..! వర్షాకాలం, చలి కాలంలో చిన్న పిల్లల్లో చర్మ సమస్యలు..  ముఖ్యంగా దురదలు, ర్యాషెస్, చర్మంపై ఎర్రటి మచ్చలు చాలా సాధారణం. కానీ ఇవి ఎందుకు వస్తాయి, ఎప్పుడు ఇంటి చిట్కాలు సరిపోతాయి, ఎప్పుడు వైద్యుడి వద్దకు వెళ్లాలి అనే విషయం చాలా మందికి స్పష్టంగా తెలియదు. దీని వల్ల కొన్నిసార్లు పిల్లల సమస్య పెరగడం లేదా సమస్య పెద్దగా లేకున్నా వైద్యుల వద్దకు వెళ్ళడం వల్ల వైద్య ఖర్చు ఎక్కువగా రావడం వంటివి కూడా జరుగుతాయి. అటు పిల్లల ఆరోగ్యం బాగుండాలన్నా, అతిగా వైద్య ఖర్చుకు ఉండకూడదు అన్నా.. చలికాలంలో పిల్లలకు వచ్చే చర్మ సమస్యల గురించి,వాటిని ఇంట్లోనే తగ్గించుకోవడం గురించి తెలుసుకోవాలి..  వర్షం–చలి కాలంలో పిల్లల్లో దురదలు, ర్యాషెస్ ఎందుకు వస్తాయి? చలి వాతావరణం & పొడి చర్మం.. చల్లటి గాలి కారణంగా చర్మంలో తేమ తగ్గిపోతుంది. ఇది dry skin dermatitis లేదా winter rash అనే స్థితిని కలిగిస్తుంది. తడి బట్టలు లేదా చర్మంపై తేమ ఎక్కువగా ఉండడం.. వర్షపు నీరు, చెమట లేదా తడి బట్టలు ఎక్కువసేపు ఉండడం వల్ల fungal infection లేదా హీట్ ర్యాష్ వస్తుంది. సబ్బులు లేదా డిటర్జెంట్ల ప్రభావం.. ఎక్కువ సుగంధ ద్రవ్యాలు ఉన్న సబ్బులు, డిటర్జెంట్లు చిన్నారుల చర్మానికి హానికరం. బ్యాక్టీరియా/ఫంగల్ ఇన్ఫెక్షన్లు వర్షాకాలంలో  సూక్ష్మజీవులు వేగంగా పెరుగుతాయి, ప్రత్యేకంగా చెమట ఎక్కువగా వచ్చే ప్రదేశాలైన గోళ్ల మధ్య, మడమల దగ్గర, కాళ్ళ కింద, మెడ చుట్టూ. ఇంట్లోనే సులువుగా చేసుకొదగ్గ సేఫ్ చిట్కాలు చర్మం తడిగా కాకుండా ఉంచడం పిల్లల బట్టలు పూర్తిగా పొడిగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. తడిగా ఉంటే వెంటనే మార్చాలి. నేచురల్ ఆయిల్ మాయిశ్చరైజర్.. రోజూ స్నానం తర్వాత కొబ్బరి నూనె లేదా బాదం నూనెను పలుచగా రాసి మసాజ్ చేయాలి. ఇది చర్మాన్ని తేమతో ఉంచి దురదను తగ్గిస్తుంది.  స్నానానికి సహజ చిట్కాలు స్నానానికి చాలా వేడి నీరు కాకుండా  సాధారణ గోరువెచ్చని నీరు ఉపయోగించడం మంచిది.  సబ్బు బదులు వారానికి 2-3సార్లు  సెనగపిండి + పాలు + తేనె మిశ్రమంతో శుభ్రం చేయవచ్చు. ఓట్స్ బాత్.. ఒక కప్పు ఓట్స్ పొడి చేసుకుని స్నానానికి నీటిలో కలిపితే దురద, ర్యాషెస్ తగ్గుతాయి. బట్టల జాగ్రత్తలు సున్నితమైన నూలు బట్టలు వేయడం మంచిది.  కొత్త బట్టలు మొదటిసారి వేసే ముందు ఒకసారి వాష్ చేసి తర్వాత వేయడం  మంచిది. పిల్లకు తగినంత నీరు తాగించాలు.. చలి కాలంలో పిల్లలు నీరు తక్కువ తాగుతారు, దాంతో చర్మం ఇంకా పొడిగా మారుతుంది.  వైద్యుడి వద్దకు ఎప్పుడు వెళ్ళాలి? ర్యాష్ ఎర్రగా పాకిపోవడం లేదా పుస్ రావడం. బుడగలు, చర్మం ఊడిపోవడం. పిల్లకు జ్వరం రావడం లేదా అసహనం, నిద్రలేమి. దురద చాలా ఎక్కువగా ఉండి రాత్రి నిద్రపట్టకపోవడం. కళ్ళ చుట్టూ లేదా జననేంద్రియాల దగ్గర ర్యాషెస్ రావడం. చర్మం పగలడం, రక్తం కారడం, లేదా తీవ్రమైన పొడిబారడం. వంటి సమస్యలు ఉంటే ఇంటి చిట్కాలు సరిపోవు. డాక్టర్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. . ఈ జాగ్రత్తలు కూడా.. పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఏ నూనె లేదా చిట్కా వాడే ముందు ఒక చిన్న ప్రదేశంలో ప్యాచ్ టెస్ట్ చేయాలి. సుగంధ ద్రవ్యాలు, రంగులు ఉన్న ఉత్పత్తులను దూరంగా ఉంచాలి. చల్లటి కాలంలో రోజుకు ఒకసారి మాత్రమే స్నానం చేయించాలి. .                   *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu

పిల్లలు తెలివైనవారిగా ఎదగాలంటే ఇవి ఫాలో అవ్వాలి!   చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే చాలా సందడిగా ఉంటుంది. మొదట్లో పిల్లలు చాలా అల్లరి చేస్తారు. ఆ తరువాత పిల్లలు ప్రశ్నల పుట్టలు అవుతారు. వారు ఇంట్లో ఉంటే ప్రతి విషయం గురించి ప్రశ్నిస్తూనే ఉంటారు. అది ఎలా ఉంది?? ఇది ఎలా ఉంది?? అదేంటి?? ఇది ఎందుకు ఇలా ఉంది?? వంటి ప్రశ్నలు పిల్లల నుండి వస్తూనే ఉంటాయి. చాలామంది ఇలా పిల్లలు ప్రశ్నిస్తున్నప్పుడు "పెద్ధయ్యే కొద్ది నీకు అర్థమవుతాయి లే" అని తోసిపుచ్చుతారు. కానీ వారు అడిగిన వెంటనే ఆ ప్రశ్నలను పరిష్కరిస్తే వారి మనసు, వారి ఆలోచన ఎంతో చురుగ్గా మారుతాయి. పిల్లలలో ప్రశ్నించే తత్వాన్ని ఎప్పుడూ అనిచివేయకుడదు. పనులు అప్పగించాలి.. పిల్లలు చేయదగిన చిన్న చిన్న పనులు కొన్ని ఉంటాయి. మొక్కలకు నీరు పోయడం, మార్కెట్ నుండి తెచ్చిన కూరగాయలు బయటకు తీయడం, వండుతున్న పదార్థానికి కావలసిన దినుసులు అందించమనడం. ఈ పనులు చేసేటప్పుడు పిల్లలు తల్లిదండ్రులతోనే ఉండటం వల్ల పిల్లలు ఎక్కడికో వెళ్లి ఏవైనా దెబ్బలు తగిలించుకుంటారేమో అనే భయం కూడా ఉండదు.  కొత్తగా ఉండాలి.. పిల్లలకు చేసిన పని మళ్లీ చేయాలంటే విసుగు వస్తుంది, వారు తొందరగా ఆసక్తిగా కోల్పోతారు. కాబట్టి వాళ్ళ మెదడు పదునెక్కాలంటే వాళ్లకు అప్పగించే పనులు  కొత్తగా ఉండాలి. పాత పని పిల్లలకు  నచ్చితే వాళ్ళే దానివైపు వెళతారు. భాగమవ్వాలి… పిల్లలతో తల్లిదండ్రులు భాగమైనప్పుడు పిల్లలు మరింత చురుగ్గా, ఆసక్తిగా పనులు చేస్తారు. వీలైనవరకు పెద్దలు పిల్లతో కలసి పనులు చేయాలి. ప్రకృతికి దగ్గరగా.. పిల్లలు ఇంట్లోనే ఉంటే వారి మెదడు అంతగా ఎదగదు. ప్రకృతికి దగ్గరగా ఉన్నపుడే వారి మెదడు ఉత్సాహంగా మారుతుంది. చెట్టు, చేమ, కొండలు, నీరు ఇవి మాత్రమే కాకుండా దేవాలయాలు, మ్యూజియం, పురాణ కథలు.. ఇలా ఎన్నో పిల్లల మెదళ్ళలో పాదరసంలా మారుతాయి.  కాబట్టి పిల్లలు చురుగ్గా . వారి ఆలోచనలు ఉన్నతంగా ఉండాలంటే ఇవన్నీ ప్రతి తల్లిదండ్రి గుర్తుంచుకుని ఫాలో కావాలి.                                           *నిశ్శబ్ద.

పిల్లలు ఎత్తు పెరగడం లేదా.. అయితే ఇవి ఫాలో అవ్వండి చాలు! బరువు పెరగలన్నా, తగ్గాలన్నా, ఆహారాన్ని నియంత్రించుకోవలన్నా, రక్తపోటు, చక్కెర స్థాయిలను నియంత్రణలో పెట్టుకోవాలన్నా ప్రతిదానికి ఓ డైట్ ప్లాన్, ఓ సమయ పాలన ఉంటుంది. కానీ ఎత్తు పెరగడమనే విషయంలోకి  వస్తే.. అది ఎవరి చేతుల్లోనూ ఉండదు. ఎత్తు పెరగడం అనేది చిన్నతనం నుండి ఓ దశలోకి వచ్చి ఆగిపోతుంది. ఓ దశాబ్ద కాలాన్ని సరిగ్గా గమనిస్తే పిల్లలు తగినంత ఎత్తు పెరగడం లేదనే వాస్తవం అర్థం అవుతుంది. పిల్లలు పెరగాల్సిన వయసులో  వారు ఎత్తు పెరగడానికి తగిన వాతావరణం, తగిన ఆహారం లభించకపోవడమే పిల్లల్లో ఎదుగుదల లేకపోవడానికి కారణం అవుతుంది. పిల్లల ఎత్తును పెంచడానికి ఉత్తమ మార్గం తెలుసుకుంటే ప్రతి తల్లి తమ పిల్లల విషయంలో దాన్ని చక్కగా ఫాలో అవ్వచ్చు...  సాధారణంగా పిల్లలఎత్తు ప్రధానంగా జన్యువులతో నిర్ణయించబడుతుంది. అయితే, జీవనశైలి సరైన జన్యు సామర్థ్యాన్ని చేరుకోవడంలో చాలా వరకు సహాయం చేస్తుంది. ఆటలు ముఖ్యం.. పిల్లల్ని స్కూళ్ళు, ట్యూషన్లతో ఎప్పుడూ కట్టేసినట్టు ఉంచకండి. రోజులో కొంతసేపు కింది ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి. బ్యాడ్మింటన్, టెన్నిస్ వంటి ఆటలు, ఈత, బాస్కెట్‌బాల్ వంటివి పిల్లలు ఎత్తు పెరగడానికి సహాయపడతాయి.  ఆహారంలో తగినంత ప్రోటీన్ చేర్చడం మరీ ముఖ్యం.  సరైన స్థాయిలో కాల్షియం, విటమిన్ డి పిల్లలకు అందించడం మరెంతో ముఖ్యం.  పొడవాటి ఎముకలలోని ఎపిఫైసెస్ (గ్రోత్ ప్లేట్లు) ఫ్యూజన్ కౌమారదశలో వస్తాయి. ఈ గ్రోత్ ప్లేట్లు ఫ్యూజ్ అయిన తర్వాత, నిలువు ఎముక పెరుగుదల ఆగిపోతుంది. అంటే తరువాత ఎత్తు పెరగదు. అబ్బాయిలకు సగటున 16-18 ఏళ్లు, బాలికలకు 14-15 ఏళ్లు సమయం ఎత్తు పెరుగుదలకు చివరి దశ.  ఈ సమయంలో గ్రోత్ హార్మోన్ ఉత్పత్తి మందగించి ఎపిఫైసెస్ ఫ్యూజ్ అవుతుంది. గ్రోత్ హార్మోన్ ఉత్పత్తిని పెంచడానికి సహజమైన మార్గాలు ఉన్నాయి, ఇవి సరైన ఎత్తుకు చేరుకోవడంలో సహాయపడతాయి. వీటిలో పైన చెప్పుకున్నట్టు  ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి బాగా అందేలా చూసుకోవాలి. ఆటలు ఆడటం  తప్పనిసరి. ముఖ్యంగా బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్ వంటి ఎముకల పొడవును ప్రేరేపించే ఆటలు ఆడించాలి.  పొడవు పెరగాల్సిన దశ దాటిపోయాక ఎన్ని ప్రయోగాలు చేసినా పొడవు ఒరేగడం కుదరదు. ఈ విషయన్ని ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి.  ముఖ్యంగా పిల్లలజీవనశైలిలో ఆహారంలో తెలియని మార్పులు చేసే ముందు ప్రతి తల్లి వైద్యులను సంప్రదించిన తరువాతే వాటిని పాటించాలి.                              ◆నిశ్శబ్ద.

పిల్లల పెంపకం బాధ్యత ముఖ్యంగా స్త్రీల మీదనే ఉంటుంది ఎందుకు..   తల్లిదండ్రుల అవసరం లేకుండా పిల్లల్ని పెంచిన వారే ఉత్తమ తల్లిదండ్రులు. ప్రతి క్షణం పిల్లలకు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో చెప్పే తల్లిదండ్రుల లక్షణం ఎలా ఉంటుందంటే…  మనం మొక్కలు పెంచేటప్పుడు ఆ చెట్టుకు కావలసిన నీరు, ఎరువులు సమకూరుస్తాం కానీ చెట్టుకు ఇలా ఎదుగు, అలా ఎదుగు అని ప్రతిక్షణం చెప్పం కదా! అలాగే పిల్లలకు ప్రేమ, స్వేచ్ఛను ఇవ్వాలే గానీ బందీలు చేయరాదు. తల్లిదండ్రులు తాము సాధించలేకపోయిన వాటిని పిల్లల నుండి సాధించుకోవాలనే ఆలోచన పెంచుకొని వారి మీద వత్తిడి పెంచుతున్నారు. అటువంటి వారు మంచి తల్లిదండ్రులు కాలేరు. పిల్లలు ఉత్తమంగా ఎదిగే వాతావరణం కల్పించేలా చేసే వారే మంచి తల్లిదండ్రులు. పిల్లల పెంపకం వ్యక్తిగతమైనదైనా తల్లిదండ్రులు ఆ పనిని సామాజిక బాధ్యతగా స్వీకరించి సమాజానికి తమ సేవను సమర్ధవంతంగా నిర్వహించడానికి దీక్షతో కృషి చేయాలి. తల్లిదండ్రులు పిల్లల దృష్టిలో పెద్దవారు. వారు చేసే పనులు గమనిస్తూ అనుసరిస్తారు. దానిని బట్టే వారి నడవడిక, ప్రవర్తన ఆధారపడతాయి. ప్రపంచంలో సర్వదోషాలకు ఈర్ష్య, స్వార్థాలు కారణం. ఇవి పెద్దల వలన పిల్లలపై ప్రభావం చూపి చెడును ప్రేరేపిస్తాయి. పిల్లలను హద్దులో పెట్టి బాగు చేసే ప్రయత్నం కన్నా పెద్దలలో మంచి మార్పు తెచ్చుకొని బాగుచేయడం మంచిది. తల్లిదండ్రులు వారి పిల్లలను భావి పౌరులుగా ఉత్పత్తి చేసి సమాజానికి అందిస్తున్నారు. ఆ ఉత్పత్తి ప్రక్రియలో నాణ్యతా లోపం చోటు చేసుకుంటే ఆ నష్టాన్ని సమాజం 60-70 సంవత్సరాల పాటు భరించవలసి వస్తుంది.  పిల్లలను ఎలా పెంచాలి? ఐదు సంవత్సరాలు వచ్చే వరకూ పిల్లలను రాజకుమారుల్లా, అతి గారాభంగా పెంచాలి. ఆపై పదిహేను సంవత్సరాల వరకు సేవకుడిలా ఆజ్ఞాపించాలి. పదహారు సంవత్సరాల తరువాత మిత్రునిలాగా భావించి పెంచాలి. అప్పుడే ప్రయోజకులవుతారు. పిల్లల్ని ప్రేమతో చూడడం వేరు, గారాబంగా పెంచడం వేరు. ప్రేమతో పెంచితే ప్రయోజకులవుతారు. గారాబంగా పెంచితే మీకూ, దేశానికీ, కట్టుకున్న వారికీ సమస్య అవుతారు. చిన్నతనం నుంచీ మన తల్లి తండ్రి నుంచి మనం ఏమి కోల్పోయామో, ఏ విషయాల ద్వారా జీవితంలో ఈ స్థితికి వచ్చామో గమనించి ఆ తప్పులే మళ్ళి మనం చేయకూడదు. పిల్లలు పెరిగి ప్రయోజకులుగా మారి, మనల్ని ఉద్దరించే స్థితిలో ఉండాలి. కానీ మనమే వారిని చూసే స్థితి వస్తే ఖచ్చితంగా మనం మన పిల్లల్ని సరైన దారిలో పెంచలేదని తెలుసుకోవాలి. చిరుప్రాయంలో తల్లి ఇచ్చే శిక్షణా విధానం పిల్లల భవిష్యత్ జీవనంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్న విషయంపై కొన్నేళ్ళ క్రితం ఓ సర్వే జరిగింది. ఆ సర్వేలో వెళ్ళడైన విషయం ఇది. "ఓ తల్లి పిల్లవాడికి నడక నేర్పే ప్రయత్నంలో పిల్లవాడికి కొంత దూరంలో నిలబడి తన వైపు రమ్మని ప్రోత్సహిస్తుంది. అప్పుడు పిల్లవాడు తల్లిని చేరుకోవాలని ఆశతో ముందుకు నడవడానికి ప్రయత్నించాడు. ఈ ప్రక్రియలో పిల్లవాడు అదుపుతప్పి పడిపోయి, ఏడవడం ప్రారంభించాడు. వెంటనే తల్లి పరుగున వెళ్ళి పిల్లవాణ్ణి ఓదారుస్తూ, చీ పాడునేల! నీవల్లే మా పిల్లాడికి దెబ్బలు తగిలాయంటూనే నేలను కొట్టింది. అప్పుడు పిల్లవాడు ఏడుపు ఆపేశాడు. ఇదే విధంగా మరో తల్లి తన పిల్లవాడికి నడక నేర్పేటప్పుడు, ఆ పిల్లవాడు తల్లి వైపు నడుస్తూ ఉండగా పడిపోయాడు. అప్పుడు ఆమె పిల్లవాడి దగ్గరకు వెళ్ళకుండా దూరం నుండే 'లే నాయనా! లే లేచిరా!' అంటూ ఉత్సాహపరిచింది. ఆ పిల్లవాడు మెల్లగా లేచి నడుచుకుంటూ తల్లిని చేరుకున్నాడు. ఆ ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళయిన తరువాత వారి స్వభావాన్ని పరిశీలిస్తే తేలిందేమిటి. మొదటి పిల్లవాడు తనకు ఎదురైన కష్టాలకు, అపజయాలకు బయట పరిస్థితులు, పరిసరాలు, వ్యక్తులే కారణమని నిందించే స్వభావం కలిగిన వాడయ్యాడు. రెండవ పిల్లవాడు తనకు ఎదురైన కష్టాలు, అపజయాలను ఎదుర్కోగల మనోబల సంపన్నుడయ్యాడు. ఆలోచనలు మనం చేసే పనుల యొక్క సున్నిత రూపాలు. అవి మెదడులో చిన్న విద్యుత్తరంగాలుగా జీవం పోసుకొని, చుట్టూ ఉండే గాలిలాగ, పీల్చుకొనే ఊపిరిలాగ మనకు తెలియకుండానే మన బాహ్యమనోపరికరాలను ప్రభావితం చేస్తాయి. అందుకే  ముఖ్యంగా పిల్లల పెంపక బాధ్యత స్త్రీల మీదే ఆధారపడి వుంటుంది.                                  ◆నిశ్శబ్ద.

మహిళలు ఐరన్ లోపాన్ని లైట్ తీసుకుంటే జరిగేది ఇదే..!   శరీరానికి  ముఖ్యమైన ఖనిజాలలో ఐరన్ ప్రధమ స్థానంలో ఉంటుంది.  మహిళలకు అయినా, పురుషులకు అయినా, పిల్లలకు అయినా, వృద్దులకు అయినా.. ఇలా మానవులందరికీ ఐరన్ చాలా ముఖ్యమైనది. మనిషి శరీరంలో రక్తాన్ని హిమోగ్లోబిన్ ఆధారంగా అంచనా వేస్తారు. మహిళలకు 12 నుండి 16 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. అలాగే పురుషులకు 14 నుండి 18 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి.  కానీ ప్రపంచంలో.. ముఖ్యంగా భారతదేశంలో అధికశాతం మంది మహిళలు  ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. దీని వల్ల రక్తహీనత సమస్య వస్తుంది. భారతదేశంలో 50 శాతం కంటే ఎక్కువ మంది వయోజన మహిళలు ఐరన్ లోపంతో బాధపడుతున్నారు.  చాలామంది తమకు ఐరన్ లోపం ఉందన్న విషయాన్ని తెలుసుకోకుండానే కాలం వెళ్లబుచ్చుతుంటారు. అసలు శరీరానికి ఐరన్ ఎందుకు ముఖ్యం? మహిళలు ఐరన్ లోపాన్ని లైట్ తీసుకుంటే జరిగేదేంటి? తెలుసుకుంటే.. ఐరన్.. ఐరన్ మనిషి శరీరానికి కీలకమైన సూక్ష్మపోషకం. ఇది హిమోగ్లోబిన్ తయారీకి సహాయపడుతుంది. ఇది శరీరమంతా ఆక్సిజన్ సరఫరా కావడంలో సహాయపడుతుంది.  అంటే.. ఐరన్ ఎంత సమృద్దిగా ఉంటే శరీరానికి ఆక్సిజన్ సరఫరా అంత మెరుగ్గా ఉంటుంది. శరీరంలో ఐరన్ లోపం ఉంటే అది హిమోగ్లోబిన్ తగ్గడానికి దారితీస్తుంది.  ఈ పరిస్థితిని ఐరన్ లోపం లేదా రక్తహీనత అని అంటారు. రక్తహీనతను లైట్ తీసుకుంటే.. చాలామంది మహిళలు రక్తహీనతను లైట్ తీసుకుంటారు.  తమకు రక్తహీనత సమస్య ఉందని తెలిసినా కొందరు జాగ్రత్తలు తీసుకోవడం,  ఐరన్ ఫుడ్ తీసుకోవడం,  హిమోగ్లోబిన్ మెరుగు పరుచుకోవడం లాంటివి చేయరు. అయితే రక్తహీనత ఉంటే మహిళలల శరీరం ఎప్పుడూ అలసటగా ఉంటుంది.  అలాగే ఆకలి లేకపోవడం, ఏకాగ్రత తగ్గడం మొదలైన వాటికి కారణం అవుతుంది.  ఐరన్ లోపం చాలా ఎక్కువ ఉంటే అది ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంటుంది. మహిళల నెలసరి.. మహిళలకు ప్రతి నెల నెలసరి కారణంగా దాదాపు 30 నుండి 40 మిల్లీలీటర్ల రక్తం కోల్పోవడం జరుగుతుంది. పైగా నెలసరి తర్వాత గర్బం దాల్చడం,  ప్రసవాలు,  గర్భసమస్యలు,  సర్జరీలు.. ఇలాంటి కారణాలు కూడా ఉంటాయి.  ఈ కారణంగా పురుషుల కంటే మహిళలలో రక్తహీనత వచ్చే అవకాశం ఎక్కువగా  ఉంటుంది. గర్భధారణ సవాల్.. గర్భధారణ మహిళలకు చాలా సవాల్ విసిరే దశ అనుకోవచ్చు.  గర్భం దాల్చినప్పుడు మహిళలకు ఐరన్ అవసరం సాధారణం కంటే  ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఐరన్ కేవలం తల్లికే కాకుండా కడుపులో బిడ్డకు కూడా అవసరం అవుతుంది. అందుకే సాధారణం కంటే 2 లేదా 3 రెట్లు ఐరన్ అవసరం పెరుగుతుంది. పిల్లలకు పాలిచ్చే తల్లులు.. పిల్లలకు పాలిచ్చే మహిళలు అవసరానికి అనుగుణంగా ఆహారంలో ఐరన్ తీసుకోవాలి.  లేకపోతే రక్తహీనత వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. గర్బిణీ స్త్రీలు గర్బం దాల్చిన మూడవ నెల నుండి శరీరానికి అవసరమైన ఐరన్ తీసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి.  అలాగే పాలిచ్చే తల్లులు ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటూ వైద్యుల సలహాతో ఐరన్ సప్లిమెంట్లు తీసుకోవాలి. ఐరన్ లోపానికి ఇలా చెక్ పెట్టాలి.. ఐరన్ లోపాన్ని చెక్ పెట్టడానికి ఆకుకూరలు,  గింజలు,  బీన్స్,  మాంసం,  చేపలు, గుడ్లు, బలవర్థకమైన తృణధాన్యాలను ఆహారంలో తీసుకోవాలి.  ఐరన్ సమృద్దిగా లభించే నువ్వులు, వేరుశనగలు,  బెల్లం,  ఖర్జూరం వంటివి తప్పనిసరిగా తీసుకోవాలి. కాఫీ, టీ లు మానేయాలి.. చాలామందికి కాఫీ, టీ వంటివి ఎక్కువగా తీసుకునే అలవాటు ఉంటుంది. అయితే.. ఎక్కువగా తీసుకునే కాఫీ, టీ లు శరీరం ఐరన్ ను గ్రహించకుండా చేస్తాయి.  అందుకే శరీరానికి ఐరన్ బాగా లభించాలంటే కాఫీ, టీ తీసుకోవడం పరిమితం చేయాలి. ఇంకా ఆరోగ్యం కోసం అవి కూడా మానేయవచ్చు. ఐరన్ ను గ్రహించే ఆహారాలు.. విటమిన్-సి ఐరన్ శోషణను మెరుగుపరుస్తుంది.  అందుకే ఐరన్ తో పాటు నిమ్మ, ఉసిరి,  నారింజ,  విటమిన్-సి అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.                            *రూపశ్రీ.

చిన్నపిల్లకు ప్లాస్టిక్ బాక్సులలో టిఫిన్, లంచ్ ఇవ్వడం సరైనదేనా...   తల్లిదండ్రులు  పిల్లలను పెంచడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.  వారికి కావలసినవి సమకూర్చడం నుండి వారికి ఆహారం ఇవ్వడం వరకు.. ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు.  అయితే కొన్నిసార్లు చిన్న తప్పులు జరిగిపోతుంటాయి. విచిత్రం ఏమిటంటే.. అది తప్పు అనే విషయం పిల్లలకు, పెద్దలకు కూడా తెలియదు. పిల్లలను స్కూల్ కు పంపేటప్పుడు చాలా వరకు తల్లులు టిఫిన్, లంచ్, స్నాక్స్ వంటివి బాక్స్ లలో ప్యాక్ చేసి ఇస్తుంటారు. అయితే చాలా వరకు ప్లాస్టిక్ బాక్స్ లలో ఇలా ఆహారం ఇవ్వడమే అసలైన మిస్టేక్ అనే విషయం చాలా మందికి తెలియదు. ప్లాస్టిక్ బాక్సులలో ఆహారం ప్యాక్ చేస్తున్నారా? పిల్లల ఆహారాన్ని ప్లాస్టిక్ బాక్సులలో ప్యాక్ చేయడం వల్ల వారి ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది. చాలా ప్లాస్టిక్ టిఫిన్ బాక్సులు ఉన్నాయి, వాటిలో వేడి ఆహారాన్ని ప్యాక్ చేయడం వల్ల వాటిలో ఉండే హానికరమైన రసాయనాలు పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. దీనివల్ల పిల్లలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు గురవుతారు. మైక్రోప్లాస్టిక్స్ ప్రమాదం.. కొన్నిసార్లు ప్లాస్టిక్ చిన్న కణాలుగా విచ్ఛిన్నమవుతుంది, వీటిని మైక్రోప్లాస్టిక్స్ అని కూడా పిలుస్తారు. ఈ కణాలు పిల్లల ఆహారంలోకి చేరి, వారి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి.  దీనివల్ల పిల్లలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బాక్టీరియా పిల్లలకు హాని చేస్తుంది.. ప్లాస్టిక్ టిఫిన్లలో బాక్టీరియా సులభంగా పేరుకుపోతుంది. ఇది అనారోగ్యానికి కూడా దారితీస్తుంది. తరచుగా ప్లాస్టిక్ బాక్సులను  ఎక్కువ కాలం  ఉపయోగించడం వల్ల సరిగ్గా శుభ్రపరచలేరు. లోపల పేరుకుపోయే బ్యాక్టీరియా పిల్లలకు హాని కలిగిస్తుంది. స్టీల్ పాత్రలు.. ప్లాస్టిక్ పాత్రలను స్క్రబ్ చేయడం వల్ల వాటి పూత తొలగిపోతుంది. ఇది పిల్లల ఆహారంలో అంటుకుని  శరీరంలోకి ప్రవేశించి, పిల్లలు త్వరగా అనారోగ్యానికి గురవడానికి కారణం అవుతుంది. ఈ సమస్యలను నివారించడానికి పిల్లలకు స్టీల్ పాత్రలను ఉపయోగించడం మంచిది.  స్టీల్ బాటిల్లు..  ప్లాస్టిక్ టిఫిన్ బాక్సులే కాదు.. నీళ్ల బాటిల్లు కూడా ప్లాస్టిక్ ఇస్తుంటారు.  వెంటనే ప్లాస్టిక్ ను  వాడటం మానేయడం మంచిది.  స్టీల్ బాటిల్ వాడటం మంచిది.                            *రూపశ్రీ.

అందమైన చర్మం కావాలంటే.. వీటిని ఎక్కువగా తినాలి..! చర్మం అందంగా , కాంతివంతంగా ఉంటే వయసు కూడా చాలా తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ కారణంగా చాలా మంది చర్మం యవ్వనంగా, అందంగా ఉండాలని కోరుకుంటారు.  దీనికోసం చాలా రకాల టిప్స్ కూడా ఫాలో అవుతారు. కొందరు అయితే చర్మం ఆరోగ్యంగా, అందంగా, యవ్వనంగా ఉండటం కోసం ఖరీదైన స్కిన్ ట్రీట్మెంట్లు,  ఖరీదైన వాణిజ్య ఉత్పత్తులు కూడా ఉపయోగిస్తారు. కానీ చర్మ సంరక్షణ నిపుణులు, ఆహార నిపుణులు, వైద్యుల అభిప్రాయం ప్రకారం.. నిజమైన అందం అనేది కేవలం పైన పూసే క్రీములు, తీసుకునే ట్రీట్మెంట్ల మీద కాదు.. లోపలి నుండి వస్తుంది. ఇదేలాగంటే.. చర్మాన్ని అందంగా, యవ్వనంగా  కనిపించేలా చేయడంలో ఆహారానిదే కీలకపాత్ర. సరైన పోషకాహారం, చర్మానికి మేలు చేసే ఆహారాలు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉంటుంది. అయితే కేవలం ఒకే ఒక కూరగాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం అద్బుతంగా మారుతుంది. అదేంటో తెలుసుకుంటే.. టమోటా.. చర్మ ఆరోగ్యానికి టమోటా అద్బుతంగా పనిచేస్తుంది. ఈ విషయం తెలిసి చాలా మంది షాకవుతారేమో.. కానీ చర్మం అందంగా, ప్రకాశవంతంగా మారడంలో టమోటాలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. టమోటాలలో లైకోపిన్,  విటమిన్-సి, యాంటీఆక్సిండెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి.  తద్వారా చర్మాన్ని రక్షిస్తాయి.  చర్మం అందంగా ఉండటంలో కీలకపాత్ర పోషిస్తాయి. టమోటాలు చర్మ ట్యాన్ తొలగించడంలో ఉపయోగిస్తారని చాలామందికి తెలిసే ఉంటుంది.  అయితే టమోటాలు కేవలం ట్యాన్ ను తొలగించడమే కాదు.. బ్లాక్ హెడ్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.  చర్మపు రంగును ప్రకాశవంతం  చేయడంలో కూడా టమోటాలు సహాయపడతాయి. చర్మ సంరక్షణ కోసం టమోటాలను రెండు విధాలుగా ఉపయోగించవచ్చు.  ఒకటి టమోటాలను నేరుగా తినడం. వీటిని శుభ్రంగా కడిగి సలాడ్ లాగా తినవచ్చు. ఇక టమోటా రసం చర్మానికి మ్యాజిక్ లాగా పనిచేస్తుంది.  టమోటా జ్యూస్ ను కాటన్ బాల్ తో అద్దుకుని ముఖానికి మొత్తం అప్లై చేసి ఆరిపోయిన తరువాత సాధారణ నీటితో కడుక్కోవాలి. ఇవి చాలా ప్రబావావంతంగా పనిచేస్తాయి. టమోటా జ్యూస్ ను నేరుగా అప్లై చేయలేకపోయినా,  జ్యూస్ ను ఏదైనా ఫేస్ ప్యాక్ లో కూడా జతచేసుకోవచ్చు. ఇది మరింత మెరుగ్గా ఉంటుంది.                                   *రూపశ్రీ. 

  పిల్లలు నోట్లో వేళ్లు పెట్టుకుంటే కోప్పడుతున్నారా..ఈ నిజాలు తెలుసా! పిల్లలు నోటిలో వేళ్లు పెట్టుకోవడం చాలా సహజం. చాలామంది తల్లిదండ్రులు దీన్ని చెడ్డ అలవాటుగా పరిగణిస్తారు.  పిల్లలు నోట్లో వేలు పెట్టుకోవడం చూడగానే తల్లిదండ్రులకు ఎక్కడలేని కోపం వస్తుంది.  తల్లిదండ్రులు వెంటనే వేళ్లను నోట్లో నుండి  బయటకు తీస్తారు. ఇది సరైనదేనా? నోటిలో వేళ్లు పెట్టడం పిల్లల పరిశుభ్రతకు మంచిది కాదని చాలామంది అబిప్రాయం. అంతేకాకుండా ఇది హాని కలిగించే అవకాశం ఉంది. అందువల్ల పిల్లల ఈ అలవాటును మాన్పించే క్రమంలో కొన్నిసార్లు పిల్లలను  కొట్టడానికి కూడా వెనుకాడరు. కానీ పిల్లల నోటిలో వేళ్లు పెట్టడం, బొటనవేలు చప్పరించడం వల్ల  ముఖ్యంగా 0 నుండి 2 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు ప్రయోజనకరంగా ఉంటుందట.  దీని గురించి తెలుసుకుంటే.. ఉల్లాసం.. పిల్లలు తమ వేళ్లను నోటిలో పెట్టుకున్నప్పుడు అది వారిని రిలాక్స్ చేస్తుందట. నిజానికి పిల్లలు అసౌకర్యంగా ఉన్నప్పుడు లేదా ఏడుస్తున్నప్పుడు, వారి వేళ్లను చప్పరించడం ప్రశాంతతను కలిగిస్తుందట. ఇది పిల్లలు తమకు తాము ఏదైనా ఒక ఎమోషన్ నుండి బయటకు రావడంలో సహాయపడుతుందని అంటున్నారు. దంతాలు వచ్చేటప్పుడు.. శిశువు దంతాలు బయటకు వస్తున్నప్పుడు వారి చిగుళ్ళు దురదగా, బాధాకరంగా మారుతాయి. ఈ అసౌకర్యాన్ని తగ్గించడానికి వారు తమ వేళ్లను నోటిలో పెట్టుకుంటారు. ఇది వారికి  ఓదార్పునిస్తుందట. రోగనిరోధక శక్తి.. కొన్ని పరిశోధనల ప్రకారం పిల్లల నోటిలో వేళ్లు పెట్టడం వల్ల వారి రోగనిరోధక వ్యవస్థకు ఉపయోగకరంగా ఉంటుందట.  ఎందుకంటే ఇది శరీరం తేలికపాటి బ్యాక్టీరియాను ఎదుర్కోవడం నేర్చుకోవడానికి సహాయపడుతుంది. నోరు,  చేతిని  ఉపయోగించే  నైపుణ్యాలు.. ఈ అలవాటు నవజాత శిశువుల శరీర నియంత్రణ,  కదలిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి కూడా సహాయపడుతుందట. ఇది నోటి-చేతిని ఉపయోగించే నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. కాబట్టి పిల్లలు వేళ్లు చప్పరిస్తుంటే వారిని తిట్టి అడ్డుకోకూడదు అంటున్నారు పిల్లల వైద్యులు. నోట్లో వేళ్లు పెట్టుకోవడం ఎప్పుడు ఆపాలి?  పిల్లలు 3 నుండి 4 సంవత్సరాల వయస్సు కలిగి ఉండి, నిరంతరం వేలు పీలుస్తుంటే అది వారి దంతాల అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. అలాంటి సందర్భంలో వెంటనే ఈ అలవాటును మాన్పించడం మంచిదని అంటున్నారు. అతిగా వేలు చప్పరించడం వల్ల నోటిలో చర్మ వ్యాధులు లేదా బ్యాక్టీరియా వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి ఈ అలవాటును మానుకోవడం చాలా అవసరం. బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత పరంగా ఈ అలవాటు మంచిది కాదు.                          *రూపశ్రీ.

చిన్నపిల్లలు పాలు తాగుతూ నిద్రపోతారు ఎందుకో తెలుసా?  ఎప్పుడైనా చిన్న పిల్లలను జాగ్రత్తగా గమనించినట్లయితే వారు పాలు తాగుతూ నిద్రపోవడం  గమనించే ఉంటారు. వారు తల్లి ఒడిలో లేదా బాటిల్ పట్టుకుని పాలు తాగుతూ ఉండగానే  మెల్లిగా  కళ్ళు రెప్పవేయడం చూడవచ్చు.  కొన్ని నిమిషాల్లోనే చిన్నపిల్లలు నిద్రపోతారు. చాలామంది దీన్ని గమనించినా  దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని మాత్రం తెలుసుకుని ఉండరు. అసలు చిన్న పిల్లలు పాలు తాగుతూ  ఎందుకు నిద్రపోతారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. పిల్లలకు పాలు కంటే మెరుగైనది మరొకటి లేదు. ఇది పోషకాలను అందించడమే కాకుండా వారికి ఆకలి తీరుస్తుంది. శిశువు కడుపు నిండిన వెంటనే శరీరం రిలాక్స్డ్ మోడ్‌లోకి వెళుతుంది. ముఖ్యంగా తల్లి పాలు తాగేటప్పుడు శిశువు సురక్షితంగా,  సుఖంగా ఫీలవుతారు. ఇది అతన్ని నిద్రపోయేలా చేస్తుంది. పాలలో నిద్రను ప్రేరేపించే మూలకం ఉంటుంది.. పాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఈ హార్మోన్లు మనస్సును ప్రశాంతపరుస్తాయి.  నిద్రను ప్రేరేపించడంలో సహాయపడతాయి. అందువల్ల  పిల్లలు పాలు తాగినప్పుడు, ఈ ప్రక్రియ వారి శరీరంలో వేగంగా జరుగుతుంది.  వారికి నిద్ర రావడం ప్రారంభమవుతుంది. పీల్చే ప్రభావం పిల్లలు తమ తల్లి రొమ్మును లేదా సీసాను పీల్చినప్పుడు  అది వారికి ఆహారం కోసం మాత్రమే కాదు, విశ్రాంతినిచ్చే ప్రక్రియ కూడా అవుతుంది. చప్పరించడం వల్ల వారి నోరు,  ముఖంలోని కండరాలు సడలించబడతాయి. ఇది క్రమంగా వారిని నిద్రపోయేలా చేస్తుంది. శక్తి ఖర్చు,  అలసట.. పాలు తాగడం తేలికగా అనిపించవచ్చు. కానీ చిన్న పిల్లలకు ఇది చాలా శ్రమతో కూడుకున్న ప్రక్రియ. వారు పాలు పీలుస్తున్నప్పుడు అలసిపోయి వెంటనే నిద్రపోతారు. పాలు తాగుతూ పిల్లలు నిద్రపోవడం వారి శరీరంలో సహజంగా జరిగే  అందమైన ప్రక్రియ. ఇది తల్లి-బిడ్డ బంధాన్ని మరింతగా పెంచుతుంది.  శిశువుకు భద్రతను,  హాయిని ఇస్తుంది.                                   *రూపశ్రీ.

 వర్షాకాలంలో పిల్లల చర్మ ఆరోగ్యానికి సూపర్ టిప్స్ ఇవి..! వర్షాకాలం అంటే వేసవి నెలల్లో మండే వేడి నుండి ఉపశమనం. కానీ ఇది తేమ అధికంగా కలిగి ఉండి అసౌకర్యాన్ని, ఇబ్బందిని కలిగిస్తుంద. ముఖ్యంగా శిశువులలో చర్మ వ్యాధులు,  చికాకులు రావడానికి ఇది ఎక్కువగా అవకాశం కలిగి ఉండే కాలం. అధిక తేమ, ఫంగల్ ఇన్ఫెక్షన్, దోమ కాటు లేదా ఉష్ణోగ్రత తీవ్రతలు పిల్లలను ఇబ్బంది పెడతాయి. పిల్లలకు ఎక్కువ ఇబ్బందిగా ఉన్నప్పుడు వైద్యుని సంప్రదించడం మంచిది. కానీ మరీ ప్రభావం ఎక్కువగా లేనప్పుడు ఇంట్లోనే పిల్లల చర్మ సంరక్షణ తీసుకోవచ్చు. పిల్లల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి చర్మాన్ని  హైడ్రేట్ గా ఉంచాలి.   చర్మాన్ని వీలైనంత వరకు బయటి వాతావరణం నుండి ప్రభావితం కాకుండా రక్షణ తీసుకోవాలి. మార్కెట్లో దొరికే క్రీములు రాయడం వల్ల చర్మం సేఫ్ అనుకుని ఎడాపెడా మార్కెట్ క్రీములు రాయకూడదు.   కొబ్బరి నూనె  సహజ యాంటీ ఫంగల్ లక్షణాలను మాత్రమే కాకుండా, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇది మంచి మసాజ్ ఆయిల్ లాగా మాత్రమే కాకుండా మంచి మాయిశ్చరైజర్ లా కూడా పని చేస్తుంది.  తేమ కారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఇది మంచి  మార్గం.  అయితే స్వచ్చమైన కొబ్బరి నూనె వాడాలి. వేప ఆకుల గురించి అందరికీ తెలిసిందే.  ఇది మంచి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది. వేపాకులను ఉడికించిన నీటితో శిశువుకు  స్నానం చేయించడం  వల్ల  బిడ్డకు దద్దుర్లు, దురద,  చర్మ ఇన్ఫెక్షన్ల నుండి సహజ రక్షణ లభిస్తుంది. తాజా కలబంద నుండి వచ్చే జెల్ మండుతున్న చర్మాన్ని చల్లబరుస్తుంది,  శాంతపరుస్తుంది, ఎరుపును తగ్గిస్తుంది.  దాని హైడ్రేటింగ్ రియాక్షన్  చాలా తేలికగా ఉంటుంది. దద్దుర్లు వచ్చే ప్రాంతాలపై చాలా లైట్ గా కలబంద జెల్ పూయడం మంచి చిట్కా.. అయితే పిల్లలకోసం కాబట్టి ముందుగా ప్యాచ్ టెస్ట చేయాలి.  ఓట్ మీల్ చర్మానికి చాలా  ఉపశమనం కలిగిస్తుంది. ఓట్ మీల్ పొడిలో నీరు లేదా కొబ్బరి నూనె వేసి పేస్ట్ లాగా చేసి పిల్లలకు స్నానం చేయించేటప్పుడు సన్నితంగా రుద్దాలి.  తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి. ఇది చర్మాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. కాటన్ దుస్తులు చర్మం పొడిగా ఉండటానికి సహాయపడతాయి.  చెమట పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది. వర్షాకాలంలో సింథటిక్ బట్టలను ఎప్పుడూ ఎంచుకోకూడదు. ఎందుకంటే అవి తేమను లాక్ చేస్తాయి, చర్మ చికాకును పెంచుతాయి.                                             *రూపశ్రీ.

పిల్లలను ప్లే స్కూల్ కు పంపడానికి ముందు ఇవి నేర్పకపోతే చాలా ఇబ్బంది పడతారు..! పిల్లల జీవితంలో విద్యాబ్యాసం ఇంట్లోనే ప్రారంభమవుతుంది. ఎందుకంటే తల్లి మొదటి గురువు కాబట్టి. అయితే ఒక వయసుకు రాగానే పిల్లలను ప్లే స్కూల్ కు పంపడం ఇప్పట్లో అలవాటైంది.  పిల్లలు ప్లే స్కూల్‌లోకి అడుగుపెట్టినప్పుడు మొదటిసారి తల్లిదండ్రుల నుండి దూరంగా  కొత్త ప్రపంచంలోకి అడుగుపెడతాడు. పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి రావడాన్ని అస్సలు భరించలేరు.  అయితే  పిల్లలకు కొన్ని అలవాట్లు ముందే నేర్పిస్తే  పాఠశాలలో  సర్దుబాటు చేసుకోవడం  సులభం అవుతుంది. పిల్లలను ప్లే స్కూల్‌కు పంపే ముందు  నేర్పించాల్సిన 5 ముఖ్యమైన అలవాట్లు తెలుసుకుంటే.. ఒంటరిగా ఆహారం తినే అలవాటు.. ప్లే స్కూల్‌లో ఉపాధ్యాయులు ప్రతి బిడ్డకు విడివిడిగా ఆహారం పెట్టలేరు. పిల్లలు ఎవరికి వారు తినాలి. కాబట్టి ఇంట్లో పిల్లలకు చెంచాతో లేదా చేతులతో ఆహారం తినడం నేర్పించాలి.  ఆహారం తినేటప్పుడు మొదట్లో కాస్త గజిబిజి చేస్తారు, కానీ ఈ అలవాటు అయ్యే కొద్ది ఆహారం తినడం సులువు అవుతుంది. టాయిలెట్ కి వెళ్ళే అలవాటు.. పిల్లలకు స్వయంగా టాయిలెట్ కి వెళ్ళడం తెలిసి ఉండాలి. కనీసం అతను టాయిలెట్ కి వెళ్ళాలని అర్థం చేసుకోవాలి,  ఆ విషయాన్ని  టీచర్ కి చెప్పగలగాలి. టాయిలెట్ కు వెళ్ళినప్పుడు మురికిగా ఉండకుండా, బట్టలు తడిసిపోకుండా ఉండేలా చక్కగా వెళ్లివచ్చేలా పిల్లలకు అలవాటు చెయ్యాలి. ఇది చేయకుండా పిల్లలను ప్లే స్కూల్ కు పంపితే వారు చాలా ఇబ్బంది పడతారు. షేరింగ్.. పిల్లలు తమ దగ్గరున్న ఏ పదార్థాలను అయినా పక్కనున్న వాళ్లతో పంచుకుని తినడం అలవాటు చేయాలి. ఇలా చేస్తే ప్లే స్కూల్లో  స్నేహితులతో  వస్తువులను పంచుకోవడం చెడ్డ విషయం కాదని తెలుసుకుంటారు.  ఇతరులతో చక్కగా కలిసిపోతారు. క్రమశిక్షణ..  “కూర్చోవడం”, “నడవడం”, “సైలైంట్ గా ఉండటం” లేదా “వరుసలో నిలబడటం” వంటి చిన్నచిన్న అలవాట్లు, క్రమశిక్షణ పద్దతులను  పాటించడం నేర్పాలి.  ఇవి పాఠశాలలో ప్రతిరోజూ పిల్లలు ఎదుర్కొంటూ ఉంటారు.   పిల్లలతో కలిసి ఉండటం.. పిల్లలు  ఎక్కువ సేపు ఒంటరిగా ఉండటానికి అలవాటుపడితే అతన్ని పిల్లలతో కలిసి ఆడుకునేలా లేదా ఏదైనా టాస్క్ లో  పాల్గొనేలా, టీమ్ వర్క్ లాంటి పనులలో ఇన్వాల్వ్ అయ్యేలా చేయాలి. తద్వారా అతను ఇతర పిల్లలతో ఆడుకోవడం,  మాట్లాడటం నేర్చుకుంటాడు. ఇది  సామాజిక నైపుణ్యాలను బలోపేతం చేస్తుంది.                                            *రూపశ్రీ.  

  పిల్లలకు ఫార్ములా పాలు ఇచ్చేవారు చేసే అతిపెద్ద మిస్టేక్..!   తల్లి పాలే బిడ్డకు శ్రీరామ రక్ష అని అంటారు. కానీ కొన్నిసార్లు పుట్టిన పిల్లలకు తల్లి పాలు సరిపడక లేక తల్లి ఆరోగ్యం సరిగా లేక.. వేరే ఇతర కారణాల వల్ల తల్లిపాలు ఇచ్చే వెసులుబాటు ఉండదు. అలాంటప్పుడు పిల్లలకు ఫార్ములా పాలు ఇవ్వమని వైద్యులు సూచిస్తుంటారు. అయితే ఫార్ములా పాలను తయారు చేయడంలో, వాటిని నిల్వ చేయడంలో చాలా తప్పులు చేస్తుంటారు.  దీని వల్ల ఆ పాలలో  పోషకాలు సున్నా అవుతాయి. అంటే పోషకాలు నాశనం అవుతాయి. ఇలాంటి పాలు ఇచ్చినా పిల్లలకు కడుపు నిండినట్టు అనిపిస్తుంది కానీ.. పోషకాలు మాత్రం లభించవు. ఇది పిల్లలకు నష్టం చేకూర్చడమే కాకుండా తల్లిదండ్రుల జేబులకు కూడా చెల్లు పెడుతుంది. అందుకే ఫార్ములా పాలు తయారు చేసే విధానం ఏమిటి? పిల్లలకు ఇవ్వడానికి సరైన మార్గం ఏమిటి? తెలుసుకుంటే.. సమయం.. ఫార్ములా పాలను ముందుగానే తయారుచేసుకుంటే , దానిని 24 గంటలు ఫ్రిజ్‌లో ఉంచవచ్చని పిల్లల వైద్య నిపుణులు  చెబుతున్నారు . కానీ ఆ పాలను  ఫ్రిజ్‌లోంచి తీసి వేడి చేసి ఉంటే  ఆ పాలను  1 గంటలోపు ఉపయోగించాలట. ఫార్ములా పాలను తయారు చేసి బిడ్డ ఆ పాలను తాగడం ప్రారంభించిన తర్వాత ఆ పాలను 1 గంటలోపు ఉపయోగించాలని నిపుణులు అంటున్నారు. అయితే బిడ్డ త్రాగడం ప్రారంభించకపోతే  గది ఉష్ణోగ్రత వద్ద రెండు గంటల పాటు ఉపయోగించవచ్చట. ఫ్రిజ్ నుండి తీసిన పాలను ఒక గంట తర్వాత తిరిగి ఉపయోగించకూడదు లేదా తిరిగి వేడి చేయకూడదట.  అలాగ  తల్లి పాల లాగా ఫార్ములా పాలను ఫ్రీజ్ చేయలేరట. లేకుంటే దాని పోషకాలు,  పాల టెక్చర్ విచ్ఛిన్నమవుతుందట. పాల పౌడర్ బాక్స్  తెరిచిన తర్వాత దాని గడువు తేదీ చూసుకుని అలాగే ఎన్నాళ్లైనా వాడవచ్చు అనుకుంటే పొరపాటు. పాల పౌడర్ ప్యాకెట్ తెరవనంతవరకు అది గడువు తేదీ వరకు వాడుకునే అవకాశం కలిగి ఉంటుంది. కానీ.. పాల పౌడర్ ఓపెన్ చేసిన తరువాత   3 నుండి 4 వారాల వరకు మాత్రమే ఉపయోగించవచ్చు.                          *రూపశ్రీ.

పిల్లలకు క్రమశిక్షణ ఎలా నేర్పాలి.. ప్రయోజనాలు ఏంటి.. ప్రతిఒక్కరికీ  క్రమశిక్షణ అనేది చాలా అవసరం. పిల్లలకు చిన్నతనం నుంచే క్రమశిక్షణ నేర్పించడం చాలా ముఖ్యం. దీని ద్వారా పిల్లలు భవిష్యత్తులో ప్రయోజకులుగా మారుతారు. శ్రమ ఎప్పటికీ వృధా కాదు. మీరు మీ పిల్లలకు క్రమశిక్షణను చిన్నతనంలోనే నేర్పించాలి. కష్టపడి పనిచేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వారికి వివరించాలి. ఇలా పెంచిన పిల్లలు భవిష్యత్తులో ప్రయోజకులుగా మారుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. తల్లిదండ్రులుగా మీరు చేయాల్సిందల్లా మీ పిల్లలను క్రమశిక్షణలో పెట్టడం. మీరు పిల్లలకి ఎక్కువ పనిని అప్పగించాల్సిన అవసరం లేదు.  బదులుగా మీరు వారి మానసిక, ప్రవర్తనా అలవాట్లను గమనించి వారిని ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు తమ పిల్లల అభివృద్ధికి ఎలా సహకరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు క్రమశిక్షణ నేర్పండి: పిల్లల భవిష్యత్తు అనేది వారి క్రమశిక్షణపై ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లలకు మంచి సలహాలు ఇస్తూ క్రమశిక్షణతోపాటు ప్రేమను కూడా వ్యక్తపరుస్తుండాలి. క్రమశిక్షణ అనేది పిల్లలకే కాదు పెద్దలకు కూడా వర్తిస్తుంది. పిల్లలు క్రమశిక్షణతో ఉండాలని ప్రోత్సహించినప్పుడు, వారు పట్టుదల, సంకల్పం వంటి లక్షణాలను నేర్చుకుంటారు. ఈ విషయాలు పిల్లల పాత్రచ పరస్పర చర్యలు, ఇతరులతో సంబంధాలను ఏర్పరుస్తాయి. కష్టపడి పనిచేసే పిల్లలు భవిష్యత్తులో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు క్రమశిక్షణతో ఉంటే పిల్లలు కూడా అదే అలవాటు అవుతుంది. ఇదంతా తల్లిదండ్రుల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని గమనించాలి. పని విషయంలో కఠినమైన నియమాలను రూపొందించండి: పిల్లలు బలమైన పని-సంబంధిత నీతిని అభివృద్ధి చేయడం ముఖ్యం. చిన్న చిన్న విషయాలు చెప్పి వారిలో ఆత్మవిశ్వాసం నింపండి. తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్ని పనులు చేయగలరని విశ్వాసం కలిగించాలి.దీని ద్వారా, పిల్లలు తాము చేసిన పనికి బాధ్యత వహించడం నేర్చుకుంటారు. వారి పనిని పూర్తి చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. ఇదొక ప్రత్యేక నైపుణ్యం: క్రమశిక్షణ ప్రత్యేక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది. ఇది పిల్లలు పాఠశాలలో, వృత్తిలో, వారి వ్యక్తిగత జీవితంలో ఈ నైపుణ్యాల నుండి ప్రయోజనం పొందేందుకు అనుమతిస్తుంది. మీ పిల్లలలో ఈ నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి సమయం పట్టవచ్చు. అలాగే, దీనికి తల్లిదండ్రుల నుండి చాలా ఓపిక అవసరం. పిల్లలను అనవసరమైన ఒత్తిడికి గురిచేయకూడదు. ఒత్తిడికి గురిచేయవద్దు: క్రమశిక్షణ పేరుతో మీ పిల్లలను ఒత్తిడికి గురిచేయకూడదు. పిల్లల వయస్సుకు తగిన అంచనాలు ఉండాలి. పిల్లలపై ఎక్కువ ఒత్తిడి పెడితే చిన్న వయసులోనే డిప్రెషన్ లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. పిల్లలకు ముందుగా సులభమైన పనులు ఇచ్చి, క్రమంగా వారి స్థాయిని పెంచుతుండాలి.  దీంతో పిల్లల్లో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అలాగే పిల్లవాడు చాలా నేర్చుకోవచ్చు. మంచి దినచర్యలో ఇంటి పని కూడా ఉంటుంది. అది అబ్బాయి అయినా సరే... అమ్మాయి అయినా సరే. పిల్లలు ప్రశంసిస్తుండాలి: పొగడ్తలను ప్రేమించే పిల్లలను ప్రశంసించడం ద్వారా వారికి క్రమశిక్షణ నేర్పించవచ్చు. కల్మషం లేని హృదయానికి ప్రేమ, శ్రద్ధ అవసరం. ఇది మీ బిడ్డకు తల్లిదండ్రులుగా ఇవ్వవచ్చు. పిల్లలు ఏదైనా మంచి చేసినప్పుడు వారిని మెచ్చుకోండి. వారి ప్రయత్నాలను గుర్తించడం ద్వారా వారి విజయానికి బాసటగా మారుతుంది.

మీ బుజ్జాయి బాడీ మసాజ్ కోసం ఉపయోగించాల్సిన బెస్ట్ ఆయిల్స్ ఇవే...   పిల్లల సంపూర్ణ వికాసానికి తల్లిపాలు ఎంత అవసరమో వారి ఆరోగ్యానికి శరీర మర్దన కూడా అంతే అవసరం. వయసు ఏదైనా సరే శరీరానికి చేసే ఆయిల్ మాసాజ్ ఎన్నో మంచి ఫలితాలనిస్తుంది. అలసట, బడలికలను దూరం చేసి కొత్త ఉత్సాహాన్నిస్తుంది. మాసాజ్ వలన ఎముకలు గట్టిపడతాయి. శరీరానికి బలం చేకూరుతుంది. పిల్లలకు చిన్నప్పటి నుండే నరాలకు బలం కలిగి వారిలో రోగ నిరోధక వ్యవస్ధ పటిష్టమవుతుంది. సాధారణంగా పిల్లలకు వచ్చే వర్షాకాల జలుబులు, దగ్గులు వంటివి కూడా దరిచేరకుండా వుంటాయి. పిల్లలు ఎంతో హాయిగా, హుషారుగా, ఆరోగ్యంగా ఉంటారు. శరీర వికాసంతోపాటు బుద్ధి కూడా వికసిస్తుంది. మసాజ్ చేసిన తర్వాత పిల్లలు హాయిగా నిద్రించటం మన ఇండ్లలో గమనిస్తూనే వుంటాం.. అన్నిటిని మించి మసాజ్ చేసే తల్లి మమతానురాగాల స్పర్శ పిల్లలకు పూర్తి రక్షణ నిస్తుంది. తల్లి ప్రేమపూర్వక పెంపకంలో పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదుగుతారు. పిల్లలకు శారీరక మర్దన తల్లి చేయటమే ఎంతో మంచిది. వేరెవరైనా అయితే, వారి చిన్నిపాటి శరీరాలకు మర్దనా బలం ఎక్కువ, తక్కువలయ్యే అవకాశం కూడా వుంది. తల్లి మమతే పిల్లలకి కొండంత బలం. వారిది విడదీయరాని అనుబంధం. తల్లినుంచి పిల్లలు ఎంతో నేర్చుకుంటారు. పిల్లల నడవడికకు తల్లే ఆదర్శం మార్గదర్శి. అయితే, పిల్లల చర్మం ఎంతో సున్నితంగా వుంటుంది. మాసాజ్ కు వాడే ఆయిల్ ఎంతో నాణ్యతలతో కూడుకున్నదై వుండాలి. ఇది శరీరంలోకి ఇంకి ప్రతి కణాన్ని ఉత్తేజపరచేలా వుండాలి. నేడు మార్కెట్ లో లభ్యమవుతున్న బేబీ ఉత్పాదనలలో బేబీ ఆయిల్ కూడా వుంటుంది. బేబీకి ఏది వాడినప్పటికి నాణ్యతా ఉత్పత్తులే వాడి చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో శ్రధ్ధ వహించండి. అందుకు మీ బేబీ బాడీ మసాజ్ కు ఉపయోగించేటటువంటి కొన్ని నూనెల ఎంపిక మీ కోసం...   1. వెజిటేబుల్ లేదా ప్లాంట్ ఆయిల్: ఈ నూనెలో బేబీ చర్మంలోనికి చర్మ రంధ్రాల ద్వారా శోషించబడతాయి కాబట్టి కొంత మంది ఎక్సపర్ట్స్ మీ బేబీ మసాజ్ కు ఈ ఆయిల్స్ ను వాడమని సలహా ఇస్తుంటారు. ఈ నూనెలో సులభంగా జీర్ణం అవుతాయి. కాబట్టి ఆయిల్ మసాజ్ చేసే సమయంలో మీ బేబీ వెళ్ళను నోట్లో పెట్టుకొని చుంబిస్తుందనే భయం అవసరం లేదు.     2. కొబ్బరి నూనె: ఇది చాలా ఆదర్శవంతమైన మరియు అత్యంత సాధారణంగా ఉపయోగించే మసాజ్ ఆయిల్. గోరివెచ్చిని కొబ్బరి నూనెతో బేబీకి మసాజ్ చేయడం వల్ల బేబికి ఓదార్పు కలుగుతుంది. మరియు బేబీ చర్మం, జుట్టు మరియు ఎముకలకు మేలు చేస్తుంది. చాలా మంది ఈ నూనెను పిల్లల బాడీ మసాజ్ కు వేసవిలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.     3. ఆవాల నూనె(మస్టర్డ్ ఆయిల్): ఈ నూనెను చాలా ఇల్లలో చాలా మంది బాడీ మసాజ్ కు తరచూ వినియోగిస్తుంటారు. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాదు, ఎముకలకు బలాన్ని అందిస్తుంది. ఇంకా జలుబు దగ్గు నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. శీతాకాలంలో ఈ నూనెతో బేబీకి బాడీ మసాజ్ చేయడానికి సూచిస్తుంటారు. ఈ వెచ్చని మస్టర్డ్ ఆయిల్ తో బేబీ బాడీ మసాజ్ చేయడం వల్ల శరీరం మీద కేశాలు రాకుండా నిరోధిస్తుంది. అతి చిన్న వయస్సులోనే బేబీ చెస్ట్, కాళ్ళు, చేతుల మీద అనవసరంగా వచ్చే కేశాలను నిరోధిస్తుంది.   4. ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్ హెయిర్ గ్రోత్ ను పెంచుతుంది. మీ బేబీకి హెయిర్ గ్రోత్ తక్కువగా ఉన్నట్లైతే ఆలివ్ ఆయిల్ తో తలకు బాగా మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన అరగంట తర్వాత తలస్నానం చేయించాలి. ఇంకా బేబీ కను బొమ్మల చక్కటి ఆక్రుతి కోసం ఈ ఆయిల్ ను కనుబొమ్మల మీద మర్ధన చేయవచ్చు. మీ బేబీ బాడీ మసాజ్ కోసం ఈ బెస్ట్ మసాజ్ ఆయిల్ ఎంపికచేసుకొంటే బేబీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. శరీరం మీద ఎటువంటి రాషెస్ దద్దుర్లు ఉన్నాకూడా ఈ ఆయిల్ మసాజ్ వల్ల నివారించబడుతాయిప. బేబీకి ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు ఎటువంటి హాని జరగకుండా మీ చేతి గాజులు, ఉంగరాలు మరియు ఇతర ఆభరణాలను తొలగించండి

మారుతున్నసీజన్ లో చిన్న పిల్లల కోసం ఇవి పాటించండి..!   మారుతున్న సీజన్‌లో ముఖ్యంగా వేసవి నుంచి వర్షాకాలం, లేదా చలికాలం వైపు మారుతుంటే చిన్నపిల్లల ఆరోగ్యం చాలా త్వరగా ప్రభావితమవుతుంది. ఈ మార్పుల కారణంగా  పిల్లలు సులభంగా జలుబు, జ్వరం, గొంతునొప్పి, దగ్గు, అలర్జీలు, స్కిన్ సమస్యలు వంటి వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పిల్లల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు.  అవేంటో తెలుసుకుంటే.. ఆహార సంబంధిత జాగ్రత్తలు.. తాజా, తేలికపాటి ఆహారం ఇవ్వాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఇవ్వాలి . వీటి నుండి పిల్లలకు విటమిన్లు, మినిరల్స్ తగినన్ని లభిస్తాయి. పాలు, పండ్లు, జ్యూసులు మొదలైనవి  వేడి గానో చల్లగానో కాకుండా గోరువెచ్చిగా ఇవ్వాలి. బాటిల్ జ్యూసులు, ఐస్ క్రీములు, కోల్డ్ డ్రింకులు తగ్గించాలి .  ఇవి గొంతు సమస్యలకు కారణం అవుతాయి. పిల్లలకు ఇచ్చే నీటి విషయంలో జాగ్రత్తలు అవసరం.  శుద్ధి చేసిన, మరిగిన నీరు మాత్రమే ఇవ్వాలి. దుస్తులు & శుభ్రత.. వాతావరణానికి తగ్గ దుస్తులు పిల్లలకు వేయాలి.  వేసవిలో కాటన్, చలికాలంలో వెచ్చని దుస్తులు వేయాలి.  పిల్లలకు స్నానం చేయించేటప్పుడు నీటిలో కాసింత వసుపు వేసి ఆ పసుపు నీటితో స్నానం చేయించడం మంచిది.  ఇది  శరీరంపై బ్యాక్టీరియా ఉండకుండా చేస్తుంది.  చేతులు తరచుగా కడిగే అలవాటు  పిల్లలలో ఉండేలా చూడాలి. ముఖ్యంగా ఆహారం తినే ముందు, బయట నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఈ  అలవాటు ఉండేలా చూడాలి. సీజన్ సమస్యలు.. నివారణ.. జలుబు, దగ్గు వచ్చిన వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలి .  వేడి నీటి ఆవిరి, తులసి-అల్లం కషాయం తీసుకోవడం ముఖ్యం. ఇమ్మ్యూనిటీ బూస్టర్స్  అయిన తులసి, అల్లం, పసుపు, మిరియాలు వంటి వాటితో కషాయాలు ఇవ్వవచ్చు. సీజనల్ వ్యాధుల గురించి ముందే డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేయడం మంచిది .  టీకాలు కావాలా అన్నది డాక్టర్లే చెబుతారు. పొడి దగ్గు, జలుబుతో పాటుగా ముక్కులు పొడిబారడం,   పొడి గాలి లేదా పొడి దగ్గుతో బాధపడితే, గోరువెచ్చని నూనెతో మర్దన చేయవచ్చు. ఇంటి వాతావరణం.. గది తడి లేకుండా ఉంచాలి . వర్షాకాలంలో ఫంగస్, బాక్టీరియా పెరగకుండా చూడాలి. వెంటిలేషన్ బాగా ఉండేలా చూడాలి . గదిలో తడి లేదా చెత్త గాలి ఉండకూడదు. నిద్ర తగినంతగా ఉండేలా చూసుకోవాలి .  మంచి ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యం. పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. ఇది పిల్లలలో మానసిక స్థైర్యం పెంచుతుంది. డాక్టర్ ను ఎప్పుడు సంప్రదించాలి.. జ్వరం మూడు రోజులకు మించితే డాక్టర్ ను కలవాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనప్పుడు డాక్టర్ ను కలవాలి. విరేచనాలు, వాంతులు ఎక్కువయ్యితే నిర్లక్ష్యం చేయకూడదు. సొంత వైద్యం అస్సలు ప్రయత్నించకూడదు. నీరసంగా ఉండటం, తినడం తగ్గిపోతే మందుల మీద ఆధారపడకూడదు.  వైద్యుడిని కలవాలి. ఇవి పాటించడం వల్ల మారుతున్న వాతావరణంలో పిల్లలు ఆరోగ్యంగా ఉండగలరు.                           *రూపశ్రీ

కొల్లాజెన్‌ను పెంచి ముడతలు తగ్గించే ఈ డ్రింక్స్ తాగితే  యంగ్‌గా ఉంటారు..!    కొల్లాజెన్  శరీరానికి అవసరమైన ప్రోటీన్. ఇది చర్మం, జుట్టు, గోర్లు, కీళ్ళు,  ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. వయసు పెరిగే కొద్దీ శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా చర్మం వదులుగా మారుతుంది.  ముడతలు వస్తాయి. అందుకే కొల్లాజెన్ స్థాయిలు మెరుగ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొల్లాజెన్ పెంచడానికి 5 పానీయాలు బాగా సహాయపడతాయి.  అవేంటంటే.. బెర్రీ స్మూతీ.. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు,  రాస్ప్బెర్రీస్ వంటి బెర్రీలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కొల్లాజెన్ ఉత్పత్తికి విటమిన్ సి చాలా అవసరం, ఎందుకంటే ఇది అమైనో ఆమ్లాలను కొల్లాజెన్‌గా మార్చడంలో సహాయపడుతుంది. బెర్రీ స్మూతీని తయారు చేయడానికి, ఒక కప్పు బెర్రీలు, ఒక అరటిపండు, ఒక కప్పు పెరుగు లేదా బాదం పాలు,  ఐస్ క్యూబ్‌లను బ్లెండర్‌లో వేసి బ్లెండ్ చేయాలి. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఆకుకూరల జ్యూస్.. పాలకూర, కాలే,  ఇతర ఆకుకూరలలో క్లోరోఫిల్ , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పదార్థాలు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి.  చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆకుపచ్చ కూరగాయల జ్యూస్ తయారు చేయడానికి పాలకూర, దోసకాయ, సెలెరీ,  ఆపిల్‌లను కలిపి జ్యూసర్‌లో గ్రైండ్ చేసుకోవాలి. దీనికి నిమ్మరసం జోడించడం ద్వారా విటమిన్ సి మొత్తాన్ని మరింత పెంచవచ్చు. బోన్ జ్యూస్ లేదా సూప్.. ఎముక రసం కొల్లాజెన్ కు సహజ మూలం. దీనిని చికెన్ లేదా మటన్ ఎముకలను ఉడకబెట్టడం ద్వారా తయారు చేస్తారు. ఇందులో అమైనో ఆమ్లాలు, గ్లైసిన్,  ప్రోలిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడతాయి. బోన్ జ్యూస్ సూప్ లాగా లేదా నేరుగా తినవచ్చు. ఇది కొల్లాజెన్‌ను పెంచడమే కాకుండా జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది . కొబ్బరి నీళ్లు,  కలబంద రసం.. కొబ్బరి నీళ్లు, కలబంద రసం రెండూ చర్మానికి చాలా మేలు చేస్తాయి. కొబ్బరి నీరు హైడ్రేషన్‌ను నిర్వహిస్తుంది.  కలబంద రసంలో యాంటీఆక్సిడెంట్లు,  విటమిన్ సి ఉంటాయి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ రెండింటినీ కలిపితే రిఫ్రెషింగ్ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. రెండు టీస్పూన్ల కలబంద రసం ఒక గ్లాసు కొబ్బరి నీళ్లలో కలిపి ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి . నారింజ, క్యారెట్ జ్యూస్.. నారింజ, క్యారెట్లు రెండింటిలోనూ విటమిన్ సి, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది, బీటా కెరోటిన్ చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా చేస్తుంది. నారింజ, క్యారెట్ రసం తయారు చేయడానికి, జ్యూసర్‌లో రెండు నారింజ, ఒక క్యారెట్‌ను గ్రైండ్ చేసుకోవాలి. దానికి అల్లం ముక్కను జోడించడం ద్వారా రుచిని కొల్లాజెన్ కంటెంట్ పెరగడాన్ని మరింత పెంచుకోవచ్చు.                                *రూపశ్రీ.